🪷99శ్రీలింగమహాపురాణం🪷
🍀పాశుపత వ్రత పూజా విధానము🍀
#తొంభై తొమ్మిదవ భాగం#
పాశుపత వ్రతము చేయ దలచిన భక్తుడు చైత్రమాసంతో ప్రారంభించి పన్నెండు మాసాలు చేయాలి. వ్రతానికి ముందు ఒక చిన్న శివలింగముతయారు చేయించుకోవాలి.ఆశివలింగాన్ని చందన సుగంధిత నీటితో స్నానము చేయించాలి.
కర్ణికలుకలఅష్టదళకమలమును బంగారంతో చేయించి వేదిక పై ఉంచాలి. నవరత్నాలతో అలకరించాలి. స్బటికముతో చేయబడిన స్థూల లింగాన్ని కమల కర్ణిక మధ్యలో ప్రతి ష్ఠించాలి.మొదటవైదికవిధులతో,మంత్రాలతోబిల్వపత్రముల చేత పూజ ప్రారంభించాలి.
తరువాత శ్వేత రక్త నీల వర్ణ కమలాలు, జిల్లేడు గన్నేరు పూలు, కురువకములు మరియు ఇతర పుష్పాలను లింగ గాయత్రీ మంత్రం జపిస్తూ పూజ చేయాలి. చందనాది సుగంధాలు సమర్పించాలి. దీప ధూపాలు అర్పించాలి.
లింగ పూజ అయిన తరువాత లింగపు దక్షిణ వైపున అఘోర మంత్రం జపిస్తూ అగరు సమర్పించాలి. పశ్చిమాన సద్యోజాత మంత్రంతో మనశిల (సుగంధ ధూప పదార్థము) సమర్పించాలి. ఉత్తరాన వామదేవ మంత్రంతో నూరిన చందనము సమర్పించాలి. తూర్పు దిశలో తత్పురుష మంత్రంతో శ్వేత కృష్ణ అగురు గుగ్గులాది ధూపములు సమ ర్పించాలి. అలాగే సితారము అని పేరు గల చక్కని సుగంధ అత్తరును సమర్పించాలి.
మహా చరువు లేదా ఒక అధకము (16 మానికలు - 32 శేర్లు) కొలత గల బియ్యముతో వండిన అన్నమును నైవేద్యంగా సమర్పించాలి. ఇదే పూజ విధానము పన్నెండు నెలలు ఆచరించాలి. ఇక విశేష పూజ విధానము తెలుపుతాను. ప్రతి మాసంలో ప్రత్యేక లింగముతో పూజ చేస్తారు.
చైత్ర మాసంలో స్ఫటిక లింగము, వైశాఖ మాసంలో వజ్ర లింగము, జేష్ఠ మాసంలో ముత్యాల లింగము, శ్రావణ మాసంలోనీలమణులలింగము, భాద్రపద మాసంలో పద్మరాగ లింగము ఆశ్వీయుజ మాసంలో గోమేధిక లింగము, కార్తీక మాసంలో ప్రవాళ (పగడపు) లింగము, మార్ఘశీర్ష మాసంలో వైఢూర్య లింగము, పుష్య మాసంలోపుష్యరాగలింగమును, మాఘమాసంలో సూర్యకాంత లింగము, ఫాల్గుణ మాసంలో స్ఫటిక లింగముతో పూజించాలి.
అన్ని నెలలలో బంగారపు కమలములలో ఉంచి లింగ పూజ చేయాలి. బంగారపు కమలములు దొరకకపోతే వెండికమలములుఉపయో
గించ వచ్చును. ఇవి లేక పోయినా, స్థోమత లేకపోయినా సామాన్య కమలములు ఉప యోగించి పూజ చేయవచ్చును. రత్న లింగాల లేకపోతే సువర్ణ రజతలింగములుఉపయోగించ వచ్చును.
బంగారము , వెండితో చేయించే స్థోమత లేని భక్తులు వేదికతో కూడిన శిల, కాష్ఠ, మృత్తిక (మట్టి) లింగములు లేదా తాత్కాలిక సర్వగంధమయ లింగము తయారు చేయించి ప్రతిష్ఠించి పూజచేయవచ్చును. స్వర్ణ రజత లేదా సామాన్య కమలములు లేనప్పుడు బిల్వపత్రములు ఉపయోగించి పూజ చేయవచ్చును.
పూజలో వేయి లేదా ఐదు వందలు లేదా అందులో సగము కమల పుష్పాలు ఉపయోగించాలి. లేకపోతే కనీసం 108 కమలములు చేత పూజించ వచ్చును. బిల్వ పత్రములలో లక్ష్మీదేవి ఉంటుంది. నీల కమలాలలో అంబికాదేవి ఉంటుంది. అరుణ కమలాలలో షడాననుడు ఉంటాడు. దేవదేవుడైన మహాశివుడు కమలములలో అధిష్టితుడై ఉండాలి.
