ఏపీ అప్ డేట్స్..📖
4K Posts • 2M views
P.Venkateswara Rao
575 views
#ఏపీ అప్ డేట్స్..📖 #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *'గీత’ను దాటుతున్న కూటమి సర్కారు… వేల కోట్ల భూమి ధారాదత్తం…❓* January 25, 2026🎯 విశాఖపట్నం, జనవరి 25… నిష్ఠురంగా ఉన్నా నిజం ఏమిటంటే… ఏపీ కూటమి ప్రభుత్వం భూముల మీద పడింది… రాజధానికి ఇంకా వేల ఎకరాల సమీకరణ, వందల ఎకరాల భూపందేరాలు మాత్రమే కాదు… 99 పైసలకు ఎకరం చొప్పున అడ్డగోలుగా లీజు పేరిట ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేయడం, పైగా సమర్థించుకోవడం… ఓ అరాచకం సాగుతోంది… మరీ ముఖ్యంగా నిన్నామొన్న ఏపీ పొలిటికల్, బ్యూరోక్రటిక్ సర్కిళ్లలో పెద్ద చర్చనీయాంశం ఏమిటంటే..? బాలకృష్ణ చిన్నల్లుడు, మంత్రి నారా లోకేష్ తోడల్లుడు, గీతం యూనివర్శిటీ అధినేత, విశాఖ ఎంపీ శ్రీభరత్‌కు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టేందుకు లేదా అక్రమ కబ్జాను క్రమబద్ధీకరించడానికి జరుగుతున్న ప్రయత్నలు విస్తుగొలుపుతున్నాయి… నిజానికి చాలాకాలంగా గీతం భూకబ్జాలపై ఎన్నో ఆరోపణలున్నాయి… పర్టిక్యులర్‌గా 54.79 ఎకరాల ఆక్రమణ భూమిని వైసీపీ హయాంలో ప్రభుత్వ భూమిగా ప్రకటించారు… అప్పుడే ఏదైనా కార్పొరేటు కంపెనీకి అమ్మేయడమో, పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడమో జరిగితే అయిపోయేది… కానీ జరగలేదు… కూటమి ప్రభుత్వం రాగానే నారా, నందమూరి కుటుంబాలు పావులు కదిపాయి చకచకా… నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించారు… ఇప్పుడు విశాఖ చివరి కౌన్సిల్ సమావేశాల్లో క్రమబద్ధీకరించడానికి వీలుగా మీటింగ్ ఎజెండాలో చేర్చేశారు… ప్రముఖ విజిల్ బ్లోయర్, 82 ఏళ్ల వయస్సులోనూ ఇప్పటికీ ప్రొ పీపుల్ యాక్టివిస్టు… మాజీ ఐఏఎస్, కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ దీనిపై స్పందించాడు… ఇలా అత్యంత విలువైన భూమిని గీతంకు ఇవ్వడం అంటే అది సుప్రీంకోర్టు ఆదేశాల్ని ధిక్కరించడమే అంటున్నాడు… తక్షణమే ఆ ప్రతిపాదనను వెనక్కు తీసుకొవాలని, అందుకు బాధ్యులైన అధికారులు, ప్రజా ప్రతినిధులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాడు… ఈ మేరకు ఏపీ రెవెన్యూ విభాగ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సీసీఎస్ఏ చీఫ్ కమిషనర్ జి.జయలక్ష్మికి శర్మ లేఖలు రాశాడు… తన లేఖలో కొన్ని ముఖ్యాంశాలు… వాస్తవానికి రెవెన్యూ శాఖ 2012, సెప్టెంబర్ 14న విడుదల చేసిన జీవో 517 ప్రకారం గీతం అంశం చెల్లదు… 2011నాటి జగపాల్ సింగ్ కేసులో స్థానిక సంస్థల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ సంస్థలకు కేటాయించకూడదని సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల్నీ ఆదేశించింది… రుషికొండ, ఎండాడ ప్రాంతంలో ఎకరం భూమి విలువ సుమారు రూ.22 కోట్లు ఉంటుంది… అంత విలువైన భూమిని గీతంకు కేటాయిస్తే సుప్రీం కోర్టు 2-జీ స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణం కేసుల్లో ఇచ్చిన తీర్పుల్ని అనుసరించి అధికారులు, రాజకీయ నేతలపై పీసీ యాక్ట్-1988 కింద చర్యలు తీసుకోవాల్సిందే… ప్రభుత్వ భూముల్ని కారు చవకగా ప్రైవేట్ ఆస్పత్రులు, విద్యా సంస్థలకు అప్పగిస్తే ఆయా సంస్థలు పేదలకు తమ సేవల్లో 25 శాతం వరకు ఉచితంగా ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు కూడా పలు సందర్భాల్లో ఆదేశించింది… పేదలకు కేటాయించిన డీ -పట్టా భూముల్ని కూడా ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ యాక్ట్- 1977ను ఉల్లంఘించి కొన్ని కంపెనీలు కొనుగోలు చేశాయి… తక్షణమే అలాంటి వాటిపై విచారణ జరిపించి ఆయా ప్రైవేట్ సంస్థలపై చర్యలు చేపట్టి, ఆ కోనుగోళ్లను రద్దు చేయాలి… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమిందారీ సంస్థలేమీ కావు.., ప్రజా స్వామ్య విధానాలు, చట్టాలకు లోబడే అంతా పని చేయాలి…
