
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
@priyadarshi2410
💫అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్💫
We fall in love with people we can't have.👣🖤💔🍀
#yes it's true 💯% #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #😢Sad Feelings💔 #😊ఎమోషనల్ ఫీలింగ్స్ #😥మనసులోని బాధ💔
He took care of you in 2025
He will take care of you in 2026....
जिन जिन्होंने अब तक संभाला आगे भी वही संभालेंगे! क्योंकि 👇🏻
"होई है वहीं जो राम रची राखा "
#🥳హాయ్ 2026 🙌 #❤️హ్యాపీ న్యూ ఇయర్🎉 #💗నా మనస్సు లోని మాట #🙆 Feel Good Status #🦚 హరే కృష్ణ 🦚
ఎక్కడ ఏ గొడవ జరిగినా,
ఏ ప్రాణం పోయినా,
అక్కడ వెతికేది న్యాయం కాదు..
"అవకాశం"!
ఒకడు దాన్ని కులంతో ముడిపెట్టి రాజకీయం చేస్తాడు..
మరొకడు పార్టీ రంగు పులిమి పబ్బం గడుపుకుంటాడు..
ఇంకొకడు డబ్బు కోణం వెతికి సెటిల్మెంట్ చేస్తాడు.
నిజం అనేది ఈ స్వార్థపరుల మధ్య నలిగిపోయే
ఒక #అనాథ.
సాటి మనిషి బాధ కంటే, ఆ బాధను
తమ అజెండా కోసం ఎలా వాడుకోవాలనే
కుటిల బుద్ధి రాజ్యమేలుతోంది.
నిజం తెలిసినా నిలదీయలేని అసమర్థత ఒకవైపు..
అబద్ధాన్ని రంగులద్ది అమ్మే నేర్పు ఇంకోవైపు.
మన వ్యవస్థలో నైతికత చచ్చిపోయింది,
కేవలం స్వార్థం మాత్రమే బతికి ఉంది!🥹
#yes it's true 💯% #💗నా మనస్సు లోని మాట #sad reality 💔 #నేటి ప్రపంచం 😠 #నేటి ప్రపంచంలో జరుగుతుంది ఇదే...😇
#తెలుసుకుందాం #🌾మన సప్రదాయాలు🌾 #హిందూసాంప్రదాయాలు #మనసాంస్కృతిసంప్రదాయాలు
*మార్చి నెలలో స్కూళ్లకు సెలవుల వివరాలు:*
ఆంధ్రప్రదేశ్లో మార్చి నెలలో పండుగలు మరియు వారాంతపు సెలవులు కలిపి మొత్తం *11* రోజులు పాఠశాలలకు సెలవులు రానున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
పండుగ సెలవులు:
మార్చి *3:* హోలీ
మార్చి *19:* ఉగాది
మార్చి *20:* రంజాన్
మార్చి *27:* శ్రీరామ నవమి
మార్చి *31:* మహావీర్ జయంతి
వారాంతపు సెలవులు:
మార్చి *14:* రెండవ శనివారం
వీటితో పాటు ఐదు ఆదివారాలు కూడా సెలవు దినాలుగా ఉన్నాయి…
#తెలుసుకుందాం #holidays
కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
.
కమలాక్షు నందు లగ్నము
నమితముగా జేయు బుద్ధి యది బుద్ధి సుమీ
నమరుల గొలిచెడి వితరణ
మమరముగా జేయు కీర్తి యది కీర్తి సుమీ
#🦚కృష్ణం వందే జగద్గురుమ్🦚 #హరే కృష్ణా🙏 #🚩కృష్ణం -వందే జగద్గురుమ్🙏 #🦚 హరే కృష్ణ 🦚 #హరే కృష్ణ
“ఈరోజుల్లో చాలామందికి ఒక అనుమానం - మేము బాగా పూజలు చేస్తాము మాకే ఎందుకు ఈ కష్టాలు?మాకే ఈ అనారోగ్యం వచ్చింది అని!"
అనారోగ్యం తెచ్చుకునే ఆహారపు అలవాట్లు గుర్తు ఉండదు, అయిన కర్మను భరించడానికి శక్తిని కోరు
కోవాలి అది వదిలించుకునే దానికే పుట్టాము అని గుర్తు ఉంచుకోవాలి.
