👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
ShareChat
click to see wallet page
@priyadarshi2410
priyadarshi2410
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
@priyadarshi2410
💫అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్💫
We fall in love with people we can't have.👣🖤💔🍀 #yes it's true 💯% #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #😢Sad Feelings💔 #😊ఎమోషనల్ ఫీలింగ్స్ #😥మనసులోని బాధ💔
yes it's true 💯% - ShareChat
He took care of you in 2025 He will take care of you in 2026.... जिन जिन्होंने अब तक संभाला आगे भी वही संभालेंगे! क्योंकि 👇🏻 "होई है वहीं जो राम रची राखा " #🥳హాయ్ 2026 🙌 #❤️హ్యాపీ న్యూ ఇయర్🎉 #💗నా మనస్సు లోని మాట #🙆 Feel Good Status #🦚 హరే కృష్ణ 🦚
🥳హాయ్ 2026 🙌 - -5` -5` - ShareChat
#yes it's true 💯% #🗣️జీవిత సత్యం #😃మంచి మాటలు #EAT HEALTHY AND BE HEALTHY
yes it's true 💯% - The forced, 661 poison was never it was offered gently until you forgot it was at all. 99 poison Mark Twain Ayurveda by Curejoy Curedfoy | The forced, 661 poison was never it was offered gently until you forgot it was at all. 99 poison Mark Twain Ayurveda by Curejoy Curedfoy | - ShareChat
మాతా నృశింహశ్చ పితా నృసింహః - భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః | విద్యా నృసింహొ ద్రవిణం నృసింహః - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబం || ---> నాకు నృసింహుడే తల్లి తండ్రి, నృసింహుడే సోదరుడు మిత్రుడు, నృసింహుడే విద్య ధనము, నృసింహుడే ప్రభువు, నాకు సర్వస్వము నృసింహుడేస్వామి🙏🙏 #లక్ష్మీ నరసింహ స్వామి #నరసింహ స్వామి
లక్ష్మీ నరసింహ స్వామి - ShareChat
మాఘ పురాణం - 30. 30వ అధ్యాయము - మార్కండేయుని వృత్తాంతము వశిష్టుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకండుని జననము, కావిశ్వనాధుని దర్శనము, విస్వనాధుని వరంవలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి "మహారాజా! ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్దగా ఆలకింపుమని యీ విధముగా చెప్పదొడంగిరి. మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరాలు మాత్రమే రోజులు గడచుచున్నకొలది తల్లిదండ్రులకు దిగులు యెక్కువగుచుండెను. అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నిటిని పూర్తి చేసిరి. ఆరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రివలెనే అచిరకాలములో సకలశాశ్త్రములు, వేదాంత పురాణేతిహాసములు, స్మృతులు పథించి గుణవంతుడని ప్రశంసలనందెను. అయిననూ మరుద్వతీ మృకండులు నిత్యమును మార్కండాఎయునకు "కుమారా! నీవు పసితనమునందే సకలశాస్త్రములు అభ్యసించి నీ బుద్దికుశలతచే అందరిమన్నలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువులయెడ,పెద్దలయెడ, బ్రాహ్మణులయెడ మరింత భక్తిభావముతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును గాన, నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధీగును" అని చెప్పుచుండెడివారు. అటుల పదిహేను సంవత్సరములు గడిచిపోయినది. రోజు రోజుకు తల్లిదండౄల ఆందోళన, భయము ఎక్కువగానున్నవి. పరమశివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి, మహాఋషులందరుకును ఆహ్వానము పంపినారు, మునీశ్వరులు, గురువర్యులు మొదలగువారందరు మృకండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకండుడానందమొంది అతిధిసత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చి పెద్దలందరుకూ నమస్కరించినాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా, ఆయన మార్కండేయుని వారించినారు, అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావా! మీరిట్ళు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించెను.అంత వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడవుకమ్ము అని దీవించితిరి గదా! అదెటుల అగును. ఇతని ఆయుర్దాయము పదహారెండ్లే గదా? ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుచున్నారు. పరమేశ్వరుదిచ్చిన వరము ప్రకారము యీతడు ఇంకోక సంవత్సరము మాత్రమే జీవించును అని చెప్పెను. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. 'చిరంజీవివై వర్ధిల్లు' మని దీవించినందున వారి వాక్కులసత్యములగునని బాధపడి దీనికి మార్గాంతరము లేదా? యని వశిష్టుల వారినే ప్రశ్నించిరి, వశిష్టులు కొంతసేపాలోచించి "మునిసత్తములారా! మనమందరమునూ ఈ మార్కండేయుని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవుదమురండు" అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొనిపోయిరి. మునీశ్వరుల యాగమునకు బ్రహ్మ్హ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ 'చిరంజీవిగా జీవించు నాయనా' అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరబాటునకు విచారము వెల్లబుచ్చి కొతతడవాగి "భయపడకు"మని మార్కండేయుని దగ్గరకు చేరదీసి "పరమేశ్వరుడు యీ బాలుని దీర్ఘాయుష్మంతునిగా జేయునుగాక" యని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతట మునుల వంక చూచి "ఓ మునులారా! మీరు పోయిరండు ఇతనికి యే ప్రమాదమునూ జరుగనేరదు" అని పలికి వత్సా మర్కండేయా! నీవు కాశీ క్షేత్రమునకు పోయి, విశ్వనాధుని సదా సేవించుచుండుము. నీకే ప్రమాదమూ కలుగదని ధైర్యము చెప్పి పంపి వేసెను. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి, 'కాశీనాధుని సేవించి వచ్చెదను అనుజ్ఞ ' నిమ్మని కోరగా మృకండుడు నాతని భార్యయు కొడుకు యొక్క యెడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి యుండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. మృకండుడు కుటుంబ సహితముగా కాశీకి పోయి .విశ్వేస్వరాలయ సమీపమందొక ఆశ్రమము నిర్మించెను. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనేయుండసాగెను. క్రమముగా నాతడు పదహారవయేట ప్రవేశించెను. మరణ సమయ మాసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు గొనితెమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివసన్నిధితో ధ్యానము చేసుకొనుదున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి, ఆ సమీపమందు నిలువలేకపోయిరి. కాలపాశము విసురుటకు చేతుల నెత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహాతేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్నికణములవలె బాధించెను. ఆ బాధ కోర్వలేక భటులుపోయి జరిగిన వృత్తాంతమును యముని కెరిగించగా యముడాశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాశమును విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరచి చూచుసరికి యముడతని ప్రాణములను తీసుకొనిపోవసిద్దముగా నుండగా, నాతడు భయపడి, శివలింగమును కౌగిలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి, మార్కండేయుని రక్షించెను. యముడు చనిపోవుటచే అష్టదిక్పాలురు బ్రహ్మాదిదేవతలు వచ్చి శివుని అనేక విధముల ప్రార్థించిరి, కోపముచల్లార్చుకో మహేశా! యముడు తన కర్తవ్యమును నెర వేర్చినాడు. తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువు నిచ్చితిరిగదా! అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. తమరు మార్కండేయుని చిరంజీవిగా జేసితిరి. అందుకు మేమెంతయో ఆనందిచుచున్నాము. కాని, ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటుకదా గాన, మరల యముని బ్రతికించుడని వేడుకొనిరి. అంతట నీశ్వరుడు యముని బ్రతికించి యమా నీవు నా భక్తులదరికి రావలదు సుమా! అని హెచ్చరించి అంతర్ధానమయ్యెను. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందులకు మృకండుడు మిక్కిలి సంతసించి, తాను చేసిన మాఘమాస వ్రతఫలమే తన కుమారుని కాపాడినదని నమ్మి యీ మాఘమాస ప్రభావమును లోకులందరకు చెప్పుచుండెను. #🌞శ్రీ సూర్యనారాయణ స్వామి🌞 #🌞 శ్రీ సూర్యనారాయణ స్వామి 🌞 #ఓం శ్రీ సూర్యనారాయణ స్వామి 🙏🏻 # ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ నమో నమః #☸🙏సూర్యనారాయణ స్వామి
🌞శ్రీ సూర్యనారాయణ స్వామి🌞 - ShareChat
మాఘ పురాణం - 30. 30వ అధ్యాయము - మార్కండేయుని వృత్తాంతము వశిష్టుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకండుని జననము, కావిశ్వనాధుని దర్శనము, విస్వనాధుని వరంవలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి "మహారాజా! ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్దగా ఆలకింపుమని యీ విధముగా చెప్పదొడంగిరి. మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరాలు మాత్రమే రోజులు గడచుచున్నకొలది తల్లిదండ్రులకు దిగులు యెక్కువగుచుండెను. అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నిటిని పూర్తి చేసిరి. ఆరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రివలెనే అచిరకాలములో సకలశాశ్త్రములు, వేదాంత పురాణేతిహాసములు, స్మృతులు పథించి గుణవంతుడని ప్రశంసలనందెను. అయిననూ మరుద్వతీ మృకండులు నిత్యమును మార్కండాఎయునకు "కుమారా! నీవు పసితనమునందే సకలశాస్త్రములు అభ్యసించి నీ బుద్దికుశలతచే అందరిమన్నలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువులయెడ,పెద్దలయెడ, బ్రాహ్మణులయెడ మరింత భక్తిభావముతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును గాన, నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధీగును" అని చెప్పుచుండెడివారు. అటుల పదిహేను సంవత్సరములు గడిచిపోయినది. రోజు రోజుకు తల్లిదండౄల ఆందోళన, భయము ఎక్కువగానున్నవి. పరమశివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి, మహాఋషులందరుకును ఆహ్వానము పంపినారు, మునీశ్వరులు, గురువర్యులు మొదలగువారందరు మృకండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకండుడానందమొంది అతిధిసత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చి పెద్దలందరుకూ నమస్కరించినాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా, ఆయన మార్కండేయుని వారించినారు, అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావా! మీరిట్ళు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించెను.అంత వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడవుకమ్ము అని దీవించితిరి గదా! అదెటుల అగును. ఇతని ఆయుర్దాయము పదహారెండ్లే గదా? ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుచున్నారు. పరమేశ్వరుదిచ్చిన వరము ప్రకారము యీతడు ఇంకోక సంవత్సరము మాత్రమే జీవించును అని చెప్పెను. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. 