ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯
14 Posts • 2K views
P.Venkateswara Rao
547 views 9 days ago
#ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *ఇదేమి కులపైత్యం.. సంక్రాంతి కమ్మ కులానిదా❗* JANUARY 15, 2026🔥🌞🌾 భారతదేశం అంటే రకరకాల కులాలు, మతాలు, భాషల కలయిక. అందులో మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు బాగా ఉపయోగపడేది కులం. అందులో కులాన్ని అడ్డుపెట్టుకోని రాజకీయాలు చేసేవారు ఉన్నారు, తమ కులం కోసమే రాజకీయ పార్టీలు నడుపుతున్నవారు కూడా ఉన్నారు. ఇక ఏపీలో అయితే కుల రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉంది. అందులోను కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొందరి అతిని చూస్తుంటే “ఏంట్రా వీళ్లు ఇలా తయారయ్యారు” అనే పరిస్థితికి తెచ్చుకున్నారు. తాజాగా టీడీపీ మీడియాలో యాంకర్గా పని చేసే యాంకరమ్మ సంక్రాంతి పండగ అంటే కమ్మవారి పండగనే అనేసింది. అందులోను కమ్మవారి వంటల కోసం ఇతరులు ఎదురు చూస్తారని, కమ్మవారు పండించే ధాన్యం, మామిడి పంటలు అంటూ తెగ ఊగిపోతూ కమ్మని భోజనం కమ్మ వారిదే. కోడి పందేలు కూడా కమ్మ వారిదే, హరిదాసులకు అయినా, ఎవరికైనా సహాయం చేసేదే కమ్మ వారే అంటూ కమ్మ వారి గురించి గోప్పలు చెప్పేసింది. యాంకరమ్మ ఒకటి మాత్రం వదిలేసిందే సంక్రాంతి కమ్మ వారిదే అని మాత్రం చెప్పేసింది కానీ, ఇతర కులాల వారు సంక్రాంతి పండగ చేసుకోకూడదు అని మాత్రం చెప్పకుండా వదిలేసింది. లేకపోతే తమ ప్రభుత్వమే కదా, ఎవరైనా ఇతరులు సంక్రాంతి పండగ చేస్తే రోడ్ల మీద తిప్పుతు జైలుకు పంపుతామని చెప్పకపోవడం సంతోషించాల్సిన విషయం. అయినా సంక్రాంతి పండగ అంటే వేద పండితులు, పురాణాల్లో ఆ పండగకు ఒక చరిత్ర ఉందని చెప్తారు. ఇలా సంక్రాంతి పండగ కమ్మవారి పండగ అని చెప్పి తమ కులాన్ని ఇబ్బందులు పాలు చేయడం తప్ప ఎవరికీ ఉపయోగం. ఇన్ని రోజులు సంక్రాంతి పండగ అంటే రాయలసీమ, ఉత్తరాంధ్రలకు చెందనిది అని, అది కేవలం గోదావరి జిల్లాలకే పరిమితం అని కొందరు అనడం చూశాం. కానీ ఇప్పుడు మరోసారి అధికారంలోకి రాగానే యాంకమ్మ సంక్రాంతి పండగ కమ్మ వారిదే అని చెప్తోంది. గతంలోనూ ఒక మాజీ ఎంపీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని వెంకయ్య చౌదరి అనడం చూశాం, విన్నాం.. ఇప్పుడు ఇది చూస్తున్నాం. తమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు సీఎం పదవిలో కూర్చున్నాడు. ఇక ఏది మాట్లాడినా, ఎవరి పైనా ఏదైనా విమర్శలు చేసినా మాట్లాడడానికి ఎవ్వరూ సహసించరు. ఒకవేళ వారు మాట్లాడితే తమ మీడియాను, అధికారాన్ని అడ్డుపెట్టుకుని రకరకాలుగా కేసులు, విమర్శలు చేస్తూ అందరినీ నోళ్లు మూయిస్తున్నవారు. ఇప్పుడు సంక్రాంతి మాదే అన్నారు. ఇకపై ఉగాది, దసరా మొదలైన పండగలు కూడా తమవే అని చెప్పినా ఆశ్చర్యపడనవసరం లేదని ప్రజలు అనుమానిస్తున్నారు.