మన తల్లిదండ్రులు, భాగస్వామీ మన పిల్లలు పరిసరాలు ఇవన్నీ చూస్తే మనము ఎలాంటి కర్మ చేసుకుని పుట్టి ఉంటామో ఎవరూ చెప్పకుండా అర్థం అయిపోతుంది.
ఎంత కష్టంలో కూడా మళ్లీ తప్పు చేయకుండా ఉంచమని కోరాలి, మళ్ళీ పాప కర్మలు చేయకుండా ఉంచినందుకు భగవంతుడుకి కృతజ్ఞతతో నమస్కారం చేయాలి.
కష్టాన్ని దాటించే నావలాగ భగవంతుడుని తోడు కోరాలి కానీ కష్టమే రాకూడదు అంటే నువ్వు అంత పుణ్యం చేసి ఉంటే నీకు జన్మ అనేది ఉండదు. పుట్టావు భూమి పైన అంటే అది ఋణం తీర్చుకోవడానికి.
దేవుడైనాసరే కర్మ భూమిలో పుట్టి కష్టాలు తప్పించు కోలేదు...
దాటలేని కష్టం అంటూ ఏది లేదు. మనము పటించుకుంటే కష్టం. దానిగురించి ఆలోచించడం మానేసి చేయాల్సిన కర్తవ్యం చేసుకుంటూ పోవాలి, అనుభవించే కొద్దీ ఆస్తులే కాదు కష్టాలు కూడా కరిగిపోతాయి.
మనమందరం ఎన్నో కష్టాలు చెప్పుకుంటూ ఉంటాము...
గయ్యాళి భార్య నువ్వు చేసుకున్న కర్మ, బాధ్యత లేని భర్త నువ్వు చేసిన కర్మ యొక్క ఫలితం, బిడ్డలు మీరు చేసిన ఋణాలు, దానాలకు ఫలితం! తల్లిదండ్రులు నువ్వు చేసిన ఆధ్యాత్మిక ధర్మ కార్యాలకు ఫలితం, వృత్తి వ్యాపారం స్నేహం ఇవన్నీ మీకున్న భూత దయకు రుణబంధాలు.
కనుక నువ్వు ఎవ్వరినీ నిందించడానికి అవకాశం లేదు, ఎందుకంటే కోపంతో ఒక మాట అయితే అందరూ అంటాము నా కర్మ కొద్దీ దొరికావు అని అది నిజం! మన పుణ్య పాప కర్మలు మనల్ని బాధించి కర్మనుండి ఆ పాపం నుండి విముక్తి కలిగిస్తుంది.
మన పాపాల రూపం వీళ్ళ రూపంలో ఉంది మన పుణ్యం వీరి రూపంలో ఉంది.
అని వాళ్ళను భరించే శక్తిని భగవంతుడుని కోరుకుని, నిత్యం నామ జపంతో కొత్తగా ఏ పాప కర్మలు చేయకుండా జీవితాన్ని ఉన్నంతలో ఉన్నతంగా జీవించాలి,
చేతనైన సహాయం చేయాలి, ఒకరికి సహాయం చేయక పోయినా ఒకరికి ద్రోహం చేయకూడదు. ఒకరి గురించి మంచి చెప్పక పోయినా చెడు ప్రచారం చేయకూడదు.
అసూయ, అహంకారం చాలా ప్రమాదం అవి మనకు బద్ద శత్రువులు వాటిని వదిలేయడం మంచిది.
ఒకడు కుబేరుడుగా భోగాలు అనుభవిస్తున్నాడు అంటే అది వారి గత జన్మ ఉపాసన పుణ్య ఫలితం. దేనికైనా ఫలితం ఉంటుంది, అది పొందాల్సిందే! అయితే మనము
ఏది మూటకట్టుకుంటామో అదే మనకు మిగులుతుంది
#తెలుసుకుందాం
శ్రీవారి సుప్రభాత సమయం, క్రమం మీకు
తెలుసా........!!
ఓం నమో వెంకటేశాయ నమః..!!
ప్రతి రోజూ బ్రాహ్మీ ముహూర్తం (2.30 నుండి 3.00) గంటల మధ్యలో శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది.
