P.Venkateswara Rao
522 views • 11 hours ago
#ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 #ఏపీ అప్ డేట్స్..📖 #ఎల్లో మీడియా.. 🤠
*జగన్పై జనాదరణ……… ప్రత్యర్థుల్లో గుండెదడ❗*
NOVEMBER 21, 2025🎯
ప్రాంతీయ పార్టీ అధినేతల్లో వైఎస్ జగన్కు ఉన్నంత ప్రజాదరణ మరే నాయకుడికి కనిపించదు. ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్న వైసీపీ అధినేతకు, ఇంత తక్కువ సమయంలో విపరీత ప్రజాదరణ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జగన్కు జనాదరణ, రాజకీయ ప్రత్యరులో గుండె దడ పుటిస్తోందనే అభిప్రాయం
ప్రత్యర్థుల్లో గుండె దడ పుట్టిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వైఎస్ జగన్ మాస్ లీడర్. జగన్ బలమే జనం. అధికారంలో వుండగా జగనే జనాన్ని పట్టించుకోలేదు. వాళ్లతో కలవలేదు. జనానికి సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి పనులు చేసి పెడుతున్నానని ఆలోచించారే తప్ప, వారితో మానసికంగా దూరమవడాన్ని పసిగట్టలేకపోయారు. అందుకే ఎన్నికల్లో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. రాజకీయాలే కాదు, జీవితంలోనూ నిత్యం అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ ముందుకు పోవాల్సిందే.
ఇందుకు జగన్ అతీతం కాదు. నాంపల్లిలోని సీబీఐ కోర్టులో వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు వెళ్లిన వైఎస్ జగన్కు భారీ జనాదరణ లభించింది. ఈ మధ్య కాలంలో జగన్కు జనంలో మళ్లీ పూర్వపు ఆదరణ దక్కుతోందని వ్యతిరేక మీడియా పసిగట్టింది. అందుకే హైదరాబాద్లో జగన్ పర్యటనపై మూడు రోజుల ముందు నుంచే వ్యతిరేక ప్రచారాన్ని మొదలు పెట్టింది. కానీ తాము చేస్తున్న ప్రతి వ్యతిరేక పని. జగన్కు రాజకీయంగా లాభిస్తుందనే
సంగతి మరిచిపోయారు.
జనాదరణ లేని ఏ నాయకుడి రాజకీయ జీవితమైనా అస్తమిస్తోందని అర్థం. కానీ జగన్కు జనాదరణ చూస్తే, ఉదయిస్తున్న సూర్యోదయాన్ని మురిపిస్తోంది. సూర్యోదయ వెలుగు అంతకంతకూ పెరుగుతుంటుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై కనీసం ఏడాదిన్నర కూడా కాలేదు. అప్పుడే కూటమి ప్రత్యర్థి, ప్రత్యామ్నాయ నాయకుడైన వైఎస్ జగన్కు, అది కూడా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో జనం పెద్ద ఎత్తున రావడం చిన్న విషయం కాదు.
హైదరాబాద్లో జగన్కు పోటెత్తిన జనం వైసీపీలో జోష్ నింపగా, ముఖ్యంగా టీడీపీలో భయం నింపింది. జనంలో మళ్లీ జగన్పై మోజు కనిపిస్తోందన్న చర్చకు తెరలేచింది. అంతేకాదు, జనాదరణ చాలా అర్థాలు చెబుతోంది. కూటమి ప్రభుత్వంపై అసంతృప్తిని, వ్యతిరేకతను ప్రతిబింబిస్తోంది. కూటమి పాలన ప్రజా వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తోందనేందుకు జగన్కు లభించిన జనాదరణే నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరీ ముఖ్యంగా పిచ్చిపట్టినట్టుగా జగన్పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ అనుకూల మీడియా వైఖరిని జనం అసహ్యించుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఏపీలో జగన్ పాదయాత్ర చేపట్టి, రోడ్డుపైకి వస్తే జనమే జనం అని చెప్పక తప్పదు. ఈ జనాదరణే జగన్కు వెయ్యి ఏనుగుల బలం. కూటమిపై పోరాటానికి జనం ఇస్తున్న మద్దతే కొండంత బలం అని చెప్పక తప్పదు.
10 likes
12 shares