
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
@priyadarshi2410
💫అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్💫
We fall in love with people we can't have.👣🖤💔🍀
#yes it's true 💯% #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #😢Sad Feelings💔 #😊ఎమోషనల్ ఫీలింగ్స్ #😥మనసులోని బాధ💔
He took care of you in 2025
He will take care of you in 2026....
जिन जिन्होंने अब तक संभाला आगे भी वही संभालेंगे! क्योंकि 👇🏻
"होई है वहीं जो राम रची राखा "
#🥳హాయ్ 2026 🙌 #❤️హ్యాపీ న్యూ ఇయర్🎉 #💗నా మనస్సు లోని మాట #🙆 Feel Good Status #🦚 హరే కృష్ణ 🦚
మంగళ సూత్రము.........!!
మన హిందూ సోదరీమణుల దౌర్భాగ్య పరిస్థితి ఏమిటంటే.. నవీనత పరాకాష్టకి వెళ్లి మంగళసూత్రమును త్యజించడం లేదా పక్కన పెట్టడం పరిపాటిగా మారింది. అంతేకాక ఈ సినిమాలు, టీవీల పుణ్యమా అని అది ఒక ఆట వస్తువుగా మారిపోయింది.
మన ఖర్మ కొద్దీ మన బంధు మిత్ర గణాల నుండి వచ్చే వాట్సాప్ లు ఫేస్బుక్ లలో వచ్చే ఫోటోలు కూడా ఎక్కువ శాతం మంగళ సూత్రాలు, బొట్టు, గాజులు లేకుండా ఉన్నవే. ఇది చాలా అరిష్టం..
క్షీరసాగర మధన సందర్భంలో మాంగళ్య వివరణ...
“మ్రింగెడివాడు విభుండని మ్రింగెడిదియు
గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనే సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!
పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవి గా ఉన్నడంటే అది ఆయన గొప్ప కాదట.., అమ్మ పార్వతీ దేవి కంఠాన ఉన్న మాంగల్యాభరణం గొప్పదనమట.
“మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా!
కంఠే భద్నామి సుభగే
త్వం జీవ శరదాంశతం”
ఓ సుభగా! నా జీవనానికి ఆధారమైన ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్ళు జీవించు, అంటే పుణ్యస్త్రీ గా, ముత్తయిదువు గా సకల సౌభాగ్యాలతో జీవించు అని స్పష్టముగా తెలుస్తున్నది..
పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు ఎటువంటి ఆచారాలు, కట్టుబాట్లు ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి..
భారతావనిలో పిండారీలు, థగ్గులు వంటి కిరాత జాతుల వారు వలస వచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొని పోయేవారు. మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచి పెట్టేవారు. కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని గౌరవించారు. అలా కోట్లాది మగువల మాన ప్రాణాలను కాపాడిందీ మంగళసూత్రం. అందుకే అప్పటి నుండీ ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్ళి చేసి మాంగల్యం వేసేవారు.
ఆదిశంకరాచార్యుల వారు వ్రాసిన సౌందర్య లహరి పుస్తకములో కూడా మంగళ సూత్రానికి విశేష విశిష్టత కల్పించారు.
మంగళసూత్రంలో ముత్యం, పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది, ఎందుకంటే.
ముత్యం చంద్ర గ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు, అన్యోన్య దాంపత్యములకు కారకుడు, శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంథులు, సిరలు, ధమనులు, స్తనములు, స్త్రీల గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భధారణ, ప్రసవములకు కారకుడు..
పగడం కుజ గ్రహనికి ప్రతీక. కుజ గ్రహ దోషాల వలన అతికోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్ధ్యము, రోగము, ఋణపీడలు,అగ్ని, విద్యుత్భయములు, పర దూషణ, కామవాంఛలు, దీర్ఘ సౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు మరియు శారీరకంగా ఉదరము, రక్తస్రావము, గర్భస్రావము, ఋతు దోషములు మొదలగునవి.
ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27. ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారం గావించి 28 వ రోజున కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతు సమయం. అంటే అర్ధం..., ఆరోగ్యమైన స్త్రీకి 28 వ రోజులకు ఋతు దర్శనమవాలి.
భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళ సూత్రములో ముత్యం మించిన విలువైనది లేనే లేదు., దానికి తోడు జాతి పగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది.. అదేమిటంటే ముత్యం, పగడం ధరించిన పాత తరం స్త్రీలలో ఆపరేషన్ అనేది చాలా అరుదైన విషయం. కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్తోనే జరగటం సర్వ సాధారణమై పోయింది.
ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీ కేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగా, భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయనటంలో ఎటువంటి సందేహం వలదు.
కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం, పగడం రెండూ కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభ ఫలితాలు సమకూర్చగలవు.
పాశ్చాత్య అనుకరణ వెర్రిలో ఊగుతున్న మన ఆడ కూతుర్లను మందలించైనా తిరిగి మన ధర్మం వైపు తీసుకుని వద్దాం.. దీని విశిష్టతని అర్ధం అయ్యే వరకు తెలియపరచండి.
సనాతన హిందూ ధర్మాన్ని గౌరవించండి పాటించండి.