ఆ సమయంలోనే 'సన్నిథిగొల్ల' దివిటీ పట్టుకుని ఉత్తర మాడవీధిలో ఉంటున్న వైఖాసన అర్చకస్వామి ఇంటికి వెళ్తారు.
వారు కూడా స్నానసంధ్యాది అనుష్ఠానాలన్నీ పూర్తిచేసుకుని సన్నిథిగొల్ల రాకకోసం ఎదురు చూస్తుంటారు.
సన్నిథిగొల్ల శ్రీవారి ఆలయానికి విచ్చేయమని ఆయన్ను స్వాగతిస్తారు.
అప్పుడు అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవడానికి ఉపయోగపడే 'కుంచెకోల' అనే సాధనాన్ని తాళం చెవులను తీసుకుని శ్రీవారిని స్మరిస్తూ సన్నిథిగొల్లని అనుసరిస్తూ మహాద్వారం వద్దకు చేరుకుంటారు.
అర్చకస్వాములు మహాద్వారం వద్దకు రాగానే 'నగారా' మండపంలోని నౌబత్ ఖానా (పెద్ద పలకగంట)ని హెచ్చరికగా మోగిస్తారు.
ఆ ఘంటారావం తర్వాతే ముఖద్వారాన్ని తెరుస్తారు.
సన్నిథిగొల్ల వెంట నడుస్తున్న అర్చకులు ప్రధాన ద్వార దేవతా గణానికి మంత్రపూర్వక ప్రణామాలర్పిస్తూ ఆలయం లోపలికి ప్రవేశిస్తారు.
తమ వద్ద ఉన్న 'కుంచెకోల'ను, తాళం చెవుల్ని ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకిస్తారు.
వారు క్షేత్ర పాలకులకు, ధ్వజస్తంభానికి నమస్కరించి, ప్రదక్షిణం చేసి వెండివాకిలి దాటి,
బంగారు వాకిలి ముందు శ్రీవారిని స్మరిస్తూ నిలుచుంటారు.
సన్నిథిగొల్ల అర్చకులను అక్కడే వదిలి శ్రీవారి సన్నిధి వీధిలోని బేడి ఆంజనేయస్వామి గుడి వద్దనున్న పెద్ద జియ్యంగార్ మఠానికి వెళ్తారు.
ఆసమయానికి జియ్యంగారు కానీ వారి పరిచారకుల్లో ఎవరైనా ఏకాంగి కానీ సిద్ధంగా ఉంటారు కాబట్టి వారిని తోడ్కొని సన్నిథిగొల్ల ఆలయానికి వెళ్తారు.
సరిగ్గా ఆ సమయానికి ఆలయ అధికారి పేష్కారు, శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేదపండితులు అందరూ బంగారు వాకిలిముందు సిద్ధంగా ఉంటారు.
తాళ్ళపాక అన్నమయ్య వంశం వారిలో ఒకరు తంబూరతో స్వామివారికి మేలుకొలుపు సంకీర్తన పాడడానికి సిద్ధంగా ఉంటారు.
సుప్రభాత సేవ కోసం రుసుం చెల్లించిన భక్తుల్ని అప్పుడు బంగారు వాకిలి వద్దకు అనుమతిస్తారు. పైన పేర్కొన్న వారందరి ముందు అర్చకులు తమ దగ్గరున్న తాళం చెవితో గడియకు వేసిన తాళాన్ని తీస్తారు.
సన్నిథిగొల్ల పేష్కారు వద్దనున్న సీలువేసిన చిన్న సంచిలో ఉన్న తాళం చెవులతో, సీలువేసి ఉన్న మూడు పెద్ద తాళాలను తీస్తారు.
తీసే సమయంలో అక్కడున్న అందరికీ చూపించడం ఆనవాయితీ.
తాళాలు తీసిన తర్వాత సన్నిథిగొల్ల బంగారు వాకిలి తెరచుకొని దివిటీతో లోనికి ప్రవేశిస్తారు.
ఆ తర్వాతే అర్చకులు మధురస్వరంలో
"కౌసల్యా సుప్రజా రామా ...'' అంటూ సుప్రభాతం అందుకొంటూ లోనికి ప్రవేశిస్తారు.
