
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
@priyadarshi2410
💫అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్💫
అరటి పండును పెరుగన్నంతో కలిపి తింటే ఏమవుతుంది.. వామ్మో.. ఎవ్వరికీ తెలియని నిజాలివే..
అరటి పండు అత్యధిక శక్తినిచ్చే పండు. పూర్వ కాలంలో శారీరక శ్రమ చేసేవారు పెరుగన్నంతో కలిపి అరటి పండును తినేవారు.
సాధారణంగా పండ్లను విడిగా తీసుకోవడమే ఉత్తమం.
అరటి పండు, మన నిత్య జీవితంలో సులువుగా లభించే, అత్యంత చవకైన, అత్యధిక శక్తినిచ్చే పండ్లలో ఒకటి.. దీనిలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుది...
అరటి పండు – పోషక విలువలు:-
100 గ్రాముల అరటి పండులో సుమారు 116 క్యాలరీల శక్తి ఉంటుంది. ఇది మామిడి (74 క్యాలరీలు), పనసతొనలు (88 క్యాలరీలు), సపోటా (98 క్యాలరీలు), సీతాఫలం (104 క్యాలరీలు) వంటి ఇతర పండ్లతో పోలిస్తే చాలా ఎక్కువ. దానిమ్మ, ఆపిల్ వంటి పండ్లలో సుమారు 60 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. బొప్పాయి, కర్బూజా వంటివి 15-30 క్యాలరీలు, నారింజ, బత్తాయి వంటివి 45 క్యాలరీలు అందిస్తాయి.
అరటి పండు మృదుత్వం, తేలికైన జీర్ణ శక్తి, ఏడాది పొడవునా లభ్యత, తక్కువ ధర అరటి పండును “చీప్ అండ్ బెస్ట్” పండుగా నిలుపుతాయి.
పెరుగన్నంలో అరటి పండును ఎవరు తినవచ్చు, ఎవరు తినకూడదు?
ఎవరు తినవచ్చు:
బరువు పెరగాలనుకునేవారు, అధిక శక్తి అవసరమైనవారు: హార్డ్ వర్కర్స్, ఎక్కువ బరువు పనులు చేసేవారు తక్కువ సమయంలో ఎక్కువ క్యాలరీలు కావాలనుకుంటే, పెరుగన్నంలో ఒకటి రెండు అరటి పండ్లను కలుపుకోవచ్చు.
ఆరోగ్య సమస్యల నివారణకు: అల్సరేటివ్ కొలైటిస్, లూజ్ మోషన్స్ వంటి సమస్యలతో బాధపడేవారు రెండు మూడు రోజులు కేవలం పెరుగన్నం, అరటి పండు కాంబినేషన్ను రోజుకు రెండు సార్లు తీసుకోవచ్చు.
చిన్న పిల్లలు, వృద్ధులు: కారం తినని పిల్లలకు (మిల్లెట్స్ లేదా రవ్వ అన్నంలో కలిపి), దంతాలు లేని వృద్ధులకు అరటి పండును అన్నంలో కలిపి పెట్టడం సులువుగా జీర్ణమయ్యే, పోషక విలువలున్న ఆహారం.
ఎవరు తినకూడదు/జాగ్రత్త పడాలి:
షుగర్ వ్యాధిగ్రస్తులు: వీరు అరటి పండును పూర్తిగా మానెయ్యాలి. ఒకవేళ తినాలనిపిస్తే, చిన్న సైజు అరటి పండును ఒకటి మాత్రమే తక్కువ మోతాదులో తీసుకోవాలి.
సాధారణ జీవనశైలి గలవారు: ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వంటివారు పెరుగన్నంలో అరటి పండును రోజూ తినడం వల్ల అధిక క్యాలరీలు చేరి బరువు పెరిగే అవకాశం ఉంది. వీరు పండ్లను విడిగా, ఫ్రూట్ డిన్నర్ లో తీసుకోవడం ఉత్తమం.
ముఖ్య సూచన:
సాధ్యమైనంత వరకు, ఉడికించిన ఆహారాలతో (పెరుగన్నం వంటివి) పండ్లను కలపడం మంచిది కాదు.