9 likes
7 shares
P.Venkateswara Rao
524 views
#ఏపీ అప్ డేట్స్..📖 #తిరుమల లడ్డు *టీడీపీ మీడియాకు సంచలన సవాల్..⁉️* JANUARY 26, 2026🎯 టీటీడీ లడ్డూ ప్రసాదంపై సిట్ తుది చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో టీడీపీ టీవీ చానెల్స్ డిబేట్లు పెట్టాలని ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇవాళ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పెద్దలు లడ్డూ ప్రసాదంపై చేసిన కామెంట్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీటీడీ లడ్డూ ప్రసాదంలో ఏమీ లేకపోయినా కల్తీ జరిగిందని ఆరోపించారని జడ శ్రవణ్కుమార్ తీవ్రంగా ఆక్షేపించారు. భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేలా దారుణంగా మాట్లాడారని ఆయన తప్పు పట్టారు. కానీ సిట్ చార్జిషీట్ వచ్చిన తర్వాత ఒక్కరు కూడా మాట్లాడలేదన్నారు. టీవీ5 మూర్తి సిట్ చార్జిషీట్పై అయిపోయిందేదో అయిపోయిందని అంటున్నాడన్నారు. ఎందుకు అయిపోతుందని జడ శ్రవణ్ ప్రశ్నించారు. ఇప్పుడు డిబేట్ పెట్టాల్సిందే, తాను రావాల్సిందే అని జడ శ్రవణ్ అన్నారు. టీవీ5, ఏబీఎన్, మహాటీవీ ప్రతినిధులందరూ డిబేట్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేయడం గమనార్హం. లడ్డూలో పందికొవ్వు, ఎద్దు కొవ్వు ఎక్కడ కలిశాయో, ఏ వైసీపీ నాయకుడు నిందితుడో ప్రజలకు తెలియాలని జడ శ్రవణ్ కుమార్ అన్నారు. మీరు (ప్రభుత్వం) తప్పు చేసి వుంటే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ నేలకు ముక్కురాసి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వేంకటేశ్వరస్వామీ… తప్పెందని, ఇలాంటి రాజకీయ క్రీడ మరొకసారి ఆడమని, తేలుకుట్టిన దొంగల్లా తమ పరిస్థితి తయారైందని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు చెప్పేంత వరకూ వీళ్లు ఆగలేదన్నారు. ముఖ్యమంత్రిని సుప్రీంకోర్టు మందలించిందని ఆయన గుర్తు చేశారు. ఏ ఆధారాలతో కల్తీ జరిగినట్టు ఆరోపించారని సీఎంను సుప్రీంకోర్టు నిలదీసిందన్నారు. విచారణ కోసం సిట్ వేశామని, నివేదిక వచ్చే వరకూ ఆగాలని అన్నంత వరకూ... ఈ దుర్మార్గులు మాట్లాడుతూనే ఉన్నారని జడ శ్రవణ్ తీవ్రంగా తప్పు పట్టారు. నీ వల్ల సనాతన ధర్మం అభాసుపాలు కాలేదా? అని పవన్ను ఆయన ప్రశ్నించారు. పవన్ను సనాతన అధర్మాధికారిగా ఆయన అభివర్ణించారు. డిబేట్లు పెట్టాల్సిందే, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిందే అని జడ శ్రవణ్ గట్టిగా డిమాండ్ చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉండగా కల్తీ జరిగిందో ప్రజలు తెలుసుకోవాల్సిందే అన్నారు. వాస్తవాలేంటో ప్రజలకు తెలియాలన్నారు. టీడీపీ, జనసేనకు తిరుపతి వేంకటేశ్వరస్వామి శాపం తగిలిందన్నారు. ఈ రెండు పార్టీలను చివరి వరకూ స్వామికి చేసిన పాపం వెంటాడుతుందన్నారు. ఏపీలో నిలువ నీడ లేకుండా చేస్తుందని ఆయన హెచ్చరించారు. రాజకీయాలు ఎన్నిచేసినా ప్రజలు క్షమిస్తారన్నారు. కానీ భక్తుల మనోభావాలతో ఆడుకోవడాన్ని ఎప్పటికీ క్షమించరన్నారు. వైసీపీని బద్నాం చేయాలని అనుకుని, మీ గోతిని మీరే తవ్వుకున్నారని ఆయన అన్నారు.
9 likes
11 shares