#తెలుసుకుందాం #🌾మన సప్రదాయాలు🌾 #హిందూసాంప్రదాయాలు #మనసాంస్కృతిసంప్రదాయాలు #😃మంచి మాటలు
శ్వాస - పంచప్రాణాలు..............!!
శ్వాస రూపంలో మనం తీసుకున్న వాయువు నాసికా రంధ్రాల గుండా ప్రవేశించగానే ఐదు భాగాలుగా విడిపోయి
1. ప్రాణము 2. అపానము 3. వ్యానము 4. ఉదానము 5. సమానము అను ఐదు ప్రాణములుగా మారిపోతుంది.
1.ప్రాణము:- అనంతాకాశంలో నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోనికి తీసుకొని వాయువు.
2. అపాన వాయువు:- బయటికి వస్తున్న వాయువును అపాన వాయువు అని అంటారు. ఈ వాయు సహాయంతోనే మల మూత్ర విసర్జనలే కాక శరీరంలోని సమస్య మాలిన్యాలను బయటకు నెట్టబడుతున్నాయి.
3. వ్యాన వాయువు:- మన శరీరానికి మానవాకృతి నివ్వడానికి సహకరించే వాయువు. ఈ వాయువు యొక్క దోషం వల్ల అంగవైకల్యం, మానసిక ఎదుగుదల లోపం, శారీరక ఎదుగుదల లోపం (మరుగుజ్జుతనం) ప్రాప్తించును.
4. ఉదాన వాయువు:- దీని సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాము. దీని లోపం వల్ల నత్తి, నంగి, ముద్ద మాటలు, బొంగురు గొంతు సమస్యలు కలుగును.
5. సమాన వాయువు:- దీని సహాయంతోనే మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి ఏ ఏ భాగానికి ఎంతెంత శక్తి పంపిణీ చేయాలో అంతంత పంపి సమతుల్యాన్ని కలుగజేస్తుంది. దీని లోపం వల్ల శరీరం తూలి పడటం సంభవించును.
శ్వాస - చక్రాలు..........
ఈ శ్వాస ప్రతిరోజు ఉదయము సరిగ్గా 6 గంటలకు మొదలై
➡️ మూలాధార చక్రము నందు - 600 సార్లు
➡️ స్వాధిష్ఠాన చక్రము నందు - 6000 సార్లు
➡️ మణిపూరక చక్రము నందు - 6000సార్లు
➡️ అనాహత చక్రము నందు - 6000 సార్లు
➡️ విశుద్ధి చక్రము నందు - 1000 సార్లు
➡️ ఆజ్ఞా చక్రము నందు - 1000 సార్లు
➡️ సహస్రారము నందు - 1000 సార్లు
అనగా, రోజుకు 21600 సార్లు పయనిస్తోంది.
శ్వాస - అంగుళాలు........
సాధారణంగా శ్వాసను సాధకుడు 12 అంగుళాలు వదులుతాడు. శ్వాసను ఎవరైతే లోతుగా - నిదానంగా - దీర్ఘంగా తీసుకొని దానిపై దృష్టి ఉంచి విడవటం చేస్తుంటే శ్వాస యొక్క అంగుళాలు తగ్గును.
➡️ శ్వాసను 11 అంగుళాలకు కుదిస్తే - ప్రాణం స్థిరమవుతుంది.
➡️ శ్వాసను 10 అంగుళాలకు కుదిస్తే - మహాకవి అవుతాడు.
➡️ శ్వాసను 9 అంగుళాలకు కుదిస్తే - బ్రహ్మానందం కలుగుతుంది.
➡️ శ్వాసను 8 అంగుళాలకు కుదిస్తే - దూరదృష్టి కలుగును.
➡️ శ్వాసను 6 అంగుళాలకు కుదిస్తే - ఆకాశగమనం చేయగలుగుతాడు.
➡️ శ్వాసను 4 అంగుళాలకు కుదిస్తే - సర్వ సిద్ధులు ప్రాప్తిస్తాయి.
➡️ శ్వాసను 2 అంగుళాలకు కుదిస్తే - కావలసిన రూపం ధరించిగలుగుతాడు.
➡️ శ్వాసను 1 అంగుళానికి కుదిస్తే - అదృశ్యం అవ్వగలరు.
మరింత సాధన చేయగా శ్వాస అవసరమే వారికి ఉండదు. అలాంటి వారు అమరులు అవుతారు.
శ్వాస - సృష్టి వయస్సు.........
మనము రోజుకు తీసుకునే శ్వాసలను (21600) రెట్టింపు చేసి ఒక సున్నను చేర్చిన
➡️ కలియుగం - 4,32,000 సంవత్సరాలు.
➡️ రెట్టింపు చేసిన ద్వాపర యుగం - 8,64,000 సంవత్సరాలు.
➡️ మూడు రెట్లు చేసిన త్రేతా యుగము- 12,96,000 సంవత్సరాలు.
➡️ నాలుగు రెట్లు చేసిన కృత యుగము - 17,28,000 సంవత్సరాలు.
