Failed to fetch language order
Failed to fetch language order
ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯
13 Posts • 2K views
P.Venkateswara Rao
455 views
#ఏపీ అప్ డేట్స్..📖 #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *బాబు సర్కార్ను బజార్న పడేసిన కొలికపూడి❗* FEBRUARY 9, 2026🎯 కూటమి సర్కార్కు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కొరకరాని కొయ్యగా మారారు. పదేపదే సొంత ప్రభుత్వాన్ని బజారులో పడేస్తున్నారు. కొలికపూడిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని అనుకూల మీడియాలో లీకు వార్తలు రావడం తప్ప, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. పలుమార్లు టీడీపీ క్రమశిక్షణా సంఘం ముందుకు వెళ్లినా, ఆయనలో మాత్రం ఎలాంటి మార్పు లేదని మరోసారి తేలిపోయింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయిలు డబ్బు ఇచ్చానని, అందుకు సంబంధించిన ఆధారాల్ని కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసి సంచలనం సృష్టించారు. ఆ వ్యవహారంలో కేశినేని చిన్ని, కొలికపూడిపై చంద్రబాబు కఠిన చర్యలు తీసుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అదంతా ఉత్తుత్తిదే అని కాలం నిరూపించింది. తాజాగా సీఎం చంద్రబాబు, టీడీపీ క్రమశిక్షణ సంఘానికి కొలికపూడి సవాల్ విసిరేలా, వాట్సప్ స్టేటస్ పెట్టడం తీవ్ర చర్చనీయైశమైంది. *“మూడు రోజులు 35 గ్రామాలు. 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ. రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పల్లెలు. పల్లె కన్నీరు పెడుతోంది”* అని కొలికపూడి తన వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పదేపదే తమ పాలనలో ఏపీ రూపు రేఖలు మారిపోయాయని చెబుతున్నారు. అయితే అందులో ఏ మాత్రం వాస్తవం లేదని కొలికపూడి తన వాట్సప్ స్టేటస్తో తేల్చి చెప్పి, ప్రభుత్వ పరువును వీధిన పడేశారు. రోడ్లు లేవు, అలాగే పిల్లలకు ఉద్యోగాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. అంతిమంగా పల్లె కన్నీరు పెడుతోందని నేరుగానే ఆయన సొంత ప్రభుత్వానికి చురకలు అంటించేలా పోస్టు పెట్టడం గమనార్హం. ఇదేదో గాలి మాటగా ఆయన చెప్పలేదు. మూడు రోజుల పాటు 35 గ్రామాల్లో తిరిగి, 480 కుటుంబాలతో ఆత్మీయంగా మాట్లాడి, మరీ చెబుతున్నట్టు ఆయన గణాంకాలతో సహా వాట్సప్ స్టేటస్లో పొందుపరిచడం గమనార్హం.
