ఏపీ అప్ డేట్స్..📖
4K Posts • 2M views
P.Venkateswara Rao
491 views 20 hours ago
#ఏపీ అప్ డేట్స్..📖 #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *మహిళలకు చంద్రబాబు వరాల డ్రామా❗* MARCH 9, 2026🎯 అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చింది. ఇలాంటి ఆర్భాటాలను ఎలా సెలబ్రేట్ చేయాలో బాగా తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఈ వేడుకల్ని కూడా చాలా ఘనంగా నిర్వహించారు. పత్రికల్లో వచ్చిన పతాక శీర్షికల ప్రకారం.. ఈ సందర్భంగా.. చంద్రబాబు మహిళలకు మహాగొప్ప వరాలను ప్రకటించారు. త్వరలోనే మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు వస్తాయని, ఎమ్మెల్యేలయ్యేందుకు మహిళలు సిద్ధంగా ఉండాలని చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. అలాగే.. గ్యాస్ ధరలు పెరిగినా కూడా.. ఏడాదిలో మూడు సిలిండర్ల పథకాన్ని యథాతథంగా కంటిన్యూ చేయనున్నట్టుగా కూడా చంద్రబాబు ప్రకటించారు. ఇంతకు మించిన వరాలు ఆయన వద్ద మరేమీ లేవేమో అనిపించేలా.. కొన్ని పత్రికల పతాకశీర్షికల్లో ఇవే కనిపిస్తున్నాయి. అసలు ఈ వరాల్లో చంద్రబాబు మహిళాలోకానికి కొత్తగా ఒరగబెడుతున్నది ఏముంది? అదే సమయంలో, మూడేళ్లకిందటి హామీని అధికారంలోకి వచ్చిన రెండేళ్లుగా తొక్కిపట్టేసి మహిళల పట్ల సాగిస్తున్న వంచన మాటేమిటి? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో తలెత్తుతున్నాయి. మహిళలు ఎమ్మెల్యేలు అయ్యేందుకు సిద్ధంగా ఉండాలనేది కూడా ఒక హామీనేనా? చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ దక్కినంత మాత్రాన.. అందులో చంద్రబాబు పాత్ర ఏమైనా ఉందా? తాను వ్యతిరేకించినా కూడా నెగ్గగల బిల్లుకు తన పార్టీ ఎంపీలతో అనుకూలంగా ఓటు వేయించడం తప్ప.. ఆయన చేసినది ఏముంది? కేంద్రం పూనికతో 33 శాతం రిజర్వేషన్లు చట్టరూపం దాల్చగా.. అదేదో తాను చేసిన గొప్పపని అన్నట్టుగా.. మహిళలు ఎమ్మెల్యే కావడానికి సిద్ధంగా ఉండాలని చంద్రబాబు చెప్పడం కేవలం డ్రామానే అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కేంద్రం చేసిన చట్టం అమలయ్యేలోగా.. మహిళలకు చంద్రబాబు అదే ప్రాధాన్యం ఇచ్చి ఉంటే.. మహిళాలోకం ఆయనను నెత్తిన పెట్టుకుని ఉండవచ్చు. ఫరెగ్జాంపుల్.. ఆ చట్టం గత ప్రభుత్వ హయాంలోనే అయింది గనుక.. 2024 ఎన్నికల్లోనే చంద్రబాబు గనుక.. తన పార్టీ తరఫున 33 శాతం టికెట్లు మహిళలకు ఇచ్చి ఉంటే.. మహిళాలోకం ఆయనకు నీరాజనాలు పట్టిఉండవచ్చు. పోనీ.. కేబినెట్ లో 33 శాతం బెర్తులు మహిళలతో భర్తీచేసి ఉంటే అదైనా గౌరవంగా ఉండేది. అవేమీ చేయకుండా.. మహిళా దినోత్సవానికి అదే తన పెద్ద హామీ అన్నట్టుగా చంద్రబాబు చెప్పడం కేవలం డ్రామానే అని ప్రజల అభిప్రాయం. 2023 మేలో ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించారు చంద్రబాబునాయుడు. ఇంకో నెల గడిస్తే.. మూడేళ్లు పూర్తవుతాయి. అధికారంలోకి వచ్చి కూడా రెండేళ్లు కావస్తున్నాయి. ఆ పథకానికి ఇప్పటిదాకా అతీగతీ లేదు. రాష్ట్రంలో అర్హురాలైన ప్రతి మహిళకు రూ. 1500 నెలకు ఇవ్వాలనేది ఆ పథకం. మహిళాదినోత్సవం నాడు ఆ పథకాన్ని ప్రారంభించి ఉంటే బాగుండేది. లేదా, కనీసం ఫలానా తేదీనుంచి ప్రారంభిస్తాం అని ప్రకటించి ఉంటే మర్యాదగా ఉండేది. దానిని మరుగున పెట్టేసి.. సూపర్ సిక్స్ మొత్తం అమలు చేసేశాం.. అవన్నీ సూపర్ హిట్ అయిపోయాయి.. అని అబద్ధాల డప్పు కొట్టుకుంటూ చంద్రబాబు మాయచేస్తున్న తీరును ప్రజలు ఈసడించుకుంటున్నారు.
