
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
@priyadarshi2410
💫అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్💫
We fall in love with people we can't have.👣🖤💔🍀
#yes it's true 💯% #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #😢Sad Feelings💔 #😊ఎమోషనల్ ఫీలింగ్స్ #😥మనసులోని బాధ💔
He took care of you in 2025
He will take care of you in 2026....
जिन जिन्होंने अब तक संभाला आगे भी वही संभालेंगे! क्योंकि 👇🏻
"होई है वहीं जो राम रची राखा "
#🥳హాయ్ 2026 🙌 #❤️హ్యాపీ న్యూ ఇయర్🎉 #💗నా మనస్సు లోని మాట #🙆 Feel Good Status #🦚 హరే కృష్ణ 🦚
#🔱విజయవాడ కనక దుర్గమ్మ #విజయవాడ కనక దుర్గమ్మ #కనక దుర్గ #కనక దుర్గమ్మ #శ్రీ కనక దుర్గ దేవి
ఇన్ని పూజలు చేస్తావు..పుణ్య క్షేత్రాలకు వెళ్తావు...అయినా ఎప్పుడూ ఏదొక కష్టంలో ఉంటూనే ఉంటావు అని...ఎందుకు పూజలు చెయ్యడం అని...
నా సమాధానం...పూజలు చేసేది కష్టాలు రాకూడదు అని కాదు...దేవాలయానికి వెళ్ళినా,పూజ చేసినా నాకు కోరికలు కోరడం రాదు...దేవుని ముందు నిలబడగానే ఒక రకమైన ప్రశాంతమైన నిశ్శబ్దాన్ని,శాంతిని అనుభవిస్తాను నేను...అప్పుడు దుఃఖంతో కాకుండా ఆనందంతో కన్నీళ్లు వస్తాయి...ఏదైనా స్తోత్రం చదివినా,చరిత్ర చదువుతున్నా కూడా అంతే...దేవునితో ముడిపడి ఉండేది కష్టాలు రాకూడదు అని కాదు...ఎంత కష్టం వచ్చినా తను తోడు ఉంటాడు అనే నమ్మకంతో...కష్టంలో ఉన్న ప్రతీసారీ నిజంగానే తోడు ఉన్నాడు కూడా...ఒకో అనుభవం ఒకో అద్భుతం...అందరికీ చెప్పుకోలేను అవి...నేను అడగకుండా చాలాసార్లు చాలా ఇచ్చాడు...అలాగే ఇప్పుడు కూడా నాతో ఉన్నాడు...ఎప్పుడూ ఉంటాడు...
అరుణాచలయ్యా...నిన్ను చూడాలనిపిస్తుంది బాగా...కానీ అంత శక్తి లేదిప్పుడు...కూసింత ఆ ఆతృత తగ్గించు శివయ్యా 🙏అరుణాచల శివ🙏
#హర హర మహాదేవ 🙏 #🕉️హర హర మహాదేవ 🔱 #హర హర మహాదేవ శంభో శంకర #అరుణాచల శివ 🙏 #om Arunachala siva🙏
దైవ పూజలు, శాంతులు, హోమాలు గృహప్రవేశ సందర్భంలో ఎందుకు చేస్తున్నాము...........!!
మానవుడు అనంతకోటి జీవరాశులలో ఒకడు.
ప్రకృతితో మమేకమై జీవనం సాగించినప్పుడే
అతడి మనుగడకు సార్ధకత.
అన్నింట్లో తాను కూడా ఒకడై మిగతా జీవులతో సమానంగా జీవించాలని శాస్త్రం బోధిస్తుంది.
పక్షిజాతి ఎలా గూడు కట్టుకుని జీవిస్తుందో,
మానవుడు కూడా తన రక్షణకు తనవారి పరిరక్షణ కోసం ఒక ఇల్లు కట్టుకుని బ్రతుకుతాడు.
ఇక ఒక ఇల్లు కట్టాలంటే శాస్త్రం ఎన్ని
విధినిషేధాలు చెప్పింది.
స్థల సేకరణ దగ్గరనుండి ఇల్లు పూర్తిగా కట్టుకునే వరకు ఎలా వ్యవహరించాలో ప్రత్యేకంగా వాస్తు శాస్త్ర రూపంలో వివరిస్తుంది.
