
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
@priyadarshi2410
💫అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్💫
We fall in love with people we can't have.👣🖤💔🍀
#yes it's true 💯% #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #😢Sad Feelings💔 #😊ఎమోషనల్ ఫీలింగ్స్ #😥మనసులోని బాధ💔
He took care of you in 2025
He will take care of you in 2026....
जिन जिन्होंने अब तक संभाला आगे भी वही संभालेंगे! क्योंकि 👇🏻
"होई है वहीं जो राम रची राखा "
#🥳హాయ్ 2026 🙌 #❤️హ్యాపీ న్యూ ఇయర్🎉 #💗నా మనస్సు లోని మాట #🙆 Feel Good Status #🦚 హరే కృష్ణ 🦚
We are seeking external solutions to internal problems.
🤷🏻♀️🤷🏻♀️🤷🏻♀️🤷🏻♀️🤷🏻♀️🤷🏻♀️
#yes it's true 💯% #💗నా మనస్సు లోని మాట #🗣️జీవిత సత్యం
Our own little hut is better than the palace of another. 💛💚💛💚💛
#💗నా మనస్సు లోని మాట #🙆 Feel Good Status
MAAGHA PURANAM -- 28
28వ అధ్యాయము
విష్ణువు బ్రహ్మ రుద్రాదులకు చేసిన హితబోధ
పూర్వము బ్రహ్మ, ఈశ్వరులకు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదము జరిగింది. శివుడు నేను సర్వేశ్వరుడను, పధ్నాలుగు లోకములకు అధిపతిని నేనే అన్నాడు. కాదు, బ్రహ్మదేవుడు ఈ పధ్నాలుగు లోకాలను, సమస్త చరాచర జీవరాశినీ, సృష్టించిన సృష్టికర్తను నేను కనక నేనే గొప్ప అన్నాడు. వాదప్రతివాదములు, తర్కమీమాంసలతో వెయ్యేళ్ళు గడిచిపోయాయి. సృష్టి కార్యం అంతా స్తంభించి పోయింది. అప్పుడు శ్రీమహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ, ఈశ్వరులు ఇద్దరూ సమస్త లోకములు ఇమిడి ఉన్న ఆ రూపమును తిలకించి నిశ్చేష్టులైనారు. సప్త సముద్రములు, సమస్త విశ్వము, ప్రకృతి, భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపిస్తున్నాయి. అ విరాట్ రూపుని ఎడమచెవిలో శంకరుడు, కుడిచెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు. ఆ రూపమునకు ఆద్యంతములు లేక సర్వత్రా తానే అయి అనేక వేల బాహువులతో ఉన్నాడు. సమస్త దేవాధిదేవులు, దేవతలు, రాక్షసులు, మునులు అందరు భగవంతుని కీర్తిస్తూ కనపడుతున్నారు.
నదీనదములు, పర్వతములు, కొండలు, గుట్టలు, జలపాతములు సమస్తము కనపడుతున్నాయి. భీషణమైన వేడి నిట్టూర్పులు వెదజల్లబడుతు కోటి సూర్య కాంతుల వెలుగులలో ప్రకాశిస్తున్నాడు. సామాన్యులకు సాక్షాత్కరించని, వీక్షించలేని ప్రకాశముతో ఉన్నాడు. ఆ విరాట్ రూపమునకు మొదలు, చివర ఎక్కడో తెలియడము లేదు. ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు తెలుసుకోవాలని అట్లు తెలుసుకున్న వారే అధికులనీ, బ్రహ్మ, ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు. ఇద్దరు వెంటనే బయలుదేరి వెయ్యేళ్ళు తిరిగి ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక యథాస్థానానికి వచ్చి ఆహా! ఏమి ఇది? బ్రహ్మ, ఈశ్వరులైన మేము ఈ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక పోయాము అంటే మనం అధికులము కాదన్నమాట. సమస్తమునకు మూలాధారము, సృష్టి స్థితి లయ కారకుడు, సర్వాంతర్యామి జగములనేలే జగదాధారుడు శ్రీమహావిష్ణువే మనకంటే అధికుడు. పంచభూతములు, సూర్యచంద్రులు, సర్వము ఆ శ్రీమన్నారాయణుడే. మనమంతా ఆయన కుక్షిలోని కణములమని నిర్ణయించుకుని శ్రీమహావిష్ణువును స్తోత్రం చేయగా విష్ణువు విరాట్ రూపము వదిలి యథారూపమును ధరించి మీరెంతో కాలమునుండి వాదించు కొంటున్న విషయము తెలుసుకొని మీకు జ్ఞానోపదేశం కలుగుటకై ఈ విరాట్ రూపమును ప్రదర్శించాను. నా విరాట్ రూపముయొక్క ఆది మధ్యాంతములను తెలుసుకొనలేక నిశ్చేష్టులై మీ కలహాన్ని ఆపుచేసారు. మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో చెపుతాను వినండి. ఈ సృష్టి సమస్తమునకు మూడు