➡️ పది రెట్లు చేసిన చతుర్ యుగము ( కలి+ద్వాపర+త్రేతా+ కృతయుగములు) - 43,20,000 సంవత్సరాలు.
శ్వాస - సాధన.........
సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చొని, మృదువుగా కళ్లుమూసుకుని, మన నాశికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన శ్వాస తిరిగి అదే నాశికా రంధ్రాల ద్వారా బయటకు వెళ్లడాన్ని గమనిస్తుండాలి. ఇలా చేయగా, చేయగా మనస్సు యొక్క పరుగు క్రమేపీ తగ్గి క్రమక్రమంగా ఆగిపోతుంది. అప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన విశ్వమయప్రాణశక్తి లభ్యమౌతుంది.
మరి ఇంతటి శక్తివంతమైన శ్వాసకు సంబంధించిన సాధన చేసుకునేందుకు మనము ఏ హిమాలయాలకు, ఏ అరణ్యాలకు వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటూ, ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉంటూ, మనం చేసే పనులు ఏవి మానుకోకుండానే, ఖాళీగా ఉన్న సమయంలో ఈ అద్భుత సాధన సులువుగా చేసుకోవచ్చు. దీనిని చిన్న పిల్లల(5 సం"ల)నుండి ముసలివారి దాకా ఎవరైనా చేయవచ్చును.
84 లక్షల జన్మల తరువాత లభ్యమైన ఈ మానవ జీవితమును వృధా చేయకుండా, వివేకవంతులముగా దీనిని సద్వినియోగపరచుకోగలరు.
#తెలుసుకుందాం
గర్భిణీ స్త్రీల ఆహార నియమావళి.. మాతృమూర్తులగు స్త్రీల కొరకు........!!
లలితా సహస్ర నామం నందు వరుసగా 98 వ శ్లోకం నుండి 110 వ శ్లోకం వరకు ఎటువంటి ఆహరం తీసుకోవాలో చక్కగా తెలపబడింది. వాటిని ఓసారి పరిశీలిద్దాం.
విశుద్ధి చక్రనిలయా, రక్తవర్ణా, త్రిలోచనా
ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా 98
పాయసాన్నప్రియా, త్వక్స్థా, పశులోక భయంకరీ
అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ 99
అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా
దంష్ట్రోజ్జ్వలా,உక్షమాలాధిధరా, రుధిర సంస్థితా 100
కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా
మహావీరేంద్ర వరదా, రాకిన్యంబా స్వరూపిణీ 101
మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా
వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా 102
రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా
సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ 103
స్వాధిష్ఠానాంబు జగతా, చతుర్వక్త్ర మనోహరా
శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,உతిగర్వితా 104
మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా
దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ 105
మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రా,உస్థిసంస్థితా
అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా 106
ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ
ఆఙ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా 107
మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా
హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ 108
సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా
సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ 109
సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ
స్వాహా, స్వధా,உమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా 110
పై శ్లోకాలను అదే వరుసక్రమంలో పరిశీలిస్తే మాతృమూర్తులగు గర్భిణీ స్త్రీల ఆహార నియమావళి అవగతమౌతుంది.
మొదటినెల.........
విశుద్ధి చక్రంలో శ్రీ లలితా పరాదేవతయే డాకినీ దేవతగా కొలువై వుంది. ఈ దేవత ఎర్రని ఛాయతో త్రినేత్రాలు కలిగి వుంటుంది. ఈమె ఖట్వాంగాన్ని, ఖడ్గాన్ని, త్రిశూలాన్ని ఆయుధాలుగా ధరించి, మొదటినెలలో గర్బస్థ శిశువునకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా పిండవృద్ధి జరిగేలా సంరక్షిస్తుంది. ఈమె త్వక్ స్థ. ఈమె చర్మమనే ధాతువునకు అధిదేవత. ఏ విధమైన చర్మరోగాలు సోకకుండా తేజోవంతమైన చర్మాన్ని శిశువునకు అనుగ్రహిస్తుంది. ఈమెకు పాయసాన్నం ప్రీతి. బియ్యంను పాలల్లో ఉడికించి, బెల్లం జోడించి, తదుపరి ఆవునెయ్యిని కలిపిన పాయసాన్నప్రసాదమును లలితా సహస్ర నామ పారాయణం చేసిన పిమ్మట నివేదనను చేసి, దానిని పవిత్రభావనతో గర్భిణీ స్త్రీ మొదటినెలలో స్వీకరిస్తే, చక్కగా పిండాభివృద్ధి జరుగుతుంది.
రెండవ నెల.......
అనాహత చక్రంలో శ్రీ లలితా పరాదేవత రాకిని దేవతగా కొలువై వుంది. ఈమె శ్యామ వర్ణంలో రెండు ముఖాలతో, అక్షమాల, శూలం, డమరుకం, చక్రాలను ధరించి యుంటుంది. ఈమె రుధిర సంస్థిత. రక్తం అనే ధాతువుకు అధిదేవత. ఈమెకు స్నిగ్ధానం అంటే నేతి అన్నం ప్రీతి. ఆవునెయ్యితో కలిపిన అన్నప్రసాదంను భక్తిశ్రద్ధలతో లలితా పారాయణం చేసిన పిమ్మట అమ్మవారికి నివేదన చేసి, సద్భావనతో గర్భిణీ స్త్రీ రెండవనెలలో స్వీకరిస్తే, శిశువు చక్కగా రక్తపుష్టితో వృద్ధి చెందుతుంది.