వాస్తు శాస్త్రంలో ఎంతో విజ్ఞాన నిధి నిబిడీకృతమై వున్నది. ఏ వైపు ఎత్తుగా వుండాలి,
ఏ వైపు కొంచెం వాలు ఉండాలి,
ఏ గది ఎక్కడ కట్టుకోవాలో చెబుతుంది వాస్తుశాస్త్రం. మనకున్న ఈశాన్య, నైరుతి ఋతుపవనాల ఆధారంగా ఎక్కడ వంటిల్లు వుండాలి,
ఎక్కడ బావులు తవ్వాలి,
యెక్కడ పడకిల్లు ఉండాలో దాని వలన వారికి
ఎలా ఆరోగ్యం కలుగుతుందో అన్న విషయాన్ని
శాస్త్రం చెబుతుంది.
శాస్త్ర ప్రధాన ఉద్దేశ్యం ఇంటికి, వంటికి సరైన
వెలుతురు, గాలి ప్రసరణ జరగాలి,
తద్వారా శారీరక, మానసిక ఉల్లాసం,
ఆరోగ్యం కలగాలని ఆ శాస్త్ర ప్రధాన ఉద్దేశ్యం.
దాన్ని నేడు వక్రీకరించి కొంతమంది శాస్త్ర ప్రాముఖ్యాన్ని ప్రశ్నార్ధకం చేస్తున్నారు,
అది వేరే విషయం.
ఒక ప్రదేశాన్ని గృహ నిర్మాణానికి ఎంచుకున్న తరువాత ముందుగా పూజ చేసి పనులు ప్రారంభిస్తాము. చదునుచేసుకున్న ప్రదేశంలో శంఖుస్థాపన చేసుకుని అప్పుడు నిర్మాణం చేపడతాము.
మనం ఎంచుకున్న ప్రదేశంలో అంతకు ముందు
కొన్ని చెట్లు ఉండవచ్చును,
వాటిపై నివాసముండే ఎన్ని జీవరాశులు వాటి నెలవు కోల్పోతాయి.
ఆ నేలను నమ్ముకుని ఎన్నో జీవాలు ఉంటాయి.
మనం చదును చెయ్యడం వలన ఎన్నో జీవరాశులను మనం తెలియక చంపుతున్నాము.
ఇదంతా మనకు తెలియక చేస్తున్న పాపం.
కానీ మనం ఒక గృహం కట్టుకోవాలంటే తప్పదు.
ఇంతేకాదు రోజు మనం ఇల్లు తుడవడం వలన ఎంతో హింస చేస్తున్నాం.
దీనికి శాస్త్రం భూత హింస అని అంటుంది.
అటువంటి భూతహింస తెలిసో తెలియకో
మనం రోజూ చేస్తున్నాము.
వాటి ప్రక్షాళనకు మనకు దానం, హోమం ఇతరత్రా చెప్పబడి వున్నాయి.
గృహస్థు మిగిలిన ఆశ్రమాల వారిని పోషించాలి. చదువుకునే బ్రహ్మచారులకు,
ఆకలితో వచ్చిన అతిధులను, ముసలి వారిని, సన్న్యాసాశ్రమ వాసులను పోషించవలసిన బాధ్యత గృహస్తాశ్రమానికి ఉన్నది.
అటువంటి గృహస్తు ఒక ఇంటిని కట్టుకున్నప్పుడు చెయ్యవలసిన శాంతులు, హోమాలు దైవజ్నులైన పండితులు చెబుతారు.
వాటిని ఆచరించడం వలన మనం చేసిన హింస
ప్రక్షాళన జరుగుతుంది.
గృహం నిర్మించడానికి మొదలు ఇంటికి ఈశాన్యంలో
ఒక శుభ ముహూర్తంలో శుద్ధి చేసి ఎక్కడ నుండి పని ప్రారంభిస్తామో అక్కడ నేలలో కొన్ని అడుగుల గొయ్యిలో నవధాన్యాలు, నవరత్నాలు, శంఖువు స్థాపించి,
తాపీ పని అక్కడ మొదలు పెడతాము.
ఇంటికి అది ఆయువుపట్టు.
ఒకరకంగా చెప్పాలంటే అది ఎనర్జీ సెంటర్.
అక్కడ నమక చమకాలతో మంత్రసహితంగా
ఎన్నో ఉపచర్యలు చేసి శక్తిని నిలుపుతాము. అక్కడనుండి మిగిలిన పనులు చేసుకుంటూ
ఇంటికి గాలి వెలుతురు వచ్చేట్టుగా జాగ్రత్తగా కట్టుకుంటున్నాము.
ఆ గృహానికి సీమగా ఆ గృహ ప్రధాన ద్వారాన్ని మంచి ముహూర్తంలో నిలుపుతాము.