ఆ తర్వాత మహంతు, మఠం వారు తెచ్చిన 'పాలు, చక్కర, వెన్న, తాంబూలం' ఉన్న పళ్లెరాన్ని ఏకాంగి అందుకుని లోనికి తీసుకొని వెళ్తారు.
వారటు లోనికి వెళ్ళగానే బంగారు వాకిలిని దగ్గరకు వేస్తారు.
బంగారు వాకిలి ముందునున్న వేదపండితులు అర్చకులు సుప్రభాత గీతాలాపనాను కొనసాగిస్తారు.
సుప్రభాతంలో స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం పూర్తయిన తరువాత అన్నమయ్య వంశీయులు భూపాలరాగంలో ఒక మేలుకొలుపు కీర్తన గానం చేస్తారు.
సన్నిథిగొల్ల వద్దనున్న దివిటీ వెలుగులో అర్చకులందరూ రాములవారి మందిరానికి వేసిన తలుపు తాళాలను తీసి శయన మండపంలో పానుపుపై ఉన్న భోగ శ్రీనివాసమూర్తికి ప్రదక్షిణంగా సన్నిధికి చేరుకుంటారు.
దివిటీతో ముందుగా లోపలికి వెళ్ళిన సన్నిథిగొల్ల 'కులశేఖర పడి' వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్యమంగళమూర్తిని తొలి దర్శనం చేసుకుంటారు.
ఆ తరువాత అర్చకులు, ఏకాంగి 'కులశేఖరపడి' దాటి లోపలికి ప్రవేశిస్తారు.
తరువాత సన్నిధిలోని దీపాలను వెలిగిస్తారు. అర్చకులు శ్రీవారికి పాద నమస్కారం చేస్తారు.
తరువాత శయన మండపంలో బంగారుపట్టు పరుపుపై పవళించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్లు చరుస్తారు.
ఆ విధంగా ఆయన్ని మేల్కొనవలసినదిగా ప్రార్థిస్తారు.
ఆపైన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థానంలో ... మూల మూర్తి సన్నిధిలో వేంచేపు చేస్తారు.
ఆనంద నిలయంలో కులశేఖరపడి వద్దనున్న తెరవేసి అర్చకులు శ్రీవారికి దంతధావన,
ఆచమనాది అనుష్ఠాన క్రియలను సమర్పిస్తారు.
మహంతు మఠం వారు తెచ్చిన నవనీతం, పాలు, చక్కెరలను నివేదన చేసి,
స్వామివారికి సుగంధ తాంబూలాన్ని సమర్పిస్తారు.
బంగారు వాకిలి ముంగిట్లో వేదపండితులు (సుప్రభాతం) మంగళా శాసనాన్ని ముగిస్తూ ఉండగా, లోపల అర్చకులు శ్రీవారికి నవనీత హారతి ఇస్తుంటారు.
'నవనీత హారతి' అంటే నివేదనాంతరం ఇచ్చే
కర్పూర హారతిని నవనీత హారతి అని పిలుస్తారు.
ఆ సమయంలోనే బంగారు వాకిళ్ళు తెరుస్తారు.
అపుడు శ్రీవారి పాదాలపై తులసీదళాలు,
పుష్పాలు కూడా ఉండవు.
భక్తులకు ఆపాదమస్తకం స్వామి దివ్యమంగళ విగ్రహ దర్శనం లభిస్తుంది.
అందుకే ఈ దర్శనాన్ని 'విశ్వరూప సందర్శనం'
అని భక్తితో పిలుస్తారు.
ఈ హారతి తరువాత అర్చకులు గత రాత్రి బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చించడం కోసం మూల సన్నిధిలో ఉంచిన బ్రహ్మతీర్థాన్ని, చందనాన్ని, శఠారిని తాము ముందుగా స్వీకరించి ఆ తరువాత జియ్యంగారికి, ఎకాంగికి ఇస్తారు.
సన్నిథిగొల్లకు కూడా తీర్థం, శఠారితో పాటు నివేదన పళ్ళెంలోని తాంబూలాన్ని అర్చకులు అందజేస్తారు.