కనుక భక్తులు పూజలో బిల్వ పత్రాలు, శ్వేత నీల రక్త వర్ణ కమలాలు ఉపయోగించాలి. కమలములు సర్వ రోగాలను వశములోకి తెస్తాయి. మనశిల ధూపము సర్వసిద్దులుఇస్తుంది. నల్లని అగరు సుగంధము సర్వ పాపములు నాశనం చేస్తుంది. గుగ్గులాది ధూప దీపములు నినేదించుట వలన సర్వ రోగాలనునశిస్తాయి.చందనముసుగంధ ద్రవ్యాలు, ధూపములు కోరికలు తీర్చు సాధకములు. శ్వేతకృష్ణ అగరు సుగంధము, సీతారము అనే ధూపములు ముక్తిపదము కలిగించేవి.
తెల్లజిల్లేడు పుష్పాలతో చతుర్ముఖ బ్రహ్మ, గన్నేరు పూలలలో మేధాదేవి, కరవీర పుష్పాలలో గణాధ్యక్షులు, కురువక పుష్పాలలో విష్ణువు, సుగంధిత పుష్పాలలో పార్వతీ దేవి నివాసము ఉంటారు. కనుక భక్తులు తమ శక్తి విత్తానుసారం లభ్యమైన పూలు, ధూపాలతో పూజించాలి.
భోజనములో ఉపయోగించు సర్వ పదార్థములతో తయారైన ఘృతసహిత నైవేద్యం సమర్పించాలి. పిమ్మట పాయసము సమర్పించాలి. లేదా ఒక అఢకము లేదా అందులో సగము అన్నము గాని, పులగము గాని సమర్పించ వచ్చును. ధర్మంగా అర్జించిన ఇతరఉపహారములు (వస్తువులు) కూడ సమర్పించ వచ్చును. అవి శుద్దముగా, దానార్హములుగా ఉండాలి.
సమర్పించుటకు ముందుగా ఆ వస్తువులు, పదార్థాలపై నీరు చల్లి శివునికి అర్పించాలి. అన్నదానము చేత శివుడు ప్రసన్నుడవుతాడు. కనుక భక్తులు అన్నము సమర్పించి శివుని పూజించాలి. విసన కర్రలోవాయుదేవుడుఉంటాడు. విసనకర్ర దానము చేత వాయు దేవుడు ప్రసన్నుడవుతాడు. సుగంధిత జలములో వరుణదేవుడు ఉన్నాడు.
వేదిక పై ప్రకృతి స్వయముగా ఉంటుంది. స్వయముగా మహాశివుడే సర్వ వస్తువులు, పదార్థములలోవిరాజిల్లు
తున్నాడు. కనుక ప్రతి నెల విధి పూర్వకంగాశివునిపూజించాలి. సర్వకార్య సిద్దికి పూర్ణ మాసిక వ్రతము చేయాలి. పూర్ణిమ, అమావాస్య నాడు ఉపవాసం ఆచరించాలి. వేద పండితులకు విద్వాంసులకు అన్నదానం చేయాలి. పూజ చేసిన శివ లింగమునుసర్వదానసామాగ్రితో శివాలయమునకు ఇచ్చి వేయాలి లేదా బ్రాహ్మణునకు దానమివ్వాలి.
అన్ని మాసాలలో శివలింగ మహావ్రతము చేసిన భక్తుడు శివలోకంలో శాశ్వతంగా ఉంటాడు. మృత్యులోకం లోకి వెళ్లడు. ఒక నెల అయినా ఆచరించిన వాడు శివలోకము చేరుతాడు. శివభక్తుడు తను ఆచరించిన లింగ పూజలను బట్టి దేవత్వము, పితృత్వము, ఇంద్రత్వము, గణాధిపత్యం పొందగలుగుతాడు.
పహాశివుని భక్తి పూర్వకంగా, విధి పూర్వకంగా పూజించిన తరువాత భక్తుడు పత్ని పుత్ర పరివార సమేతంగా శిరస్సు వంచి నమస్కారం చేయాలి. తరువాత ప్రదక్షిణం చేయాలి. అనంతరం "వ్యాపోహన ప్రార్థన మంత్రము" లను పఠించాలి. ఈ ప్రార్థనా మంత్రాన్ని బ్రహ్మ ముల్లోకాలకు శుభము కలిగించుటకు రచించాడు.
https://chat.whatsapp.com/DnFG7pWG3BkH6MKxaSFRFb
#🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు #🙏ఓం నమః శివాయ🙏ૐ
*మిగతా కథ రేపటి భాగంలో చదువుదాం*.
🌹శ్రీకాంత్ గంజికుంట
కరణంగారి సౌజన్యంతో🌹
💜 ఓం శ్రీఉమా
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః
సుఖినోభవన్తు🙏
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
(సర్వం శ్రీశివార్పణమస్తు)
🌷🙏🌷
శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