గృహ ప్రవేశ సమయంలో మనం చేసిన పని సక్రమంగా జరిపించి సజావుగా పూర్తి చేయించినందుకు దేవతలకు ధన్యవాద పూర్వకంగా హోమ, జప తపాదులు చేసి అందరికీ అన్నశాంతి జరిపించి వారి ఆశీర్వాదాలను అందుకుని ఆ ఇంట అడుగు పెడతాము.
ఆ ఇంటిలో అన్నీ శుభకార్యాలు జరగాలని భగవంతుని ప్రార్దిస్తాము.
negative ఎనర్జీ ని బయటకు తరిమి positive ఎనర్జీ ని ఇంటిలో నిమ్పుకుంటాము.
సకల దేవతా స్వరూపంగా కామధేనువు ఇంటి లో నడయాడెట్టు ఒక ఆవును ఇంటిలో ప్రవేశం చేయిస్తాం. ఇంట్లో సుఖ సంతోషాలు పొంగి పొరలాలని పాలు పొంగించి పొంగలి చేసి దేవునికి నివేదన చేస్తాం.
మన ధర్మం ప్రకృతిలో అన్నింటిలోను దైవాన్ని దర్శిస్తాము. పొద్దున్న లేచి కాలు కింద పెట్టాలంటే భూమాతకు “సముద్ర వసనే దేవి పర్వత స్తన మండలే .. “
అంటూ మన పాదం ఆవిడ మీద మోపినందుకు
క్షమాపణ చెప్పుకుని ఆవిడ మనల్ని రక్షించాలని
కోరుకుని రోజు మొదలు పెడతాము.
మనకు నీరు దైవం,
గాలి దైవం,
అగ్ని దైవం,
అన్నీ దేవతా స్వరూపాలే.
మన చుట్టూ మనతో వున్న అధిదేవతలు మనలను నిత్యం కాపాడాలని వారిని ప్రార్ధించుకుంటాము.
వారి ప్రీతిగా హోమాలు చేసి వారి స్వాహా కారంతో
వారిని తృప్తి పరచి మన జీవనం సాగించడం మనకు శాస్త్రం నేర్పుతుంది.
అంతేకానీ టోస్ట్ అని వైన్ తాగే, తాగించే సంస్కృతి కాదు మనది.
#తెలుసుకుందాం #😃మంచి మాటలు #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #మనసాంస్కృతిసంప్రదాయాలు
సాయంత్రం మోహం ముట ముట లాడించుకుంటూ ఇంటికి వస్తాడు భర్త.
ఉదయం నా Dress Iron చెయ్యమని చెప్పాను . చేసావా ? విసురుగా అడిగాడు.
లేదండి . బేబి వాళ్ళ టీచర్ అర్జెంట్ గా స్కూలుకు రమ్మని ఫోను చేసింది . అందువల్ల చేయలేదు . రేపు చేస్తాను. నెమ్మదిగా సమాధానం చెప్పింది భార్య.
24 గంటలూ ఇంట్లోనే ఖాళీగానే ఉంటావు. నువ్వు వెలగపెడుతున్న రాచకార్యం ఏమిటి ? విరుచుకు పడ్డాడు భర్త.
నిజానికి 24 గంటలూ అన్ని పనులు మానేసి అస్తమానం టి.వి. లో తెలుగు
సీరియళ్ళు చూస్తూ కూర్చుంటుందా ? ఆ ఇంటి ఇల్లాలు.
అలాంటి వారు నూటికి మహా అయితే ఓ 20 శాతం మంది ఉండవచ్చునేమో ?
మరి మిగిలిన ఉద్యోగం చేయని గృహిణులు మిగిలిన సమయంలో ఏం చేస్తున్నారు ?
ఆ తల్లి పడే కష్టాన్ని అర్ధం చేసుకునే మగవారు ఎంతమంది ?
నిష్కర్షగా మోహమాటం లేకుండా చెప్పాలంటే పూర్వకాలంలో అంటే ఓ 40 , 50 సంవత్సరాల క్రితం స్త్రీలే ఎంతో సుఖపడ్డారు .
బజారు పనులు చేయాల్సిన అవసరం ఉండేది కాదు.
ఉద్యోగం చేసే ప్రసక్తే లేదు.
పనిమనుషులు , చాకళ్ళు రోజంతా చేతి కింద ఉండే వారు .
పిల్లల్ని చదివించాల్సిన అవసరం గృహిణికి ఉండేది కాదు.