18 likes
10 shares
P.Venkateswara Rao
3K views 8 hours ago
#ఏపీ అప్ డేట్స్..📖 గత మూడు రోజుల్లో చంద్రబాబు గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మూడు డ్రామాలు చూపించింది. అసెంబ్లీలో ఒక డ్రామా.. పగటి వేషాలు వేసుకున్న అదే ఎమ్మెల్యేతో మరో డ్రామా.. ఈ రెండింటికీ కొనసాగింపుగా అంతర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం నాడు చంద్ర‌బాబు నాయుడు ట్రూప్ ఆడిన‌ది ఇంకో డ్రామా! నేను నేరుగా Nara Chandrababu Naidu గారిని అడుగుతున్నా.. అయ్యా! జ‌నాభాలో 50 శాతం ఉన్న అక్క చెల్లెమ్మ‌ల‌కు ఎన్నిక‌ల ముందు మీరిచ్చిన ఏ ఒక్క హామీని ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేయ‌క‌పోయినా , అన్నీ చేసేసిన‌ట్లు విజ‌య‌వాడ‌లో ఈ రోజు, అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా, ప‌ట్ట‌ప‌గ‌లు ఇంకో డ్రామా మొద‌లు పెట్టిన మిమ్మ‌ల్ని నేరుగా అడుగుతున్నా.. మ‌హిళా సాధికార‌త అన్న ప‌దం ప‌లికే అర్హ‌త మీకుందా? 1 - సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లో భాగంగా 19-59 మ‌ధ్య వ‌య‌సున్న ప్ర‌తి ఒక్క అక్క‌చెల్లెమ్మ‌కు నెల‌కు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామ‌ని ఎన్నిక‌ల ముందు చెప్పారు. రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడి, 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలు ఎన్నికల కమిషన్‌ డేటా ప్రకారం కోటి 80 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.1500 అంటే సంవత్సరానికి రూ.18 వేల చొప్పున ఒక్కో అక్కచెల్లెమ్మలకు మూడేళ్ల‌లో రూ.54 వేల చొప్పున బాకీ పడ్డారు. ఆ డ‌బ్బులు ఎప్పుడిస్తారు చంద్ర‌బాబు గారూ? 2- మ‌రో హామీ 50 ఏళ్లకే పింఛన్‌. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క‌చెల్లెమ్మ‌ల‌కు 50 ఏళ్లు వయస్సు దాటిన వారికి నెల‌కు రూ.4వేలు చొప్పున ఒక్కొక్కరికి రూ.48 వేలు ఇవ్వాలి. మూడేళ్లలో రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. ఆ డ‌బ్బులు ఎప్పుడిస్తారు? 3- బడికి వెళ్లే ప్రతి పిల్ల వాడికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికి త‌ల్లికి వంద‌నం కింద‌ ఇస్తామన్నారు. మొద‌టి ఏడాది పూర్తిగా ఎగ‌నామం పెట్టారు. రాష్ట్రంలో యూడీఐఎస్ఈ (యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌) ప్రకారం 2023–24 నాటికి బడికి పోయే పిల్లలు 87,41,885 మంది ఉంటే రెండో ఏడాది 20 ల‌క్ష‌ల మందికి ఎగ‌ర‌గొట్టారు. చివరకు 67.27 లక్షల మందికి మాత్రమే అది కూడా కొందరికి రూ.8 వేలు.. రూ.9 వేలు.. రూ.10 వేలు, మరి కొంత మందికి రూ.13 వేలు ఇచ్చారు. మ‌రి వీళ్లంద‌రికీ డ‌బ్బులు ఎప్పుడిస్తారు? ఎగ్గొట్టిన మొద‌టి ఏడాది డ‌బ్బులు ఎప్పుడిస్తారు? 