
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
@priyadarshi2410
💫అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్💫
#చిన్ని కన్నయ్య #కన్నయ్య #🦚 హరే కృష్ణ 🦚 #హరే కృష్ణా🙏 #హరే కృష్ణ
కొందరికి ఎందుకు అంత స్వార్థం?
ఎందుకు మనసులో అంత కపటం?
సాటి మనుషులంటే ఎందుకంత చిన్నచూపు?
అవసరంలో ఆదుకున్న వారిని అలుసుగా చూస్తారు?
ఆపదలో అండగా నిలిచిన వారిని హేళన చేస్తారు!
అవసరం కోసం,కాళ్ళదగ్గర కుక్కలా చేరి,అక్కర తీరాక,
ఆ కాళ్ళనే కరిచేస్తారు!వెనకెనకే ఉండి,వెన్నుపోటు పొడుస్తారు!
లోకంలో తమంత మంచివారు లేరంటారు!జగమంతా
నీతిమాలిన వాళ్లేనని నిందిస్తారు!గురివింద తామని గుర్తించరు! అహంతో గుడ్డివాళ్ళం అయ్యామని తెలుసుకోరు!
తప్పు తమదేనని ఒప్పుకోరు!
చితిలో పడి కాలినా, నీచపు బుద్ధి మార్చుకోరు!
#💗నా మనస్సు లోని మాట #నేటి ప్రపంచం 😠 #నేటి ప్రపంచంలో జరుగుతుంది ఇదే...😇 #నేటి లోకం తీరు...!!
షుగర్ ఉన్నవాళ్లు మామిడి పండ్లు తినొచ్చా? డాక్టర్లు చెబుతున్న అసలు నిజం ఇదీ.!
మామిడి పండు అనగానే అది కేవలం తీపి మాత్రమే కాదు, అందులో విటమిన్-సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. షుగర్ ఉన్నవారు ఏదైనా ఆహారం తీసుకునే ముందు గ్లైసమిక్ ఇండెక్స్(GI) గురించి తెలుసుకోవాలి. ఒక ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత వేగంగా పెంచుతుందో ఇది చెబుతుంది. మామిడి పండు గ్లైసమిక్ ఇండెక్స్ సుమారు 51 ఉంటుంది. ఇది తక్కువ కేటగిరీ కిందకే వస్తుంది, అంటే ఇది రక్తంలో షుగర్ను మరీ వేగంగా పెంచదు.
మనం మామిడి పండును ఎలా తింటున్నాం అన్నదే ముఖ్యం. విదేశాల్లో పండ్లను భోజనంలో ఒక భాగంగా తీసుకుంటారు. కానీ మన దగ్గర భోజనం అంతా ముగించి, కడుపు నిండా తిన్న తర్వాత అదనంగా మామిడి పండు ముక్కలను తింటాం. దీనివల్ల శరీరానికి అందాల్సిన క్యాలరీల కంటే ఎక్కువ అందుతాయి. ఫలితంగా బరువు పెరగడం, షుగర్ లెవల్స్ అదుపు తప్పడం జరుగుతుంది.
మధుమేహ బాధితులు మామిడి పండ్లను ఆస్వాదించాలంటే కొన్ని చిన్న జాగ్రత్తలు తప్పనిసరి. మొదటిది, మామిడి పండును జ్యూస్ రూపంలో అస్సలు తీసుకోకూడదు. జ్యూస్గా చేసినప్పుడు అందులోని పీచు పదార్థం (ఫైబర్) పోయి, షుగర్ నేరుగా రక్తంలో కలిసిపోతుంది. ఎప్పుడైనా సరే పండును ముక్కలుగా కోసుకుని తినడమే శ్రేయస్కరం. రెండోది, మీరు మామిడి పండు తినాలనుకున్న రోజున, అన్నం లేదా ఇతర కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని కొంచెం తగ్గించాలి. అంటే, ఒక పూట తీసుకునే పిండి పదార్థాలకు బదులుగా మామిడి పండును తినాలి.
అలాగే, మామిడి పండును ఉదయం పూట వ్యాయామానికి ముందు తీసుకోవడం మంచిది. దీనివల్ల అందులోని క్యాలరీలు ఖర్చయిపోతాయి. మామిడి పండు ముక్కలతో పాటు కొన్ని నట్స్ (బాదం, వాల్నట్స్) వంటి ప్రోటీన్ ఆహారాన్ని కలిపి తీసుకుంటే చక్కెరను కంట్రోల్ అవుతుంది. మొత్తానికి చెప్పాలంటే, షుగర్ ఉన్నవారు మామిడి పండ్లకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మితంగా, సరైన పద్ధతిలో తింటే ఈ వేసవి తీపిని మీరు కూడా నిశ్చింతగా ఆస్వాదించవచ్చు.
