👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
ShareChat
click to see wallet page
@priyadarshi2410
priyadarshi2410
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
@priyadarshi2410
💜💚💜యద్భావం తద్భవతి💜💚💜
శ్రీ మహావిష్ణు పురాణం గజ్రేంద మోక్షము - మకర సంహారం - గజేంద్ర రక్షణం మొసలిని భూమి పైకి లాగి ఓడించాలని ఏనుగు, ఏనుగుని నీటిలో ముంచి ఓడించాలని మొసలి తమ శక్తి సామర్థ్యాలు పూర్తిగాపెడుతూపోరాడుతున్నాయి. ఆడ ఏనుగులు తీరం నుంచి ఏమి చేయలేక తమ నాథుడుకి కలిగిన పరిస్థితికిదుఖిస్తున్నాయి. కరి మకర పోరాటం గంటలుదాటి రోజులకి మారింది. స్థాన బలిమి వలన రోజులు గడిచేకొద్ది మొసలి బలం పెరుగుతూ ఏనుగు బలం క్షీణిస్తోంది. గజరాజుకితనకుఓటమి,మరణం తప్పదని తెలిసి వస్తోంది. శక్తి సామర్థ్యాలుపూర్తిగాక్షీణించాయి. తననులోకేశ్వరుడైనశ్రీహరిమాత్రమేరక్షించగలడనిఅర్థమైంది. అంతబాధలో,మరణంతప్పదన్న ఆఖరి క్షణాల్లో ఆకాశం వైపు తల ఎత్తి, తొండం ఎత్తి నారాయణుని రక్షించమని ప్రార్ధించింది. పోతనా మాత్యులు భాగవతంలో చెప్పిన సుప్రసిద్ధ పద్యం గజేంద్రుడి పరిస్థితిని తెలియజేస్తుంది "లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె బ్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చె, దనువుదస్సెన్శ్రమంబయ్యెడిన్|| నీవే తప్ప నితః పరంబెరుగ మన్నింపదగున్ దీనునిన్ రావే ఈశ్వరా! కావవే వరద! సంరక్షింపు భద్రత్మాకా||" మంచి చేసే మనస్సు గల శ్రీహరీ! నా బలము పూర్తిగా నశించింది. ధైర్యము సన్నగిల్లిపోయింది. పంచప్రాణాలు శరీరంలో తమ స్థానాలు వదలివెళ్లిపోతున్నాయి. శరీరం అలసి సృహతప్పుతోంది. ఈ కష్టం, బాధ తట్టుకోలేక పోతు న్నాను. నాకు నీవు తప్ప వేరె వ్వరు తెలియదు. ఈ దీనుని మన్నించిరక్షించడానికిరావయ్యా! ఓ శ్రీహరీ! భక్తులు కోరిన వరా లిచ్చే వరదరాజా! ఈశ్వరా!నన్ను రక్షింపుము! గజేంద్రుని హృదయం నుండి రక్షించమని ప్రార్ధిస్తూ వెలువడిన దీనాలాపాలు లోకాలన్ని దాటి వైకుంఠంలో మహాలక్ష్మితో సరస మాడుతున్న శ్రీహరి చెవులకు చేరాయి. భక్తుల పిలుపులకు తక్షణమే స్పందించే ఆర్తత్రాణ పరాయణుఢైన నారాయణుడు గజేంద్రుడి మొర ఆలకించగానే ఉన్నవాడు ఉన్నట్లే వైకుంఠం వదలి గజేంద్రుని రక్షించడానికి త్రికూట వనము వైపు వేగంగా బయలుదేరి వెళ్ళసాగాడు. ఈ సన్నివేశం వర్ణిస్తూ పోతన గారి పద్యం చదువుదాం. "సిరింకింజెప్పడుశంఖచక్రయుగముం జేదోయి సంధింప డే పరివారంబును జీరడభ్రగపతిం మన్నింపడాకర్ణికాం తర థమిల్లము చక్కనొత్తడు వివాదప్రోద్ధత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై||" గజేంద్రుడిప్రాణరక్షించాలనేతొందర లో శ్రీహరి లక్ష్మికి చెప్పలేదు. శంఖచక్రాలను చేతులలోతీసుకో లేదు. పరివారాన్ని రమ్మనలేదు. గరుత్మంతుడి పైన ఆధిరోహించ లేదు.చెవులవరకుజారినజుట్టును సరిచేసుకోలేదు.చదరంగంలో ఓడి తన చేత చిక్కిన లక్ష్మీదేవి పైటనువదలలేదు.