'చిరంజీవివై వర్ధిల్లు' మని దీవించినందున వారి వాక్కులసత్యములగునని బాధపడి దీనికి మార్గాంతరము లేదా? యని వశిష్టుల వారినే ప్రశ్నించిరి, వశిష్టులు కొంతసేపాలోచించి "మునిసత్తములారా! మనమందరమునూ ఈ మార్కండేయుని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవుదమురండు" అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొనిపోయిరి. మునీశ్వరుల యాగమునకు బ్రహ్మ్హ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ 'చిరంజీవిగా జీవించు నాయనా' అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరబాటునకు విచారము వెల్లబుచ్చి కొతతడవాగి "భయపడకు"మని మార్కండేయుని దగ్గరకు చేరదీసి "పరమేశ్వరుడు యీ బాలుని దీర్ఘాయుష్మంతునిగా జేయునుగాక" యని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతట మునుల వంక చూచి "ఓ మునులారా! మీరు పోయిరండు ఇతనికి యే ప్రమాదమునూ జరుగనేరదు" అని పలికి వత్సా మర్కండేయా! నీవు కాశీ క్షేత్రమునకు పోయి, విశ్వనాధుని సదా సేవించుచుండుము. నీకే ప్రమాదమూ కలుగదని ధైర్యము చెప్పి పంపి వేసెను. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి, 'కాశీనాధుని సేవించి వచ్చెదను అనుజ్ఞ ' నిమ్మని కోరగా మృకండుడు నాతని భార్యయు కొడుకు యొక్క యెడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి యుండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. మృకండుడు కుటుంబ సహితముగా కాశీకి పోయి .విశ్వేస్వరాలయ సమీపమందొక ఆశ్రమము నిర్మించెను. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనేయుండసాగెను. క్రమముగా నాతడు పదహారవయేట ప్రవేశించెను. మరణ సమయ మాసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు గొనితెమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివసన్నిధితో ధ్యానము చేసుకొనుదున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి, ఆ సమీపమందు నిలువలేకపోయిరి. కాలపాశము విసురుటకు చేతుల నెత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహాతేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్నికణములవలె బాధించెను. ఆ బాధ కోర్వలేక భటులుపోయి జరిగిన వృత్తాంతమును యముని కెరిగించగా యముడాశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాశమును విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరచి చూచుసరికి యముడతని ప్రాణములను తీసుకొనిపోవసిద్దముగా నుండగా, నాతడు భయపడి, శివలింగమును కౌగిలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి, మార్కండేయుని రక్షించెను. యముడు చనిపోవుటచే అష్టదిక్పాలురు బ్రహ్మాదిదేవతలు వచ్చి శివుని అనేక విధముల ప్రార్థించిరి, కోపముచల్లార్చుకో మహేశా! యముడు తన కర్తవ్యమును నెర వేర్చినాడు. తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువు నిచ్చితిరిగదా! అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. తమరు మార్కండేయుని చిరంజీవిగా జేసితిరి. అందుకు మేమెంతయో ఆనందిచుచున్నాము. కాని, ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటుకదా గాన, మరల యముని బ్రతికించుడని వేడుకొనిరి. అంతట నీశ్వరుడు యముని బ్రతికించి యమా నీవు నా భక్తులదరికి రావలదు సుమా! అని హెచ్చరించి అంతర్ధానమయ్యెను. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందులకు మృకండుడు మిక్కిలి సంతసించి, తాను చేసిన మాఘమాస వ్రతఫలమే తన కుమారుని కాపాడినదని నమ్మి యీ మాఘమాస ప్రభావమును లోకులందరకు చెప్పుచుండెను. #మాఘ పురాణం అధ్యాయాలు #మాఘ పురాణం అధ్యాయలు #మాఘ పురాణం #మాఘ పురాణం.. 🙏 #మాఘ పురాణం🙏🙏
మాఘ పురాణం అధ్యాయాలు - ShareChat
