Failed to fetch language order
Failed to fetch language order
ఏపీ అప్ డేట్స్..📖
4K Posts • 2M views
P.Venkateswara Rao
455 views
#ఏపీ అప్ డేట్స్..📖 #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *బాబు సర్కార్ను బజార్న పడేసిన కొలికపూడి❗* FEBRUARY 9, 2026🎯 కూటమి సర్కార్కు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కొరకరాని కొయ్యగా మారారు. పదేపదే సొంత ప్రభుత్వాన్ని బజారులో పడేస్తున్నారు. కొలికపూడిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని అనుకూల మీడియాలో లీకు వార్తలు రావడం తప్ప, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. పలుమార్లు టీడీపీ క్రమశిక్షణా సంఘం ముందుకు వెళ్లినా, ఆయనలో మాత్రం ఎలాంటి మార్పు లేదని మరోసారి తేలిపోయింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయిలు డబ్బు ఇచ్చానని, అందుకు సంబంధించిన ఆధారాల్ని కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసి సంచలనం సృష్టించారు. ఆ వ్యవహారంలో కేశినేని చిన్ని, కొలికపూడిపై చంద్రబాబు కఠిన చర్యలు తీసుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అదంతా ఉత్తుత్తిదే అని కాలం నిరూపించింది. తాజాగా సీఎం చంద్రబాబు, టీడీపీ క్రమశిక్షణ సంఘానికి కొలికపూడి సవాల్ విసిరేలా, వాట్సప్ స్టేటస్ పెట్టడం తీవ్ర చర్చనీయైశమైంది. *“మూడు రోజులు 35 గ్రామాలు. 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ. రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పల్లెలు. పల్లె కన్నీరు పెడుతోంది”* అని కొలికపూడి తన వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పదేపదే తమ పాలనలో ఏపీ రూపు రేఖలు మారిపోయాయని చెబుతున్నారు. అయితే అందులో ఏ మాత్రం వాస్తవం లేదని కొలికపూడి తన వాట్సప్ స్టేటస్తో తేల్చి చెప్పి, ప్రభుత్వ పరువును వీధిన పడేశారు. రోడ్లు లేవు, అలాగే పిల్లలకు ఉద్యోగాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. అంతిమంగా పల్లె కన్నీరు పెడుతోందని నేరుగానే ఆయన సొంత ప్రభుత్వానికి చురకలు అంటించేలా పోస్టు పెట్టడం గమనార్హం. ఇదేదో గాలి మాటగా ఆయన చెప్పలేదు. మూడు రోజుల పాటు 35 గ్రామాల్లో తిరిగి, 480 కుటుంబాలతో ఆత్మీయంగా మాట్లాడి, మరీ చెబుతున్నట్టు ఆయన గణాంకాలతో సహా వాట్సప్ స్టేటస్లో పొందుపరిచడం గమనార్హం.
11 likes
15 shares
P.Venkateswara Rao
588 views
#తిరుమల లడ్డు #ఏపీ అప్ డేట్స్..📖 #పబ్లిక్ టాక్.. 🗣️ *తిరుమలపై సర్కార్ తీరు.. ప్రజాభిప్రాయం ఏంటి⁉️* FEBRUARY 6, 2026🎯 తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం రోజురోజుకూ చినికిచినికి గాలివానగా మారుతోంది. కోట్లాది మంది హిందువులు తిరుమల క్షేత్రాన్ని తమ ఆధ్మాత్మిక రాజధానిగా భావిస్తారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించే తిరుమల శ్రీవారు రాజకీయ వివాదం కావడం ప్రతి ఒక్కరి మనసుల్ని తొలిచేస్తోంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంతగా కలుషితం అయ్యాయో తిరుమలేశుని వివాదం చేయడమే నిదర్శనం. అయితే పాలకులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించుకోవాలి. ప్రజలు తమకంటే తెలివైన వాళ్లనే సంగతిని గుర్తించుకోవాలి. తిరుమల శ్రీవారిని రాజకీయ అస్త్రంగా వాడుకుంటూ, చివరికి ఆ దేవుని ప్రతిష్టను కాపాడ్డానికి కఠిన చర్యలు తీసుకుంటామని అనడం పాలకులకే చెల్లింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించడంతో యావత్ దేశమంతా నివ్వెరపోయింది. ఆధారాలు లేకపోతే సీఎం హోదాలో, అందులోనూ కోట్లాది మంది హిందువులు పరమ పవిత్రంగా పూజించే తిరుమల లడ్డూ ప్రసాదంపై కామెంట్స్ చేస్తారా? అని ప్రతి హిందువూ తనకు