అలాగేపట్టుకుని బయలుదేరి వెళ్లాడు. లక్ష్మీదేవి, గరుడుడు, ఆదిశేషుడు ఆశ్చర్యంగా చూస్తూ హరి వెంట కదిలారు. వారి వెనుక శంఖచక్ర గదాది ఆయుధాలు. నారదుడు, విష్వక్సేనాది వైకుంఠపుర వాసులు వెళుతుంటే ఊర్ధ్వలోకాల వారైన బ్రహ్మ మహేశ్వర ఇంద్రాది దేవతలు, దేవర్షులు, గంధర్వాదులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. త్రికూట పర్వత సమీపానికి వచ్చిన నారాయణుడు కింద సరస్సులో మొసలి నోటికి కాలు చిక్కి రక్షించమని తనను ప్రార్ధిస్తున్న గజేంద్రుని చూసాడు. క్షణమైనా ఆలస్యం చేయకుండా చక్రాన్ని తలచి చేతికి రాగానే మకరం పైకి ప్రయోగించాడు. ముల్లోకాలు కంపించి పోయేట్టు ధ్వని చేస్తూ సుదర్శన చక్రం కదిలింది. చక్రభ్రమణ వేగానికి అగ్ని కణాలు ఉత్పన్నమై ఆకాశాన్ని ప్రకాశితం చేస్తూంటే, సరస్సులోకి దూసుకు వెళ్లి గజేంద్రుని కాలు పట్టుకున్న మొసలి కంఠాన్ని ఖండించి వేసింది. గజేంద్రుడు తెగిన మొసలిశిరస్సు పట్టు వదలించుకున్నాడు. బాధ తొలిగి ఉపశమనం లభించింది. ఆడ ఏనుగులు సరస్సులో దిగి గజేంద్రుని చుట్టూ చేరి చల్లని నీటిని జలధారలుగా పోస్తూ అలసిన శరీరానికి స్వాంతన చేకూర్చాయి. గజేంద్రుడు తన భార్యలతో కలసి సరస్సులోని పద్మాలు తొండాలతో తీసుకుని శ్రీమహావిష్ణువుకి సమర్పిస్తూ, ఆనంద బాష్పాలతో కృతజ్ఞతలు అర్పిస్తూ ఘీంకారం చేసాడు. శ్రీహరి చేతిలోకి వచ్చిన పాంచ జన్య శంఖాన్ని పూరించి విజయ నాదం చేశాడు. దేవదుందుభులు మ్రోగాయి.లక్ష్మీదేవిచెంతచేరింది. చతుర్భుజాలలో గదా శంఖ చక్ర పద్మాలు విరాజిల్లగా లక్ష్మీదేవి సమేతుడై గరుత్మంతుడి ఫై ఆసీనుడై గంజేంద్రునికి దర్శన మిచ్చాడు. దేవతలు పుష్ప వర్షం కురిపిస్తూ స్తుతి సోత్రానికి చేశారు. మకర సంహారంతో శాప విముక్తుడైనగంధర్వుడుభార్యతో కలసి లక్ష్మీనారాయణు లకు భక్తి శ్రద్థలతోనమస్కరించినారాయణ నామాన్నిస్మరిస్తుగంధర్వలోకానికి వెళ్లి పోయాడు. శ్రీమహావిష్ణువు గంజేంద్రుని దగ్గరకు వచ్చి తన దివ్య హస్త స్పర్శతో అనుగ్రహించి ముక్తి ప్రసాదించాడు. గజేంద్రుడు, అతని భార్యలు తమ దేహాలు వదిలి ఆత్మజ్యోతులుగా వెళ్లి శ్రీహరిలో లీనమయ్యారు. తనను స్తుతిస్తున్న నారదాది మహర్షులను, ఇంద్రాది దేవతలను శ్రీమహావిష్ణువు మందహాసంతో చూసి "దేవతలారా! మహర్షులారా! నేను భక్తవత్సలుడను. నిరంతరం నా నామం జపించే వారిని, దేవతలా మానవులా జంతువులా అని చూడకుండా ఆపద కలిగి నప్పుడు వెంటనే వచ్చి రక్షించి కాపాడుతాను. ఈ గజేంద్ర రక్షణమే ఇందుకు నిదర్శనం. నా భక్తుడైన గజేంద్రుని మకర బంధం నుండి విడిపించి మోక్షం ప్రసాదించాను. ఈ గజేంద్ర మోక్షము కథ విన్నవారికి, చదివినవారికి దుఖాలు తొలగి శుభాలు, కీర్తి జయాలు కలుగుతాయి. నిత్య పారాయణ చేసినవారికి మరణానంతరం మోక్షము లభిస్తుంది"అని లక్ష్మీదేవితో కలసిగరుత్మంతుడిపైవైకుంఠానికి వెళ్లి పోయాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు #🙏🕉️శ్రీ మహావిష్ణువు🕉️🙏 #🪐 శ్రీ మహావిష్ణు 🔱 #శ్రీ మహావిష్ణు 🪐
🙏🕉️శ్రీ మహావిష్ణువు🕉️🙏 - ShareChat
#💗నా మనస్సు లోని మాట
💗నా మనస్సు లోని మాట - @শ ಗೆಯಂ ತನಿಖಿಂದದು కొన్ని జీవితమంతా మనసులోమిగిలిపోతాయి: @শ ಗೆಯಂ ತನಿಖಿಂದದು కొన్ని జీవితమంతా మనసులోమిగిలిపోతాయి: - ShareChat
రేపే #నరక_చతుర్ధశి ఆశ్వీయుజ బహుళ చతుర్దశి ఈ తిథి నరక చతుర్దశి తిథి. దీనికే ‘ప్రేత చతుర్దశి’ అనే పర్యాయ నామం కూడా ఉంది. ఆశ్వీయుజ కృష్ణ త్రయోదశి – చతుర్దశి తిథుల మధ్య, కృష్ణుడు నరకాసురుడిని సంహరించిన సందర్భాన్ని పురస్కరించుకుని, ఏటా ఈ పండుగను జరుపుకోవడం ఆచారం. నరకాసురుడిని కృష్ణుడు సంహరించిన దినం కావడం వల్లనే... దీనికి నరక చతుర్దశి అనే పేరు వచ్చింది. ఈ పండుగ నిమిత్తంగా తెల్లవారుజామున సూర్యోదయం ముందే నిద్రలేచి, అభ్యంగన స్నానం చేస్తారు. ‌‌‌‌‌‌‌ ఈనాడు నరకవిముక్తి కోసం యమధర్మరాజును ఉద్దేశించి, దీపదానం