మూడవ నెల........
మణిపూర చక్రంలో శ్రీ లలితా పరాదేవత లాకిని దేవతగా కొలువై వుంది. ఈమె రక్తవర్ణంలో మూడు శిరస్సులతో వజ్రం, శక్తి, దండం, అభయముద్రలను ధరించి యుంటుంది. ఈమె మాంస నిష్ఠ. మాంసం అనే ధాతువునకు అధిదేవత. ఈమెకు గుడాన్నం అంటే బెల్లపు పొంగలి ప్రీతి. అన్నం, బెల్లం, ఆవునెయ్యిలతో తయారుచేసిన పొంగలి ప్రసాదంను లలితా పారాయణమనంతరం అమ్మవారికి నివేదన చేసి, భక్తితో గర్భిణీ స్త్రీ మూడవనెలలో స్వీకరిస్తే, శిశువు దేహంలో మాంసవృద్ధి గావిస్తుంది.
నాల్గవ నెల........
స్వాదిష్టాన చక్రంలో శ్రీ లలితా పరాదేవత కాకిని దేవతగా కొలువై వుంది. ఈమె బంగారు ఛాయలో నాలుగు ముఖాలతో, శూలం, పాశం, కపాలం, అభయముద్రలు ధరించి యుంటుంది. ఈమె మేధో నిష్ఠ. మేధ అనే ధాతువుకు అధిదేవత. ఈమెకు దద్ధ్యన్నం అంటే పెరుగన్నం ప్రీతి. అన్నంలో ఆవుపాల పెరుగుతో కలిపిన ప్రసాదంను లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి ప్రీతిగా నివేదన చేసి, సద్భావనతో గర్భిణీ స్త్రీ నాల్గవ నెలలో స్వీకరిస్తే, శిశువునకు మేధావృద్ధి కలుగుతుంది.
ఐదవ నెల.......
మూలాధార చక్రంలో శ్రీ లలితా పరాదేవత సాకిని దేవతగా కొలువై వుంది. ఈమె ఐదు ముఖాలతో, అంకుశం, కమలం, పుస్తకం, జ్ఞానముద్రలను కలిగి యుంటుంది. ఈమె ఆస్థి సంస్థిత. ఎముకలు అనే ధాతువునకు అధిదేవత. ఈమెకు ముద్గౌదన అంటే కట్టుపొంగలి ప్రీతి. పెసరపప్పు, మిరియాలు, జీలకర్ర, ఆవునెయ్యితో కలిపిన అన్నప్రసాదాన్ని లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి నివేదన చేసి, భక్తితో గర్భిణీ స్త్రీ ఐదవ నెలలో స్వీకరిస్తే, శిశువునకు దృఢమైన ఎముకలు వృద్ధి చెందుతాయి.
ఆరవ నెల.......
ఆజ్ఞా చక్రంలో శ్రీ లలితా పరాదేవత హాకిని దేవతగా కొలువై యుంటుంది. ఈమె శుక్రవర్ణంలో ఆరు ముఖాలుతో శోభిల్లుతుంది. ఈమె మజ్జా సంస్థ. మజ్జ అంటే ఎముకల లోపలున్న గుజ్జు. ఈమె మజ్జా దాతువునకు అధిదేవత. ఈమెకు హరిద్రాన్నం అంటే పులిహారం ప్రీతి. ఈ పులిహార ప్రసాదంను లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి నివేదన చేసి, భక్తి విశ్వాసంలతో గర్భిణీ స్త్రీ ఆరవనెలలో స్వీకరిస్తే, శిశువు ఎముకలలో మజ్జాధాతువు వృద్ధి చెంది పరిపుష్టి పొందుతుంది.
ఏడవ నెల.......
సహస్రార చక్రంలో శ్రీ లలితా పరాదేవత యాకిని దేవతగా కొలువై యుంటుంది. ఈమె సర్వ వర్ణాలతో, సర్వాయుధాలను ధరించి యుంటుంది. ఈమె శుక్ల సంస్థిత. జీవశక్తికి అధిష్టాన దేవత. ఈమెకు సర్వోదన అంటే పాయసాన్నం, నేతి అన్నం, గుడాన్నం, దద్ధ్యన్నం, కట్టుపొంగలిహరిద్రాన్న ప్రసాదంలు ప్రీతి. ఈ ప్రసాదాలను వరుసక్రమంలో ఆరురోజులు లలితా పారాయణమనంతరం అమ్మవారికి నివేదన చేసి, సద్భావనతో అమ్మను స్మరిస్తూ గర్భిణీ స్త్రీ ఏడవ నెలలో స్వీకరిస్తే, శిశువు సంపూర్ణమైన దేహాకృతిని దాల్చి, పరిపూర్ణంగా వృద్ధి చెందుతుంది.
అమ్మ కామాక్షమ్మ తల్లి ఒకటే..
