P.Venkateswara Rao
550 views
11 days ago
#ఏపీ అప్ డేట్స్..📖 #అమరావతి #రెండు కళ్ళ సిద్ధాంతం.. 🤠 *మాయలే మాయలు: అప్పుడొకలా.. ఇప్పుడొకలా..❓* MARCH 30, 2026🎯 అమరావతి రాజధాని' అనేది ప్రత్యేకించి నారా చంద్రబాబునాయుడుకు ఒక కల్పవృక్షంలాగా, కామధేనువులాగా మారినట్టుగా కనిపిస్తోంది. ఈ అమరావతి రాజధాని నిర్మాణ ప్రాజెక్టును ఆయన ఏటీఎంలాగా మార్చుకుని.. విపరీతమైన అవినీతికి పాల్పడుతూ వందల కోట్ల రూపాయలు స్వాహా చేసేస్తున్నారని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. అలాంటి విమర్శలను పక్కన పెట్టినప్పటికీ.. రాజధాని నిర్మాణం పేరుతో ప్రజల్ని మాయ చేయడానికి, వాస్తవాలవైపు వారి దృష్టి మరలకుండా.. వారిని నిరంతరమూ మభ్యపెడుతూనే ఉండడానికి అమరావతి రాజధాని చంద్రబాబునాయుడుకు ఒక అద్భుతమైన వనరుగా కలిసి వస్తోంది. 2014లో సీఎం అయినప్పుడు.. అమరావతిని రాజధానిగా ప్రకటించి.. చంద్రబాబునాయుడు అయిదేళ్లపాటు ఒకేరకం మాయలు చేస్తూ వచ్చారు. బొమ్మలు చూపించారు. కంప్యూటరు తెరల మీద, కాగితాల మీద డిజైన్లు చూపించారు. కానీ తమాషా ఏంటంటే.. 2024 లో అధికారంలోకి వచ్చి పనులను పునఃప్రారంభించిన తర్వాత కూడా.. ఇంకా అదే తరహాలో ప్రజల్ని మాయ చేయాలని అనుకుంటున్నారు. కాకపోతే.. ఆ మాయలకు కొత్త కొత్త సృజనాత్మకతను జోడిస్తున్నారు. అప్పటిలాగా కాకుండా కొత్త మాయలు చేయాలనుకుంటున్నారు. అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించడం కోసం అసెంబ్లీ తీర్మానం చేసి పంపడం అనేది ఒక పెద్ద డ్రామా. ఇతరత్రా ఏమీ అంశాలు తమ ఎదుట లేవు కాబట్టి.. జగన్మోహన్ రెడ్డిని కొన్ని నెలలపాటు కంటిన్యువస్ గా ఆడిపోసుకుంటూ ఉండడానికి, తూలనాడుతూ ఉండడానికి ఒక సందర్భాన్ని సృష్టించుకోవడం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టారు తప్ప మరొకటి కాదు. అమరావతే రాజధాని అని తెలుగుదేశం సర్కారు 2014లోని నిర్ణయించుకున్నదే అనుకుందాం. జగన్ దానిని పట్టించుకోకపోయిన నేపథ్యంలో 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే అందుకోసం చర్యలు తీసుకుని ఉండొచ్చు. విభజన చట్టం నిర్దేశించిన ‘హైదరాబాదు పదేళ్లపాటు రాజధాని' అనే క్లాజు 2024 జూన్ లోనే పూర్తయిపోయింది. అప్పటినుంచి ఇప్పటిదాకా.. ఈ రెండేళ్లలో ఏ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అయినా అమరావతి రాజధానికి చట్టబద్ధత గురించి తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపి ఉండవచ్చు. కానీ.. అలా వారు చేయలేదు. రెగులర్ సమావేశాల సమయంలో ఇలాంటి తీర్మానం ప్రవేశపెడితే శాసనమండలిలో కూడా చర్చించాల్సి వస్తుంది. అందుకే స్కిప్ చేశారు. రెండేళ్లు గడుస్తుండగా ఇప్పుడు కేవలం శాసనసభప్రత్యేకసమావేశం పెట్టి తీర్మానించారు. ఈ తీర్మానం కేంద్రానికి వెళుతుంది. చట్టబద్ధత దక్కుతుంది. కానీ, అదంతా కేవలం లాంఛనం మాత్రమే. కానీ చట్టబద్ధత వచ్చిన వెంటనే ఊరూ వాడా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. ఇల్లలకగానే పండగ అనే సామెత గుర్తుకొస్తున్నది.. ప్రభుత్వం చేస్తున్న మాయ చూస్తోంటే. అమరావతి రాజధాని పూర్తయిన తర్వాత.. అక్కడినుంచి ప్రభుత్వ కార్యకలాపాలు, అక్కడ ప్రజల జీవనాలు ప్రారంభం అయిన తర్వాత.. రాష్ట్రమంతా వేడుకలు నిర్వహించినా కూడా అర్థముంది. కేవలం చట్టబద్ధత దక్కగానే అన్నిచోట్లా వేడుకలంటే.. ఇల్లు అలకడానికంటె ముందు.. అలకడానికి పేడ దొరికిన వెంటనే పండగ చేసుకున్నటుగా. అతిశయంగా, ఉంటుంది. కానీ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. చంద్రబాబు స్ట్రాటజీ కూడా అదే. అమరావతి ఇంకా పూర్తి కావడం లేదే.. అన్న భావన ప్రజల్లోకి రానివ్వకూడదు. దానిని ఈ అయిదేళ్లలో పూర్తిచేయకూడదు. నన్ను మళ్లీ గెలిపిస్తే తప్ప ఇది పూర్తి కాదు.. అని ప్రజల్ని ఎన్నికల సమయంలో బెదిరించాలి. ఈలోగా తన వైఫల్యం మీద వారికి అసంతృప్తి కలగకుండా ఇలాంటి వేడుకలు నిర్వహించాలి- అనేదే వ్యూహంగా సాగుతున్నారని అంటున్నారు. ఈ వేడుకల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా తగలేసే ఖర్చుతో.. అమరావతి కనీసం ఒక చిన్న భవనం అయినా నిర్మించవచ్చు కదా.. అని ప్రజలు అంటున్నారు.