అత్తగారు లేక ఇతర కుటుంబ సభ్యుల సహకారం ఆమెకు ఎల్లప్పుడూ ఉండేది .
అప్పుడు ఆమె పనల్లా వంట గదికే పరిమితమై ఉండేది .
ఒంటి గంట కల్లా వంట పూర్తి చేసి , భగవంతునికి నివేదన చేసి , భర్త భోజనము చేసేదాకా తను భోజనము చేయదు కనుక, భర్త కోసం నిరీక్షిస్తూ ఎక్కడో గడప మీద తన చీరె చెంగు వేసుకుని పడుకునేది .
మరి ఈ కాలం ఆడవాళ్ళు.
ఉద్యోగం చేసి తీరాలి. నూటికి 80 శాతం ఆడవాళ్ళు ఈ రోజుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు .
ముఖ్యంగా ఉదయం కాఫీలు , టిఫిన్ లు , మధ్యాహ్నము భోజనాలు , పిల్లల స్నానాలు , Dress లు వేసి వాళ్ళని ready చేయించాలి , వాళ్ళతో Home Work చేయించాలి , వాళ్ళ టిఫిన్ Box లు సర్దాలి , వాళ్ళని ఉదయం 7.30 కల్లా సందు చివర ఆగి ఉన్న స్కూలు బస్ దగ్గర దింపి రావాలి.
అయిదు నిముషాలు ఆలస్యమయినా బస్ వాడు తుర్రున పారిపోతాడు.
ఇక ఆరోజు వేరే ఆటో మాట్లాడి పిల్లల్ని స్కూల్ కి పంపేదాకా ఆమెకి ప్రత్యక్ష నరకమే.
భర్త గారిని ఆ రోజుకు తన స్కూటర్ మీద దింపి రమ్మంటే సవాలక్షా సాకులు చెప్పి దింపక పోగా , ఎదురింటి ఎల్లమ్మ తోనో , పక్కింటి పుల్లమ్మతోనే పోల్చి , నీకసలు పిల్లల్ని పెంచడమే చేతకాదు.
You are unfit to the mother Post అని , ఆఫీసులో వాళ్ళ Boss భర్త గారి Confidential report రాసినట్టుగా ఓ తిట్ల దండకం మొదలేడతాడు.
ఏ అత్తగారో ఇంట్లో ఉంటే తన కొడుకుకు ఒకటి రెండు క్లూలు అందించి , అగ్నిలో ఆజ్యం పోసి ఇతోధికంగా తన వంతు సాయం చేస్తుంది.
ఈ తద్దినం కన్నా అడగక పోవడం మేలని , సగం లో వదిలేసిన వంటను పూర్తి చేసి , భర్త గారి Lunch Box లు సర్ది, అత్తగారి భోజనానికి అన్నీ టేబుల్ పై అమర్చి ,తను హడావుడిగా రెడీ అయి, తన Box సర్దుకుని , ఆఫీసుకు హడావుడిగా బస్ ను పట్టుకుని పరుగు పరుగున ఆఫీసులో అడుగు పెట్టే సరికి గడియారం 10. 30 చూపిస్తుంది .
ఇక అదను కోసం ఎదురు చూస్తున్న బాస్ చేత అక్షింతలు వేయించుకుని, మూడ్ ఔట్ సీట్లో కూలపడి ఏం చేస్తున్నదో తెలియని స్థితిలో ఆ రోజు పని ముగించి తిరిగి ఇంటికి చేరేసరికి సమయం ఆరు అవుతుంది .
ఇంక స్కూలు నుండి తిరిగి వచ్చిన పిల్లలకు టిఫిన్ లు , భర్తకు అత్త గారికి సాయంత్రం టిఫిన్ లు అయ్యేసరికి రాత్రి 7.30 అవుతుంది . ఇంక పిల్లల హోమ్ వర్క్ లు , చదువులు , రాత్రి భోజనాలు, అత్తగారికి టిఫిన్ లు , భోజనాలు అవి పూర్తి అయి శయన మందిరం చేరే సరికి గడియారం రాత్రి 11 గంటలు చూపిస్తుంది.
మళ్ళీ ఉదయం 5 గంటలకే పనిమనిషి వచ్చి Calling Bell కొడుతుంది .
ఇంక శని , ఆదివారాలు ఆ గృహిణికి విశ్రాంతి అనుకున్నారా ?
No Never.