పండ్లు విడిగా తీసుకున్నప్పుడు వాటి పోషకాలు శరీరానికి సంపూర్ణంగా అందుతాయి.
ఏమైనా అనారోగ్య సమస్యలున్నా.. సందేహాలున్నా.. నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
#తెలుసుకుందాం #🥗బలం & పోషక ఆహరం
కళ్ల కింద డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే క్రీములు మాత్రమే సరిపోవు.. ఇవి కూడా పాటించాలి..!
డార్క్ సర్కిల్స్ తగ్గడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
కళ్ల కింద నల్లటి వలయాలు ముఖాన్ని కాంతిహీనంగా చేస్తాయి. అంతేకాకుండా వయస్సు కంటే ఎక్కువగా కనిపించేలా చేస్తాయి.
ఇవి ఒత్తిడి, నిద్రలేమి, అనారోగ్యం వంటి అనేక కారణాల వల్ల వస్తాయి.
క్రీములు, ప్యాచ్లు, ఇంటి చిట్కాలు ఉపయోగపడినా, జీవనశైలిలో మార్పులు లేకపోతే అవి పూర్తిగా పని చేయవు.
నిద్ర చాలా ముఖ్యం:-
1.డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే రోజూ 7–8 గంటలు నిద్రపోవడం 2.అవసరం. రాత్రి ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉంటే 3.మార్చుకోవాలి. సాధ్యమైనంత వరకు రాత్రి 10 గంటలకల్లా
పడుకోవడం మంచిది.
4.మంచి నిద్ర ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
స్క్రీన్ టైమ్ తగ్గించాలి:-
1.మొబైల్, ల్యాప్టాప్, టీవీ ముందు ఎక్కువసేపు గడపడం వల్ల కూడా కళ్ల కింద నల్లటి వలయాలు వస్తాయి.
2. నిద్రకు కనీసం 2 గంటల ముందు స్క్రీన్ వాడకం తగ్గించాలి. 3.చీకటిలో ఫోన్ చూడటం మానుకోవాలి. కళ్లకు విశ్రాంతి ఇవ్వడానికి 4.దోసకాయ ముక్కలు కళ్లపై పెట్టుకోవచ్చు.
ఆహారాన్ని మెరుగుపరచాలి
పోషకాహార లోపం కూడా డార్క్ సర్కిల్స్కు కారణం కావచ్చు:-
కూరగాయలు, పండ్లు, విత్తనాలు, నట్స్, ధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.
అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి.
తగినంత నీరు తాగాలి:-
డీహైడ్రేషన్ వల్ల కూడా కళ్ల కింద నల్లటి వలయాలు వస్తాయి.
రోజంతా సరిపడా నీరు తాగడం, కొబ్బరి నీరు, నిమ్మరసం, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవడం మంచిది.
చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
అధికంగా మద్యం సేవించడం, ధూమపానం వంటి అలవాట్లు చర్మాన్ని దెబ్బతీస్తాయి. ఇవి డార్క్ సర్కిల్స్కు కూడా కారణం అవుతాయి. కాబట్టి ఈ అలవాట్లను తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం మంచిది.
డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే క్రీములు మాత్రమే సరిపోవు.. సరైన నిద్ర, మంచి ఆహారం, తగినంత నీరు, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా చాలా ముఖ్యం. ఇలా ఉంటేనే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
#తెలుసుకుందాం #👩స్కిన్ కేర్ #skin care tips👩🦰
చాలా మంది ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగుతుంటారు. కానీ, వాటికంటే ముందు..
ఒక గ్లాసు గోరు వెచ్చని నీరు తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
ముఖ్యంగా వేసవి కాలంలో శరీరాన్ని లోపల నుంచి శుభ్రం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు, గోరువెచ్చని నీరు తాగడం వల్ల పేగుల్లో పేరుకుపోయిన వ్యర్థాలు సులభంగా బయటకు వచ్చేస్తాయి.
దీనివల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. వేడి నీరు తాగినప్పుడు శరీర ఉష్ణోగ్రత స్వల్పంగా పెరుగుతుంది, దీనివల్ల చెమట పట్టి చర్మ రంధ్రాల ద్వారా విషతుల్యాలు బయటకు వెళ్తాయి.