కామాక్షి అమ్మవారి దర్శనం శుభ ఫలితాలు ఇస్తాయి. శుక్రవారం అమ్మకు,గోత్ర నామాలతో అర్చన,మంచి ఫలితాలు ఇస్తాయి
ఇక ఎనిమిదో నెల నుండి శిశు జననం వరకు...
సంపూర్ణ భక్తి విశ్వాసాలతో శ్రీ లలితా అమ్మవారిని ఆరాధిస్తూ, క్షీరాన్నాన్ని నివేదన చేస్తూ, స్వీకరిస్తే,చక్కటి ఆయురారోగ్యాలతో ప్రజ్ఞావంతులైన తేజోమయ సంతానం కలగడం తధ్యం.
#తెలుసుకుందాం #😃మంచి మాటలు #మనసాంస్కృతిసంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾
ధ్యానం..ఒక..ప్రయాణం..............!!
నీలో నాలో మనలో ఈ విశ్వమంతా నిండి ఉన్న ఆత్మస్వరూపమే పరమాత్మ.ఈ సృష్టిని నడిపించే అనంతమైన శక్తి ఆ పరమాత్మ. ఆసత్యాన్ని అవగతం చేసుకొని ఆయనను చేరుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గమే ధ్యానం. ఆ ధ్యానం"యోగ" లో
భాగం.
ధ్యానం అంటే ఎవరి మనసులోకి వారు చేసే ప్రయాణం. ఆప్రయాణం ఎందుకో, ఎలాచేయాలో తెలుసుకున్నవారు మానసికంగానూ శారీరకంగాను ధృఢంగా ఉండగలరు.
అతి చిన్న విత్తనం నుంచే అంత పెద్ద మర్రిచెట్టు పుట్టిందన్న సత్యం అందరికీ తెలిసిందే. అయితే అది ఎలా పుట్టిందో తెలుసుకోవాలంటే మనం ప్రయాణం చేయాలి. ఆప్రయాణం ఎక్కడికో కాదు, మన(సు)లోకే..అలా ప్రయాణం చేయడానికి కావలసింది ఏకాగ్రత, నమ్మకం, ఆత్మవిశ్వాసం. ఆమూడూ కావాలంటే ధ్యానం చేయడమే సరైనమార్గం.
ధ్యానానికి, యోగినికి సాక్షాత్తూ ఆపరమశివుడే ఆది పురుషుడు. ఆది పరాశక్తి నుంచి త్రిమూర్తుల వరకు, మహర్షుల నుంచి మహాయోగుల వరకు, ప్రతి ఒక్కరూ ధ్యానం(తపస్సు)లో తరించినవారే. మనమందరం ధ్యానించేది ఆ దేవుళ్ళనే కదా, మరి ఆదేవుళ్ళు ధ్యానించేది ఎవరిని అన్న సందేహం కలగటం సహజం. నిజమే మరి! దేవతలకన్నా బలమైన మహత్తరమైన మహాశక్తి మరోటి ఉంది.ఆశక్తే మనస్సు. మనస్సు బలంగా ఉన్నప్పుడే ఏపనైనా చేయగలం.
ప్రపంచ గమనం వేగంగా మారింది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఏ పనీ సంపూర్తిగా, ఏకాగ్రతతో చేయలేని పరిస్థితి. ఏదో సాధించాలనే తపన,ఎక్కడికో వెళ్ళలన్న హడావుడి, ఏదో చేసేయాలన్న ఆత్రుత, తలపెట్టినపని సవ్యంగా జరుగుతుందో లేదోనన్న ఆంధోళన..ఫలితంగా రక్తపోటు, మధుమేహం, కీళ్ళనొప్పులు, వాతం వంటి రుగ్మతలు కమ్ముకొస్తాయి.
దానికి తోడు నిర్వేదం, నిరాశ, మానసిక ఒత్తిడి ముప్పెట దాడిచేసి మనిషిని మరింతగా కుంగదీస్తాయి. ఈదౌర్భల్యం మనస్సును అంటకుండా ఉండడానికే యోగులు, ఋషులు ధ్యానం చేసేవారు. ఈసత్యాన్ని తెలుసుకున్న ఆధునికులు కూడ ఇప్పుడు యోగ, ధ్యానం చేయడం అలవరచుకున్నారు.
ప్రతీరోజూ క్రమం తప్పకుండా యోగా సాధన చేసేవారు శరీరాన్నేకాదు, మనస్సును కూడ అదుపులోకి తెచ్చుకోగలుగుతారు. యోగా సాధనవల్ల ఏకాగ్రత ఏర్పడుతుంది, చేసే పనిపై ఇష్టం ఆసక్తి పెరుగుతాయి, శరీరం బరువు తగ్గి చురుకుదనం ఏర్పడుతుంది. శారీరక రుగ్మతలు ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం, కీళ్ళనొప్పుల వంటివి దరిచేరవు. వైద్యశాస్త్రానికి కూడ అంతు పట్టని కొన్ని సమస్యలకు యోగా, ధ్యానం పరిష్కారం చూపుతున్నాయి.
