ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯

3 Posts • 4K views
P.Venkateswara Rao
831 views 1 months ago
#ఏపీ అప్ డేట్స్..📖 #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *మహిళలకు చంద్రబాబు వరాల డ్రామా❗* MARCH 9, 2026🎯 అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చింది. ఇలాంటి ఆర్భాటాలను ఎలా సెలబ్రేట్ చేయాలో బాగా తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఈ వేడుకల్ని కూడా చాలా ఘనంగా నిర్వహించారు. పత్రికల్లో వచ్చిన పతాక శీర్షికల ప్రకారం.. ఈ సందర్భంగా.. చంద్రబాబు మహిళలకు మహాగొప్ప వరాలను ప్రకటించారు. త్వరలోనే మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు వస్తాయని, ఎమ్మెల్యేలయ్యేందుకు మహిళలు సిద్ధంగా ఉండాలని చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. అలాగే.. గ్యాస్ ధరలు పెరిగినా కూడా.. ఏడాదిలో మూడు సిలిండర్ల పథకాన్ని యథాతథంగా కంటిన్యూ చేయనున్నట్టుగా కూడా చంద్రబాబు ప్రకటించారు. ఇంతకు మించిన వరాలు ఆయన వద్ద మరేమీ లేవేమో అనిపించేలా.. కొన్ని పత్రికల పతాకశీర్షికల్లో ఇవే కనిపిస్తున్నాయి. అసలు ఈ వరాల్లో చంద్రబాబు మహిళాలోకానికి కొత్తగా ఒరగబెడుతున్నది ఏముంది? అదే సమయంలో, మూడేళ్లకిందటి హామీని అధికారంలోకి వచ్చిన రెండేళ్లుగా తొక్కిపట్టేసి మహిళల పట్ల సాగిస్తున్న వంచన మాటేమిటి? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో తలెత్తుతున్నాయి. మహిళలు ఎమ్మెల్యేలు అయ్యేందుకు సిద్ధంగా ఉండాలనేది కూడా ఒక హామీనేనా? చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ దక్కినంత మాత్రాన.. అందులో చంద్రబాబు పాత్ర ఏమైనా ఉందా? తాను వ్యతిరేకించినా కూడా నెగ్గగల బిల్లుకు తన పార్టీ ఎంపీలతో అనుకూలంగా ఓటు వేయించడం తప్ప.. ఆయన చేసినది ఏముంది? కేంద్రం పూనికతో 33 శాతం రిజర్వేషన్లు చట్టరూపం దాల్చగా.. అదేదో తాను చేసిన గొప్పపని అన్నట్టుగా.. మహిళలు ఎమ్మెల్యే కావడానికి సిద్ధంగా ఉండాలని చంద్రబాబు చెప్పడం కేవలం డ్రామానే అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కేంద్రం చేసిన చట్టం అమలయ్యేలోగా.. మహిళలకు చంద్రబాబు అదే ప్రాధాన్యం ఇచ్చి ఉంటే.. మహిళాలోకం ఆయనను నెత్తిన పెట్టుకుని ఉండవచ్చు. ఫరెగ్జాంపుల్.. ఆ చట్టం గత ప్రభుత్వ హయాంలోనే అయింది గనుక.. 2024 ఎన్నికల్లోనే చంద్రబాబు గనుక.. తన పార్టీ తరఫున 33 శాతం టికెట్లు మహిళలకు ఇచ్చి ఉంటే.. మహిళాలోకం ఆయనకు నీరాజనాలు పట్టిఉండవచ్చు. పోనీ.. కేబినెట్ లో 33 శాతం బెర్తులు మహిళలతో భర్తీచేసి ఉంటే అదైనా గౌరవంగా ఉండేది. అవేమీ చేయకుండా.. మహిళా దినోత్సవానికి అదే తన పెద్ద హామీ అన్నట్టుగా చంద్రబాబు చెప్పడం కేవలం డ్రామానే అని ప్రజల అభిప్రాయం. 2023 మేలో ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించారు చంద్రబాబునాయుడు. ఇంకో నెల గడిస్తే.. మూడేళ్లు పూర్తవుతాయి. అధికారంలోకి వచ్చి కూడా రెండేళ్లు కావస్తున్నాయి. ఆ పథకానికి ఇప్పటిదాకా అతీగతీ లేదు. రాష్ట్రంలో అర్హురాలైన ప్రతి మహిళకు రూ. 1500 నెలకు ఇవ్వాలనేది ఆ పథకం. మహిళాదినోత్సవం నాడు ఆ పథకాన్ని ప్రారంభించి ఉంటే బాగుండేది. లేదా, కనీసం ఫలానా తేదీనుంచి ప్రారంభిస్తాం అని ప్రకటించి ఉంటే మర్యాదగా ఉండేది. దానిని మరుగున పెట్టేసి.. సూపర్ సిక్స్ మొత్తం అమలు చేసేశాం.. అవన్నీ సూపర్ హిట్ అయిపోయాయి.. అని అబద్ధాల డప్పు కొట్టుకుంటూ చంద్రబాబు మాయచేస్తున్న తీరును ప్రజలు ఈసడించుకుంటున్నారు.