చేయాలని వ్రత చూడామణి అనే గ్రంథంలో ఉంది. కనుక యమదీపం దానంచేసి, బ్రాహ్మణులకు భోజనంపెట్టి, వస్త్రదానం కూడా సమర్పిస్తారు. ఈ రోజు ఆచరించే క్రతుల శాస్త్రాన్ని ఇపుడు తెలుసుకుందాం👇 ‘భాగవత పురాణంలో కథ ఈ విధంగా ఉంది – పూర్వకాలంలో ప్రాగ్ జ్యోతిషపురం అనే నగరంలో భౌమాసుర లేక నరకాసుర అనే పేరు కలిగిన అసురుల రాజ్యం ఉండేది. వాడు దేవతలు మరియు మానవులకు బాగా ఇబ్బందులు పెట్టేవాడు. ఈ కౄరమైన రాక్షసుడు మహిళలుకు కూడా చాలా కష్టాలు కలిగించేవాడు. వాడు గెలుచుకున్న ప్రాంతం నుండి, వివాహం కానిపదహారువేల మంది రాజకన్యలను అపహరించి, కారాగృహంలో బంధించాడు, మరియు వారితో వివాహం చేసుకుందామని నిశ్చయం చేసుకున్నాడు. దీని మూలంగా ఎక్కడ చూసినా గోల గోల మొదలైంది. భగవాన్ శ్రీ కృష్ణునికి ఈ విషయం తెలిసిన తర్వాత సత్యభామ సహాయంతో వారు నరకాసురుడితో యుద్ధాన్ని ప్రారంభించి, వాడిని హతమార్చి, రాజకన్యలు అందరికీ విముక్తిని ఇచ్చాడు. చచ్చిపోయే ముందు నరకాసురుడు శ్రీకృష్ణుని వద్ద ఒక కోరికను కోరాడు. అది ఏమనగా? ఈ రోజు తిథి నాడు ఎవరైతే మంగళ స్నానం (అభ్యంగన స్నానం) చేస్తారో... వారికి నరక యాతన నుండి విముక్తి కలగాలి! ఇది విన్నాక శ్రీ కృష్ణులవారు ‘తథాస్తు’ అనడంతో ఆ రోజు నుండి ఆశ్వయుజ బహుళ చతుర్దశి అనేది నరకచతుర్దశి గా నిర్వహించడం మొదలైంది. ఆ రోజే ఉదయం ప్రజలందరూ సూర్యోదయం ముందే అభ్యంగన స్నానం చేయడం ప్రారంభించారు. చతుర్దశి రోజున తెల్లవారు జామున, నరకాసుర వధను పూర్తి చేసుకుని, వాడి రక్తంతో నుదుటి పై తిలకాన్ని ధరించి శ్రీకృష్ణ వారు ఇంటికి చేరేసరికి, మాతృమూర్తులు అందరూ ప్రేమతో కౌగిలించుకున్నారు మరియు స్త్రీ మూర్తులు అందరూ హారతి పళ్లెం తీసుకొని హారతి ఇచ్చి, ఆత్యానందంతో స్వాగతం పలికారు. #మహత్యము ముందు రోజు రాత్రి 12 గంటల నుండి వాతావరణం అంతా కూడా దూషితమైన లహరీలతో నిండి ఉంటుంది. ఎందుకంటే ఆ తిథి నాడే బ్రహ్మాండంలో గల చంద్రనాడి యొక్క స్థిత్యంతరము సూర్యనాడిలో జరుగుతుంది. ఆ స్థిత్యంతరము యొక్క లాభం పాతాళంలో గల చెడు శక్తిల ద్వారా పొందడం వలన, పాతాళం నుండి ప్రసారమయ్యే నాదయుక్తమైన కంపన తరంగాలు, వాతావరణంలో ఇబ్బందికరమైనటువంటి ధ్వనిని నిర్మాణం చేస్తుంటాయి. ఈ ధ్వని యొక్క నిర్మాణ తరంగాలలోని రజతమాత్మకమైన కణాల యొక్క కదలిక వలన ఉత్పన్నమయ్యే శక్తి నుండి జరుగుతూ ఉంటుంది. ఆ తరంగాలు విస్పోటక్ స్థితికి సంబంధించినదై ఉంటుంది. ఈ తరంగాల యొక్క ధ్వని కంపనాలపై నియంత్రణ చేయుట కొరకు తెల్లవారి జామున అభ్యంగన స్నానం చేసి, నేతి దీపాలు పెట్టి, వాటిని పూజిస్తారు. ఎందుకంటే దీపం ద్వారా వెలువడే తేజ తత్వానికి సంబంధించిన తరంగాల యొక్క మాధ్యమం ద్వారా వాతావరణంలో గల ఇబ్బందికరమైన తరంగాలలో గల రజతమాత్మకమైన కణాలు కరిగిపోతాయి. ఈ కరిగే ప్రక్రియ వలన అనేక సూక్ష్మ శక్తిలలో గల కోషంలోని రజ-తమ కణాలు కూడా కరిగిపోతాయి మరియు చెడు శక్తిల చుట్టూ ఉన్నా రక్షణ కవచం కూడా నశించిపోతుంది. దీనిని వాతావరణంలో దీపం సాయంతో జరిగినటువంటి అసుర శక్తి యొక్క సంహరం అని అంటారు. అందువలన ఈ రోజున చెడు శక్తిలయొక్క నాశనం చేసి దీపావళి మరియు ఇతర రోజులలో జీవుల ద్వారా శుభకార్యానికి ప్రారంభం చేయాలి. అసురులను అంతం చేసే రోజు అనగా ఒక రకమైన నరకం నుండి పృద్వి పై వచ్చినటువంటి చెడు శక్తిలు విఘటించే రోజు. అందువలన నరక చతుర్దశి రోజుకు ప్రత్యేకమైన