Balaji Rayol
525 views
🪷103లింగ మహాపురాణం🪷 🍀మాస శివ వ్రతాలు 🍀 #నూట మూడవ భాగం# వైశాఖ మాస వ్రతము : వైశాఖ మాస శివ వ్రతములో భక్తుడు రాత్రి పూట భోజనం చేయాలి. పూర్ణిమ రోజున పంచగవ్యము, ఘ్రతాది పదార్థములతో శివునికి అభిషేకం చేయాలి. తెల్లటి గోవును, వృషభాన్ని శివునికి సమర్పించాలి. అశ్వమేధ యాగ ఫలము భక్తుడికి లభిస్తుంది. జేష్ఠ మాస వ్రతము : ఈ నెలలో శివుని రోజు అర్చిస్తూ పూజిస్తూ రాత్రి పూట మాత్రమే భోజనం చేస్తూ గడపాలి. భోజనంగా ఎఱ్ఱని శాలి ధ్యానము, నెయ్యి, తేనె, నీరుతో వండిన ఆహారం తీసుకోవాలి. అర్థరాత్రి సమయం నుండి గోవుల సేవలో గడపాలి. పూర్ణిమ నాడు శివునికి అభిషేకం చేయాలి. చరువును సమర్పించాలి. బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేయాలి. ధూమ్ర వర్ణపు గోవును, వృషభాన్ని శివునికి సమర్పించాలి. ఇలా చేసిన భక్తుడు వాయు లోకము చేరి సన్మానం పొందుతాడు. ఆషాడ మాస వ్రతము : శివ భక్తుడు పగటి పూట ఉపవాసం చేసి శివుని పూజించాలి. రాత్రి పూట నెయ్యి చక్కెర ఆవుపాలు పెరుగు మజ్జిగలతో కలిపిన పేలపిండిని ఆహారంగా స్వీకరించాలి. పూర్ణిమ రోజున నెయ్యి పాలు తేనె పెరుగు నీరు మొదలైన వాటితో శివునికి అభిషేకం చేయాలి. వేద పండితులైన బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. తెలుపు రంగు ఆవుని, ఎద్దుని శివునికి సమర్పించాలి. ఇలా చేసిన భక్తుడు వరుణ లోకములో నివసిస్తాడు. శ్రావణ మాస వ్రతము : ఈ మాసంలో శివుని పగటి పూట పూజించి రాత్రి పూట పాలతో వండిన షష్టిక ధాన్యము యొక్క అన్నమును ఆహారంగా తీసుకోవాలి. పూర్ణిమ రోజున శివునికి నెయ్యి మొదలైన వాటితో అభిషేకం చేసి చేయాలి. వేద పండితులైన బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేయాలి. చెరకు , ఆవు , వృషభాన్ని పరమేశ్వరునికి సమర్పించాలి. భక్తుడు వాయుదేవుని సాయిజ్యం పొంది వాయువుతో సమానంగా ఎక్కడికైనా పోగల శక్తి పొందుతాడు. భాద్రపద మాస వ్రతము : ఈ మాసంలో భక్తుడు హోమం చేస్తూ శివుని పూజించాలి. హోమము చేయగా మిగిలిన పదార్థములను రాత్రి పూట ఆహారంగా తీసుకోవాలి. పూర్ణిమ రోజు శివునికి అభిషేకం చేసి అర్చన చేయాలి. నీలపు రంగు భుజభాగము కల గోవుని, వృషభాన్ని దానము చేసి వేదవేదాంగ పారంగతులైన బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఫలితంగా యక్షలోకం చేరి యక్షులకు రాజవుతాడు. ఆశ్వీయుజ మాస వ్రతము : ఈ మాసంలో భక్తుడు పగటి పూట శివపూజ చేస్తూ రాత్రి పూట నేతితో వండిన పదార్థములను ఆహారంగా తీసుకోవాలి. పూర్ణిమ నాడు శివునికి అభిషేకం, అర్చన, పూజ చేసి బ్రాహ్మణులకు, శివభక్తులకు అన్నదానం చేయాలి. నీలపు రంగు ఆవు, వృషభాన్ని శివునికి సమర్పించాలి. ఇలా చేసిన భక్తుడు ఈశాన లోకము పొందుతాడు. కార్తీక మాస వ్రతము : కార్తీక మాసంలో రోజు శివపూజ చేసి రాత్రి పూట పాలతో వండిన అన్నమును నేతితో కలిపి ఆహారంగా తీసుకోవాలి. పూర్ణిమ రోజున శివాభిషేకం, అర్చన విధి విధానాలతో చేయాలి. శివునికి చరువు సమర్పించాలి. పేద బ్రాహ్మణులకు, వేద పండితులకు భోజనం ఏర్పాటు చేయాలి. తెల్లటి ఆవుని, వృషభాన్ని శివునికి సమర్పించాలి. వ్రతము