తాను ప్రశ్నించుకున్నారు. మరీ ముఖ్యంగా రాజకీయంగా తమను సమాధి చేయడానికి చంద్రబాబు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని వాడుకున్నారని పసి గట్టింది . దీంతో వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్ గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, తమిళనాడుకు చెందిన సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేశారని, కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారని సుప్రీంకోర్టుకు మొర పెట్టుకున్నారు. తిరుమల శ్రీవారి ప్రతిష్టను కాపాడేలా చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని వారు అభ్యర్థించారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై వైవీ, సుబ్రమణ్యస్వామి పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ ఆధారాలతో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపించారని, ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలా చేయడం తగదని సీఎంకు సుప్రీంకోర్టు తలంటింది. ఆ తర్వాత నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ నేతృత్వంలో విచారణకు ఆదేశించింది. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇద్దరు అధికారుల్ని నియమించుకోవచ్చని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టపరిచింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సీబీఐ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. ఈ సిట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇద్దరు ఐపీఎస్ అధికారుల్ని నియమితులయ్యారు. సుమారు 14 నెలల పాటు సిట్ అన్ని కోణాల్లో విచారించి, ఇటీవల న్యాయస్థానానికి చార్జిషీట్లు సమర్పించింది. ఇందులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ప్రధానంగా చంద్రబాబునాయుడి తీవ్ర ఆరోపణలే సుప్రీంకోర్టు వరకూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందనేది జగమెరిగిన సత్యం. అందుకే సిట్ ఏం తేల్చిందో తెలుసుకోవాలన్న ఉత్కంఠ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల్లో నెలకుంది. లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, అలాగే డిప్యూటీ సీఎం అదనంగా ఆరోపించినట్టు చేప నూనె కలవలేదని సిట్ నివేదిక విస్పష్టంగా తేల్చి చెప్పింది. దీంతో కోట్లాది మంది హిందువులు సంతోషంగా, హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. తాము స్వీకరించిన లడ్డూ ప్రసాదంలో మాంసకృత్తులు లేవన్న వాస్తవం ఎంతో ఊరట ఇచ్చింది. ఇదే సందర్భంలో మరెందుకని ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంపై అనుచిత ఆరోపణలు చేశారనే ప్రశ్న హిందూ సమాజం నుంచి వెల్లువెత్తింది. ఇక్కడే చంద్రబాబుతో పాటు బలపరిచిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయంగా బద్నాం కావడం మొదలైంది. ఇదంతా రాజకీయంగా వైసీపీని నాశనం చేయకుండా స్వామివారిని అస్త్రంగా వాడుకున్నారంటూ అంత కాలం సాగుతున్న విమర్శకు బలం కలిగించింది. అధికారం, రాజకీయం కోసం కోట్లాది మంది హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రార్థించే తిరుమల శ్రీవారిని బజారుకీడుస్తారా? ఇదేం న్యాయం? అని దేశ వ్యాప్తంగా అనేక మంది మేధావులు, తటస్థులు నిలదీసే పరిస్థితి. సీబీఐ చార్జిషీట్ తోనైనా తిరుమల లడ్డూ ప్రసాద వివాదానికి ముగింపు పలుకుతారని అంతా అనుకున్నారు. అబ్బే, అలాంటిది లేదని ప్రభుత్వ పెద్దలు తేల్చి చెప్పారు. మరోవైపు చంద్రబాబు, పవన్కల్యాణ్కు మంచి బుద్ధి ప్రసాదించాలని, వాళ్లిద్దరూ క్షమాపణ చెప్పాలని వైసీపీ నుంచి డిమాండ్ రావడంతో కూటమి పెద్దల్లో తీవ్ర అసహనం మొదలైంది. రెండురోజుల క్రితం