1. ఉదయాన్నే వేడి నీరు తాగడం వల్ల శరీరంలోని మెటబాలిజం రేటు పెరుగుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
2. గోరు వెచ్చని నీరు రక్తనాళాలను వ్యాకోచింపజేసి, రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది.
3. క్రమం తప్పకుండా తాగడం వల్ల మొటిమలు తగ్గి, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
4. కేవలం నీటినే కాకుండా, అందులో కొంచెం నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలుపుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
5.నీరు కేవలం గోరు వెచ్చగా మాత్రమే ఉండాలి. మరీ మరిగే నీరు తాగితే నోరు, గొంతు కణజాలం దెబ్బతినే అవకాశం ఉంది.
6.గోరు వెచ్చని నీరు కండరాలకు ఉపశమనాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మహిళల్లో వచ్చే నెలసరి నొప్పుల తీవ్రతను తగ్గించడంలో ఇది సహకరిస్తుంది.
7. ఉదయాన్నే వేడి నీరు తాగడం వల్ల గొంతులో ఉండే ఇన్ఫెక్షన్లు, గొంతు నొప్పి మరియు జలుబు వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇది శ్వాసనాళాల్లోని కఫాన్ని కరిగించడానికి సహాయపడుతుంది.
8. శరీరంలోని విష పదార్థాలు పేరుకుపోవడం వల్ల చర్మం ముడతలు పడుతుంది. గోరు వెచ్చని నీరు ఈ వ్యర్థాలను తొలగించి, చర్మ కణాలను రిపేర్ చేయడం ద్వారా మిమ్మల్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
9. శరీరంలో నీటి శాతం సరైన స్థాయిలో ఉంటే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఉదయాన్నే నీరు తాగడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరిగి, రోజంతా ఏకాగ్రతతో ఉండేందుకు తోడ్పడుతుంది.
10. ఇది జుట్టు కుదుళ్లను ఉత్తేజితం చేస్తుంది. దీనివల్ల జుట్టు మెరుస్తూ, ఆరోగ్యంగా పెరుగుతుంది. జుట్టు పొడిబారడం వంటి సమస్యలు తగ్గుతాయి.
#తెలుసుకుందాం
గుండె ఆరోగ్యం నుంచి చర్మ సౌందర్యం వరకు.. గ్లాసు జ్యూస్తో ఎన్నో లాభాలు
ఎండలు ముదురుతున్నాయి.. శరీరాన్ని చల్లబరుచుకోవడానికి ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సాధారణంగా దాహం వేయగానే అందరూ కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. కానీ, కృత్రిమ పానీయాల కంటే ప్రకృతి సిద్ధంగా లభించే తాజా పండ్ల రసాలు తీసుకోవడం వల్ల అటు ఆరోగ్యం, ఇటు ప్రశాంతత రెండూ లభిస్తాయి.
ఈ పండ్ల రసాలు మిమ్ముల్ని ఉల్లాసంగా ఉంచడమే కాదు, శరీరాన్ని చల్లబరుస్తాయి. వేసవిలో మన శరీరానికి శక్తినిస్తూ, డీహైడ్రేషన్ నుండి కాపాడే ఆ పండ్ల రసాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పుచ్చకాయ రసం:
పుచ్చకాయలో దాదాపు 92% నీరు ఉంటుంది. ఇది శరీరానికి తక్షణమే హైడ్రేషన్ను అందిస్తుంది. ఇందులో ఉండే 'లైకోపీన్' చర్మాన్ని ఎండ దెబ్బ నుండి కాపాడుతుంది. బాడీని చల్లబరచడానికి ఇది బెస్ట్ ఆప్షన్.
2. నిమ్మరసం:
అందరికీ అందుబాటులో ఉండే అతి తక్కువ ఖర్చుతో కూడిన పానీయం. ఇందులోని విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎండ వల్ల కలిగే అలసటను తొలగించి, శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.