శని ఆదివారాలు బజారుకు వెళ్ళడం , కూరలు తెచ్చుకోవడం , సరుకులు తెచ్చుకోవడం , భర్త గారు , అత్తగారు శని, ఆది వారాలు శలవు దినాలే కనుక ( ఎవరికి శలవు ? ) బంధువుల్ని లేదా స్నేహితుల్ని భోజనాలకు పిలిస్తే వారి భోజనానికి Special Items చేయడంలో , అతిధులకు మర్యాదలు చేసి వారిని పంపించడంలో ఆ శని ఆది వారాలు ఎలా గడిచిపోయాయో తెలియక పోగా, చేద్దామనుకున్న మిగిలిన పనులన్నీ వచ్చే వారానికి వాయిదా పడి పోతాయి .
మధ్యలో ఉద్యోగ బాథ్యతగా Work from Home , శని , ఆది వారాల్లో Office కు వెళ్ళవలసిన అవసరం కూడా ఉన్న మహిళలు పడే కష్టం ఇంక వర్ణించ నలవి కాదు .
ఇంకా నేను చాలా విషయాలు సమయానికి జ్ఞప్తికి రాక ప్రస్తావించ లేక పోవచ్చును ?
చాలా మంది ఈ రోజుల్లో మీరు చెప్పిన వన్నీ ఏ ఇల్లాలు చేయడం లేదు . అత్తమామల్ని ఎవరూ చూడటం లేదు , అని అనవచ్చు.
ఒకటి మాత్రం చెయ్యదల్చుకున్న వారికి దారి దొరుకుతుంది .
చెయ్యదల్చుకోని వారికి సాకు దొరుకుతుంది .
ఒకటి మాత్రం నిజం.
ఈ రోజుల్లో పైన తెలిపిన గృహిణి తన బాధ్యత గా చేసే పనుల్లో భర్త సహకారం అడుగడుగునా తప్పనిసరి.
ఆమె సంపాదనే నాకు ముఖ్యం . చేసుకుంటుందో మానుకుంటుందో అది ఆవిడ సమస్య, నాకు ఎంత మాత్రం సంబంధం లేదని భర్త భావించిన పక్షంలో " అమ్మ రాజీనామా " ప్రతి వారు చూస్తారు. ఇది తథ్యం.
స్త్రీ సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది కదా.
ఇంటి వారి సుఖసంతోషాల కోసం అనుక్షణం పరితపించే ప్రతి గృహిణికి, ప్రతి ఇల్లాలికి పేరు పేరునా పాదాభివందనములు .🙏🙏🙏🙏🙏
#💗నా మనస్సు లోని మాట #అడపిల్ల జీవితమ్ #👧ఆడపిల్ల👧 #స్త్రీలను గౌరవించండి 🙏🏻 #మహిళలను గౌరవించoడి
[1) కంచికామక్షి తల్లిని దర్శించు కోవడానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు. తల్లి సంకల్పమే ప్రధానం. ( ఇది గొప్పవిశేషం )
2) సమస్త భూమండలానికి నాభిస్థానమే కాంచీపురం. (మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన నాభినుండే తల్లి పోషిస్తుంది. (అందుకే కామక్షి తల్లిని దర్శించుకున్న వారిని కష్టం లేకుండా పోషిస్తుంది.)
3) ప్రపంచంలో ఎక్కడా దర్శించ లేని విధంగా అమ్మను ఇక్కడ "సుగంధ కుంతలాంబ" అవతారంలో దర్శించవచ్చు. (ముత్తైదువులకు అఖండ సౌభాగ్యం లభిస్తుంది.)
4) ప్రపంచంలో ఎక్కడా దర్శించ లేని విధంగా ఇక్కడ "ఢంకా వినాయకుడు" దర్శనమిస్తాడు.(ఏకాంబరేశ్వర, సుగంధ కుంతలాంబ కళ్యాణ మహోత్సవాన్ని ఢంకా భజాయింపుతో అందరికీ తెలియజేస్తాడు )
5) కామాక్షి తల్లి ఆలయంలో "అరూపలక్ష్మి" దేవి దర్శన మిస్తుంది. కామాక్షితల్లిని అర్చించిన తరువాత పూజారి మనకిచ్చిన కుంకుమ ప్రసాదాన్ని అరూపలక్ష్మి తల్లికి ఇచ్చి దాన్నే ప్రసాదంగా తీసుకుంటే, భర్తను నిందించిన దోషం పొతుంది. మరియు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇక్కడ అరూపలక్ష్మి తల్లిని దర్శించుకుంటే తప్పకుండా శాపవిమోచనం అవుతుంది.