13 likes
8 shares
P.Venkateswara Rao
544 views 13 days ago
#ఏపీ అప్ డేట్స్..📖 #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *తప్పు చంద్రబాబుది కాదు, రాయలసీమదే❗* JANUARY 10, 2026🎯 రాయలసీమ అంటే చంద్రబాబు కు ఏనాడూ ఒక లెక్క లో లేదు! సీమకు ఏం చేయకపోయినా వచ్చే సీట్లు ఎక్కడికీ పోవు, ఏం చేసినా రాని సీట్లు రావన్నట్టుగానే చంద్రబాబు నాయుడు దశాబ్దాలుగా వ్యవహరించారు! బీసీల జనాభా గణనీయంగా ఉన్న సీమలో గాలి వీచిందంటే తెలుగుదేశం స్వీప్ చేసుకుంటుంది! ఇంకేం కావాలి? అంత కన్నా! అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాయలసీమ నీటి విషయంలో కూడా ఏం 22 టీఎంసీలు ఒక్క లెక్కనా? అని ప్రశ్నించగలుగుతున్నారు! అదేమంటే.. అన్నీ తానే, అంతా తానే అనే పాట అందు కుంటారు. ఈ పాటికి హంద్రీనీవా ప్రాజెక్టు గనుక లేకపోతే.. రాయలసీమ నీటి కష్టాలు ఏ స్థాయిలో ఉండేవో ఊహించడం కూడా కష్టం! వైఎస్ఆర్ రెక్కల కష్టం హంద్రీనీవా. ఎన్టీఆర్ హయాంలో శంకుస్థాపన రాళ్లు వేసి వదిలిపెడితే.. అవి దశాబ్దాల పాటు వెక్కిరించాయి. చివరకు రాజశేఖర రెడ్డి ఆ కలను సాకారం చేశారు. ఇప్పుడు హంద్రీనీవాను కూడా తన ఖాతాలో జమ వేసుకుని దబాయిస్తారు చంద్రబాబు! రాయలసీమ అంటే చంద్రబాబుకు ఎప్పుడూ గ్రాంటెడ్ అనే భావనే కనిపిస్తుంది. అక్కడి ప్రజల అవసరాలు, నీటి కష్టాలు.. ఇవన్నీ ఆయన రాజకీయ లెక్కల్లో చివరి వరుసలో ఉంటాయి. ఇది మాటల విమర్శ కాదు, చరిత్ర చెప్పే సత్యం. అయినా ప్రతి ఎన్నికల్లో సీమ నుంచి ఆయనకు ఓట్లు పడతాయి, సీట్లు వస్తాయి. ఇదే ఆయన ధైర్యానికి మూలం. "ఏం చేసినా సీమ నా వెంటే ఉంటుంది" అన్న ధోరణి ఇక్కడే మొదలవుతుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయానికి వస్తే ఈ నిర్లక్ష్యం మరింత స్పష్టంగా బయటపడుతుంది. 22 టీఎంసీల నీటిని సీమకు అందించాలన్న ప్రతిపాదనపై చంద్రబాబు తీరును చూస్తే ఇది దబాయింపేనని అర్థమవుతుంది. సీమకు నీరు అవసరం లేదన్నట్టు, లేదా ఆ అవసరం అంత అత్యవసరం కాదన్నట్టు మాట్లాడటం .. ఇది సీమ ప్రజలపై చేసిన అన్యాయం కాదా? సీమ అనేది వర్షాభావ ప్రాంతం. వ్యవసాయం నీటిపైనే ఆధారపడుతుంది. ఒక టీఎంసీ నీటితో ఎంత భూమి పచ్చబడుతుందో రైతులకు తెలుసు. అలాంటప్పుడు 22 టీఎంసీలు “ఒక లెక్కనా?" అని ప్రశ్నించడం అంటే సీమ రైతు కన్నీళ్లను తక్కువగా చూడటమే. ఇది పాలకుడు మాట్లాడాల్సిన మాటేనా? చంద్రబాబు పాలనలో సీమకు ఏం దక్కింది? హైదరాబాద్ను నిర్మించానని చెప్పుకునే నాయకుడు, సీమలో ఒక సమగ్ర అభివృద్ధి నమూనాను ఎందుకు చూపలేకపోయాడు? అభివృద్ధి