3. కర్బూజ రసం:
కర్బూజలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, కళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
4. చెరుకు రసం:
వేసవిలో దొరికే సహజసిద్ధమైన ఎనర్జీ డ్రింక్ ఇది. ఇది కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలోని మలినాలను బయటకు పంపి, డీహైడ్రేషన్ బారిన పడకుండా చూస్తుంది.
5. బేల్ ఫ్రూట్ జ్యూస్:
బేల్ ఫ్రూట్ జ్యూస్.. దీన్నే మారేడు పండు రసం అని కూడా అంటారు. ఇది వేసవి తాపాన్ని తగ్గించి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది.
6. కొబ్బరి నీళ్లు:
ప్రకృతి ప్రసాదించిన అత్యుత్తమ పానీయం ఇది. వేసవిలో శరీరానికి అవసరమైన పొటాషియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని నీటి శాతాన్ని సమతుల్యం చేస్తుంది, తక్షణమే నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది.
7.ద్రాక్ష రసం:
నలుపు లేదా ఆకుపచ్చ ద్రాక్ష రసం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. వేసవిలో వచ్చే నీరసాన్ని తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.
8. దానిమ్మ రసం:
ఇది కేవలం రక్తాన్ని పెంచడానికే కాకుండా, వేసవి తాపం నుండి రక్షణ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. శరీరంలో మంటను తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది
#తెలుసుకుందాం #🍊సీజనల్ ఫ్రూట్స్🍉 #ఫ్రూట్స్ #ఫ్రూట్ జ్యూస్ #🍉🥭🍍🍈పండ్ల రసాలు🍌🍎🍇🥥
తియ్యటి పుచ్చకాయను ఎలా గుర్తించాలో తెలుసా..? కొనే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఎండలు మండిపోతున్నాయి.. ఈ వేసవిలో దాహార్తిని తీర్చుకోవడానికి మనకు గుర్తొచ్చే మొదటి పండు పుచ్చకాయ. అయితే, మార్కెట్లో నిగనిగలాడుతూ కనిపించే ప్రతి పుచ్చకాయ తియ్యగా ఉంటుందని చెప్పలేం. ఇంటికి తెచ్చి కోసిన తర్వాత అది తెల్లగానో లేదా చప్పగానో ఉంటే మన మూడ్ మొత్తం పాడైపోతుంది. కానీ పుచ్చకాయను కోయకుండానే, కేవలం బయటి రూపాన్ని బట్టి అది ఎంత తియ్యగా ఉందో తెలుసుకోవచ్చు.
ఫీల్డ్ స్పాట్: పుచ్చకాయ కొనేటప్పుడు గమనించాల్సిన అతి ముఖ్యమైన గుర్తు దాని మీద ఉండే మచ్చ. ప్రతి పుచ్చకాయ నేల మీద పడుకుని పెరుగుతుంది. నేలకు తగిలే భాగం ఎండ తగలక తెల్లగా లేదా పసుపు రంగులో ఉంటుంది.ఆ మచ్చ ముదురు పసుపు లేదా బంగారు రంగులో ఉంటే అది చెట్టు మీద పూర్తిస్థాయిలో పండిందని, చాలా తియ్యగా ఉంటుందని అర్థం. మచ్చ తెల్లగా ఉంటే అది ఇంకా పచ్చిగా ఉన్నప్పుడే కోసేశారని అర్థం. అలాంటి కాయలు అస్సలు తియ్యగా ఉండవు.
వెబ్బింగ్: పుచ్చకాయ తొక్క పైన అప్పుడప్పుడు గోధుమ రంగులో సాలీడు గూడులాంటి మచ్చలు కనిపిస్తాయి. చాలామంది ఇవి చూసి కాయ పాడైందేమో అనుకుంటారు. కానీ అసలు రహస్యం ఏంటంటే.. ఆ పుచ్చకాయ పువ్వుగా ఉన్నప్పుడు తేనెటీగలు ఎన్ని ఎక్కువ సార్లు పరాగసంపర్కం చేస్తే, ఆ కాయకు అన్ని ఎక్కువ మచ్చలు వస్తాయి. ఈ మచ్చలు ఎక్కువగా ఉన్న కాయలు చాలా తియ్యగా ఉంటాయి
ఆడ పుచ్చకాయలే తియ్యగా: పుచ్చకాయల్లో మగ, ఆడ అని రెండు రకాలు ఉంటాయని మీకు తెలుసా? మగ పుచ్చకాయలు పొడవుగా, కోల ఆకారంలో ఉంటాయి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కానీ తీపి తక్కువ. ఆడ పుచ్చకాయలు గుండ్రంగా, బంతిలా ఉంటాయి. ఇవి చాలా తియ్యగా ఉంటాయి. కాబట్టి తీపి కావాలనుకునే వారు గుండ్రటి కాయలనే ఎంచుకోవాలి.