మహిమ ఉన్నది. #పండుగ జరుపుకునే విధానం👇 అ. ఆకాశంలో చుక్కలు ఉన్నప్పుడే అనగా బ్రహ్మ ముహూర్తంలో అభ్యంగన స్నానము చేస్తారు. ఉత్తరేణి మొక్క కొమ్మతో తల నుండి పాదాల వరకు, అలాగే పాదాలు నుండి తల వరకు నీరును జల్లుకుంటారు. దీని కొరకు ఉత్తరేణి మొక్క వేరుతో సహా ఉండాలి. ఆ. యమతర్పణం – అభ్యంగన స్నానం అయిన తర్వాత అపమృత్యు నివారణార్థం యమతర్పణ విధిని చేయడం ఆనవాయితి. యమతర్పణం విధి యొక్క వివరణ పంచాంగంలో ఇస్తూంటారు. ఆ విధంగా చేయాలి. దాని తర్వాత తల్లి పిల్లలకు హారతిని ఇస్తుంది. కొన్ని ప్రాంతాలలో కొందరు అభ్యంగన స్నానం అయిన తర్వాత, నరకాసుర వధకు ప్రతీకగా చేదు రుచి కలిగిన ఒక రకమైన కాయను కాలుతో చిట్లు కొడతారు, మరి కొందరు వాటిరసం (రక్తంగా) నాలికపై పెడతారు. ఇ. మధ్యాహ్నం బ్రాహ్మణ భోజనం పెట్టి, వస్త్రదానం సమర్పిస్తారు. ఈ. ప్రదోషకాలంలో దీప దానాన్ని నిర్వహిస్తారు. ఎవరైతే ప్రదోష పూజా వ్రతాన్ని నిర్వహిస్తారో వారు, ప్రదోషపూజ మరియు శివపూజను నిర్వహిస్తుంటారు. నరక చతుర్దశి రోజున చేసే #విధి వెనక ఉన్న శాస్త్రము👇 అ. బ్రాహ్మణ భోజనం ‘నరక చతుర్దశి రోజున బ్రాహ్మణలకు భోజనం పెట్టడం, అంటే ధర్మ స్వరూపములో అవతరించి, కార్యం చేయుటకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేయడం. ఈ మాధ్యమంగా బ్రహ్మాండంలో సంచరిస్తున్న ధర్మలహరీలకు పుష్టిని అందించి, అవతార కార్యమును ముందుకు కొనసాగించేందుకు అనగా భూతలంపై వచ్చే చెడు మరియు అధోగామీ తరంగాలను నష్ట పరిచేందుకు, సమిష్టి యొక్క ఇచ్చాశక్తిని అందిస్తూ, ప్రత్యక్ష స్వరూపంలో కార్యాన్ని ప్రారంభించమని ఆహ్వానం పలకడం. ఈ మాధ్యమంగా స్వతహాగా ధర్మ కర్తవ్యాన్ని పాటిస్తూ భగవంతుడి కృప ఆశీర్వాదాలతో కూడిన తరంగాలను గ్రహించుకోవచ్చు. ఆ. వస్త్రదానము వస్త్రదానం చేయడం అనగా దేవతల యొక్క స్పందనలను భూతలంపై రావడం కోసం దానం స్వరూపంలో, అంటే ధర్మసంవర్ధన కార్యం చేయుటకు ఆహ్వానించడమే. ఈ మాధ్యమం నుండి మనం పోగుచేసిన ధన సంచయమును ధర్మకార్యం కోసం అర్పించడం మూలంగా మనకు ఆధ్యాత్మిక ఉన్నతీ కలుగుతుంది. ఇ. యమదీపదానం యమదీపదానం చేయడం, అంటే లయం యొక్క శక్తి మరియు చలన శక్తి స్వరూపంలో జరిగే యుద్ధంలో స్వరక్షణ కొరకు మృత్యు దేవత అయిన యముడికి వారి పాలును ఇచ్చి అపమృత్యు నుండి రక్షణ పొందడమే. ఈ మాధ్యమం నుండి ధర్మానికి వాటి భాగం ఇచ్చి, తృప్తిపరచి, మనం సమష్టి కార్యాన్ని సహజంగా చేసుకోవచ్చు. ఈ. ప్రదోష పూజ ‘కాలాయ తస్మై నమః’ ఇలా కాలమహిమను వర్ణించి కాలం యొక్క మాధ్యమంగా కార్యన్వితమయ్యే స్థిరమైన మరియు పురుషదర్శకమైన క్రియాశక్తి యొక్క కొంత భాగమును పూజించి వాటి సంర్థన చేయడం, అనగా కార్యాన్ని దర్శించే స్వరూపాన్ని అందించడమే. ఈ మాధ్యమంగా కాలమహిమను చిత్తముపై ధృడ పరిచి దానికనుసారంగా ఆచరణను మొదలు పెట్టి ఉచ్చస్థాయి అవస్థను పొంది ధర్మాచరణ చక్కగా చేసుకోవచ్చు. ఉ. శివపూజ సమష్టికు ఇబ్బంది కలిగించే అధోగామీ తరంగాల యొక్క నాశనం కొరకు జాగ్రత్త అయిన భగవంతుడి మారక స్వరూప సగుణత్వానికి పూజ ద్వారా కృతజ్ఞత వ్యక్తం చేయడం. ఈ పూజ ద్వారా భగవంతుడి కృతిలో ఆప్యాయత నిర్మాణం అయ్యి భావ వృద్ధి జరిగి భగవంతుడితో ఏకరూపం సాధించే దిశగా ముందుకు సాగుతాము. #👹నరక చతుర్దశి🎇 #తెలుసుకుందాం
👹నరక చతుర్దశి🎇 - ShareChat
GIF