కన్నా సామాజిక సమీకరణలే ఆయన్ను గెలిపిస్తాయన్న నమ్మకం ఆయనలో గట్టిగా ఉంది. అందుకే సీమ ప్రయోజనాలను పక్కన పెట్టి కూడా రాజకీయంగా ముందుకు సాగగలనన్న ధైర్యం. కానీ ఇది ఎంతకాలం? ప్రజలు ఎప్పటికైనా ప్రశ్నిస్తారు. నీరు, ఉపాధి, గౌరవం ఇవి కులాలకన్నా పెద్దవని తెలుసుకుంటారు. ఎత్తిపోతల పథకం విషయంలో కేంద్రం, రాష్ట్రం, న్యాయస్థానాలు అన్నింటి మధ్య సమన్వయం అవసరం. కానీ చంద్రబాబు మాటల్లో సమన్వయం లేదు; ఉంది కేవలం రాజకీయ లెక్క. "ఇది సాధ్యం కాదు”, “అది అవసరం లేదు” అన్న మాటలు చెప్పడం సులువు. కానీ ఒక నాయకుడు చేయాల్సింది సీమకు ఎంత నీరు కావాలో, అది ఎలా తీసుకురావాలో స్పష్టమైన కార్యాచరణ చూపడం. ఆ ధైర్యం, ఆ నిజాయితీ ఇక్కడ కనిపించడంలేదు. రాయలసీమ ప్రజలు దానం అడగడం లేదు. తమ హక్కును కోరుతున్నారు. తమ ప్రాంతం ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురికాకూడదని కోరుతున్నారు. 22 టీఎంసీలు ఒక లెక్క కాదు. అవి సీమ జీవితానికి ప్రాణం. ఆ ప్రాణాన్ని లెక్కలతో కొలిచే నాయకత్వాన్ని సీమ ఇక ప్రశ్నించాలి. చంద్రబాబు సీమకు ఏమిచ్చారు? అనేది కాదు అసలు ప్రశ్న.. సీమ ఆయన నుంచి మొదటి నుంచి ఎందుకు తక్కువనే ఆశిస్తోంది? అనేదే! *ఓ రాయలసీమ బిడ్డ*
9 likes
10 shares
P.Venkateswara Rao
1K views 19 days ago
#ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *కొండగట్టులో పవన్ కల్యాణ్ ‘ప్రదర్శన’ ఏం సంకేతాలు ఇస్తోంది..⁉️* January 5, 2026🎯 ఉత్తర తెలంగాణలో ప్రధాన పుణ్యక్షేత్రం కొండగట్టు..! ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో ప్రతి గ్రామంలో 20 నుండి 200 మంది హనుమాన్ దీక్షాధారులుంటారు… అందరూ దీక్ష విరమణకు వెళ్లేది కొండగట్టు హనుమాన్ క్షేత్రానికే… ఒకప్పుడు మానసిక వికలాంగుల్ని తీసుకొచ్చి అక్కడ రోజుల తరబడీ ఉంచేసేవారు, కట్టేసేవారు… అందరికీ ఆ ఆంజనేయుడే స్వస్థత చేకూరుస్తాడని నమ్మకం… ఒకప్పుడు చిన్న గుడి… తరువాత భక్తజన సందోహం బాగా పెరిగింది… ఇప్పుడది తెలంగాణలోని ప్రధాన తీర్థం… పవన్ కల్యాణ్ అక్కడ దీక్షావిరమణ మండపం, వసతి గృహ నిర్మాణం కోసం టీటీడీ నుంచి 35 కోట్లు ఇప్పించాడు… గుడ్… టీటీడీ ఇప్పుడు పవన్ కల్యాణ్ చెప్పినట్టు వింటుంది కాబట్టి చైర్మన్ నాయుడు పీకే అడగ్గానే ఇచ్చేశాడు… ఇక్కడి వరకూ గుడ్… ఈ ఒక్క కోణంలో అభినందిద్దాం… కొండగట్టు ఆంజనేయుడి దయ వల్లే బతికి బట్టకట్టాననే వినమత్రను చూపిస్తున్నాడు, రుణం తీర్చుకున్నాను అంటున్నాడు కాబట్టి..! (కొండగట్టు ఆంజనేయుడు ఎవరినైనా తన వద్దకు