*మాఘ అమావాస్య ప్రశస్తి* *మహాదేవ మహాదేవ మహాదేవ* ******************************************* రేపు అనగా 17.2.2026 పితృ తర్పణ రేపు చేయాల్సి ఉంటుంది *మాఘ సోమ అమావాస్య* *స్కాంద పురాణే* అమావాస్యా యదా సోమే మాఘమాసే ప్రశస్యతే | సర్వతీర్థమయీ పృథ్వీ గంగాద్యాః సరితస్తథా || మాఘ మాసంలో సోమవారం నాడు వచ్చే అమావాస్య అత్యంత ప్రశస్తమైనది. ఈ రోజున భూమిపై ఉన్న అన్ని జలవనరులు, నదులు గంగానదితో సమానమైన పవిత్రతను పొందుతాయి. *మాఘ అమావాస్య స్నానం* మాఘే మాసి త్వమావాస్యాం స పౌర్ణమాస్యాం విశేషతః | మౌనస్నానం ప్రశస్తం స్యాత్ సర్వపాపహరం నృణామ్ || మాఘ మాసంలో అమావాస్య తిథి నాడు మౌనంగా ఉండి స్నానమాచరించడం మనుషుల యొక్క సమస్త పాపాలను హరిస్తుంది. అందుకే దీనిని 'మౌని అమావాస్య' అని పిలుస్తారు. *వాయుపురాణే* ఆయుః పుత్రం యశః స్వర్గం కీర్తిం పుష్టిం బలం శ్రియమ్ | పశూన్ సౌఖ్యం ధనం ధాన్యం దద్యుః పితృపూజితాః || ఈ పవిత్ర దినాన పితృ దేవతలను పూజించడం వల్ల ఆయువు, పుత్ర సంతానం, యశస్సు, స్వర్గం, కీర్తి, పుష్టి, బలం, ఐశ్వర్యం, పశు సంపద, సుఖం మరియు ధనధాన్యాలు లభిస్తాయి. **************************************** *జపం, హోమం, అర్చన విశేషం* మాఘే మాసి త్వమావాస్యాం జపహోమార్చనాదికమ్ | యత్కించిత్కురుతే మర్త్యః తత్సర్వమక్షయం భవేత్ || మాఘ మాస అమావాస్య నాడు మనిషి చేసే జపం, హోమం, అర్చన వంటి ఏ స్వల్ప పుణ్యకార్యమైనా సరే, అది 'అక్షయం' (ఎన్నటికీ నశించనిది) అవుతుంది. మౌనేన జప్యమానం తు సహస్రగుణితం భవేత్ | మాఘ్యామమావాస్యాం తస్మాన్మౌనీ భూత్వా జపేద్బుధః || తాత్పర్యం: మౌనంగా ఉండి చేసే జపం వేయి రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల విద్వాంసులైన వారు మాఘ అమావాస్య నాడు మౌన వ్రతాన్ని పాటిస్తూ జపం చేస్తారు. మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః | అమావాస్యాం జపేన్మంత్రం చిత్తశుద్ధిప్రదాయకమ్ || తాత్పర్యం: మనస్సే బంధానికి, మోక్షానికి కారణం. అమావాస్య నాడు చేసే మంత్ర జపం చిత్తశుద్ధిని కలిగించి సాధకుడిని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. **************************************** *పితృ తర్పణ విశేషం* మకరాదౌ గతే సూర్యే మాఘమాసే త్వనఘే | అమావాస్యాం ప్రయాతాయాం పితౄణాం తృప్తికృద్భవేత్ || సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు, పవిత్రమైన మాఘ మాస అమావాస్య నాడు చేసే స్నాన, దాన, తర్పణాలు పితృదేవతలకు అక్షయమైన తృప్తిని కలిగిస్తాయి. **************************************** శ్రీ గోవింద నారాయణ మహాదేవ 🙏 #తెలుసుకుందాం
తెలుసుకుందాం - ShareChat
*ఆధ్యాత్మికం లో సర్వదేవతలు మరియు భక్తులపై గౌరవం ముఖ్యం* మన భారతదేశం ఆధ్యాత్మికత లో గురుస్థానం , మన నిత్య జీవనం లో భాగం మన సనాతన ధర్మం - దీనికి మూలం వేదాలు - ధర్మశాస్త్రాలు -మన పుణ్యక్షేత్రాలు - మనం కొలిచే దేవతలు , ఈ క్రమం లో భక్తులందరూ వారి వారి ఇష్టానుసారం నిత్యo శ్రీ శివ ,విష్ణు , దేవీ , ఇలా ఎన్నో దేవతలను అనుసరిస్తాము , ఇక్కడ తెలుసువాల్సిన సత్యం ఒకటి ఉంది ముందు వ్యాసాలలో దేవతలలో భేదం లేదు అని తెలుసుకున్నాం , పుణ్యం సంపాదించే ప్రయత్నంలో పాపం మూట కట్టుకోవద్దని పెద్దలు చెబుతారు , ఈ సున్నితమైన విషయం లో ప్రతీ ఒక్కరు సర్వ దేవతలను + ఆయా భక్తులను కూడా గౌరవించడం ముఖ్యం అని శాస్త్రీయంగా తెలుసుకుందాము* **************************************** *శివ పురాణం (Shiva Puranam)* మద్భక్తానాం వినోదేన మమ తుష్టిః ప్రజాయతే | తస్మాత్ సర్వప్రయత్నేన పూజనీయాః శివాశ్రితాః || నా భక్తులు సంతోషంగా ఉంటేనే నేను సంతోషిస్తాను. కాబట్టి, సర్వ ప్రయత్నాలతో శివుడిని ఆశ్రయించిన భక్తులను గౌరవించాలి, పూజించాలి. (అంటే భక్తుల మధ్య పరస్పర గౌరవం శివుడికి ప్రీతికరం). *స్కాంద పురాణం (Skanda Puranam)* దర్శనం శివభక్తానాం సర్వపాపప్రణాశనమ్ | వందనం శివభక్తానాం సర్వమంగళకారకమ్ || శివ భక్తులను చూడటం వల్ల పాపాలు నశిస్తాయి. వారిని గౌరవించి నమస్కరించడం వల్ల సర్వ మంగళాలు (శుభాలు) కలుగుతాయి. భక్తులందరినీ తన బంధువులుగా భావించడమే ఉత్తమ మార్గం. *లింగ పురాణం (Linga Puranam)* అద్వైతభావనా యుక్తో యః పశ్యతి శివాశ్రితాన్ | స ఏవ ముచ్యతే పాపైః శివలోకం స గచ్ఛతి || ఎవరైతే శివ భక్తులందరినీ 'అద్వైత భావం'తో (అంటే తనలో ఉన్న దైవమే వారిలోనూ ఉన్నాడని) చూస్తారో, వారు సమస్త పాపాల నుండి విముక్తులై శివలోకాన్ని పొందుతారు. *బ్రహ్మవైవర్త పురాణం (Brahmavaivarta Puranam)* హరిభక్తోఽథ శైవో వా యో నిందతి కుబుద్ధిమాన్ | స యాతి నరకం ఘోరం యావచ్చంద్రదివాకరౌ || విష్ణు భక్తుడిని గానీ, శివ భక్తుడిని గానీ కుబుద్ధితో నిందించేవాడు సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఘోరమైన నరకాన్ని అనుభవిస్తాడు. సాటి భక్తుడిని దైవ సమానుడిగా గౌరవించాలి. *బ్రహ్మాండ పురాణం (Brahmanda Puranam)* సర్వం బ్రహ్మమయం జగత్, సర్వం శివమయం తథా | భక్తానాం హృదయే నిత్యం వసామి పరమేశ్వరః || జగమంతా బ్రహ్మమయం, శివమయం. భక్తుల హృదయంలో నేను నిత్యం నివసిస్తాను. కాబట్టి ఒక భక్తుడు మరొక భక్తుడిని తన హృదయంలో ఉన్న దైవంగా భావించి గౌరవించాలి. *విష్ణుధర్మోత్తర పురాణం (Vishnudharmottara Puranam)* న విష్ణుభక్తాః పృథగ్వై బంధుభ్యో భవసాగరే | తేషాం సేవనమత్యంతం విష్ణోః సేవనముచ్యతే || ఈ సంసార సాగరంలో విష్ణు భక్తులు తన బంధువుల కంటే వేరు కాదు. వారి సేవ చేయడమే విష్ణువుకు చేసే అత్యున్నత సేవ. (ఇది శివ భక్తులకు కూడా వర్తిస్తుంది—భగవంతుడిని ప్రేమించే వారంతా మనకు పరమ బంధువులే). *బృహన్నారదీయ పురాణం (Brihannadiya Puranam)* భక్తాః సర్వే సమానాశ్చ న భేదస్తత్ర కశ్చన | యేన తద్భేదబుద్ధిః స్యాత్ తస్య పుణ్యం వినశ్యతి || భక్తులందరూ సమానమే, వారిలో ఎటువంటి భేదభావం చూపకూడదు. ఎవరైతే భక్తుల మధ్య వ్యత్యాసం చూస్తారో (వీడు గొప్ప భక్తుడు, వీడు తక్కువ అని), వారి పుణ్యం మొత్తం నశిస్తుంది. *నారద పురాణం (Narada Puranam)* పశ్యన్ భక్తజనం లోకే ప్రహర్షం యాతి యో నరః | తస్మై తుష్యతి దేవేశః సర్వగామీ జనార్దనః || లోకంలో తన తోటి భక్తుడిని చూడగానే ఎవరైతే అమితమైన ఆనందాన్ని పొందుతారో (తన సొంత బంధువును చూసినట్టుగా), వారిపై ఆ పరమేశ్వరుడు (శివుడైనా, విష్ణువైనా) అత్యంత ప్రసన్నుడవుతాడు. *శ్రీమద్భాగవత పురాణం (Srimad Bhagavatam)* అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థితః సదా | తమవజ్ఞాయ మాం మర్త్యః కురుతేఽర్చావిడంబనమ్ || నేను అన్ని ప్రాణులలో ఆత్మ స్వరూపుడనై ఉన్నాను. నన్ను (దైవాన్ని) అన్ని ప్రాణులలో, తోటి భక్తులలో గుర్తించకుండా, వారిని అవమానిస్తూ చేసే దేవాలయ పూజ అంతా కేవలం ఒక 'నటన' (విడంబనం) మాత్రమే అవుతుంది. *కూర్మ పురాణం (Kurma Puranam)* శివభక్తాస్తు సతతం పరస్పరహితైషిణః | వదంతి శివనామాని బంధువత్ ప్రేమభావతః || నిజమైన శివ భక్తులు నిరంతరం పరస్పరం ఒకరి శ్రేయస్సును మరొకరు కోరుకుంటారు. వారు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు బంధువుల వలె ప్రేమతో శివ నామాలను స్మరించుకుంటారు. *గరుడ పురాణం (Garuda Puranam)* సర్వేషామపి భూతానాం భక్తో హి పరమో గురుః | తస్య పూజా ప్రశస్తా చ బంధువత్ పరిచర్యయా || సమస్త ప్రాణులలో భగవంతుని భక్తుడు పరమ శ్రేష్ఠుడు. అటువంటి భక్తుడిని తన సొంత బంధువులా భావించి పరిచర్య (సేవ) చేయడం వల్ల దైవం సంతోషిస్తాడు. *స్కాంద పురాణం (అవంతి ఖండం)* గంగా స్నానం గయా శ్రాద్ధం కాశ్యాం వా నివసన్ తథా | శివభక్త సమాగమస్య కళాం నార్హంతి షోడశీమ్ || గంగా స్నానం చేయడం, గయలో శ్రాద్ధం పెట్టడం, కాశీలో నివసించడం ఎంత గొప్పవో.. ఒక శివ భక్తుడిని కలిసి, అతనిని తన బంధువుగా గౌరవించడంలో ఉండే పుణ్యంలో ఇవి 16వ వంతు కూడా