#నరకచతుర్దశి, యమచతుర్దశి. ఆశ్వయుజ బహుళ చతుర్దశినే “నరకచతుర్దశి” అంటాం. ఈ నరకచతుర్దశి తర్వాతి రోజే దీపావళి. తెలుగు పండుగల్లో నరకచతుర్దశి, దీపావళి ప్రముఖమైనవి. మనం ఆచరించే పండుగలలో ఒక రాక్షసుడి మరణాన్ని ఆనందంగా, పండుగ చేసుకోవడం - నరకచతుర్దశి విశిష్టత! ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు నరకవధ జరిగింది. పండుగలకు - ఖగోళ సంఘటనలకు సంబంధం ఉంది. ఆకాశంలో రాశుల స్థితిని సూచించేది. తులారాశి తూర్పుక్షితిజం మీద ఉదయిస్తుంటే... పడమటి క్షితిజం మీద మేషరాశి అస్తమిస్తుంటుంది. నరకుడు భూదేవి కొడుకు. మేషం సహజంగా మంచిదే అయినా మూర్ఖత్వమూర్తి. కనుక అతని పాలన అంధకారమయం! ఆ రోజు మేషరాశి సూర్యాస్తమయ సమయంలో ఉదయిస్తుంది. అది అస్తమించే వరకూ చీకటే! మేషరాశి అస్తమించే వేళకు తులారాశి తూర్పు దిక్కున క్షితిజం మీదికి వస్తుంది. స్వాతినక్షత్రానికి అధిపతి వాయువుదేవత. దాన్ని అధిష్టించి నరకుని మీదికి బయలుదేరిన కృష్ణుడు-సూర్యుడు, సత్యభామ-చంద్రుడు. నరకుడు చనిపోగానే ఆకాశపు అంచులపై దీపచ్ఛాయల్లో కన్యారాశి (కన్యల గుంపు) నరకుని బంధాలనుంచి విడివడి, తమను విడిపించిన సూర్యున్ని-కృష్ణున్ని నాయకునిగా చేసుకునింది. ఇలాంటిస్థితి నరకచతుర్దశి, దీపావళి రోజుల్లో తప్ప — మిగిలిన రోజుల్లో లేదు. నరక భావాలు అంటే దుర్భావాలను, కృష్ణభక్తి అనే చక్రాయుధంతో ఖండింపచేసి, జీవుడు భవద్దర్శన ప్రాప్తితో ఆనందించాలనేది ఇందులోని అంతరార్ధం. నరాకాసుర వధ స్త్రీ స్వాతంత్ర్యానికి నిదర్శనం. నరకచతుర్దశి ఆచరణ వెనక ఉన్న గాథల్లో నరకాసురుడి గాథ ప్రధానమైంది. హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టచుట్టి సముద్రంలో ముంచినప్పుడు - విష్ణుమూర్తి వరాహావతారమెత్తి, ఆ రాక్షసుని సంహరించి, భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవి,విష్ణుమూర్తి →నిషిద్దకాలమైన సంధ్యాసంయములో కలవటమువలన కలిగిన పుత్రుడు కాబట్టి, నరకునిలో అసురలక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెపుతాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడని భయపడి తనబిడ్డకు రక్షణ ప్రసాదించమని వరము కోరుతుంది. దానికి విష్ణుమూర్తి సరే అని, తన తల్లి చేతుల్లలోనే ఇతనికి మరణము ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏ తల్లీ తనబిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది. తర్వాత నరకుడిని జనక మహారాజుకి అప్పచెప్పి, విద్యాబుద్ధులు నేర్పమని అడుగుతుంది. ఆ విధముగా జనకమహారాజు పర్యవేక్షణలో పెరిగి, ఎంతో శక్తివంతుడుగా మారతాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు. నరకుడు ప్రాగ్జోతిషపురం రాజధానిగా కాపరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. భూమాత తన కుమారుని రాక్షసత్వానికి దూరంగానే పెంచింది. దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంలోపడి ఘోరతపస్సు చేసి, అనేక వరాలు పొందాడు. తనకు తన తల్లిచేతిలోతప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు. స్వయాన తనతల్లే తనను చంపదని అతని ధీమా. ఆ వరగర్వంతో అతను కావించిన దుష్కార్యాలు పరాకాష్టకుచేరి, దేవతలను తీవ్ర అశాంతికి గురిచేసాయి. విష్ణుద్వేషియై దేవతలను హింసించసాగాడు. మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పుత్రికను చెరపట్టాడు. వీరూ,వారను విచక్షణ లేకుండా గంధర్వ, దేవ, మానవ కన్యలను బలవంతంగా అపహరించి, తన అంతఃపుర పంజరంలో బంధించడం ఇతనికొక వ్యసనం. ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగక చివరకు ఇంద్రునిపైకి కూడా దండెత్తి ఆయన అధికారముద్రను అపహరించడంతో ఈ అసుర ప్రముఖుని దురంతం పరాకాష్టనందుకుంది. ఇంద్రుడు ఆపదరక్షకుడైన శ్రీకృష్ణుని శరణువేడగా గోపాలుడు నరుకునిపై దండెత్తాడు. అయితే నరకాసురుని విషపు బాణానికి శ్రీకృష్ణుడు ఒక క్షణంపాటు నిశ్చేష్టుడయ్యాడు. అది గమనించి, ఆయనతో కూడానే ఉన్న ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి సంహరించింది. ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు లోక కంటకుడైన నరకుని మరణం సంభవించింది. యాదృచ్ఛికంగా నరకాసుని మరణం సత్యభామ రూపంలో తనతల్లి భూదేవి చేతిలోనే సంభవించింది. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచివుండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరకచతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు. ధ్రర్మం సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటిరోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునేరోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి, వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. #యమచతుర్దశి ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక మూడో జాములో అభ్యంగస్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్ర వచనం. ఈ చతుర్దశినాడు నూనెలో లక్ష్మీదేవి, నీళ్లలో గంగాదేవి అధివసించి ఉంటారంటారు. కనుక నరక చతుర్దశినాడు సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేస్తే మంచిది. సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ, ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం. 👉చతుర్దశ్యాం తు యే దీపాన్‌ నరకాయ దదాతి చ| తేషాం పితృగణా స్సర్వే నరకాత్‌ స్వర్గ మాప్నుయుః|| చతుర్దశినాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుంది. ఇదేరోజున సాయం సమయంలో నూనెతో తడిపిన, రసాయన ద్రవ్యాలతో తయారుచేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపినట్లవుతుంది. #తెలుసుకుందాం #👹నరక చతుర్దశి🎇 #👹నరక చతుర్దశి🎇
తెలుసుకుందాం - ShareChat
ప్రకృతి ముందు ఏ పాచికలు పారవు; కష్టపడ్డాడికి ఏదో ఖరీదు కట్టేసే రూపాయి ఏమాత్రం న్యాయం చేయదు..!. ఆ కష్టానికి తగ్గ ఫలితమే అసలైన ఫలం... ఫలం, ఫలితం, ధనం మధ్య వ్యత్యాసం ఎంతో వేరు... "ఒకర్ని కష్టాలలోకి నెట్టడం కొందరికి క్రీడ (మాయా జూదం)"... "నమ్మినోడినే నట్టేట ముంచడం కొందరికి అదో ఆనందం "... కానీ న్యాయం, ధర్మం వద్ద ఏ మాయా పాచిక పారినా.. అది ధర్మ సంస్థాపన కొరకే... అధర్మం నెత్తిన తొక్కడానికే... చరిత్రలకు చదలు పట్టదు, సమాజానకి దృష్టిలోపం ఉండదు, విన్నదే వందరకాలుగా చెబుతారు..! ఇక చూసినది? ప్రకృతి అన్నీ గమనిస్తుంది... అందుకే వంద కౌరవులు, వారి హితులు అధర్మవాదులుగా చరిత్రలో నిలిచిపోయారు. #🗣️జీవిత సత్యం
🗣️జీవిత సత్యం - ShareChat