మనం ఏపని చేయాలన్నా మనస్సు సహకరించనిదే చేయలేము. మనస్సును అదుపు చెయ్యడానికి, మనస్సును జయించడానికి ముఖ్యమైన సాధనం ధ్యానం.
నీరు ఏపాత్రలో వుంచితే ఆపాత్ర ఆకారం పొందుతుంది. మనస్సుకూడ ఏవస్తువుపై లగ్నమైతే ఆవస్తువు స్వరూపాన్ని సంతరించుకుంటుంది. దివ్యత్వాన్ని ధ్యానించే మనస్సు నిర్విరామ భక్తిభావంతో దానినే ధారణ చేస్తుంది.
అంతరాయం లేని విద్యుత్ సరఫరాతో విద్యుద్దీపంలో తీగ వెలిగినట్లే, ధ్యానంతో యోగి మనసు తేజోమయం అవుతుంది. ధ్యానకేంద్రమైన విశ్వాత్మలో యోగి దేహం, శ్వాస ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం సమీకకతమై విలీనమవుతాయి. అప్పుడే అనిర్వచనీయమైన చైతన్యానుభూతిని ఆస్వాదిస్తాడు.
ధ్యానస్తితిలో ధ్యానం చేయడం, ధ్యానం చేసే వ్యక్తి, ధ్యాన వస్తువు వుంటాయి. ధ్యానంలో కొంత ప్రగతి సాధించాక ధ్యానం చేస్తున్నాను అనే భావనపోతుంది.ధ్యాన వస్తువు, ధ్యానంచేసే వ్యక్తి మిగులుతారు. ధ్యానం తీవ్రమైన కొద్దీ ధ్యానవస్తువు కూడా లయమైపోతుంది. ధ్యానం చేసేవ్యక్తి మాత్రమే మిగులుతాడు.నేను ధ్యానం చేస్తున్నాను అనేది పోతే తప్ప సమాధిస్థితి ఉచ్ఛస్థితికి చేరదు.
ఆ అహంకారం "నేను" గా చివరి వరకూ వుంటుంది. ఎవరికైతే "నేను" కూడా లయమైపోతుందో, అప్పుడు కేవలం ఆత్మ మాత్రమే స్వయం ప్రకాశంగా మిగులుతుంది. అదే నిజమైన సమాధి, కైవల్యం.
ఓం తత్ సత్..!!
#తెలుసుకుందాం #ధ్యానం #☀Do Dhyanam #dhyanam #ధ్యానం
నవగోప్యాలు - గుప్త విషయాలు..........!!
*ఆయువు,*
*విత్తము,*
*ఇంటిగుట్టు,*
*మంత్రం,*
*ఔషధం,*
*సంగమం,*
*దానం,*
*మానము,*
*అవమానం*
అనే ఈ తొమ్మి దింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచాల్సినవి.
భగవంతుడు మనిషితో పాటు జీవులన్నిటికీ శరీరం ఇచ్చినప్పటికీ ‘వివేకము’ అనే గొప్ప గుణం మనిషికి ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు.
రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు. జరిగేది జరగకమానదు అని వివేకంతో ఆలోచిస్తాడు కాబట్టి మనిషి నిబ్బరంగా ఉండగలుగుతున్నాడు. నిజంగా ఒక వ్యక్తి ఆయుః ప్రమాణం ఇదీ అని తెలిసినా, నిబ్బరంగా ఉండి, దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై అతనిని బాధిస్తుంది. కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుష్షుది ప్రధాన పాత్ర. అది తెలిసినా గోప్యంగా ఉంచమన్నాడు శాస్త్రకారుడు.
ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. దానివల్లఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎంత ధనం ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ఉన్నపుడు మనకు నష్టం జరుగదు. ‘లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు బంగా రంబు మ్రింగబోడు’ అన్నట్లు నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే. ‘అతి సంచయేచ్ఛ తగదు’ అన్న నీతి చంద్రిక వాక్యం ధనం విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం.
అయినా మన దగ్గర ఉన్నవిషయం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం. ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం. అతడు నలుగురికీ అన్న. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. ధర్మకార్యాలకు ధనం వినియోగించకపోతే పన్నుల మూలకంగా రాజు (ప్రభుత్వం) దాన్ని స్వాధీన పరచుకోవడమో, అగ్ని ప్రమాదాలవల్ల నష్టమో, దొంగలు దోచుకోవడమో జరుగుతుంది.
ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. దాన్నే ‘ఇంటిగుట్టు’ అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమపూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. వాటిలో రహస్యాలను బహిరంగం చేయాలనుకోవడం తెలివితక్కువ పని.
సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం- ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు.
మననం చేసేది మంత్రం- మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చెయ్యడం మన సంప్రదాయం. మంత్ర వైశిష్ట్యం తెలిసినవారికి చెప్పడంవల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కాని అపాత్రునికి చెప్పడంవల్ల నష్టమని భావన. దానిమీద భక్తిలేని వాడికి చెబితే అది అభాసుపాలవుతుంది. మంత్రంపై అచంచల నమ్మకం ఉండాలి.
