శాసన మండలి సమావేశాలు
1 Post • 80 views
P.Venkateswara Rao
597 views 1 days ago
#ఏపీ అప్ డేట్స్..📖 #శాసన మండలి సమావేశాలు *నోరు జారిన అచ్చెన్నాయుడు.. క్షమాపణ❗* MARCH 4, 2026🎯 మంత్రి అచ్చెన్నాయుడికి ముందూవెనుకా ఆలోచించకుండా మాట్లాడ్డం అలవాటైనట్టుంది. మరీ ముఖ్యంగా చట్టసభలో మాట్లాడేటప్పుడు తగిన ఆధారాల్లేకుండా నోరు తెరవకూడదని ఆయనకు తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కల్తీ నెయ్యిపై మండలిలో జరిగిన చర్చలో భాగంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైఎస్ జగన్తో పాటు మండలి చైర్మన్ మోషేన్రాజును ఉద్దేశించి క్రిస్టియన్లగా అభివర్ణించారు. దీంతో మండలి చైర్మన్ సీట్లో ఉన్న మోషేన్రాజు షాక్కు గురయ్యారు. తనను క్రిస్టియన్ అని ఎలా అంటారంటూ అచ్చెన్నాయుడిని చైర్మన్ గట్టిగా నిలదీశారు. ఇదే సందర్భంలో క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ సభ్యుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. క్షమాపణ చెప్పాలనే నినాదాలతో మండలిని హోరెత్తించారు. ఈ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకుంది. తనను వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడారని చైర్మన్ వాపోయారు. అయితే తాను కించపరిచినట్టు రికార్డుల్లో నమోదై వుంటే క్షమాపణ చెప్పడానికి ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. అచ్చెన్నతో పలువురు మంత్రులు చర్చలు జరిపారు. తప్పు మాట్లాడావని ఆయనతో చెప్పినట్టు కనిపించింది. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్న స్పందిస్తూ తప్పు జరిగి వుంటే, ఆ విషయాన్ని అంగీకరించడానికి ఎలాంటి బేషజం లేదన్నారు. క్రిస్టియన్ కాదని, హిందువని మండలిలో మీరే ఒప్పుకున్న నేపథ్యంలో తన మాటను వెనక్కి తీసుకుంటున్నట్టు అచ్చెన్న తెలిపారు. తప్పయిందని, క్షమించాలని చైర్మన న్ను అచ్చెన్న కోరారు. దీంతో మండలి చైర్మన్ క్షమాపణను స్వాగతించారు. వైసీపీ సభ్యులు నిరసనను నిలుపుదల చేయాలని చైర్మన్ ఆదేశించారు. Video-👇 https://x.com/i/status/20291229025920044 98
16 likes
10 shares