జీవకోటి యాత్రలో ఒక గీత అడ్డంగా పెడతారట. ఏమా గీత అంటే... అరుణాచల ప్రవేశానికి పూర్వం, తర్వాత అట. ‘అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు’ అని ఓ సిద్ధాంతం ఉంది. నేనూ ఈ సిద్ధాంతాన్ని నమ్మాను. ఎందుకంటే పదేళ్ల నుంచి అక్కడికి వెళ్లాలని వెళ్లలేకపోయాను. ఈసారి ఎలాగైనా వెళ్లాలని సంకల్పించుకున్నాను. అరుణాచలేశ్వరుడి చుట్టూ 14 కిమీ గిరి ప్రదక్షిణం నడక... ఇది కేవలం యాత్ర కాదు, ఒక జీవన మార్గం. ఈ ప్రదక్షిణ వల్ల మనస్సు శుద్ధి, ఆత్మాన్వేషణ, శివ అనుగ్రహం లభిస్తాయి. అరుణాచలం ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి? ఎలా చేయాలి మీకున్నా అన్ని సందేహాలకు ఈ పోస్ట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 1. అరుణాచల క్షేత్ర మహిమ ఏమిటీ? అరుణాచలం (తిరువణ్ణామలై) శైవమతంలో అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటి. ఇది ఐదు భూతలింగాలలో అగ్నిలింగం కి ప్రతీక. ‘‘అరుణాచలేశ్వరుడు’’ అనగా – ఆరున్ (తేజస్సు), అచల (అచంచలుడు) – శివుడు స్వయంగా తేజోమయంగా లింగరూపంలో వెలసిన స్థలం. శివుడు తన స్వరూపాన్ని చూపించడానికి ఎక్కడో వెలయించబడతాడు కానీ, ఇక్కడ ఆయన స్వయంగా ‘గిరిరూపం’ గా వెలసాడు. అందుకే అరుణాచలం కేవలం శిల కాదు – శివుడే! అరుణాచలం గిరిప్రదక్షిణం చేసిన మహనీయులు – ఋషులు, యోగులు, గురువులు 1. భగవాన్ శ్రీ రమణ మహర్షి (Bhagavan Sri Ramana Maharshi) అరుణాచల గిరిప్రదక్షిణాన్ని అత్యంత పవిత్ర సాధనంగా పరిగణించిన ఆధునిక యోగి. ఆయ‌న జీవితంలో ఎన్నో సార్లు అరుణాచలం చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేశారు. "గిరిప్రదక్షిణం అనేది పర్వతాన్ని కాకుండా, శివుని చుట్టూ తిరిగే విధానం" అని రమణ మహర్షి తత్వబోధ. 2. శ్రీ శేషాద్రి స్వామి (Sri Seshadri Swamigal) రమణ మహర్షికి సమకాలికుడు. తిరువణ్ణామలై లోనే నివసిస్తూ అరుణాచల గిరిప్రదక్షిణతో తన భక్తులను ఉద్ధరించారు. 3. గౌతమ మహర్షి (Gautama Maharshi) పురాణాల ప్రకారం, గౌతమ మహర్షి అరుణాచల ప్రాంతంలో తపస్సు చేసి శివానుగ్రహాన్ని పొందాడు. శివుడు ఈ ప్రాంతంలో స్వయంగా ‘తేజో లింగంగా’ వెలసినట్లు మొదటి సంబందం గౌతమ మహర్షి ద్వారా తెలియజేయబడింది. 4. విరూపాక్ష ఋషి (Virupaksha Deva or Rishi) ఆయన సాధనానికి ప్రసిద్ధమైన విరూపాక్ష గుహ ఇప్పటికీ అరుణాచల పర్వతంలో ఉంది. ఆయన అరుణాచలాన్ని శివ స్వరూపంగా చూసి దశాబ్దాలుగా ఆ గుహలో నివసించారు. 5. యోగి రామయ్య (Yogi Ramsuratkumar) ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన గాఢమైన తపస్వి. తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వరుని చుట్టూ ఎన్నో సార్లు గిరిప్రదక్షిణ చేశాడు. “Viswaroopa of Arunachala” అనే ఆయన మాటలు ప్రసిద్ధం. 6. శ్రీ శివప్రభునంద స్వామి (Sri Shivaprabhananda Swami) అరుణాచలం గురించి విస్తృతంగా గ్రంథాలు రచించిన ఋషిసమానం గురువు. గిరిప్రదక్షిణ సాధన విధానాన్ని తాను అనుసరించడమే కాక, భక్తులకు కూడా ప్రేరణగా నిలిచారు. ఇతర ప్రసిద్ధ ఆధ్యాత్మికుల ప్రస్తావన: అప్పర్, సంధానర్, జ్ఞానసంబంధర్, మాణిక్యవాచకర్ వంటి నాయనార్లు అరుణాచలేశ్వరుని భక్తులుగా ప్రసిద్ధులు. శ్రీ శంకరాచార్యులు కూడా అరుణాచల మహత్యాన్ని అభినందిస్తూ కొన్ని శ్లోకాల ద్వారా గుర్తించారని నమ్మకం. అనేక సాధకులు పేరు తెలియని యోగులు ఈ పర్వతాన్ని తమ జీవితధ్యేయంగా మార్చుకున్నారు. సూచనలు: ఈ గురువులు చేసిన గిరిప్రదక్షిణ అనుభవాలు వారి ఆశ్రమాలలో, గుహలలో, ప్రేరణాత్మక రచనలలో ఉద్ఘాటించబడ్డాయి. అరుణాచల పర్వతం కేవలం శిల గోపురం కాదు – అది జీవంత శివ తత్త్వం. గురువులు నడిచిన ఆ బాటలో మనం కూడా ఒక అడుగు వేయడం సాకారం మార్గానికి మొదటి మెట్టు. 