రప్పించుకోగలడు…) ఇక ఉన్నదున్నట్టు కొన్ని విషయాలు చెప్పుకుందాం… 1) పట్టువస్త్రాలు, పూలు, పళ్లు ఎప్పుడు తీసుకుపోతారు ఓ గుడికి… ఏదేని సందర్భం ఉండాలి… కల్యాణాలో, బ్రహ్మోత్సవాలో… మరి పవన్ కల్యాణ్ రావడమే కొండగట్టులో బ్రహ్మోత్సవం అన్నట్టుగా అక్కడి పూజారులు, అధికారగణం సాగిలబడ్డారు ఎందుకు..? పవన్ కల్యాణ్ అక్కడ దీక్షావిరమణ మండపం, వసతి గృహ నిర్మాణం కోసం టీటీడీ నుంచి 35 కోట్లు ఇప్పించాడు… గుడ్… టీటీడీ ఇప్పుడు పవన్ కల్యాణ్ చెప్పినట్టు వింటుంది కాబట్టి చైర్మన్ నాయుడు పీకే అడగ్గానే ఇచ్చేశాడు… ఇక్కడి వరకూ గుడ్… ఈ ఒక్క కోణంలో అభినందిద్దాం… కొండగట్టు ఆంజనేయుడి దయ వల్లే బతికి బట్టకట్టాననే వినమత్రను చూపిస్తున్నాడు, రుణం తీర్చుకున్నాను అంటున్నాడు కాబట్టి..! (కొండగట్టు ఆంజనేయుడు ఎవరినైనా తన వద్దకు రప్పించుకోగలడు…) ఇక ఉన్నదున్నట్టు కొన్ని విషయాలు చెప్పుకుందాం… 1) పట్టువస్త్రాలు, పూలు, పళ్లు ఎప్పుడు తీసుకుపోతారు ఓ గుడికి… ఏదేని సందర్భం ఉండాలి… కల్యాణాలో, బ్రహ్మోత్సవాలో… మరి పవన్ కల్యాణ్ రావడమే కొండగట్టులో బ్రహ్మోత్సవం అన్నట్టుగా అక్కడి పూజారులు, అధికారగణం సాగిలబడ్డారు ఎందుకు..? 2) అసలు పవన్ కల్యాణ్‌ను చూస్తేనే జన్మ ధన్యం అయిపోయినట్టు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పులకరించి పోయాడు దేనికి..? నువ్వు తెలంగాణ మంత్రివి నాయకా..? సగటు పవన్ కల్యాణ్ అభిమానిలాగే వ్యవహరిస్తే ఎలా..? 3) ముందుగా పవన్ కల్యాణ్‌లోని ఆంధ్రా రాజకీయ నాయకుడిని గుర్తుచేసుకుందాం… తెలంగాణ ఏర్పడినప్పుడు వారంపది రోజులు నిద్రాహారాలు మాని దుఃఖించాడు… సమైక్యుడు… మొన్నటికిమొన్న, అంటే తెలంగాణ ఏర్పడిన పుష్కరం తరువాత కూడా అదే ధోరణి… కోనసీమ కొబ్బరిచెట్లకు తెలంగాణ దిష్టి తగిలిందనీ, అసలు ఈ దిష్టే విభజనకు కారణం అనీ ఏవేవో చెప్పాడు… ప్రతి మాటలో తెలంగాణ వ్యతిరేకత… ఇప్పుడు చెబుతున్నాడు తెలంగాణ చైతన్యమే తనకు స్పూర్తి అనీ, ఇంకా ఏదేదో… తన దిష్టి వ్యాఖ్యలకు వివరణ ఇస్తాడేమో అనుకున్నారు, అదీ లేదు… 4) ఇదే కొండగట్టు విషయానికి వస్తే… పదేళ్ల కేసీయార్ పాలన ఎలాగూ పట్టించుకోలేదు, 1300 కోట్ల యాదాద్రి నిర్మాణం తప్ప మరే గుడినీ పట్టించుకోలేదు… చివరకు అదే కొండగట్ట బస్సు ప్రమాదంలో దాదాపు 55 మంది మరణించినా పట్టలేదు తనకు… ఈ 30 కోట్లు చేతకాలేదా..? అందినకాడికి భక్తుల నుంచి దండుకునే తెలంగాణ దేవాదాయ శాఖకు ఎందుకు చేతకాలేదు..? పోనీ, రెండేళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు చేతకాలేదు..? 