6) కాత్యాయనీ దేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి తపస్సు చేసిన క్షేత్రం కాంచిపురం. తపస్సులో భాగంగా, శివకల్పితమైన గంగా ప్రవాహాన్ని తట్టుకొని సైకత లింగాన్ని రక్షించుకునే ప్రయత్నంలో లింగాన్ని తన ఆలింగనంతో (కౌగిలితో) కాపాడుకుంటుంది. అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మగాజుల మరియు కుచముల ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగంపై అగుపిస్తాయి.
7) కామాక్షిదేవి ప్రధాన ఆలయానికి ప్రక్కనే ఉన్న ఉత్సవ కామక్షి తల్లికి ఎదురుగా ఉన్న గోడలో తుండిర మహారాజు, శివుడి నంది ఎలాగో అమ్మకు అలా ఎదురుగా ఉంటాడు. (తనను నమ్మిన వారికి ఎంతటి మహోన్నత స్థానాన్నైనా అనుగ్రహించగలదు కామక్షి).
అమ్మధ్యానంలో, "శోకాపహంత్రీ సతాం" అనే దివ్యవాక్కు గురించి వర్ణణ ఉంది. ఎవరైతే సతతం మనః శుద్ధితో అమ్మను ధ్యానించే సత్పురుషులు ఉంటారో, అలాంటి వారి దుఃఖాన్ని పోగొట్టడానికి తల్లి ఎల్లపుడు సిద్ధంగా ఉంటుంది. తనయొక్క కరుణను కురిపించి ఆదుకుంటుంది భుజం తట్టి నేనున్నాని ధైర్యం చెబుతుంది.
#sri kamakshi Ammavaru #kamakshi ammavaru
మట్టి పాత్రలను సబ్బుతో శుభ్రం చేస్తున్నారా? యమడేంజర్.. ఆరోగ్యంగా ఉండేందుకు ఇలా క్లీక్ చేయండి!
మట్టి కుండల్లో వండిన ఆహారం ఆరోగ్యానికి చాలా మంచిది. పూర్వ కాలంలో మన పూర్వీకులు మట్టి పాత్రలనే వాడి ఎలాంటి రోగాలు లేకుండా ఎక్కువకాలం జీవించారు. అయితే, మట్టి కుండలను సబ్బుతో శుభ్రం చేయడం వల్ల రసాయనాలు పాత్రలకు పట్టి వాటిలో వండి ఆహారం కల్తీ అయయే ప్రమాదం ఉంది. కాబట్టి సబ్బు లేకుండా మట్టి కుండలను ఎలా శుభ్రం చేయాలో, కొత్త కుండలను ఎలా సిద్ధం చేయాలో వివరంగా తెలుసుకుందాం.
పాత్రలు శుభ్రం చేసేటప్పుడు ఈ తప్పులను నివారించండి.
మట్టి పాత్రలను శుభ్రం చేసేటప్పుడు ప్రజలు చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే వాటిని సబ్బు లేదా ఇతర లిక్విడ్స్తో శుభ్రం చేయడం. ఇలా రసాయనాలతో మట్టి పాత్రలు శుభ్రం చేయడం ద్వారా మట్టి కుండకు ఉండే రంధ్రాలు ఈ రసాయనాలను పీల్చు్కుంటాయి. వాటిలో అలాగే ఆహారం వండినప్పుడు వేడి ఆవిరికి ఆ రసాయనాలు ఆహారంలో కలిసే ప్రమాదం ఉంది. కాబట్టి మట్టి కుండలను ఎప్పుడూ సబ్బు లేదా లిక్విడ్స్తో శుభ్రం చేయకండి.
మట్టి కుండలను ఎలా శుభ్రం చేస్తారు?
సబ్బు లేకుండా మట్టి కుండలను శుభ్రం చేసేందుకు మీరు మొదటగా కుండలో కొన్ని నీరు పోసి, అందులో కొన్ని నిమ్మకాయ ముక్కలు వేసి మంటపై వేడి చేయండి.
నీరు కాస్త మరిగిన తర్వాత దానికి దించి వడకట్టండి.
తర్వాత కొంచెం ఉప్పు, బియ్యం పిండి వేసి, శుభ్రమైన స్క్రబ్బర్ తీసుకుని, మొత్తం కుండను పూర్తిగా శుభ్రం చేయండి.