18 likes
11 shares
P.Venkateswara Rao
620 views 1 months ago
#తిరుమల లడ్డు #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *జగన్ పై మతాస్త్రం.. లాభనష్టాలెవరికి❓* MARCH 7, 2026🎯 సుదీర్ఘ రాజకీయ, పరిపాలన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తిగా తప్పుదారిలో పయనిస్తున్నారు. హిందువుల వ్యతిరేకిగా వైసీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ముద్ర వేసి రాజకీయంగా భారీ లబ్ధి పొందాలనేది చంద్రబాబు అండ్ కో వ్యూహం. రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడంలో చంద్రబాబు దిట్ట. రాజకీయ చాణక్యుడిగా పేరొందిన చంద్రబాబు ఎత్తుకు టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావు లాంటి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులే చిత్తయ్యారు. చంద్రబాబు మాస్ లీడర్ కాదు. కానీ తెలివితేటలతో గత నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో రాణిస్తున్నారు. బాబు వేసిన ఎత్తులకు మహామహులు చిత్తయ్యారు. అయితే వైఎస్ జగన్ దగ్గరికి వచ్చే సరికి, ఒక్కోసారి ఆయన వ్యూహాలు నిష్ఫలం అవుతున్నాయి. ఎన్నికల సమయంలో దుష్ప్రచారంతో తమను ఓడించారని చంద్రబాబుపై వైఎస్ జగన్, వైసీపీ నాయకుల ఆరోపణల గురించి తెలిసిందే. కానీ వైసీపీకి శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టాలన్న చంద్రబాబు శకుని పాచిక పారడం లేదు. చంద్రబాబు గొప్పతనం ఏమంటే, తన ప్రయత్నాల్ని ఎప్పుడూ విరమించరు. ప్రయత్నిస్తూ వుంటే, ఎప్పుడూ ఒకసారైనా సత్ఫలితాలు ఇవ్వకుండా వుంటుందా? అనే నమ్మకం ఆయనది. వైఎస్ జగన్పై కొన్నేళ్లపాటు సాగించిన అవినీతి ఆరోపణలకు కాలం చెల్లిందని చంద్రబాబు గుర్తించారు. దీంతో జగన్పై కొత్త అస్త్రాన్ని ప్రయోగించాలని చంద్రబాబు కొత్త ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగానే వైఎస్ జగన్పై మతాస్త్రాన్ని ప్రయోగించారు. టీటీడీ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు పదార్థాలు కలిపారని సీఎం హోదాలో చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందుకు తీసుకెళ్లారు. తమపై విసిరిన మతాస్త్రాన్ని ఎదుర్కోవడంలో మొదట్లో వైసీపీ ఇబ్బంది పడింది. అయితే తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదుట ప్రమాణంతో మొదలైన ఎదురు దాడి... క్రమంగా పెంచింది. చివరికి సీబీఐ నేతృత్వంలోని సిట్ ఇచ్చిన నివేదికతో వైసీపీ పూర్తిగా పైచేయి సాధించింది. అయితే మతాస్త్రంతో రాజకీయంగా భారీ లబ్ధి పొందుతామని అనుకుంటే, బూమరాంగ్ కావడం టీడీపీ, జనసేన నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో వైఎస్ జగన్తో పాటు వైసీపీ నాయకులందరినీ మతం దృష్టితోనే చూడడం విస్మయం కలిగిస్తోంది. ఈ పరిణామాలు జనంలో టీడీపీ, జనసేన పార్టీలపై వ్యతిరేకత తెచ్చి పెడుతున్నాయి. శాసన మండలిలో చైర్మన్ మోషేన్రాజును ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు క్రిస్టియన్ అంటూ అనవసరంగా కెలికారు. దీంతో మండలి చైర్మన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మతం గురించి మీరెలా చెబుతారని మోషేన్రాజు