2. అరుణాచల గిరి ప్రదక్షిణం ఎలా చేయాలి? గిరి ప్రదక్షిణం అంటే అరుణాచల పర్వతాన్ని చుట్టూ నడిచి ప్రదక్షిణ చేయడం. దాదాపు 14 కి.మీ. మేర నడక ఉంటుంది. ఇది సాధారణ నడక కాదు – ఒక ఆధ్యాత్మిక సాధన. #ఎలా_చేయాలి? కాలినడకన చేయాలి. సాధ్యమైనంత వరకూ పాదయాత్రే శ్రేష్ఠం. శరీర శ్రమ, మనస్సు ఏకాగ్రతతో భక్తి లభిస్తుంది. “అరుణాచల శివా” అనే నామస్మరణతో నడవాలి. రాత్రిపూట ప్రదక్షిణ చేయడం పవిత్రంగా భావిస్తారు – చందమామ వెలుతురులో పర్వతం దేవతా స్వరూపంగా అనిపిస్తుంది. గొప్ప శౌచం, దినచర్య, ఆహార నియమాలు పాటిస్తూ చేయాలి. ప్రదక్షిణ ప్రారంభానికి ముందు స్నానం చేయడం, శుద్ధ బద్ధంగా ఉండడం శుభకరం. ప్రదక్షిణలో #ముఖ్యమైనక్షేత్రాలు: అష్టలింగాలు (ఇవి 8 మూలదిక్కులకు ప్రతీకలు): ఇంద్ర లింగం, అగ్ని లింగం, యమ లింగం, నిరుతి లింగం, వరుణ లింగం, వాయు లింగం, కుబేర లింగం, ఈశాన్య లింగం. మనం గిరిప్రదక్షిణం చేస్తున్న కొండ చుట్టూ ఈ 8 లింగాలు రోడ్డు పక్కనే ఉంటాయి. వాటిని దర్శించుకొని మనం గిరిప్రదక్షిణం చేస్తే మంచిది. అలాగే మార్గం మద్యలో మోక్షమార్గం కూడా ఉంటుంది. ఆ మార్గం గుండా ప్రవేశిస్తే మోక్షం కలుగుతుంది అని చెప్పుతుంటారు. సద్గురు రమణ మహర్షి ఆశ్రమం. అనేక ప్రాచీన ఆలయాలు, తీర్థాలు, పుణ్యసంఘాలు ఈ మార్గంలో ఉంటాయి. 3. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడవలన #ప్రయోజనం ఏమిటి? పాప విమోచనం: గత జన్మల పాపాలు తొలగుతాయి. #తెలుసుకుందాం #అరుణాచల శివ 🙏 #అరుణాచలం 🙏 #om Arunachala siva🙏 #ఆధ్యాత్మిక ప్రపంచం అరుణాచల శివ
తెలుసుకుందాం - skrbij I skrbij I - ShareChat
*అనుకున్న పనుల్లో అవరోధాలా?* 🕉️ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం, సంకల్ప సిద్ధి కోసం ఆచరించాల్సిన పరిహారాలు ఉన్నాయి. జీవితంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్న వారైనా ఈ పరిహారా లను ఆచరించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. 🕉️ వ్యాపారాలు అనుకున్న రీతిలో సాగకపోతుంటే, వ్యాపార పురోభివృద్ధి కోసం ఒక చిన్న పరిహారం ఉంది. దీపావళి రోజున నిత్యపు నిత్యపూజలు ముగించుకున్న తర్వాత ఒక కొబ్బరికాయను, పదకొండు గురివింద గింజలను ఎర్రని వస్త్రంలో మూటకట్టి, నగదు నిల్వ చేసే పెట్టెలో లేదా బీరువాలో భద్రపరచి, ప్రతిరోజూ దానికి ధూపం సమర్పించండి. 🕉️ సంసార జీవితంలో ఈతిబాధలు ఎదు రవుతున్నా, దంపతుల మధ్య మనస్పర్థలు వస్తున్నా ద్విముఖ రుద్రాక్షను ఏదైనా ఒక సోమవారం ఉదయాన్నే పూజించి, ఎర్రని తాడుతో మెడలో ధరించండి 🕉️జీవి తంలో తరచుగా ఎదురయ్యే ఇక్కట్లు తొలగిపోయి, ప్రశాంతత చేకూరాలంటే దీపావళి రోజున ఇంటి ముంగిట దీపాలు పేర్చడానికి ముందు రావిచెట్టు వద్ద ఆవనూనెతో దీపం వెలిగించి, వెనుదిరిగి చూడకుండా ఇంటికి చేరుకోవాలి. ఆ తర్వాత కాళ్లు కడుక్కొని యథావి ధిగా దీపావళి వేడుకలు జరుపుకోవాలి. 🕉️ తలపెట్టిన పనుల్లో తరచు అనుకోని అవరోధాలు ఎదురవుతున్నట్ల యితే ప్రతిరోజూ గణపతిని ఆరాధించాలి. ఉదయం పూజలో గణపతికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి, గణపతి గాయత్రి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. #తెలుసుకుందాం #జై గణేశా #🕉️ గణపతి బప్పా మోరియా #గణపతి బప్పా మోరియా #గణపతి బప్పా మోరియా
తెలుసుకుందాం - anea anea - ShareChat