👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
622 views
1 days ago
వేలిముద్రే అమ్మనాన్నల ఆనవాలు... అక్షరజ్ఞానం లేని అమాయకురాలు ఆమె. అయితేనేం... ఆమె తన అమ్మనాన్నల జ్ఞాపకాన్ని పదిలంగా దాచుకున్న తీరు చూస్తే మాత్రం మనకు అబ్బురమనిపించక మానదు. ఆమె చిన్నతనంలోనే అమ్మనాన్నలు చనిపోయారు. అమ్మనాన్నలు ఎలా ఉంటారో తెలీదు. వారి రూపం కళ్ళ ముందు లేదు. కొంచెం ఊహ తెలిశాక అమ్మనాన్నల ఫోటో ఏదైనా దొరుకుతుందేమోనని ఇల్లంతా వెతికింది. ఎక్కడా దొరకలేదు. అయినవాళ్లందరినీ అడిగి చూసింది. ఎవ్వరూ అమ్మనాన్నల ఆనవాలుగా ఒక్క ఫోటోని కూడా ఇవ్వలేకపోయారు. ఒకరోజు పాత ఆస్తి కాగితాలు తిరగేస్తూ ఉంటే... వాటిలో నాన్న మునిస్వామి వేలిముద్ర కనిపించింది. ఈమెకు అంతులేని ఆనందం. వెంటనే ఆ వేలిముద్రను ఎనలార్జ్ చేయించి, ఫోటో ఫ్రేమ్ కట్టించింది. ఇప్పుడు ఆ వేలిముద్రే అమ్మనాన్నలకు ఆనవాలు. ఆ వేలిముద్ర ఫోటో ముందు ఆమె ప్రతిరోజూ దీపం వెలిగిస్తుంది. ఆ ఫోటోకే నైవేద్యం పెడుతుంది. అంతే కాదు... మరో అబ్బురం కూడా ఆమె ఖాతాలో ఉంది. ఆమెకు పుట్టిన ఒక్కగానొక్క కొడుకు బాల సుబ్రహ్మణ్యంకి చిన్నతనంలో పోలియో సోకింది. అందరిలా ఆమె నిరాశతో కృంగిపోలేదు. ఏడుస్తూ కూర్చోలేదు. తన తలరాత ఇంతేనని సరిపెట్టుకోలేదు. తన కొడుకుని ఒక దివ్యాంగుడిగా కేవలం చక్రాల బండికి పరిమితం చెయ్యడానికి ఆ తల్లి హృదయం ఒప్పుకోలేదు. ఆ బిడ్డని కంటికి రెప్పలా కాచుకుంది. ఓపికగా సపర్యలు చేసింది. ఆ పిల్లాడికి ప్రతిరోజూ చక్కగా స్నానం చేయించి, స్కూల్ యూనిఫామ్ ధరింపజేసి, చక్కగా తల దువ్వి, క్లాసు పుస్తకాలు అమర్చి చక్రాల బండిలో తీసుకుని, స్కూలు దగ్గర దిగబెట్టి వచ్చేది. స్కూలు అయిపోయాక, మళ్లీ ఆ పిల్లాడిని జాగ్రత్తగా ఇంటికి తీసుకు వచ్చేది. ఆమె కష్టం ఊరికే పోలేదు. పిల్లవాడు చక్కగా చదువుకుని ప్రయోజకుడు అయ్యాడు. ప్రస్తుతం అతను ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. ఆమె పేరు భద్రమ్మ. నెల్లూరు జిల్లా, ఇందుకూరుపేట మండలం, కొత్తూరు గ్రామ వాస్తవ్యురాలు. ఇప్పుడు ఆమె వయసు ఇంచుమించుగా 65 సంవత్సరాలు. ఇప్పటికీ ప్రతిరోజూ నాన్న వేలిముద్ర ఫోటో ముందు దీపం వెలిగించి దండం పెట్టి, నైవేద్యం పెట్టడం ఆమె దినచర్యలో భాగం. తల్లిదండ్రులనే దైవాలుగా భావించి ఆరాధించే భద్రమ్మను, ఆమె కుమారుడు బాలసుబ్రహ్మణ్యం కూడా అంతే అపురూపంగా చూసుకుంటున్నాడు. దివ్యాంగుడైన తన కొడుకు దివ్యంగా ఉన్నాడన్న ఆనందం ఆమె క ళ్ళలో ఇప్పుడు. #🙆 Feel Good Status #amma #మాతృ దేవో భవ 🙏 #🕊️🐾💗అమ్మా ప్రేమా💗🐾🦋🦋 #ᬊᬁ𝐌𝐨𝐦'𝐬 𝐥𝐨𝐯𝐞💕