4- సూపర్‌ సిక్స్‌లో ఉచిత గ్యాస్‌ చిన్న హామీ. ఇక్కడా కూడా మోసాలే. రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్న గ్యాస్‌ కనెక్షన్ల సంఖ్య 1.59 కోట్లు. వీరికి ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. సిలిండర్ ధర రూ.855 చొప్పున మూడు సిలిండర్లకు ఏడాదికి రూ.3,990 కోట్లు కేటాయించాలి. మొదటి ఏడాది కేవలం రూ.786 కోట్లు, రెండో ఏడాది రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ ప్రకారం బడ్జెట్‌లో రూ.2,199.99 కోట్లు కేటాయించారు. 2026–27లో బడ్జెట్‌లో ఈ పథకానికి పెట్టింది రూ.2,601 కోట్లు. అంటే మొత్తంగా రూ.6,143 కోట్లు బాకీ పడ్డారు. ఆ డ‌బ్బులు ఎప్పుడు ఇస్తారు చంద్ర‌బాబు గారూ? 5- ఉచిత బ‌స్సులో ఎక్క‌డి నుంచి ఎక్క‌డికైనా వెళ్ల‌వ‌చ్చ‌ని మ‌హిళ‌ల‌కు హామీ ఇచ్చారు. కడప నుంచి వైజాగ్‌కు పోవచ్చు.. శ్రీకాకుళం వాళ్లు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు.. మధ్యలో కనకదుర్గమ్మను కూడా దర్శనం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఫ్రీ అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీలో 16 రకాల సర్వీసులుంటే.. కేవలం ఐదు సర్వీసులకు మాత్రమే పరిమితం చేశారు. ఈ పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఖర్చు చేయాలి. మొదటి ఏడాది ఈ స్కీమ్‌ ఎగరగొట్టేశారు. రెండో ఏడాది ఆర్నెల్ల తర్వాత ఆగస్టులో అరకొరగా మొదలు పెట్టారు. చేసిన ఖర్చు రూ.1,040 కోట్లు. ఈ స్కీమ్‌ కోసం ఈ బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం రూ.1,420 కోట్లు. అంటే మూడేళ్లలో రూ.9,600 కోట్లకు గాను రూ.2,460 కోట్లు కేటాయించారు. అంటే రూ.7,140 కోట్లు బాకీ పడ్డారు. ఆ డ‌బ్బులు ఎప్పుడిస్తారు చంద్ర‌బాబు గారూ? 6- సూప‌ర్ సిక్స్‌లో అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ఇచ్చిన ప్ర‌తి ఒక్క హామీని ఇలా వంచ‌న‌గా మార్చ‌టం వ‌ల్ల ప్ర‌తి ఒక్క కుటుంబాన్నీ, అక్క‌చెల్లెమ్మ‌ల ఆర్థిక సాధికార‌త‌ను, మొత్తంగా మ‌న రాష్ట్రంలో ఇంటింటి భ‌విష్య‌త్తును మీరు ఎంత‌గా దెబ్బ‌తీశారో అర్థ‌మ‌వుతోందా? 7- ఇవేకాదు అక్కచెల్లెమ్మల పేరిట వాళ్లకు మంచి చేస్తూ ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలిచ్చాం. అందులో 21 లక్షల ఇళ్లు మంజూరు చేయించాం. అందులో 10 లక్షల పైచిలుకు ఇళ్లు పూర్తి చేశాం. చంద్రబాబునాయుడు అక్కచెల్లెమ్మలకు ఇచ్చే ఇంటి స్థలాలకు సంబంధించి చేసిన ప్రామిస్‌ ఏంటి? పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామనిమేనిఫెస్టోలో చెప్పారు. 3 బడ్జెట్లు అయిపోయాయి. ఈరోజుకు కూడా ఒక్క కుటుంబానికి ఒక్క పట్టా ఇవ్వలేదు. ఒక్క గజం కూడా స్థలం దీనికోసం కొనలేదు. ఉన్న ఇళ్ల‌నిర్మాణాల‌ను గాలికొదిలేశారు. మ‌రి ఆ ఇళ్ల నిర్మాణాల‌ను అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ఎప్పుడు పూర్తి చేసి ఇస్తారు? 8- డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ. ఈ పథకానికి మూడు బడ్జెట్లలో అతీగతీ లేదు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ. 