దీని తరువాత జియ్యంగారు, ఏకాంగి, సన్నిథిగొల్ల బంగారు వాకిలి వెలుపలకు వస్తారు.
దేవస్థానం పరిచారికలు లోపలికి వెళ్ళి శ్రీవారి పాన్పును, మంచాన్ని బయటగల 'సబేరా' గదిలోకి తీసుకు వెళ్తారు.
సుప్రభాతం పఠించిన వేదపండితులు, అన్నమాచార్య వంశీయులు, మహంతు, మైసూరు సంస్థానం తరపు వారు ఇంకా స్వామి వారి కైంకర్యంలో పాల్గొన్న స్థానీయులు స్వామి వారి సన్నిధికి వెళ్ళి హారతి, తీర్థం, చందనం, శఠారి మర్యాదలు పొందుతారు.
వీరందరికీ శ్రీవారికి నివేదించిన చందనం, వెన్న ప్రసాదంగా ఇస్తారు.
ఆ తరువాత ఆలయాధికారులు,
సర్కారు (దేవస్థానం) వారి హారతి జరిపి
తీర్థచందన నవనీత ప్రసాదం స్వీకరిస్తారు.
స్వామివారి సుప్రభాత సేవకోసం భక్తులు వరుసగా స్వామివారి సన్నిధికి వెళ్ళి ఆ దివ్యమంగళ మూర్తిని దర్శించి తీర్థం, శఠారులను స్వీకరిస్తారు.
సర్వే జనా సుఖినోభవంతు..!!
#తెలుసుకుందాం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #TTD తిరుపతి తిరుమల #తిరుమల తిరుపతి దేవస్థానం
ముప్పై మూడు కోట్ల దేవతలు............!!
ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే..
33 రకాల దేవతా సమూహములు.
ముప్పైమూడు కోట్ల దేవతలు అంటే..
సంస్కృతంలో కోటి అంటే విభాగం అని అర్ధం.
మొత్తం ముప్పైమూడు రకాలయిన దేవతలు
అని అర్ధం వస్తుంది.
వైశ్వదేవ శాస్త్రము యొక్క దేవతా సంఖ్యను తెలిపే నివిత్తు అనే మంత్రముతో ఎంత సంఖ్య గల దేవతలు ఏర్పడుతున్నారో అంతమంది దేవతలున్నారు.
ఆ మంత్రము ద్వారా 303 దేవతలు,
3003 దేవతలు కలిసి మొత్తం 3306 మంది దేవతలు.
కాని 33 మంది దేవతల యొక్క విభూతులే
ఆ మొత్తం దేవతలందరూ.
వారే ఆరుగురు దేవతలుగాను,
ముగ్గురు దేవతలుగాను,
ఇద్దరు దేవతలుగాను,
ఒకటిన్నర దేవత గాను
చివరగా ఒక్క దేవతగాను అయ్యారు.
అష్ట వసువులు,
ఏకాదశ రుద్రులు,
ద్వాదశ ఆదిత్యులు,
ఇంద్రుడు మరియు బ్రహ్మ (ప్రజాపతి) కలిపి
మొత్తం ముప్పైమూడు మంది దేవతలు.
అష్ట వసువులు:
అగ్ని,
పృథివి,
వాయువు,
అంతరిక్షము,
ఆదిత్యుడు,
ద్యులోకము,
చంద్రుడు,
నక్షత్రాలు
అనే ఈ ఎనిమిదిలోనూ సర్వమూ ఉంచబడింది.
అందుచే వారికి వసువులని పేరు.
(భూమిపై గల సమస్త పదార్ధములకు రంగు రుచి
వాసన గుణము ఆకారము (అస్థిత్వము) కల్పిస్తూ ప్రకాశించేవాళ్ళు వసువులు. భూమి యందలి ఏ రూపమైనా వసువులు లేకుండా ఏర్పడదు.)
ఏకాదశ రుద్రులు :
ఏకాదశ రుద్రులంటే పురుషునిలో ఉండే పంచప్రాణములు,
మనస్సు, జీవాత్మ కలిపి ఒకటి,
పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు
మొత్తం పదకొండు రుద్రులు.
