Sąíkűmąŕ $@i
754 views
5 months ago
*సత్యమేవ జయతే.. మా నినాదం: ఖర్గే* * నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా, రాహుల్‌ గాంధీలకు మంగళవారం ఊరట లభించింది. వారిపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటును పరిగణనలోకి తీసుకోవడానికి దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు నిరాకరించింది. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే స్పందించారు. ‘‘ఈ కేసుతో వారు రాజకీయ ప్రతీకారానికి దిగుతున్నారు. గాంధీ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టడానికి రాద్దాంతం చేస్తున్నారు. ఈ తీర్పు తర్వాత ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా రాజీనామాలు చేయాల్సింది. సత్యమేవ జయతే.. మా నినాదం. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం’’ అన్నారు. #news #politics #sharechat