ఒకానొక కల్పంలో బ్రహ్మకి శ్రీ మహావిష్ణువుకి ‘నేను అధికుడను అంటే నేను అధికుడను’ అని వాదోపవాదం జరిగింది. వీరి మధ్య వాదోపవాదం జరుగుతుండగా అది తీవ్రస్థాయిని పొందుతుంటే దేవతల మొరవిన్న పరమేశ్వరుడు ఒక జ్యోతి స్తంభంగా వారిమధ్య ఆవిర్భవించాడు. అదే మహాశివరాత్రి. దేశము, కాలము కలవడం చాలా కష్టం. అందుకనే జన్మమునకు ఒక్క శివరాత్రి అని శాస్త్రం పిలిచింది. ఆనాడు వేకువఝామున చక్కగా తలస్నానం చేసి వచ్చి కూర్చని సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయిన పరమేశ్వరుని ప్రార్థిస్తూ నామం చెప్తూ ఈశ్వర సాకార మూర్తులకు తెల్లబియ్యం అక్షతలు ఒక్కొక్క గింజ వేస్తూ రుద్రాధ్యాయంతో పూజచేసి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదమును మీరు మీ పిల్లలు తీసుకుంటే పరమాత్మ మిమ్మల్ని ఎంతగానో కృపచేస్తారు....
~ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు
#🕉️హర హర మహాదేవ 🔱 #🙏ఓం నమః శివాయ🙏ૐ #😇శివ లీలలు✨ #🕉️మహాశివరాత్రి త్వరలో రాబోతోంది🕉️ #దేవుళ్ళ స్టేటస్