11 likes
15 shares
P.Venkateswara Rao
563 views
#తిరుమల లడ్డు #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *దేవుడంటే భయభక్తులెవరికి❓* FEBRUARY 7, 2026🎯 కలికాలంలో అధర్మం నాలుగు పాదాలపై నడుస్తుందని పెద్దలు చెబుతుంటే, ఊత్తుత్తి కథలు చెప్పేవాళ్లు అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. స్వార్థ రాజకీయాలకని చెప్పడం చాలా తక్కువ చేసి చెప్పినట్టు అవుతుంది. అత్యంత నీచ, నికృష్ణ రాజకీయాల్ని ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. చివరికి దేవున్ని కూడా అధికారం కోసం అడ్డగోలుగా వాడుకుంటున్న దుర్మార్గ కాలం. దీన్ని ఏమనాలో కూడా ఎవరికీ అంతుచిక్కడం లేదు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రపంచంలో ప్రతి హిందువు అత్యంత శక్తిమంతుడైన దైవంగా విశ్వసించి, పూజిస్తారు. స్వామిని దర్శించుకుని, తమ కష్టాలు చెప్పుకుంటే పరిష్కరిస్తారనే విశ్వాసం. కలియుగం దైవం తమ మొర ఆలకించి, కష్టనష్టాల నుంచి బయటపడేశారని, మళ్లీ మొక్కులు తీర్చుకోవడం తెలిసిందే. సర్వ మానవులకు రక్షకుడైన ఆ దేవదేవునికి కష్టాలు తీసుకొచ్చారంటే, కలికాలంలో పాపాత్ముల పడగ నీడలో బతకడం ఎంత భయంకరమో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రాజకీయంగానే కాదు, దేవుడి పేరుతో రెండుగా పాలక ప్రతిపక్షాలు చీలిపోయాయి. నిత్యం తిరుమల శ్రీవారి ప్రసాదంగా రాజకీయ ప్రయోజనాల పొందేందుకు వికృత క్రీడకు పాల్పడుతుండడాన్ని సమాజం జాగ్రత్తగా గమనిస్తోంది. దీనంతటికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారు. కలియుగ దైవం తమ ఇంటి దేవుడిగా చెబుతూనే, లడ్డూ ప్రసాదాన్ని పంది కొవ్వు, ఆవు కొవ్వుతో తయారు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తనయుడు లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కూడా అవే ఆరోపణలకు చేపనూనె జత చేసి మరింత వేడి రగిల్చారు. ఇదేమంటే ఎన్టీడీబీ రిపోర్ట్ ఆధారంగా ఈ వాస్తవాలు చెప్పామని దబాయింపు. అత్యున్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆధారాలు లేకుండా పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై ఏంటీ మాటలని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది.ఆ తర్వాత సీబీఐ ఏర్పాటు, ఇటీవల విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించడం.. అన్నీ జరిగిపోయాయి. సీబీఐ నేతృత్వంలోని సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత లడ్డూ ప్రసాదం కేంద్రంగా, వివాదానికి ముగింపు పలుకుతారని అంతా భావించారు. అయితే ఆ తర్వాత మరింత వికృతరూపందాల్చింది. తమ ఆరోపణలే నమ్మాలన్నట్టు సిట్ ఇచ్చిన నివేదికను పాలకులు పక్కన పెట్టారు. ఇప్పుడు కొత్తగా బాత్రూమ్లలో ఉపయోగించే రసాయనాలతో లడ్డూ ప్రసాదం తయారు చేశారని ఆరోపించే వరకూ వెళ్లడం హిందువుల మనోభావాల్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. లడ్డూ ప్రసాదంలో పాలకులు ఆరోపించినట్టు జంతువుల కొవ్వులు, చేప నూనె, రసాయనాల కలయిక కంటే, పాలకుల ఆరోపణలే తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని శ్రీవారి భక్తులు వాపోతున్నారు. శ్రీవారి ప్రసాదంపై పాలకుల ఆరోపణలే తీవ్రంగా కలచివేస్తున్నాయనే కోణంలో దేశ వ్యాప్తంగా విస్తృత చర్చకు దారి తీసింది. అసలు