ప్రపంచంలో ప్రతి మొక్క ఔషధమే. ఇవాళ భయంకర రసాయనాలను ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఇవి అందరికి బహిరంగ పరిస్తే ఎవ్వరంటేవారు తయారుచేస్తారు. ఔషధం రహస్యంగా ఉంచడం మంచిదే.
సంగమం అంటే కలయిక. మనం కొన్ని రహస్యమైన భేటీలు జరుపుతాం. అవి అధికారిక, అనధికారమైనవి ఏవైనా కావచ్చు. రహస్యంగా ఉంచడం ఉత్తమం. అలాగే గొప్పవారు అనుకునే వారి జీవితాల్లో ఎన్నో రహస్యలున్న సమావేశాలు ఉంటుంటాయి. అవి బహిర్గతమైనపుడు వారి వ్యక్తిత్వాలపై మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే సంగమం రహస్యంగా ఉంచడం మంచిది.
దానం అన్నింటిలో చాలా గొప్పది. అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదు. మనం చేసిన దానం రహస్యంగా ఉంచితే వెంటనే ఫలం ఇస్తుంది.
మానం అంటే గౌరవం. దాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. ఏమీ చేతగాకున్నా నేనింతవాణ్ణి అంతవాణ్ణి అని చెప్పకూడదు. మనం గౌరవాన్ని ఎంత రహస్యంగా ఉంచితే అంత పెరుగుతుంది.
అలాగే తనకు జరిగిన అవమానం మరిచిపోవాలి. అవ మానాలను అస్తమానం మననం చేస్తే క్రోధం పెరుగు తుంది. దాంతో పగ.. ప్రతీకారాలు.. ఇక వాటికి అంతనేది ఉండదు. ప్రపంచంలో ఉన్న ముళ్ళను మొత్తం మనం తొలగించలేం కానీ మన చెప్పులు వేసుకొని వెళ్ళడం సులభం.
ఈ తొమ్మిది రహస్యలను కాపాడుకోవడం విజ్ఞుల లక్షణం అని పెద్దలు చెప్పిన జ్ఞానబోధ....
స్వస్థి...
సర్వేజనా సుఖినోభవంతు
#తెలుసుకుందాం #😃మంచి మాటలు
ఆంజనేయ స్వామి పాదాల విశిష్టత
ఆంజనేయ స్వామి పాదాలు అత్యంత పవిత్రమైనవి. శక్తివంతమైనవి.మరియు రక్షణ కవచాలుగా పరిగణించబడతాయి.హనుమంతునిపాదసేవ సకల కష్టాలను తొలగిస్తుందని ముఖ్యంగాశనిదోషాలు,భయాలు మరియు ఆపదల నుండి రక్షిస్తుందని భక్తుల నమ్మకము.హనుమంతునిపాదాలను ఆశ్రయించటం ద్వారా మనిషి భక్తి ,ధైర్యం.మరియుబలాన్ని పొందుతాడని ప్రతీతి
రక్షా కవచం
ఆంజనేయస్వామి పాదాలు భక్తులను ప్రతికూలశక్తులనుండి రక్షించే కవచంగా భావిస్తారు
శనిదోష నివారణ
శని భగవానుడు ఆంజనేయుని పాదాలను పట్టుకుని శరణుకోరినందున ,స్వామిపాదాలను పూజిస్తే శనిప్రభావం తగ్గుతుందని పురాణాలు చెబుతున్నాయి.
భక్తి మరియు సమర్పణ
హనుమంతుని పాదాలను భక్తితో నమస్కరించడం అంటే మనఅహంకారాన్ని స్వామికి వమర్పించడమే.
పంచముఖఆంజనేయుడు
ఆంజనేయుడు పాతాళంలో మహీ రావణుడినిసంహరించడానికి హనుమంతుడు పంచముఖరూపందాల్చినప్పుడు ఆయన పాదాలు శత్రువులను సంహరించే శక్తిగా వర్ణించబడ్డాయి.
#తెలుసుకుందాం #jai hanuman #🚩🌺జై హనుమాన్🌺🚩 #🙏జై శ్రీ రామ్ శ్రీ ఆంజనేయ 🙏🏹 #🚩 జై భబజరంగబలి🙏
"శివుడు భస్మ ధారి‘"
భస్మము అంటే 'భ "అంటే భత్సార్ణము అంటే నాశనము చేయడము". స్మ "అంటే పాపములను నశింపచేసి భగవంతుడిని జ్ణాపకము చేసేదని అర్ధము,భస్మము అంటే పాపాలను భస్మం చేసేదని చెప్తారు,జీవితంలోని అనిత్యాన్ని "భ "-భస్మం గుర్తు చేస్తూనే వుంటుంది.భస్మమే పరమశివుని స్వరూపమని, దానిని ఉపయెాగించడము వల్లదుఃఖాలు,పాపాలు నశిస్తాయి.