ఆచరించిన భక్తుడు సూర్యలోకంలో సూర్యసాయిజ్యం పొందుతాడు. మార్గశీర్ష మాస వ్రతము : పగటి పూట ఉపవాసం ఉండి శివపూజ చేసి రాత్రి పూట పాలు, నేయితో వండిన యవల ధ్యానపు అన్నాన్ని ఆహారంగా తీసుకోవాలి. పూర్ణిమ నాడు శివాభిషేకం అర్చన చేయాలి. పేదలకు, వేద పండితులకు అన్న సంతర్పణ చేయాలి. తెల్లటి గోవు, వృషభాన్ని దానంగా ఇవ్వాలి. ఇలా చేసిన భక్తుడు చంద్రలోకం చేరి చంద్రునితో సమానంగా సుఖ సంతోషాలు పొందుతాడు. పుష్య మాస వ్రతము : పగటి పూట ఉపవాసం చేసి శివుని పూజించాలి. రాత్రి వేళ శాలి ధాన్యము, గోధుమలను పాలతో కలిపి వండిన ఆహారాన్ని స్వీకరించాలి. భూమి మీద పడుకోవాలి. రెండు పక్షములలో అష్టమి నాడు పూర్తి ఉపవాసం చేయాలి. పూర్ణిమ నాడు నేయి పాలు తేనె మొదలైన వాటితో రుద్రాభిషేకం చేయాలి. బ్రాహ్మణులకు పాలు నేతితో వండిన యవల భోజనం పెట్టాలి. గోవుని వృషభాన్ని దానంగా ఇవ్వాలి. ఇలా చేసిన భక్తుడు అగ్ని లోకం చేరి సుఖభోగాలు అనుభవించి ముక్తి పొందుతాడు. మాఘ మాస వ్రతము : మాఘ మాసంలో శివుని పూజించి రాత్రి పూట మాత్రమే భోజనం చేయాలి. నేతితో వండిన పదార్థములను రాత్రి పూట మితంగా తీసుకోవాలి. రెండు పక్షాలలో చతుర్దశి నాడు పూర్ణ ఉపవాసము చేయాలి. పూర్ణిమ రోజున శివాభిషేకం చేసి శివునికి నల్లని కంబళి, నల్లని గోవు వృషభాలను దానంగా ఇవ్వాలి. బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. యమలోకంలో చేరి యమధర్మరాజుతో సమానంగా గౌరవం పొందుతాడు. ఫాల్గుణ మాస వ్రతము : పగటి పూట శివపూజ చేస్తూ పాలు నేతితో వండిన శ్యామక ధాన్యపు అన్నమును రాత్రి వేళ ఆహారంగా తీసుకోవాలి. రెండు పక్షముల అష్టమి, చతుర్దశి తిథులలో పూర్తి ఉపవాసం ఉండి వ్రతము చేయాలి. పూర్ణిమ నాడు శివాభిషేకం చేత అర్చించాలి. కపిల గోవుని, వృషభాన్ని శివునికి సమర్పించాలి. శక్తి కొలది బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేయాలి. ఇలా చేసిన భక్తుడు చంద్రలోకం చేరి చంద్రుని సాయిజ్యం పొందుతాడు. మాస వ్రతములు చేయు సమయంలో అహింస బ్రహ్మచర్యం, సత్య భాషణము, దయ, శాంతము, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ప్రాతః (పొద్దున్న) మధ్యాహ్న సాయంత్ర సమయాలలో స్నానము, అగ్నిహోత్ర ఆరాధన తప్పక చేయాలి. రాత్రి పూట మాత్రమే భోజనము చేయాలి. భూమి మీద మాత్రమే పడుకోవాలి. మాసపు రెండు పక్షములలో అష్టమి, చతుర్దశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఒక సంవత్సరం పాటు ఈ విధంగా ఆచరించిన భక్తుడు శివలోకము, శివ సాయిజ్యం తప్పక పొందుతాడు. https://chat.whatsapp.com/DnFG7pWG3BkH6MKxaSFRFb #🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు #🙏ఓం నమః శివాయ🙏ૐ *మిగతా కథ రేపటి భాగంలో చదువుదాం*. 🌹శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో🌹 💜 ఓం శ్రీఉమా మహేశ్వరాయ నమ:💜 🙏లోకా:సమస్తాః సుఖినోభవన్తు🙏 రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.* (సర్వం శ్రీశివార్పణమస్తు) 🌷🙏🌷 శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి. 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