తరువాత కుండను కాటన్ గుడ్డతో బాగా తుడిచి, కొంతసేపు ఎండలో ఉంచండి. అదేవిధంగా, మీరు ఈ సులభమైన దశల్లో మట్టి కుండలను శుభ్రం చేయవచ్చు.
కొత్త మట్టి కుండలను ఉపయోగించటానికి చిట్కాలు
కొత్త మట్టి కుండను ఉపయోగించే ముందు, కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే మీరు వాటిలో వంట చేసినప్పుడు అందులో ఉండే మట్టి కణాల కారణంగా వంటకాలు చేదుగా మారొచ్చు. లేదా వేడికి కుండ పగిలిపోవచ్చు. కాబట్టి మీరు కొత్త కుండలో వంటచేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తులు తీసుకోవాలో తెలుసుకోండి. మీరు కొత్త మట్టి కుండను ఉపయోగిస్తుంటే, ముందు రోజు రాత్రి కుండ నిండా నీరు పోసి ఉంచండి. ఇది నీటిని పీల్చుకుంటుంది. వంటచేప్పుడు వేడికి పగిలిపోకుండా ఉంటుంది. ఇది వదులుగా ఉన్న బంకమట్టి నిక్షేపాలను కూడా తొలగిస్తుంది.
#తెలుసుకుందాం
ఆయనను అందరూ "అప్పా" అని పిలుస్తారు.
ఆయన అసలు పేరు? KP రామస్వామి. కోయంబత్తూరులోని KPR మిల్లుల యజమాని. వృత్తిరీత్యా వస్త్ర పరిశ్రమ దిగ్గజం. కానీ, ఆయన ఎంచుకున్నది మాత్రం తండ్రి పాత్ర.
కార్పొరేట్ పెద్దలు ఉద్యోగుల శ్రమను దోచుకొంటారు, ఖర్చు తగ్గించుకొంటారు, లాభాల గురించి మాత్రమే చూలుకొంటారు అని అనుకొంటాం. ఈ వ్యక్తి మాత్రం జీవితాలను మార్చడంలో నిమగ్నమయ్యారు.
ఎలాగంటారా? మిల్లు కార్మికులను గ్రాడ్యుయేట్లుగా మార్చడం ద్వారా. విద్యను వారి మెరుగైన జీవితానికి పునాదిగా మార్చడం ద్వారా.
ఇదంతా ఒక చిన్న అభ్యర్థనతో మొదలైంది. ఒకసారి ఆయన మిల్లులోని ఒక యువతి
"అప్పా (అంటే నాన్న), నాకు చదువంటే ఇష్టం. కానీ పేదరికం కారణంగా నా తల్లిదండ్రులు నన్ను పాఠశాల నుండి మాన్పించి ఇక్కడికి పంపారు. కానీ నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను." అని చెప్పింది.
ఆ పిలుపు, ఆ ఒక్క వాక్యం ఆయన్ని మార్చేసింది.
తన కార్మికులకు కేవలం జీతం ఇవ్వడంతో పాటు, వారికి భవిష్యత్తును ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు.
మిల్లు లోపలే పూర్తి స్థాయి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
8 గంటల షిఫ్ట్ తర్వాత 4 గంటల తరగతులు.
తరగతి గదులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్, యోగా కోర్సు కూడా.
అన్నిటికీ పూర్తిగా నిధులు సమకూర్చబడ్డాయి. ఎలాంటి షరతులు లేవు.
మరి ఫలితం?
24,536 మంది మహిళలు 10వ, 12వ, UG మరియు PG డిగ్రీలు పొందారు.
చాలా మంది ఇప్పుడు నర్సులు, ఉపాధ్యాయులు, పోలీసు అధికారులుగా ఉన్నారు.
ఈ సంవత్సరం తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ నుండి 20 మంది గోల్డ్ మెడల్ అందుకున్నారు.
ఒక వ్యాపారవేత్త ఉద్యోగుల నిష్క్రమణ గురించి ఆందోళన చెందుతారని మీరు ఊహించవచ్చు. ఈ మహిళలు వెళ్లిపోతే ఏమిటి? కార్మికులు తరచూ మిల్లు వీడి వెళ్లిపోతే ఎలా అని.
KP రామస్వామి గారు ఏమి చెబుతారంటే..
"నేను వారి సామర్థ్యాన్ని వృథా చేస్తూ మిల్లులోనే ఉంచాలనుకోవడం లేదు. వారు ఇక్కడకు ఎంచుకుని రాలేదు, పేదరికం కారణంగా వచ్చారు. వారికి భవిష్యత్తును ఇవ్వడం నా పని, ఇది పంజరం కాదు అని.