ఆత్మయే పదకొండవ రుద్రుడు.
ఈ ఆత్మ మర్త్య శరీరాన్ని వదలనని,
విడిచి వెళ్ళనని చెప్పడం మానవునికి
దుఃఖ హేతువు.
ఆ రకంగా ఏడ్పించడం వల్లనే “రోదయంతి రుద్రః” – రుద్రులు అని పేరు వచ్చింది.
(ఆకాశంలో ఏర్పడే స్పందనలన్నీ రుద్రులు సృష్టించేవే. పంచభూతాత్మకమైన ప్రకృతిలో ఉండే మార్పులన్నీ వీరు సృష్టించే స్పందనలే కాబట్టి ప్రాణుల జీవనం వీరి దయపై ఆధారపడి ఉంది. మనలోని పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను, మనస్సును శాసించేది ఈ రుద్రులే.)
ద్వాదశ ఆదిత్యులు :
సంవత్సరము యొక్క పన్నెండు మాసాలు..
పన్నెండు ఆదిత్య దేవతలు.
ఒక్కొక్క మాసంలో సూర్యకిరణాలు ఒక్కొక్క గుణాన్ని కలిగి ఉంటాయి.
ఆ పన్నెండు ఆదిత్యులు వేరు వేరు గా ఉంటారు.
ఆయా మాసములందు పరివర్తన చెందుతూ ప్రాణుల ఆయుస్సును కర్మఫలమును హరించుచుండడం చేత “ఆదదానః” ఆదిత్యులు అని పిలవబడుతున్నారు.
ఇంద్రప్రజాపతులు :
స్తనయిత్నువు అనేవాడే (మబ్బులు లేదా ఉరుములు) ఇంద్రుడు;
యజ్ఞమే ప్రజాపతి.
స్తనయిత్నువు అంటే వజ్రాయుధమే.
యజ్ఞమంటే యజ్ఞపశువే.
ఆరుగురు దేవతలు:
అగ్ని,
భూమి,
వాయువు,
అంతరిక్షము,
సూర్యుడు,
ద్యులోకము
అనే ఆరు ఆరుగురు దేవతలు.
ఇంతకు ముందు చెప్పిన ముప్పయి ముగ్గురు దేవతలు ఈ ఆరుగురే అవుతున్నారు.
ముగ్గురు దేవతలు:
భూమి,
సూర్యుడు,
ద్యులోకము
అనే ఈ మూడు లోకాలు ముగ్గురు దేవతలు.
సర్వ దేవతలు (ఆరుగురు దేవతలు) ఈ ముగ్గురిలో అంతర్భావాన్ని కలిగి ఉన్నారు.
ఇద్దరు దేవతలు:
అన్నము,
ప్రాణము
అనేవి రెండూ పూర్వోక్తమైన ఇద్దరు దేవతలు.
సగము అధికముగా గల దేవత:
వాయువే ఒకటిన్నర దేవత.
వాయువే అధ్యర్ధము అన్నారు.
ఒకటి వాయువు ఒక దేవత.
వాయువు చేతనే సమస్తము అభివృద్ధి చెందుతోంది, అంతే కాకుండా చరాచర ప్రాణికోటికి ఆధారము వాయువే కాబట్టి ఇంకొక అర్ధ భాగం గా పేర్కోని వాయువును ఒకటిన్నర దేవతగా వర్ణించేరు.
ఒకే ఒక్క దేవత :
ప్రాణమే ఒక్క దేవత:
సర్వ దేవతలు ఒక్క ప్రాణం లోనే ఉన్నారు.
అందువల్ల ప్రాణమే సర్వ దేవాత్మకమైన బ్రహ్మము గా అభివర్ణించేరు.
“జ్యేష్ట శ్రేష్ట ప్రజాపతి” అని నామాన్ని పొందిన
ప్రాణమే సర్వ దేవతా స్వరూపము.
ముప్పయి మూడు (3306) దేవతల యొక్క రూపమే
ఈ ప్రాణ దేవత.
అందుచేత ఆ ప్రాణమే బృహత్స్వరూపమైన
ఆ పరబ్రహ్మమని చెప్పబడుతోంది.
#తెలుసుకుందాం