గుణములు నిర్దేశించబడ్డాయి. వీటీనే త్రిగుణములు అంటారు. అవి సత్త్వరజస్తమోగుణములు. మీరు రజస్తమో గుణములు కలిగిన వారు. ఎవరైతే సత్త్వరజస్తమో గుణములు కలిగిఉంటారో వారే గొప్పవారు. ఏకాత్మస్వరూపునికి ఆదిలో మూడు రూపములే ఉన్నాయి. అవి సృష్టిస్థితి లయలు. సృష్టికి బ్రహ్మ, స్థితికి నేను, లయమునకు ఈశ్వరుని అధిపతులుగా చేసాను. వీరిని త్రిమూర్తులు అందురు. త్రిమూర్తులు అనువారు ముగ్గురు కాదు ఏక స్వరూపమే. సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపులము అయినాము. మీరు వేరు, నేను వేరు అనునది లేదు. అంతా ఏకత్వస్వరూపమే. మన ముగ్గురిలో ఎవరికి పూజ చేసినా ఏకాత్మ స్వరూపునికే చెందుతాయి. త్రిమూర్తులమైన మనలో భేదము ఉండదు. రజస్తమో గుణముల ప్రభావముచే మీరిట్లు ప్రవర్తించారు. శాంతము పొంది ప్రవర్తించండి. బ్రహ్మదేవా! నా నాభికమలము నుండి ఉద్భవించావు కదా! నీకును, నాకును భేధము లేదు. ఓ మహేశ్వరా! ఓంకార స్వరూపుడవగు నీ గొప్పతనమును తెలియగోరి నారదుడు ఒకనాడు నీ మహాత్మ్యమును తెలుపమనగా నేను నీయొక్క మహిమను సర్వస్వమును వినిపించాను. నాటినుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకమూలకు విస్తరింప చేసాడు. నువ్వు నిర్వికార నిరాకల్పుడవు. శక్తి స్వరూపుడవు, త్రినేత్రుడవు, సర్వేశ్వరుడవు, ఆదిదేవుడవు, ఆత్మ స్వరూపుడవు నువ్వే. భోళా శంకరుడవైన నువ్వు ఇంత పంతము పట్టదగునా? నేనే నీవు, నీవే నేను అందుకే శివకేశవులని భక్తులు భజించి పూజిస్తారు. నిత్య సత్య స్వరూపుడవు. నిత్యానంద రూపుడవు. నిత్య ధ్యాన స్వరూపుడవు. అర్థనారీశ్వరుడవు. నువ్వు నాతో సమానుడవు” అంటూ బ్రహ్మకు, శివునకు జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేసాడు. మాఘమాసమందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడగు ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తులు ఆవుటయే కాక స్వర్గర్హత పొంది సుఖములను పొందుతారు.
#☸🙏సూర్యనారాయణ స్వామి #🌞శ్రీ సూర్యనారాయణ స్వామి🌞 #🌞 శ్రీ సూర్యనారాయణ స్వామి 🌞 #ఓం శ్రీ సూర్యనారాయణ స్వామి 🙏🏻 # ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ నమో నమః
మానవాళికి ఎక్కు వ లబ్ది చేకూరాలంటే ఏయే చెట్లు నాటాలి.*
స్కంద పురాణంలో ఒక చక్కని శ్లోకం ఉంది.
అశ్వత్థమేకం పిచుమందమేకం
న్యగ్రోధమేకం దశ తిన్త్రిణీకం|
కపిత్థ బిల్వాఁ మలకత్రయాంచ పంచామ్రవాపీ నరకన్ నపశ్యేత్||.
అశ్వత్థ = రావి (100% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది) - 1
పిచుమందా = వేప (80% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది)- 1
న్యగ్రోధ = మర్రి చెట్టు (80% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది) - 1
తింత్రిణి = చింత (80% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది) - 10
కపిత్థ = వెలగ (80% కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది) - 3
బిల్వ = మారేడు (85% కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది) - 3
అమలకా = ఉసిరి (74% కార్బన్ డయాక్సైడ్ గ్రహిస్తుంది) - 3
ఆమ్రాహ్ = మామిడి (70% కార్బండయాక్సైడ్ గ్రహిస్తుంది) - 5
అర్థం
ఈ చెట్లను చెప్పిన సంఖ్యలో నాటి ఒక దిగుడు బావి నిర్మించి సంరక్షించినవారు నరకం చూడవలసిన అవసరం ఉండదు. (ప్రస్తుత కలుషిత వాతావరణం)
ఈ నిజమైన విషయాలను పాటించకపోవడం వల్లే ఈరోజు వాతావరణంలో నరకాన్ని చూస్తున్నాం ఇంకా ఏమీ తప్పులేదు, మన తప్పును మనం సరిదిద్దుకోవచ్చు.
గుల్మోహర్, నీలగిరి లాంటి చెట్లు మన పర్యావరణానికి ప్రాణాంతకం.
పాశ్చాత్య దేశాలను గుడ్డిగా అనుకరించడం వల్ల మనకు మనమే గొప్ప హాని చేసుకున్నాం.
రావి, మోదుగ, వేప వంటి మొక్కలు నాటడం ఆగిపోవడంతో కరువు సమస్య పెరుగుతోంది.