సరిపోవు. అంత గొప్పది భక్త సమాగమం! **************************************** *బ్రహ్మవైవర్త పురాణం (Brahmavaivarta Puranam)* శివం నిందతి యో మూఢో విష్ణుం నిందతి యో నరః స యాతి నరకం ఘోరం యావచ్చంద్రదివాకరౌ || ఏ మూఢుడైతే శివుడిని నిందిస్తాడో లేదా ఏ నరుడైతే విష్ణువును నిందిస్తాడో, వాడు సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఘోరమైన నరకాన్ని అనుభవిస్తాడు. *శివ పురాణం (Shiva Puranam)* యో మాం భజతి నాన్యం చ విష్ణుం నిందతి మందధీః | న స మే ప్రియకృద్భక్తో నరకం స హి గచ్ఛతి || మందబుద్ధి గలవాడై నన్ను (శివుడిని) భజిస్తూ, విష్ణువును నిందిస్తాడో, అటువంటి వాడు నాకు ఇష్టమైన భక్తుడు కానేరడు. వాడు నిశ్చయముగా నరకమునకే పోవును. *స్కాంద పురాణం (Skanda Puranam)* విష్ణుభక్తో నైవ శైవం నిందేచ్చ పరమేశ్వరమ్ | శైవోపి విష్ణుభక్తంచ నిందన్ యాతి రౌరవమ్ || విష్ణు భక్తుడు ఎప్పుడూ శివుడిని నిందించకూడదు. అలాగే శివ భక్తుడు విష్ణువును లేదా విష్ణు భక్తులను నిందిస్తే 'రౌరవం' అనే భయంకరమైన నరకాన్ని పొందుతాడు. *హరి-హర భేదరాహిత్యం (పద్మ పురాణం)* శివభక్తశ్చ విష్ణోశ్చ భక్తౌ ద్వౌ సమానౌ స్మృతౌ | తయోః పూజా విధానేన సర్వపాపైః ప్రముచ్యతే || శివ భక్తుడు మరియు విష్ణు భక్తుడు ఇద్దరూ సమానమే. వారిద్దరినీ భక్తితో పూజించడం వల్ల మనిషి సమస్త పాపాల నుండి విముక్తుడై పరమగతిని పొందుతాడు. *భక్త పూజ ప్రాముఖ్యత (భారతం - అనుశాసనిక పర్వం)* మద్భక్తానాం చ యే భక్తాః తే మే భక్తతమా మతాః | తైః కృతాం పూజనం దేవి మత్పూజాయాః ఫలాధికమ్ || నా భక్తులకు ఎవరైతే భక్తులో (శివ లేదా విష్ణు భక్తులు), వారే నాకు అత్యంత ప్రియమైన వారు. వారికి చేసే పూజ నాకే చేసే పూజ కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. *భక్త గౌరవం - లోకప్రాప్తి" యేర్చియంతి సదా భక్తాన్ హరిశంకర రూపిణః | తే గచ్ఛంతి పరం ధామ యత్ర దేవో మహేశ్వరః || హరి మరియు హర స్వరూపులైన భక్తులను ఎవరైతే నిత్యం అర్చిస్తారో, వారు పరమ పదాన్ని (వైకుంఠం లేదా కైలాసం) చేరుకుంటారు. *స్కాంద పురాణం* హరిభక్తం శివభక్తం చ యః పశ్యేత్ సమదర్శనః | తస్యానుగ్రహతో లోకాన్ సర్వాన్ జయతి నారద || ఓ నారదా! హరి భక్తుడిని, శివ భక్తుడిని సమదృష్టితో చూసి గౌరవించేవాడు భగవంతుని అనుగ్రహం పొంది సమస్త లోకాలను జయిస్తాడు. ఇలా దేవతల మరియు మహర్షుల సంవాదాలలో దేవతల మధ్య ఆయా దేవతలను అనుసరించే భక్తుల మధ్య ఎలాంటి ద్వేష కలుష భావనలు ఉండరాదని ప్రామాణికంగా తెలుస్తుంది వ్యర్థమైన విమర్శలకు మన జీవనం లో ప్రాధాన్యత ఇవ్వకుండా సన్మార్గం లో పయనించడం ముఖ్యం , ధార్మిక,వ్యక్తిగత జీవనానికి ఇది మేలు అని ప్రతీ వారు అర్ధం చేసుకోవాలి , మన పూర్వీకులు అనుసరించిన సహనం నిష్ఠ మర్యాద మన తరానికి భవిష్య తరాలకు కూడా శుభం. *ధర్మస్య విజయోస్తు* *లోకా: సమస్తా స్సుఖినో భవంతు* **************************************** శ్రీ గోవింద నారాయణ మహాదేవ 🙏 #తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు
తెలుసుకుందాం - ಬಂ೦ನ ಬಂ೦ನ - ShareChat
*శ్రీమాతా అనుగ్రహం భయనివారణ , ఙ్ఞాన ప్రాప్తి అన్యోన్యత, మనోబీష్ట సిద్ధి కోసం శ్రీ శివకామేశ్వరీ మాత ధ్యానం* *శ్రీ శివకామేశ్వరీ ధ్యానo* ఓం వందే శివకామేశ్వరీం పద్మయుగ్మ- విన్యస్త పాదాం సిత-వస్త్ర-యుగ్మామ్ | ముక్తామయైః భూషణైః భూషితాంగీం శశాంక-బింబానన పద్మ-నేత్రామ్ || వరాభయైర్-ముద్రిత-పాణి-పద్మాం మందస్మితాం తాం కరుణా-సముద్రామ్ | ధ్యాయేత్ పరాం చిన్మయ-రూపిణీం తాం శివస్య వామాంక-కృత-నివాసామ్ || *రూప వర్ణన* అమ్మవారి పాదాలు రెండు పద్మాలపై కొలువై ఉన్నాయి , తెల్లని వస్త్రాలను ధరించి, ప్రశాంతతకు చిహ్నంగా