గుంటూరులో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ద్రోహిగా చంద్రబాబును నిలిపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సీబీఐ నేతృత్వంలోని సిట్ రాజకీయంగా తమ వాళ్ల ప్రమేయం లేదని తేల్చి చెప్పడాన్ని గుర్తు చేశారు. స్వామి వారి ప్రసాదంపై అవాకులు చెవాకులు పేలడం, ఆరోపణలన్నీ తప్పని సీబీఐ నిర్ధారించిన నేపథ్యంలో క్షమాపణ చెప్పాలని జగన్ డిమాండ్ చేయడాన్ని పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం, ఏపీ బీజేపీ చీఫ్, మరో ఆరేడుగురు మంత్రులు అసాధారణ రీతిలో మీడియా ముందుకొచ్చారు. దీన్ని బట్టి ప్రజల్లో తమపై నెగెటివ్ ప్రచారం పోతోందన్న ఆందోళన వారిలో స్పష్టంగా కనిపించింది. మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. “తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఆ వేంకటేశ్వరస్వామే మాకు అప్పగించారు. ఈ విషయమై ఈ రోజు నేను, పవన్కల్యాణ్, మాధవ్ కూర్చుని భవిష్యత్ కార్యాచరణపై చర్చించాం” అని చంద్రబాబు అన్నారు. తాము మాత్రమే శ్రీవారి భక్తులమనే భావన నుంచి చంద్రబాబు బయటికి రావాలి. మంచి పరిపాలన అందించాలని ప్రజలు అపరిమిత అధికారాన్ని ఇచ్చారు. అయితే ఆ పని చేయకుండా, దారుణంగా ఓడిపోయిన వైఎస్ జగన్ను చేయడానికి ఇంకా ఏముందని కలియుగ దైవం శ్రీవారిని వాడుకుంటున్నారనే చర్చ ప్రజల్లో వుంది. కూటమి రాజకీయ, వ్యక్తిగత రాగద్వేషాలతో ప్రజలకు సంబంధం వుండదు. వారిలో అన్ని రకాల మత విశ్వాసులుంటారు. అందరూ కలిసి ఐకమత్యంగా జీవిస్తున్నారు. తిరుమల శ్రీవారిని హిందువుల కంటే ఏ మాత్రం తక్కువ కాకుండా ఇతర మతస్తులు కూడా గౌరవిస్తారు, పూజిస్తారు. ఇందులో రెండో అభిప్రాయమే లేదు. భిన్నత్వంలో ఏకత్వమే మన ప్రజాస్వామ్య అందం. పాలక, ప్రతిపక్ష పార్టీల రాజకీయాలతో ప్రజలకు సంబంధం లేదు. మనం కోరుకుంటున్నట్టు మంచి పాలన అందుతోందా? లేదా? అనేదొక్కటే ప్రజలు చూస్తారు. పాలించాలని అధికారం ఇస్తే, తిరుమల శ్రీవారిని అప్రతిష్టపాలు చేసేలా వ్యవహరిస్తున్నారంటి? అని జనం మాట్లాడుకుంటున్నారు. శ్రీవారిని ఇలవేల్పుగా చెబుతూ, మరోవైపు స్వామివారి ప్రసాదం జంతువుల కొవ్వుతోనే తయారు చేశారని నిరూపించడానికి సీబీఐ నివేదిక కాదని, చంద్రబాబునాయుడు (సీబీఎన్) కమిటీ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో గెలిపించినంత మాత్రాన, తమ ఆరోపణలన్నింటికీ ప్రజామోదం ఉందనే భావన నుంచి పాలకులు బయటపడాలి. శ్రీవారి కేంద్రంగా ఇంతకాలం సాగిన వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రజానీకం కోరుకుంటున్నారు. ప్రజలు విజ్ఞులని, సీబీఐ నివేదికతో ప్రసాదంలో ఏం జరిగిందో వారే తేల్చుకుంటారని పాలకులు వదిలేయాలి. అందుకు విరుద్ధంగా తమ ఆరోపణలే నిజమని నిరూపించడానికి, శ్రీవారిని వివాదంలో ముంచెత్తుతామంటే... ఇక వారిష్టం. నమ్మకాలు ఎప్పటికీ నిజాలు కావు. వాస్తవాలు మాత్రమే నిజాలవుతాయి. అందుకే తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణల వ్యవహారంలో సీబీఐ చార్జిషీట్కు అంత ప్రాధాన్యం. ఎందుకంటే, నెలల తరబడి ఎంతో మందిని విచారించి, ఆధారాలను బట్టి నివేదిక తయారు చేసింది. ఇంతకాలం పాలక, ప్రతిపక్షాల నుంచి వచ్చినవన్నీ తాము నిజమని నమ్మి మాట్లాడినవే. వాటితో విచారణ టీమ్కు సంబంధం ఉండదు. వాళ్లకు కావాల్సింది ఆధారాలు, వాస్తవాలు. సీబీఐ సమగ్ర విచారణ జరిపి, ఒక నివేదిక ఇస్తే, దానిపై పాలకులు అసంతృప్తి వ్యక్తం చేయడం విడ్డూరం. పైగా దాన్ని కాదని, తామొక ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం విపరీత ధోరణికి నిదర్శనమనే విమర్శ వస్తోంది. ప్రస్తుతం శ్రీవారి కేంద్రంగా సాగుతున్న అవాంఛనీయ వివాదంపై ప్రజానీకం ఏ మాత్రం సంతోషంగా లేరని గ్రహించి, ఆ తర్వాత పాలకులు ఏం చేయాలో నిర్ణయించుకోవాలి.