అత్యున్నత స్థానంలో ఉన్నోళ్లు, నిజంగా శ్రీవారి ప్రతిష్టను కాపాడే మాటలేనా ఇవి? అంటూ ప్రతి ఒక్కరూ ప్రశ్నించే పరిస్థితి. వైఎస్ జగన్ ను దైవ ద్రోహంగా చిత్రీకరించడానికి పాలకులు……… అంతిమంగా శ్రీవారిని బజారుకీడ్చడం అత్యంత దుర్మార్గం, క్షమించరాని నేరంగా ప్రజానీకం చెబుతోంది. శ్రీవారికి నిజమైన భక్తులెవరైనా స్వామి ప్రతిష్టను కాపాడేందుకు, ఎవరైనా నిరాధార ఆరోపణలు చేస్తే, చీల్చి చెండాడుతారు. అయితే కంటికి రెప్పలా కాపాడాల్సిన పాలకులే, కలియుగ దైవంపై అవాకులు చెవాకులు పేలుతుంటే, భక్తులు మౌనంగా రోదిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు దేవుడంటే భయం, భక్తి లేవని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో సినిమా డైలాగ్ కొట్టారు. ఇదే పవన్ కల్యాణ్ పలు సందర్భాల్లో ఏమన్నారో, ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. దేవుని ముందు వెలిగించిన దీపానికి తన తండ్రి సిగరెట్ వెలిగించే వాడని, ఆ తర్వాత మారిపోయాడని పవన్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ చీవాట్లు పెట్టడంతో వైఎస్ జగన్ను హిందూ ద్రోహిగా తిడుతూ నాగబాబు అత్యుత్సాహంతో వీడియో విడుదల చేశారు. ఇదే నాగబాబు తాను నాస్తికుడిని అని, దైవం అంటే విశ్వాసం లేదని చెప్పిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఒకవైపు తమకు దైవం అంటే నమ్మకం లేనోళ్లు, మరొకరి మత విశ్వాసాలను ప్రశ్నించడం, అవహేళన చేయడాన్ని నెటిజన్లు, రాజకీయ ప్రత్యర్థులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇక వైఎస్ జగన్మోహన్రెడ్డి విషయానికి వెళ్లాం. ప్రతి మీటింగ్లోనూ వైఎస్ జగన్ నోటి నుంచి పదేపదే వచ్చే మాట………పైన దేవుడున్నాడు, కింద మీరు (ప్రజలు) ఉన్నారని… దుర్మార్గంగా వ్యవహరించే ప్రత్యర్థుల కథేంటో చూసుకుంటారని చెబుతుంటారు. దేవుడు.. దేవుడు అని జగన్ నిత్యం నామస్మరణ చేస్తుంటారు. క్రిస్టియన్ మతంలో పుట్టడం జగన్ ఆప్షన్ కాదు. ఇదే విషయాన్ని ఆయన గతంలో చెప్పారు. ఇతర మతాల విషయంలోనూ ఆయన అంతే భక్తిశ్రద్ధలతో వ్యవహరిస్తుంటారు. వైఎస్ జగన్ మతాన్ని అడ్డుపెట్టుకుని, హిందువుల ద్వేషిగా చిత్రీకరించే వారి చేష్టల్ని మెజార్టీ ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి. ముఖ్యంగా వైఎస్ జగన్ను మతం అడ్డుపెట్టుకుని నెగెటివ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న వారి తీరును జాగ్రత్తగా గమనించాలి. తాము హిందువులం కావడంతో, ఆ మత విశ్వాసాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే నిర్లక్ష్య, అహంకారాన్ని చూడొచ్చు. గతంలో హిందూమతానికి మచ్చ తెచ్చేలా, ఆ మతం వారే వ్యవహరిస్తున్నారనే పవన్కల్యాణ్ అభిప్రాయం ముమ్మాటికీ నిజం. కాకపోతే, ఇప్పుడా జాబితాలో ఆరోపించిన వారినే అనుమానించే పరిస్థితి రావడం దురదృష్టకరం. ధర్మాన్ని రక్షిస్తే, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందని వేదాలు చెప్పాయి. ధర్మాన్ని రక్షిస్తున్నామా? భక్షిస్తున్నామా? అని ఒక్కసారి రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తే, కలియుగ దైవంపై అత్యంత దుర్మార్గమైన ఆరోపణలకు దిగనుగాక దిగరు. ఇప్పటికైనా స్వామివారికి చేసిన ద్రోహం చాలని, తప్పుల్ని సరిదిద్దుకుందామనే ఆలోచన పాపుల్లో వస్తే అందరికీ మంచిది.