కనిపిస్తుంది ,ముత్యాల హారాలతో మరియు దివ్యాభరణాలతో అలంకరించబడి ఉంటుంది , చంద్రబింబం వంటి ముఖం, పద్మాల వంటి విశాలమైన కళ్లతో, మందహాసం (చిరునవ్వు) చిందిస్తూ ఉంటుంది ,వరద ముద్ర (కోరికలు తీర్చేది) మరియు అభయ ముద్ర (భయాలను పోగొట్టేది) ధరించి ఉంటుంది , పరమశివుని ఎడమ తొడపై (వామాంకము) ఆసీనురాలై, జ్ఞాన స్వరూపిణిగా వెలుగుతోంది. *ధ్యాన ఫలం* *మానసిక ప్రశాంతత అశాంతిగా ఉన్న మనసు నిర్మలంగా మారుతుంది. *భయ నివారణ "అభయ ముద్ర" ధరించిన తల్లిని స్మరించడం వల్ల అన్ని రకాల భయాలు తొలగిపోతాయి. *జ్ఞాన ప్రాప్తి చిన్మయ రూపిణి (జ్ఞాన స్వరూపిణి) అయిన అమ్మవారి అనుగ్రహంతో బుద్ధి కుశలత పెరుగుతుంది. *అన్యోన్యత శివ-పార్వతుల ఏకత్వ రూపం కాబట్టి, ఇది దంపతుల మధ్య అన్యోన్యతను, కుటుంబ సౌఖ్యాన్ని కలిగిస్తుంది. *మనోభీష్ట సిద్ధి కోరిన కోరికలు నెరవేరి, సర్వ మంగళాలు చేకూరుతాయి. **************************************** శ్రీగోవింద నారాయణ మహాదేవ 🙏 #🕉Sri Mathre Namaha 🕉 #🕉 Sri Mathre Namaha 🕉 #om sri mathre namaha🙏🙏 #Om sri mathre namaha #sri mathre namaha
🕉Sri Mathre Namaha 🕉 - 8 8 - ShareChat
*శివభక్తి* *మహాదేవ మహాదేవ మహాదేవ* ************************************** *భవిష్య పురాణే* *శివార్చన లేని జన్మ నిరర్థకం* యేన రానార్చయంతీహ శివం త్రిభువనేశ్వరం| న తే స్వర్గస్య మోక్షస్య రాజ్యస్యాపి న భాజనం|| ఈ లోకంలో త్రిభువనేశ్వరుడైన ఆ పరమశివుడిని ఎవరైతే ఆరాధించరో, వారు స్వర్గానికి గానీ, మోక్షానికి గానీ, కనీసం ఈ లోకంలోని రాజ్య భోగాలకు గానీ అర్హులు కారు. అంటే, సకల శుభాలకు మూలం శివారాధన అని భావం. **************************************** *నియమబద్ధమైన ఆరాధన* వరం ప్రాణపరిత్యాగః శిరసో వాపి కర్తనం| నత్వ సంపూజ్య భూంజీత భగవంతం త్రిలోచనం|| ముక్కంటి దేవుడైన ఆ పరమేశ్వరుడిని పూజించకుండా భోజనం చేయకూడదు. శివార్చన చేయకుండా తినడం కంటే, ప్రాణాలను వదలడం లేదా శిరచ్ఛేదనం చేసుకోవడం మేలు (ఇది శివారాధన పట్ల ఉండవలసిన నిష్ఠను, పట్టుదలను సూచించే తీవ్రమైన ఉదాహరణ). **************************************** *శివభక్తుడే శివుడు* స్ఫుటం నిర్వహతే యస్య యావజ్జీవం శివార్చనం| మనుష్య చర్మణానద్ధః స రుద్రో నాత్ర సంశయః|| ఎవడైతే తన జీవితాంతం నిరంతరం శివార్చన చేస్తాడో, వాడు మనుష్య చర్మం ధరించిన సాక్షాత్తు ఆ రుద్రుడే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. శివభక్తుడు శివస్వరూపమే అని దీని అర్థం. **************************************** *లింగం అంటే ఏమిటి* ఆకాశం లింగమిత్యాహుః పృథివీ తస్యపీఠికా| ఆలయః సర్వభూతానాం లయనాల్లింగ ముచ్యతే|| ఆకాశమే లింగం, పృథ్వి (భూమి) దాని పీఠం. సకల ప్రాణులు దేనియందు లయమవుతాయో (ఐక్యమవుతాయో) దానినే 'లింగం' అంటారు. అంటే అనంతమైన విశ్వమే శివలింగ స్వరూపం. **************************************** *సర్వదేవతా స్వరూపం* అర్చాయాం పూజయేద్యోమాం విష్ణుర్భవతి పూజితః| అర్చితా మూర్తయః సర్వాయోమేలింగం సమర్చయేత్|| శివలింగ రూపంలో నన్ను (శివుడిని) పూజించేవాడు విష్ణువును కూడా పూజించినట్లే. ఎవరైతే శివలింగాన్ని అర్చిస్తారో, వారు సకల దేవతా మూర్తులను అర్చించినట్లే అవుతుంది. శివుని యందే సమస్త దేవతలు కొలువై ఉన్నారని దీని అర్థం. **************************************** శ్రీ గోవింద నారాయణ మహాదేవ 🙏 #హర హర మహాదేవ శంభో శంకర #🕉️హర హర మహాదేవ 🔱 #హర హర మహాదేవ 🙏 #🙏ఓం నమః శివాయ🙏ૐ #అరుణాచల శివ 🙏
హర హర మహాదేవ శంభో శంకర - పళిని <<"""""?> & ೫ 4 " & &்"ஈ P = 1 = 1 1 4 1 ೭ ౌ పళిని <<"""""?> & ೫ 4 & &்"ஈ P = 1 = 1 1 4 1 ೭ ౌ - ShareChat