3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పి.. పెంచడం కథ దేవుడెరుగు.. మామూలుగా ఇంతకు ముందు ఇస్తున్నట్టు ఇచ్చేది కూడా ఆగిపోయింది. మా హయాంలో కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద రూ.4,969 కోట్లు ఇచ్చాం. మీరు వ‌చ్చి మూడు బ‌డ్జెట్లు పెట్టారు. ఇప్ప‌టికి ఒక్క పైసా కూడా సున్నా వ‌డ్డీ కింద ఇవ్వ‌లేదు. ఈ డ‌బ్బులు ఎప్పుడు ఇస్తారు? 9- వైయ‌స్ఆర్‌ చేయూత పథకం ద్వారా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు రూ.19,189 కోట్లు ఇచ్చాం. వైయ‌స్ఆర్‌ ఆసరా కింద 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు రూ.25,570 కోట్లు ఇచ్చాం. వైయ‌స్ఆర్‌ కాపు నేస్తం ద్వారా 3,58,613 మంది అక్కచెల్లెమ్మలకు రూ.2,029 కోట్లు ఇచ్చాం. వైయ‌స్ఆర్‌ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,269 మంది అక్కచెల్లెమ్మలకు మరో రూ.1876 కోట్లు ఇచ్చాం. నిజంగా స్త్రీ శక్తి ఎక్కడైనా లభించింది అంటే, వారి సాధికారత ఎక్కడైనా జరిగింది అంటే అది వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలోనే అని గర్వంగా చెప్పగలుగుతాం. ఈ ప‌థ‌కాల‌న్నీ మీరు అధికారంలోకి వ‌చ్చాక ర‌ద్దు చేశారు క‌దా.. మరి మీకు మ‌హిళా సాధికార‌త గురించి మాట్లాడే అర్హ‌త ఉందా? 10- మీ పాల‌న‌లో ఈబీసీ అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ఈబీసీ నేస్తం అనే ప‌థ‌క‌మే లేదు. మీకు కాపుల్ని మ‌భ్య‌పెట్టించి వారి ఓట్లు కొల్ల‌గొట్టే ప్యాకేజీ ప‌థ‌కాలు బాగా తెలుసుగానీ, కాపు నేస్తంగా ఒక్క రూపాయి కూడా ఆ అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ఇచ్చిన చ‌రిత్ర మీకు కానీ, మీకు మ‌ద్ద‌తిస్తున్న‌వారికి కూడా లేదు. 11- ఇలా ఇవ్వ‌క‌పోవ‌టం కూడా మీకున్న విజ‌న్‌లో భాగ‌మే అని న‌మ్మించ‌గ‌ల ఎల్లో మీడియా మీ చేతిలో ఉంది కాబ‌ట్టి.. ఇదీ గొప్ప ఎంప‌వ‌ర్‌మెంట్ అని ప‌త్రిక‌ల్లో రాయించ‌టం, టీవీల్లో వేయించ‌ట‌మే ఇక మిగిలింది! 12- అక్క‌చెల్లెమ్మ‌ల కాపురాల్లో చిచ్చుపెట్టేలా వీధికో బెల్టుషాపు, ఊరికో మ‌ద్యం షాపు, బారు తెర‌వ‌ట‌మే మీకు తెలిసిన మ‌హిళా సాధికార‌త‌, అదే మీకు తెలిసిన మ‌హిళా భ‌ద్ర‌తా? 13- దిశ పోలీస్ స్టేష‌న్ల‌ను, దిశ యాప్ ను కూడా నిర్వీర్యం చేశారు. చివ‌రికి రాష్ట్రాన్ని మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ టీటీడీ ఛైర్మ‌న్‌.. ఇలా ప్ర‌తి ఒక్క‌రూ అత్యాచార‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను నిర్మించారు. ప‌సి పిల్ల‌ల్ని, ఆడ‌పిల్ల‌ల్ని, చివ‌రికి ఉద్యోగాలు చేసుకుంటున్న మ‌హిళ‌ల్ని కూడా.. మీరు, మీకు మ‌ద్ద‌తిస్తున్న వాళ్లు పెంచి పోషిస్తున్న కామాంధులంతా ఎలా చిదిమేస్తున్నారో చూసి కూడా మీకు సిగ్గు అనిపించ‌డం లేదా? 