శబ్దాన్ని బట్టి తీపి: పుచ్చకాయను వేళ్లతో తట్టినప్పుడు వచ్చే శబ్దం దాని లోపలి స్థితిని చెబుతుంది. కాయను కొట్టినప్పుడు డబ్ డబ్ అని డొల్లగా శబ్దం వస్తే అది బాగా పండినట్లు. శబ్దం గట్టిగా లేదా మందంగా వస్తే అది ఇంకా పచ్చిగా ఉందని లేదా లోపల గట్టిగా ఉందని అర్థం. తొక్క నిగనిగలాడుతూ మెరిసిపోతుంటే అది ఇంకా పండలేదని అర్థం. బాగా పండిన కాయ తొక్క కొంచెం డల్గా ఉంటుంది
కాండం - బరువు: పుచ్చకాయ కాండం లేదా తొడిమ పచ్చగా ఉంటే అది పండక ముందే కోసినట్లు. అది పూర్తిగా ఎండిపోయి ఉంటేనే సహజంగా పండినట్లు లెక్క. అదే సైజులో ఉన్న రెండు కాయలను తీసుకుని చూస్తే, ఏది ఎక్కువ బరువుగా ఉందో దాన్నే ఎంచుకోండి. బరువు ఎక్కువగా ఉందంటే అందులో చక్కెర శాతం, రసం నిండుగా ఉన్నాయని అర్థం.
#తెలుసుకుందాం #ఫ్రూట్స్ #ఫ్రూట్స్ #🍊సీజనల్ ఫ్రూట్స్🍉
eight specific foot-related symptoms that may indicate underlying health issues and advises consulting a doctor if these signs appear.
• Warning Signs: Pay attention to cold feet, cracked heels, persistent pain, numbness, burning sensations, slow-healing wounds, discolored toenails, and swelling.
• Potential Causes: These symptoms can be related to conditions like diabetes, poor circulation, thyroid imbalances, vitamin deficiencies, arthritis, or kidney issues.
• Are these symptoms appearing in your feet... Do not ignore them at all!!
• Feet being cold
• Cracked heels
• Persistent foot pain
• Poor blood circulation
• Hypothyroidism
• Anemia
• Diabetes
• Dehydration
• Thyroid imbalance
• Nutritional deficiency (Zinc, Omega-3)
• Arthritis
• Plantar fasciitis
• Stress fracture
• Numbness or tingling
• Burning sensation in feet
• Slow-healing wounds
• Peripheral neuropathy
• Diabetes
• Vitamin B12 deficiency
• Nerve damage
• Diabetes
• Vitamin deficiency
• Infection
• Blood circulation issues
• Sores on skin
• Dark spots or lines under nails
• Blood circulation issues
• Diabetes
• Infection
• Swelling of feet & ankles
• Kidney issues
• Heart-related issues
• Venous insufficiency
• ps: The foot is a vital part of the body.
Feet give early warning signs in identifying health problems.
Experts suggest that if the above 8 signs appear, it is better to consult doctors without any negligence.
#🩺ఆరోగ్య జాగ్రత్తలు #తెలుసుకుందాం
రోజుకో అరటిపండు తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..? ఇవి తప్పక తెలుసుకోండి..
సాధారణంగా ఏ పండగ వచ్చినా, శుభకార్యం జరిగినా మన ఇంట్లో ముందుగా కనిపించేది అరటిపండు. తక్కువ ధరలో దొరికే ఈ పండులో ఉన్న పోషకాలు మాత్రం వెలకట్టలేనివి.