ఆయన ఖచ్చితంగా అదే చేస్తున్నారు....
వారు వెళ్లిపోతారు. కెరీర్లు నిర్మించుకుంటారు. ఆ తర్వాత? వారి గ్రామాల నుండి మరింతమంది అమ్మాయిలను మిల్లుకు పంపుతారు. ఈ చక్రం కొనసాగుతుంది.
ఇది కేవలం CSR కార్యక్రమం కాదు. ఇది నిజమైన అర్థంలో మానవ వనరుల అభివృద్ధి.
ఇటీవల జరిగిన స్నాతకోత్సవంలో 350 మంది మహిళలు తమ డిగ్రీలు అందుకున్నారు. KP రామస్వామి గారు ఒక అసాధారణ అభ్యర్థన చేశారు.
మీరు లేదా మీ స్నేహితులు వారిని నియమించుకోగలిగితే, ఇతర అమ్మాయిలకు మరింత చదువుకోవడానికి ఆశ కలుగుతుంది అని.
ఒకసారి ఆలోచించండి. కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నడుపుతున్న ఒక వ్యక్తి వ్యాపారం గురించి అడగడం లేదు. తన కార్మికుల కోసం ఉద్యోగాలు అడుగుతున్నారు.
ఇలాంటివి మనం చాలా అరుదుగా చూస్తాము.
ఈ కథ కేవలం KPR మిల్లుల గురించి మాత్రమే కాదు. ఇది నాయకత్వం, కార్పొరేట్ నీతి, దేశ నిర్మాణంలో ఒక పాఠం.
#💗నా మనస్సు లోని మాట #motivational #మహానుభావులు #mahanubhavulu #endharo mahanubhavulu
40 రోజులుగా... మతం మారమని అనేక లాభ పేక్ష చూపినా...
తల క్రిందులుగా వ్రేలాడి తీసినా
వేట కుక్కలతో కరిపించినా
కాళ్ళు చేతుల గోళ్ళు పీకేసినా
నాలుక కోసినా
కళ్ళు పీకేసినా
చివరికి...
చర్మం పూర్తిగా వలిచేసి, శరీరం మొత్తం ఉప్పు రాసినా
తల వగ్గని ధీరుడు
తల నరికి సూలానికి గుచ్చి రాజ్యాలంతా ఊరేగించిన ఛత్రపతి శంభాజి మహారాజ్ నీ ఏమని కొలవాలి మరి.
మహారాజుగా కొనియాడు బడుతూ, అనేక రాజ్యాలను ఛత్రపతి గా ఎలుతూ, అంతటి నరకాన్ని అనుభవించటానికి కారణం ఏంటో తెలుసా????
చిత్ర హింసలకు తట్టుకోలేక మహారాజు మతం మారితే, చేసేది లేక, ప్రజలంతా మతం మార్చుకోవాల్సి వస్తుంది అని తన ప్రాణాలను పనంగా పెట్టీ మన తాత ముత్తాత లను హైందవ ధర్మం వైపే నిలబడేటట్టు నిలిపిన ఛత్రపతి సాంబాజీ మనకు దేవుడు ఎందుకు కాలేక పోయారు???
విపరీతమైన మత మార్పిడులకు ప్రోత్సాహం ఎలా జరిగింది?
ఆనాడు, శంబాజీ చనిపోవడానికి కారణమైన అసూయ స్వార్థ పరులు నేటికీ ఉండటం, రాజకీయ లాభ పేక్షి ఉండటం తోనే.
నీ తాత ముత్తాతలు ధర్మం కోసం ప్రాణాలు అర్పిస్తే, నేడు, అదే ధర్మాన్ని బియ్యం బాగ్ కి అమ్ముడు పోతున్నారు దరిద్రులు.
ఎంత మంది వచ్చినా,
ఎన్ని కుతంత్రాలు చేసినా,
ఎన్ని రాజకీయాలు చేసినా,
ఎన్ని ప్రగడ్బాలు పలికినా
వెంట్రుక కూడా పీకలేరు అనేది గుర్తెరగాలి.
దిక్కుమాలిన లౌకికవాదం చూపించకండి.
మన ధర్మాన్ని కాపాడుకుందాం
శ్రీ మాత్రే నమః
#chatrapati shivaji maharaj #జై శివాజి...🚩 #ఛత్రపతి శివజీ #జై శ్రీరామ్ జై శివాజి