5 likes
11 shares
P.Venkateswara Rao
551 views
#ఏపీ అప్ డేట్స్..📖 #తిరుమల లడ్డు #పబ్లిక్ టాక్.. 🗣️ *శ్రీవారి ఎఫెక్ట్.. బాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి..❗* JANUARY 30, 2026🎯 కూటమి పాలనపై ఇంటాబయటా తీవ్ర విమర్శలు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ విపక్షాలు అప్పుడే పోరాటాల్ని ఉధృతం చేస్తున్నాయి. దీంతో చంద్రబాబు నేతృత్వంలోని సర్కార్కు దిక్కుతోచని స్థితి. విశాఖలో వేలాది కోట్ల విలువైన భూముల్ని మంత్రి నారా లోకేశ్ తోడల్లుడికి కట్టబెట్టడంపై ఉత్తరాంధ్రలో నిరసనల వెల్లువ. మరోవైపు టీటీడీ లడ్డూ ప్రసాదంలో జంతువుల కలిపారనే సీఎం చంద్రబాబు ఆరోపణల్లో నిజం లేదని సీబీఐ నేతృత్వంలోని సిట్ నివేదిక. కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల నిరసన. కొన్నిచోట్ల పోరాటాల బాట. అలాగే కూటమి సర్కార్ తప్పుల్లో తాము సైతం అంటూ జనసేన ప్రజాప్రతినిధి గలీజు పనులు. ఇంకా సగం పాలన కూడా పూర్తి చేసుకోని కూటమి ప్రభుత్వం, రోజురోజుకూ ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకోవడంలో మాత్రం దూసుకెళుతోందన్న ప్రచారం. ఓవరాల్గా చూస్తే, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఫీల్ బ్యాడ్. అసలు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? అతి తక్కువ పాలనలో విపరీతమైన నెగిటివిటీ ఎందుకు? అసలు చంద్రబాబు ముద్ర ఎందుకు లేకుండా పోతోంది? పాలనపై సీఎం పట్టు కోల్పోవడానికి కారణాలేంటి? మెజార్టీ కూటమి ప్రజాప్రతినిధుల్లో ఎందుకంత లెక్కలేనితనం? చేతిలో అధికారం దోచుకోడానికి, దాచుకోడానికే అన్న రీతిలో ఎందుకు ప్రవర్తిస్తున్నారు? తదితర ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఓవరాల్ గా కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రులు లోకేశ్, వంగలపూడి అనిత...ఇలా ఎవరి తీరు తీసుకున్నా. వైఎస్ జగన్ను బద్నాం చేయాలన్న ఉద్దేశమే కనిపిస్తుంది. ఆ తర్వాతే ప్రభుత్వానికి సానుకూలత అంశాలపై దృష్టి సారిస్తున్నారనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. వైఎస్ జగన్ ను రాజకీయంగా అప్రతిష్టపాలు చేస్తే, తమ అధికారానికి డోకా వుండదనే ఆలోచన వారి మాటల్లోనూ, చేతల్లోనూ నిత్యం కనిపిస్తుంటుంది. ఇలాంటి ప్రతికూల ధోరణి కేవలం వైఎస్ జగన్ అంటే భయం నుంచే పుట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి భవిష్యత్, అధికారం……. జగన్ ను జనం చూసే దృష్టిపై ఆధారపడి వుంటుందని వారు నమ్ముతున్నారు. అంతే తప్ప, తాము మంచి పాలన చేయడం వల్ల ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం కూటమి పాలకుల్లో మచ్చుకైనా కనిపించడం లేదు. అందుకే కూటమి పాలకులు మంచి పరిపాలన అందించడంపై కంటే, జగన్ను జనంలో చెడ్డ చేయడానికే విపరీత ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అయితే గత ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమిపాలైనా, ఆ పార్టీకి రాజకీయ భవిష్యత్ లేదని కూటమి నేతలు నమ్మకపోవడం ఇక్కడో విచిత్ర పరిస్థితి. కూటమి అధికారంలోకి రావడం మొదలు, గతంలో వైసీపీ చేసిన తప్పులను ఎప్పుడో మించిపోయింది. వైసీపీ కార్యాలయాల కూల్చివేతలతో కూటమి పాలన మొదలైంది. అప్పుడే కూటమి నేతల్లో భయానికి బీజం కూడా పడింది. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చీరాగానే ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలు పెట్టారు. అందుకే ఆ ప్రభుత్వం కూడా ఐదేళ్లు తిరిగే సరికి కూలిపోయిందని ఇదే కూటమి నేతలు అనేక సార్లు విమర్శిస్తున్నారు. ఇప్పుడు వాళ్లు చేస్తున్నదేమీ వైసీపీ కంటే భిన్నమైంది కాదు. వైసీపీ కార్యాలయాల కూల్చివేతలు, ఆ పార్టీ నాయకులపై అక్రమ కేసులు, జైళ్లకు పంపడం. కూటమి పాలకులు అధికారాన్ని ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోడానికే దుర్వినియోగం చేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. హామీల అమలు కూటమికి పెద్దగా ప్రాధాన్య అంశం కాదేమో అనే చర్చకు తెరలేచింది. మరోవైపు అయినవాళ్లకు ఇష్టానుసారం భూముల్ని దోచి పెడుతున్నారు. ఇవన్నీ కూడా మళ్లీ అధికారంలోకి వస్తామో, రాలేమో అనే భయంతో చేస్తున్నవే అని పలువురు అంటున్నారు. వైఎస్ జగన్ అంటే భయమే ముఖ్యంగా చంద్రబాబుతో ఎక్కువ తప్పులు చేయిస్తోంది. నిజానికి చంద్రబాబు ఆచితూచి మాట్లాడుతుంటారు. అలాంటి చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందంటూ నోరు జారి, సరిదిద్దుకోలేని రీతిలో ముందుకెళ్లారు. ఈ ఒక్క తప్పు టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బహుశా చంద్రబాబు ఊహించి వుండరు. ఈ ఒక్క ఆరోపణతో రాజకీయంగా వైసీపీకి సమాధి కట్టొచ్చని చంద్రబాబు అనుకున్నారు. అయితే కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి అత్యంత శక్తిమంతుడని, చేసిన తప్పులకు వెంటనే శిక్ష విధిస్తారని పసిగట్ట లేకపోయారు. టీటీడీ లడ్డూ ప్రసాదంలో కల్తీపై సిట్ నివేదికతో ప్రతి ఒక్కరూ చంద్రబాబు, పవన్ను తప్పు పట్టే పరిస్థితి. ఆధారాలు లేకుండా అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై అవాకులు చెవాకులు ఏంటని నిలదీసే పరిస్థితి. కూటమి పాలనను బాగా గమనిస్తే, తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు నోరు జారడం, ఆయన బాటలోనే డిప్యూటీ సీఎం పవన్ నడుస్తూ, అతి చేయడం.. ఆ తర్వాత క్రమంగా ప్రజల్లో నెగెటివిటీ పెరగడం మొదలైంది. ఒకదాని తర్వాత మరొకటి కూటమి సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తన పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వుందని స్వయంగా చంద్రబాబే కలెక్టర్ల సమావేశంలో ప్రకటించి, ఆశ్చర్యపరిచారు. చంద్రబాబు పైకి చెప్పలేకపోవచ్చు కానీ, ఇదంతా శ్రీవారి ఎఫెక్టే అనే అభిప్రాయం ప్రజానీకంలో వుంది. జగన్ అంటే భయంతో, లడ్డూ ప్రసాదంపై హిందువుల్లో ఉన్న సెంటిమెంట్ను రాజకీయంగా సొమ్ము చేసుకోడానికి, వైసీపీపై నింద వేశారు. అయితే అది బూమరాంగ్ అయ్యింది. పాపానికి ప్రాయశ్చితం బదులు, ఎదురు దాడి ద్వారా ప్రత్యర్థుల నోళ్లు మూయించాలన్న ఆలోచన మరో తప్పు అని కూటమి పాలకులకు ఎవరు చెప్పాలి? తమ వైపు న్యాయం వుందని భావించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు సిట్ నివేదికను చూపుతూ, టీడీపీ, జనసేనలపై ఎక్కడికక్కడ విరుచుకుపడుతున్నారు. ఇక ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్పరం చేయాలన్న కూటమి సర్కార్ నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుంది. ఆర్థిక భారం ప్రభుత్వానికి, లాభాలు మాత్రం ప్రైవేటు దోచిపెట్టాలన్న నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత గుప్పుమంది. ఈ తప్పులన్నీ కూడా, మళ్లీ జగన్ అధికారంలోకి వస్తాడేమో అనే భయమే చేయిస్తోంది. అధికారం ఉండగానే ఇంటిని చక్కదిద్దుకోవాలనే సీఎం చంద్రబాబు మొదలుకుని కూటమి నేతల దురాశే, వారి దుఃఖానికి కారణమవుతోందని చెప్పక తప్పదు.
9 likes
13 shares