14 likes
14 shares
P.Venkateswara Rao
616 views
#తిరుమల లడ్డు #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *జగన్పై విఫలమైన బాబు బ్రహ్మాస్త్రం……❗️* FEBRUARY 6, 2026🎯 మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సీఎం చంద్రబాబు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం విఫలమైంది. దీంతో రాజకీయంగా జగన్ను దెబ్బకొట్టేందుకు అస్త్రాల కోసం వెతుకులాడుతున్నారు. రెండు రోజుల క్రితం గుంటూరులో తమపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు, కేబినెట్లోని సగం మంది సహచరుల్ని చంద్రబాబు వెంటపెట్టుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని చంద్రబాబు ఎంత సీరియస్ గా తీసుకున్నారో ఇదే నిదర్శనం. మీడియా సమావేశంలో చంద్రబాబు జంతువుల కొవ్వు అంశాన్ని పక్కన పెట్టినట్టు కనిపించింది. ఇదే సందర్భంలో జగన్పై మరో అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ అస్త్రం కూడా తిరుమల లడ్డూ ప్రసాదం కావడం గమనార్హం. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిపింది కమీషన్ల కోసం కాదని, ఏకంగా హిందూమతాన్ని అప్రతిష్టపాలు చేయడానికే అంటూ పేద్ద బండరాయి వేశారు. అయితే ఏడాది క్రితం మతం ప్రాతిపదికగా, శ్రీవారి ప్రసాదాన్ని బ్రహ్మాస్త్రంగా భావించి జగన్పై బాబు ప్రయోగించారు. సీబీఐ చార్జిషీట్ తో బాబు, పవన్ ఆరోపణలన్నీ అబద్ధాలని ప్రజలు గుర్తించారు. ఇప్పుడు జంతువుల కొవ్వుకు బదులు, కల్తీ జరపడం హిందూమతాన్ని దెబ్బకొట్టడానికే అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు. జగన్ క్రిస్టియన్ మతస్తుడు కావడంతో ఆయన్ను రాజకీయంగా దెబ్బ కొట్టడానికి తిరుమల శ్రీవారిని పాలకులు ఆయుధంగా వాడుకుంటుండడంపై భక్తులు తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారు. తెలుగు సమాజం మతం విషయంలో మొదటి నుంచి చాలా అప్రమత్తతో వ్యవహరిస్తోంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మతం కంటే కుల రాజకీయాలే రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. గత ఎన్నికల్లో కుల సమీకరణల్లో కూటమి సక్సెస్ అయ్యింది. పవన్కల్యాణ్ను టీడీపీ దగ్గరికి తీసుకోవడం వల్ల కాపులు, బలిజల్లో మెజార్టీ కూటమి వైపు మొగ్గింది. అలాగే బీజేపీతో జత కట్టడం వల్ల మతపరమైన భావాలున్న కొద్ది మంది కూటమి వైపే మొగ్గు చూపారు. ఇప్పుడు ప్రజలిచ్చిన అధికారాన్ని సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత చంద్రబాబు సర్కార్పై వుంది. అదేంటో గానీ, వైఎస్ జగన్పైనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎక్కువ దృష్టి సారించారు. మళ్లీ ప్రజల్లో జగన్కు జనాదరణ ఉందని భయపడుతున్నట్టున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ను సీఎం సీట్లో కూచోనివ్వకుండా చేయాలనే పట్టుదలతో బాబు, పవన్ రాజకీయాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి రాజకీయ అస్త్రమయ్యారు. ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో అంతుచిక్కని పరిస్థితి. రానున్న రోజుల్లో తిరుమల శ్రీవారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదన్నట్టు పాలకుల తీరు హిందువుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇదేమంటే, స్వామి వారి ప్రతిష్టను కాపాడే పేరుతో, రకరకాల ముసుగుల్ని వేస్తున్నారు. బ్రహ్మాస్త్రం విఫలం కావడాన్ని పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ అస్త్రం పోతే, ఇంకో అస్త్రం అన్నట్టు కొత్తకొత్త ఆరోపణలతో ముందుకు రావడాన్ని గమనించొచ్చు.
12 likes
8 shares