ఈ చెట్లన్నీ వాతావరణంలో ఆక్సిజన్ను పెంచుతాయి.
అలాగే, ఇవి భూమి ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి.
ఈ చెట్లను పూజించే సంప్రదాయాన్ని మూఢ నమ్మకాలుగా భావించి, విదేశీ సంస్కృతి పేరుతో ఈ చెట్లను దూరం చేసుకుని రహదార్లకు ఇరువైపులా గుల్మోహర్, యూకలిప్టస్ (నీలగిరి) చెట్లను నాటడం ప్రారంభించాం. యూకలిప్టస్ త్వరగా పెరుగుతుంది, కానీ ఈ చెట్లు చిత్తడి నేలను ఆరబెట్టడానికి నాటబడతాయి.
ఈ చెట్ల వల్ల భూమిలో నీటి మట్టం తగ్గుతుంది. గత 40 ఏళ్లలో యూకలిప్టస్ చెట్లను విరివిగా నాటడం వల్ల పర్యావరణం దెబ్బతింది.
గ్రంథాలలో, రావి చెట్టుని చెట్లరాజు అని పిలుస్తారు.
మూలే బ్రహ్మ చర్మం విష్ణు శాఖ శంకరమేవచ| పత్రే పత్రే సర్వదేవయం వృక్ష రాజ్ఞో నమోస్తుతే||
భావం: ఏ మూలంలో బ్రహ్మ, కాండములో విష్ణువు, శాఖలలో శంకరుడు, ఆకులలో సర్వ దేవతలు నివసిస్తారో అటువంటి వృక్షరాజం రావికి నమస్కారాలు.
రాబోయే సంవత్సరాల్లో ప్రతి 500 మీటర్లకు ఒక రావి, మర్రి, వేప తదితర చెట్లను నాటితేనే మన భారతదేశం కాలుష్య రహితంగా మారుతుంది.
తులసి మొక్కలను ప్రతి ఇంటిలో నాటాలి.
మన సంఘటిత ప్రయత్నాల ద్వారానే మన భారతదేశాన్ని ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడుకోగలము.
భవిష్యత్తులో మనకు సహజ ప్రాణవాయువు సమృద్ధిగా అందేలా ఈరోజు నుంచే ప్రచారం ప్రారంభించాల్సిన అవసరం ఉంది.
రావి, మఱ్ఱి, మారేడు, వేప, ఉసిరి మరియు మామిడి * మొక్కలు నాటడం ద్వారా రాబోయే తరానికి ఆరోగ్యకరమైన మరియు ప్రకాశవంతమైన పర్యావరణాన్ని అందించడానికి ప్రయత్నిద్దాం.
ఉన్న చెట్లను కాపాడుకోకపోతే.... రేపు కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఇది కూడా వ్యాపారం అవుతుంది.
ప్రతి మనిషి ఒక్క రోజుకు పీల్చుకునే ఆక్సిజన్ 3 ఆక్సిజన్ సిలిండర్లకు సమానం ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ ధర రూ॥ 700/- అయితే 3 సిలిండర్లకు రూ॥ 2100/- అవుతుంది. అంటే,
ప్రతి సంవత్సరం ఆక్సిజన్ను కొంటే ఒక్కో మనిషి రూ 7,66,000/- ఖర్చు అవుతుంది ఒక్క మనిషి యొక్క సగటు వయస్సు 65సంలు అనుకుంటే, ఆక్సిజన్ కొనడానికి దాదాపుగా రూ॥ 5 కోట్లు కావాలి.
కాని అంత విలువ చేసే ఆక్సిజను మనం చెట్ల నుండి ఉచితంగా పొందుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మొక్కలను నాటండి.
#తెలుసుకుందాం #🌴చెట్లు నాటుదాం...పర్యావరణాన్ని కాపాడుదాం🌻🌲 #plant trees🌱 #చెట్లునాటుదాం #చెట్లు నాటుదాం
#🙏హ్యాపీ మహాశివరాత్రి📿 #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏🏻మహాశివరాత్రి శుభాకాంక్షలు🙏🏻📿 #మహాశివరాత్రి శుభాకాంక్షలు #హర హర మహాదేవ 🙏
#మహాశివరాత్రి శుభాకాంక్షలు #🙏🏻మహాశివరాత్రి శుభాకాంక్షలు🙏🏻📿 #🙏ఓం నమః శివాయ🙏ૐ #🛕శివాలయ దర్శనం #🙏హ్యాపీ మహాశివరాత్రి📿
#🙏ఓం నమః శివాయ🙏ૐ #హర హర మహాదేవ 🙏 #అరుణాచల శివ 🙏 #🙏🏻మహాశివరాత్రి శుభాకాంక్షలు🙏🏻📿 #మహాశివరాత్రి శుభాకాంక్షలు
#మహాశివరాత్రి శుభాకాంక్షలు #🙏🏻మహాశివరాత్రి శుభాకాంక్షలు🙏🏻📿 #అరుణాచల శివ 🙏 #హర హర మహాదేవ 🙏 #🙏ఓం నమః శివాయ🙏ૐ