5) పోనీ, తెలంగాణ ప్రభుత్వం అడిగితే టీటీడీ ఇవ్వకపోయేదా..? దేశవిదేశాల్లో వందలు, వేల కోట్లను ఖర్చు చేస్తోంది టీటీడీ… తిరుమల ఆదాయంలో తెలంగాణ భక్తుల వాటా ఏమీ తక్కువ కాదు కదా… చివరకు పవన్ కల్యాణ్ అడిగితే తప్ప కొండగట్టులో సౌకర్యాల కల్పనకు ముందుకు రాలేదా..? 6) జనసేన తరఫున గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు, పోటీచేసినవాళ్లతో మీటింగు పెట్టాడు అక్కడే… ఆధ్యాత్మికతకూ, పార్టీ వ్యవహారాలకూ లంకె పెట్టడం దేనికి అక్కడ..? తన ఉద్దేశం క్లియర్, పోటీచేస్తాం తెలంగాణలో అంటున్నాడు… 7) ఓ సంకేత ప్రదర్శనకు వచ్చాడు తను… రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తెలంగాణలో కలిసి పోటీచేస్తాయని..! ఇప్పుడిప్పుడే కాస్త పుంజుకుంటున్న తెలంగాణలో బీజేపీలో అంతర్గత విభేదాల మాటేమిటో గానీ… కొందరు బీఆర్ఎస్ వైపు లాగుతున్నారు… ఎన్‌డీఏలోని టీడీపీ, జనసేన తమవైపు లాగుతున్నాయి… దశాబ్దాలపాటు టీడీపీకి తోకగా మారి, సొంత బలం చేజేతులా చెడగొట్టుకున్న తెలంగాణ బీజేపీకి మళ్లీ గడ్డు రోజులు రాబోతున్నాయి… 8) చివరగా అక్కడ ఏదో బలప్రదర్శనలాగా వెహికిల్ మీద కూర్చుని, అభివాదాలు దేనికి..? సంధ్య థియేటర్ దుర్ఘటన గుర్తుకురాలేదా..? అసలు తెలంగాణ పోలీసులు ఎలా అంగీకరించినట్టు..? ప్రోటోకాల్‌లో కూడా ఆయన పేరు పైన పెట్టి మంత్రుల పేర్లు కింద పెట్టారు, పవన్ కల్యాణ్ పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత భక్తో కదా… చివరకు ఆనం రామనారాయణ రెడ్డి పేరు పెట్టాల్సిన అవసరం ఏమిటి..? ఆయనకు లింక్ ఏమిటి..? (ఇది ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా సాగింది ప్రోగ్రామ్… రేవంత్ రెడ్డి మరీ తనకు మాలిన ధర్మం చూపిస్తున్నాడు… జిల్లా యంత్రాంగం, దేవాదాయ శాఖ మీద ఎవరి పర్యవేక్షణ లేకుండా పోయినట్టుంది…) 9) చివరగా… గతంలో కరెంటు తీగెల నుంచి తనను కాపాడాడు ఆంజనేయుడు అనే భక్తితో, కృతజ్ఞతతోనే కదా, మొక్కు తీర్చుకోవడానికి వచ్చింది… ఓ భక్తుడిగా ఒద్దికగా, ఆ శంకుస్థాపనలేవో చేసేసి వెళ్లిపోకుండా… ఈ అట్టహాసాలు, రాజకీయ ప్రదర్శనలు ఏమిటి..? 10) మీరు పైన ఫోటో చూశారుగా... గతంలో ప్రమాదం తప్పినచోట మళ్లీ కరెంటు తీగెలు అడ్డొస్తే, చాకచక్యంగా వెనక్కి వాలి తప్పించుకున్నాడట... ప్రమాదం తెలిసీ మరెందుకు వాహనం మీద ఎక్కి ర్యాలీలు..? తను వెనక్కి వాలాడు గానీ తన బాడీ గార్డ్ అలాగే కూర్చున్నాడు... కాస్త తలవంచాడు అంతే... ఎందుకీ ప్రదర్శన..? మళ్లీ తృటిలో తప్పిన ప్రమాదం అంటూ వార్తలు... హేమిటో...!!
23 likes
12 shares