14- మా అయిదేళ్ల పాల‌న‌లో దాదాపు 90 శాతం అక్క‌చెల్లెమ్మ‌ల పేరిట డీబీటీ ప‌థ‌కాలే. మేం ఇచ్చిన ఇళ్ల స్థ‌లాల‌న్నీ అక్క‌చెల్లెమ్మ‌ల పేరుమీదే! దేశ చ‌రిత్ర‌లో తొలిసారిగా.. మేం ఇచ్చిన వేల కొద్దీ నామినేటెడ్ ప‌ద‌వుల్లో 50 శాతం వాటా నేరుగా అక్క‌చెల్లెమ్మ‌ల‌కే! 15- చ‌రిత్ర‌లోనే క‌నీవినీ ఎరుగ‌ని విధంగా ఎక్కువ మంది మ‌హిళ‌ల‌కు ఎమ్మెల్సీలు, క్యాబినెట్ మంత్రులుగా అవ‌కాశం ఇచ్చిన‌ది కూడా మా అయిదేళ్ల పాల‌న‌లోనే! ఇలా చేశాం కాబ‌ట్టే మా పాల‌న మ‌హిళా సంక్షేమ చ‌రిత్ర‌లో సువ‌ర్ణ అధ్యాయం అని గ‌ర్వంగా చెప్పుకోగ‌లుగుతున్నాం. మ‌న ఆడ బిడ్డ‌లు, త‌మ కుటుంబాల చ‌రిత్ర‌నే కాకుండా.. ఈ దేశ చ‌రిత్ర‌నే మార్చేలా శ‌క్తిమంతంగా ఎదిగేలా వారికి అండ‌గా నిలిచాం. 16- ఇప్ప‌టి ప‌రిస్థితి ఏమిటంటే.. మ‌హిళాభ్యుద‌యానికి, మ‌హిళా సాధికార‌త‌కు చంద్ర‌బాబుగారి పాల‌న చీక‌టి కాలం. రాష్ట్రంలో న‌డుస్తున్న‌దంతా దుశ్శాస‌న ప‌ర్వం!
53 likes
33 shares
P.Venkateswara Rao
620 views 5 days ago
#ఏపీ అప్ డేట్స్..📖 #శాసన మండలి సమావేశాలు *నోరు జారిన అచ్చెన్నాయుడు.. క్షమాపణ❗* MARCH 4, 2026🎯 మంత్రి అచ్చెన్నాయుడికి ముందూవెనుకా ఆలోచించకుండా మాట్లాడ్డం అలవాటైనట్టుంది. మరీ ముఖ్యంగా చట్టసభలో మాట్లాడేటప్పుడు తగిన ఆధారాల్లేకుండా నోరు తెరవకూడదని ఆయనకు తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కల్తీ నెయ్యిపై మండలిలో జరిగిన చర్చలో భాగంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైఎస్ జగన్తో పాటు మండలి చైర్మన్ మోషేన్రాజును ఉద్దేశించి క్రిస్టియన్లగా అభివర్ణించారు. దీంతో మండలి చైర్మన్ సీట్లో ఉన్న మోషేన్రాజు షాక్కు గురయ్యారు. తనను క్రిస్టియన్ అని ఎలా అంటారంటూ అచ్చెన్నాయుడిని చైర్మన్ గట్టిగా నిలదీశారు. ఇదే సందర్భంలో క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ సభ్యుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. క్షమాపణ చెప్పాలనే నినాదాలతో మండలిని హోరెత్తించారు. ఈ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకుంది. తనను వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడారని చైర్మన్ వాపోయారు. అయితే తాను కించపరిచినట్టు రికార్డుల్లో నమోదై వుంటే క్షమాపణ చెప్పడానికి ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. అచ్చెన్నతో పలువురు మంత్రులు చర్చలు జరిపారు. తప్పు మాట్లాడావని ఆయనతో చెప్పినట్టు కనిపించింది. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్న స్పందిస్తూ తప్పు జరిగి వుంటే, ఆ విషయాన్ని అంగీకరించడానికి ఎలాంటి బేషజం లేదన్నారు. క్రిస్టియన్ కాదని, హిందువని మండలిలో మీరే ఒప్పుకున్న నేపథ్యంలో తన మాటను వెనక్కి తీసుకుంటున్నట్టు అచ్చెన్న తెలిపారు. తప్పయిందని, క్షమించాలని చైర్మన న్ను అచ్చెన్న కోరారు. దీంతో మండలి చైర్మన్ క్షమాపణను స్వాగతించారు. వైసీపీ సభ్యులు నిరసనను నిలుపుదల చేయాలని చైర్మన్ ఆదేశించారు. Video-👇 https://x.com/i/status/20291229025920044 98
16 likes
10 shares