విటమిన్ సి, బి6, ప్రొటీన్, పొటాషియం, మెగ్నీషియం వంటి అద్భుతమైన పోషకాలు నిండిన అరటిపండును ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె, మూత్రపిండాల రక్షణ: మీరు రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారా? అయితే అరటిపండు మీకు సరైన పరిష్కారం. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ప్రాణాంతకమైన గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో ఇది సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎముకల బలం.. రోగనిరోధక శక్తి పెంపు: వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడటం సహజం. అయితే రోజూ ఒక అరటిపండు తింటే మీ ఎముకలు ఎక్కువ కాలం బలంగా ఉంటాయి. దీనిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. తరచూ జబ్బుపడే వారు అరటిపండును డైట్లో చేర్చుకోవడం ఉత్తమం.
జీర్ణక్రియకు ప్రాణవాయువు: అరటిపండులో పీచుపదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను శుభ్రం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మీరు మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతుంటే, ప్రతిరోజూ ఒక అరటిపండు తినడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడి, కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మెదడు పనితీరు: అరటిపండు కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్ బి6 మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్ల మధ్య కమ్యూనికేషన్ను మెరుగుపరుస్తుంది. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక స్థితి మెరుగుపడుతుంది. డిప్రెషన్ నుంచి బయటపడాలనుకునే వారికి అరటిపండు ఒక సహజ సిద్ధమైన ఔషధం.
సహజమైన మెరుపు: కాంతివంతమైన చర్మం కోసం ఖరీదైన క్రీములు అవసరం లేదు, రోజూ ఒక అరటిపండు చాలు. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. ఫలితంగా వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉండి, చర్మం సహజ సిద్ధమైన కాంతితో మెరుస్తుంది.
అరటిపండులో చక్కెర పరిమాణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.
#తెలుసుకుందాం #🩺ఆరోగ్య జాగ్రత్తలు #eat healthy, stay healthy... #eat healthy #EAT HEALTHY AND BE HEALTHY
రోజుకు ఎంత వంట నూనె వాడాలి, ఏది మంచిది- పరిమితి మించితే..!!
వంటల్లో నూనె తప్పనిసరి. వంటకు నూనె ఎంత ముఖ్యమూ... ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలోనూ వంట నూనె కీలకమైనది.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో వంట నూనె వినియోగం..
పరిమితి చాలా ముఖ్యం. ఎక్కువ నూనె వాడటం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి.. గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నూనెను పదే పదే వేడి చేయడం లేదా అధికంగా వాడటం గుండెకు హానికరం.
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకు సుమారు 25 నుండి 30 మిల్లీలీటర్ల (సుమారు 2 టేబుల్ స్పూన్లు) నూనె మాత్రమే తీసుకోవాలి.
వారానికి మొత్తం 150 నుండి 170 మిల్లీ లీటర్ల నూనె సరిపోతుంది. ఈ పరిమాణంలో వంట నూనెతో పాటు వేయించిన ఆహారం, బేకరీ పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్లో ఉండే నూనె కూడా లెక్కలోకి వస్తుంది.
అధికంగా నూనె తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది దీనివల్ల గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. అలాగే ఊబకాయ సమస్య తలెత్తడంతో పాటూ అధిక రక్తపోటు, మధుమేహ ప్రమాదం పెరుగుతుంది.
వంట నూనె వినియోగం లో కొన్ని జాగ్రత్తలు అవసరం. ఆలివ్ నూనె, వేరుశెనగ నూనె, నువ్వుల నూనె, చియా సీడ్ ఆయిల్, అవోకాడో ఆయిల్ వంటివి వినియోగిస్తే మంచిదని సూచిస్తున్నారు.
నాన్ స్టిక్ లేదా ఇనుప పాత్రలు వాడితే తక్కువ నూనె సరిపోతుంది. నూనెను చెంచాతో కొలిచి వాడాలి. వేయించిన ఆహారం, జంక్ ఫుడ్ తగ్గించాలి. తక్కువ నూనె వాడటం, సరైన నూనె ఎంపిక చేయడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడుకోవచ్చు.
#తెలుసుకుందాం #🩺ఆరోగ్య జాగ్రత్తలు