గట్టిగా నిలదీశారు. తాను హిందువని ఆయన తేల్చి చెప్పారు. దీంతో మండలిలో అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి. మరోవైపు జగన్ క్రిస్టియనో, కాదో చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు అడ్డగోలు వాదన చేశారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు చంద్రబాబునాయుడు మరోసారి మతం కేంద్రంగా కీలక కామెంట్స్ చేశారు. ఏసు ప్రభువుకు అపచారం జరిగిందంటే జగన్ క్షమాపణలు చెప్పారన్నారు. వెంకటేశ్వరస్వామికి కల్తీ చర్యలతో అపచారం చేస్తే దానికి సమాధానం చెప్పరా? క్షమాపణలు చెప్పరా? కనీసం పశ్చాత్తాపమైనా ఎందుకు ప్రకటించరని చంద్రబాబు నిలదీశారు. మతపరంగా ప్రభుత్వ పెద్దలు, మంత్రులు మాట్లాడే ప్రతి మాటనూ ప్రజలు జాగ్రత్తగా గమనిస్తుంటారు. వైఎస్ జగన్ క్రిస్టియానిటీని పరిగణలోకి తీసుకుని, మతపరమైన విభజన తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలనేది పాలకుల ఎత్తుగడ. అయితే జగన్ క్రిస్టియన్ కావడంతో ఏదో అపచారం చేస్తున్నారని చంద్రబాబు, పవన్ కల్యాణ్ తదితరులు చేసే నిందారోపణలు నమ్మి, హిందువులంతా వైసీపీకి దూరమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కానీ పాలకుల ఆరోపణలతో క్రిస్టియన్, ముస్లిం తదితర మైనార్టీలంతా కూటమికి దూరం కావడం ఖాయం. అలాగే దళితులు, గిరిజనుల్ని కూడా వైసీపీకి చేరువ చేయడంలో కూటమి నేతలు విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. అంటే, చంద్రబాబు, పవన్ ఆడుతున్న మత వికృత క్రీడలో తామే రాజకీయంగా నష్టపోతున్నామనే గ్రహించలేకున్నారా? లేక మొండిగా ముందుకు వెళుతున్నారా? అనే విషయాలు వారికే తెలియాలి. తెలుగు సమాజం మతపరంగా విడిపోయేంత అజ్ఞానంలో లేదు. ఇటీవల కోవా బన్ వలీ విషయంలో హిందువులంతా ఆ పేద చిరు వ్యాపారికి ఎంత అద్భుతంగా అండగా నిలిచారో తెలిసిందే. అలాంటిది అత్యంత ప్రజాదరణ కలిగిన వైఎస్ జగన్పై చంద్రబాబు, పవన్కల్యాణ్ ఏ ఉద్దేశంతో మతాన్ని అడ్డం పెట్టుకుని విమర్శలు చేస్తున్నారో అర్థం చేసుకోలేనంత అమాయక స్థితిలో జనం లేరు. హిందువుల్లో జగన్పై వ్యతిరేకత రాకపోగా, రాజకీయ లబ్ధి కోసం ఇంతగా దిగజారి తమ మనోభావాల్ని దెబ్బతీసేలా మాట్లాడ్తారా అని చంద్రబాబు, పవన్పై హిందువులు ఆగ్రహించే పరిస్థితి. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో జగన్ కంటే, తీవ్ర ఆరోపణలు చేసిన చంద్రబాబు, పవనే ప్రజల్లో ఎక్కువగా అభాసుపాలయ్యారు. ఈ వాస్తవాన్ని పసిగట్టడం వల్లే చంద్రబాబు, పవన్లో ఓర్వలేనితనం పెరిగింది. తప్పుల్ని సరిదిద్దుకోడానికి బదులు, మరిన్ని చేస్తున్నారనే చర్చకు తెరలేచింది. తెలుగు సమాజం మత వలకు చిక్కదని ఏపీ పాలకులు తెలుసుకోవాలి. వైఎస్ జగన్ను రాజకీయంగా ఎదుర్కోడానికి మరో అస్త్రాన్ని ఎంచుకోవాలి. మరే అస్త్రాలు లేకపోవడం వల్లే మతాన్ని ఎంచుకున్నామని అనుకుంటే, అది పూర్తిగా తప్పుడు విధానం అని... ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత నుంచైనా తెలుసుకోవాలి. ఇక తిరుమల లడ్డూ ప్రసాదంపై జుగుప్స కలిగించే ఆరోపణల్ని ఆపాలంటూ ముక్త కంఠంతో తెలుగు సమాజం కోరుతున్నదంటే, మన మాటలు ఎంత వెగటు పుట్టించాయో ఒక్కసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవాలి. ఈ మొత్తం ఎపిసోడ్లో జగన్కు హిందువులు దూరం కాకపోగా, సానుభూతి పొందగలిగారు. అలాగే పదేపదే జగన్ మతం గురించి పాలకులు మాట్లాడుతుండడంతో దళితులు, గిరిజనులు, క్రిస్టియన్లు, ముస్లింలంతా వైసీపీకి మరింత దగ్గరయ్యారు. ఎందుకంటే, గత ఎన్నికల్లో వీళ్లలో మెజార్టీ కూటమి పక్షాన నిలిచింది. ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. మరోవైపు హిందువుల్ని తమవైపు తిప్పుకోలేకపోగా, వారిలో కూడా వ్యతిరేకతను కూటమి సంపాదించుకుంది. చేతులు కాలాక చంద్రబాబు, పవన్ ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏంటి? జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
5 likes
13 shares
P.Venkateswara Rao
566 views 1 months ago
#ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *వైసీపీ బలాన్ని అసెంబ్లీ వేదికగా చాటి చెప్పిన పవన్కల్యాణ్❗* MARCH 6, 2026🎯 వైసీపీపై విమర్శలు చేయడానికి డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఒంటికాలిపై లేస్తుంటారు. మరీ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా ఆయన ద్వేషిస్తున్నట్టుగా, ఆయన విమర్శలుంటాయి. ఈ నేపథ్యంలో వైసీపీని విమర్శించే క్రమంలో ఆ పార్టీ బలాన్ని అసెంబ్లీ వేదికగా పవన్కల్యాణ్ బయటపెట్టారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై డిప్యూటీ సీఎం మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. ఇప్పటికీ వాళ్లకు (వైసీపీ) సభ్యులు తక్కువే అన్నారు. 11 మంది సభ్యులే ఉన్నప్పటికీ 1100 మంది ఉన్నట్టు మాట్లాడుతుంటారన్నారు. ఇదే సందర్భంలో వారు చెప్పే విషయాలను ప్రజలు చాలా బలంగా నమ్ముతున్నారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మంచి చేస్తున్నా చెప్పుకోవడంలో విఫలమవుతోందన్నారు. వైసీపీ నాయకులు రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను సరిగా అర్థం చేసుకోలేదన్నారు. మాట్లాడే స్వేచ్ఛను ఇతరుల్ని దూషించడానికి ఉపయోగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలాగే వైసీపీ నాయకులు తమ తప్పుల్ని దాచిపెట్టి ఇతరులపై ఆరోపణలు చేస్తారని, ఆ తర్వాత కులాల వెనుక దాక్కోవడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ కామెంట్స్ మాజీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించినట్టు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ ఇటీవల కాలంలో కూటమి దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొడుతోంది. మరీ ముఖ్యంగా భయం అంటే ఏంటో తెలియదన్నట్టు వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. అయితే ఏమవుతుందని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మహా అయితే కేసులు, లేదంటే జైలుకు పంపుతారని, ఇంతకంటే ఏం చేస్తారనే ధిక్కార స్వరం పెరిగింది. ఇదే పవన్కు ఆందోళన కలిగిస్తున్నట్టుంది. వైసీపీ ఎంత బలంగా వుందో, ఆ పార్టీపై వ్యతిరేకతను ప్రదర్శించే క్రమంలో పవన్ బయటపెట్టడం జోష్ నింపుతోంది.
11 likes
13 shares