ShareChat
click to see wallet page
search
#ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *వైసీపీ బలాన్ని అసెంబ్లీ వేదికగా చాటి చెప్పిన పవన్కల్యాణ్❗* MARCH 6, 2026🎯 వైసీపీపై విమర్శలు చేయడానికి డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఒంటికాలిపై లేస్తుంటారు. మరీ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా ఆయన ద్వేషిస్తున్నట్టుగా, ఆయన విమర్శలుంటాయి. ఈ నేపథ్యంలో వైసీపీని విమర్శించే క్రమంలో ఆ పార్టీ బలాన్ని అసెంబ్లీ వేదికగా పవన్కల్యాణ్ బయటపెట్టారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై డిప్యూటీ సీఎం మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. ఇప్పటికీ వాళ్లకు (వైసీపీ) సభ్యులు తక్కువే అన్నారు. 11 మంది సభ్యులే ఉన్నప్పటికీ 1100 మంది ఉన్నట్టు మాట్లాడుతుంటారన్నారు. ఇదే సందర్భంలో వారు చెప్పే విషయాలను ప్రజలు చాలా బలంగా నమ్ముతున్నారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మంచి చేస్తున్నా చెప్పుకోవడంలో విఫలమవుతోందన్నారు. వైసీపీ నాయకులు రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను సరిగా అర్థం చేసుకోలేదన్నారు. మాట్లాడే స్వేచ్ఛను ఇతరుల్ని దూషించడానికి ఉపయోగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలాగే వైసీపీ నాయకులు తమ తప్పుల్ని దాచిపెట్టి ఇతరులపై ఆరోపణలు చేస్తారని, ఆ తర్వాత కులాల వెనుక దాక్కోవడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ కామెంట్స్ మాజీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించినట్టు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ ఇటీవల కాలంలో కూటమి దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొడుతోంది. మరీ ముఖ్యంగా భయం అంటే ఏంటో తెలియదన్నట్టు వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. అయితే ఏమవుతుందని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మహా అయితే కేసులు, లేదంటే జైలుకు పంపుతారని, ఇంతకంటే ఏం చేస్తారనే ధిక్కార స్వరం పెరిగింది. ఇదే పవన్కు ఆందోళన కలిగిస్తున్నట్టుంది. వైసీపీ ఎంత బలంగా వుందో, ఆ పార్టీపై వ్యతిరేకతను ప్రదర్శించే క్రమంలో పవన్ బయటపెట్టడం జోష్ నింపుతోంది.
ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 - ShareChat