త్రినేత్రుడికి భస్మం అంటే చాలా యిష్టం.అందుచేతనేశివయ్యకు అలంకారంగా పరి గణించబడుతుంది. అధ్యాత్మికంగా చూస్తే భస్మం అనేది సృష్టి యెుక్క అంతిమ సత్యాన్ని తెలియ చేస్తుంది. ఈ విశ్వంలో ఏదైనా సరే అది ఎంత గొప్పదైనా అందమైనదైనా,చివరికి మిగిలేది బూడిద మాత్రమే
శివుడు స్మశాన వాసి.ప్రళయంతరువాత సమస్తం నశించి పోయిమిగిలిన శుద్ధ మైన పదార్ధమే బూడిద.శివుడు దీనిని ధరించడంద్వారా ఈ భౌతిక దేహంసంపద, పేరుప్రతిష్టలు అన్నీ తాత్కాలికమేతుది సత్యం అశాశ్వతమైనది శాశ్వతమైనది కేవలం ఆత్మ మాత్రమే.
ఈ భస్మం వైరాగ్యానికి సంకేతము
.మనముదేనినిపట్టుకోకూడదు దేనికి అతుక్కు పోకూడదు అని శివుడు తన రూపము ద్వారా బోధిస్తున్నాడు.అంతే కాక భస్మానికి ఔషధ గుణాలు వున్నాయి.శివుడు ఎప్పుడూ కఠినతపస్సులో వుంటాడు ఆయన ధరించే విభూతి ఆయన శరీరాన్ని బాహ్య శక్తుల నుండి ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రత నుండి రక్షిస్తుంది.
ఈభస్మం కేవలం బూడిద కాదు. అది అగ్నిలో సంపూర్ణంగా దహనము చేయబడిన పదార్ధముఅంటేఅదికల్మషాలను అహం కారాన్ని పూర్తిగా తగుల బెట్టి పవిత్రతను మాత్రమే మిగుల్చుతుందని అర్ధం
శివుడుభస్మమును ధరించటము అంటే ఆయన సమస్త కల్మషాలకు అతీతుడు అని ఆయన పవిత్రతకు నిలువెత్తు నిదర్శనము అని మనము గ్రహించాలి. యిది కేవలము ఆచారంగా కాకుండా జీవితంలో విముక్తిని శుద్ధిని కోరుకునే వారికి ఒకగొప్ప మాార్గ దర్శకం
భస్మం దుష్టత్వాన్ని పాపాలను భస్మం చేసి పవిత్రతను ,దివ్యత్వాన్ని. సూచిస్తుంది. శివుడు భస్మధారిగా, కైలాసంలో యెాగిగా సకల ప్రాణులను కాపాడే పరమేశ్వరుడు శివుడు.
#తెలుసుకుందాం #హర హర మహాదేవ శంభో శంకర #🕉️హర హర మహాదేవ 🔱 #హర హర మహాదేవ 🙏 #hara hara mahadeva
మానవదేహంలో మూలాధారచక్రం గణపతితో దాని సంబంధం
యెాగ శాస్త్రంలో షట్ చకరా లలో మూలాధార చక్రం ప్రధానమైనది, అస లు మూలాధారము అంటే ఏమిటి మానవుని దేహం పంచభూతాత్మక మైనది. ఈ పంచభూతాలలో మూలాధార చక్రం భూమి స్థానం కల్గి వుంటుంది వెన్ను పూసచిట్ట చివరి మల ద్వారానికి ఒక అంగుళం పైన మూత్రకోశానికి ఒకఅంగుళం క్రింద మూలాధారము వుంటుంది. మూలాధార చక్రమునకు గణపతి అధి దేవుడు. అక్కడఅతడు ఎర్రని రంగుతో తేజో వంతమైన స్వరూపముకల్గి వుంటాడు.
మూలాధార చక్రం నాలుగు దళములు కల్గిన కమలం లాంటిది అందులోనే కేంద్రమందు ఒక సూక్ష్మ మైన లింగమును,తేజో లింగమును,కుండలిని మూడున్నర సార్లు చుట్టుకొని వుంటుంది. కేవలంభక్తి శ్రద్ధ లతో యెాగ ముద్రలో గణపతి మంత్రం జపిస్తే అతడిని ఆ నాలుగుదళాల కమలంలో మధ్య స్థిరునిగా ధ్యానిస్తే అంటే ప్రాణాయామం చేసిన వారికి ప్రధమంగా గణపతి దర్శనము కల్గి క్రమంగా యెాగానుభూతిని పొందుతారు
విఘ్నములను తొలగించు వాడు వినాయకుడు.
విఘ్నం అంటే మన అజ్ణానం అంటే కొన్ని కాలమాన పరిస్థితులలో విఘ్నాన్ని తప్పించుకో లేము.మన తెలివితేటలు, మనకున్న సంపద వాటినుండి తప్పించుకోలేము.విఘ్నేశ్వరుడు పృధ్వీ తత్త్వంలో కుండలినీ శక్తికి అధిపతిగా వుంటాడు మూలాధార చక్రఅధిష్టాన దేవత సిద్ధ విద్యా దేవి సాకిణీ రూపములో వుంటుంది
#తెలుసుకుందాం #జై గణేశా.. జై జై గణేశా #🙏జై గణేశాయ నమః🙏 #🕉️జై గణేశ జై జై గణేష🔱🙏 #🙏జై గణేష మహారాజ్ కి జై 🙏