#తెలుసుకుందాం #😃మంచి మాటలు #🩺ఆరోగ్య జాగ్రత్తలు #👨🏻⚕️ఆరోగ్య చిట్కాలు #🏋️♀️హెల్త్ టిప్స్
*"వృక్షాలు ఇంకా గ్రామాల్లోనే ఉన్నాయి, ఫలాలు మాత్రమే పట్టణాలకు వెళ్లాయి". అర్థమైనోళ్ళకు అర్థమైనంత!*
ఆ ప్రదేశాన్ని వదిలి ఎక్కడకూ పోలేవు
పోతే మనలేవు... చావో రేవో ఈ మట్టి లోనే 🙏
#yes it's true 💯% #💗నా మనస్సు లోని మాట #sad reality of life😔 #😊ఎమోషనల్ ఫీలింగ్స్
🙏#అమ్మ_ఏం_చదివింది? 🙏
నాన్న పేరు పక్కన డిగ్రీలు చూసినప్పుడల్లా
అమ్మ ఏం చదివిందో తెలుసుకోవాలనిపిస్తుంది.
వంటింట్లో తన ఒంటిచేతి విన్యాసం చూస్తే...
గిన్నెలూ, గరిటెలతో కూర పట్టు యుద్ధం చేస్తే..
హోటెల్ మేనేజ్మెంట్లో వంద డిగ్రీలైనా
హోల్సేల్గా కట్టబెట్టారనిపిస్తుంది.
ఇద్దరికే సరిపడా కూర
నలుగురుకి తృప్తిగా వడ్డించినప్పుడు
మరో డిగ్రీ నెత్తిమీద పెట్టాలనిపిస్తుంది.
సింగిల్ బెడ్ రూమ్ ఇంటిని
ఇంద్రభవనంలా సర్దినప్పుడు
పెరట్లో పూసిన పిచ్చి పూలను
ఖాళీ సీసాల్లో పేర్చి ఫ్లవర్ వాజ్ గా మార్చినప్పుడు
ఇంటీరియర్ కోర్సేదో తన కొంగున
ముడివేసుకొందా అనే అనుమానం వేస్తుంది.
చాలీ చాలని జీతంతో
నెలంతా సర్దుకోలేక నాన్న సతమతమవుతుంటే..
చిటికెలో పద్దులేసి చిల్లర మిగిల్చిన అమ్మ
కచ్చితంగా ఎకనామిక్స్ లో మాస్టర్ డిగ్రీ కొట్టేసుంటుంది.
నాన్న చేసే తప్పుల్ని కనిపెడుతూ
నా అల్లరిని అదుపు చేస్తూ
అమ్మ జడ్జిమెంట్లని పాస్ చేస్తున్నప్పుడు
'లా' కూడా ఆమె ముందు
బలాదూర్ కాకుండా ఎందుకు ఉంటుంది?
అమ్మ దగ్గు చూడలేక
డాక్టర్ ఖరీదైన మందులు రాసిస్తే..
నవ్వుతూ ఆ చీటి డస్ట్ బిన్ లో వేసేసి
పంటికింద లవంగాన్ని పడేసిన అమ్మ...
ఎంబీబీఎస్లకు అందని చదువేదో చదివేసిందనే నా నమ్మకం.
బ్యాంకు ఎకౌంటు ఖాళీ అయినప్పుడు
నాన్న జేబులు నిండుకొన్నప్పుడు
అమ్మ మెడలో నగలు మాయం అయిపోవడం చూస్తే..
తాంత్రిక విద్యలోనూ పీహెచ్డీ కట్టబెట్టారన్న భయమూ వేస్తుంది.
ఇన్ని చేసినా
నీకేం తెలీదెహె.. ఊరుకో అన్నప్పుడు
ముసిముసిగా నవ్వుకొంటూ,
అలవాటు ప్రకారం మమ్మల్ని క్షమించేస్తూ
మళ్లీ అమ్మలా మారిపోతుంటే..
తత్వశాస్త్రమేదో ఔపోసన పట్టినట్టే ఉంటుంది.
ఇంతా చూసి ఉండబట్టలేక
ఓసారి అడిగేశా.. ఏం చదివావ్ అని?!
ఆరో గళాసు.. అని ముసిముసిగా నవ్వేసింది.
తనకేం తెలుసు..?
ఎవరికీ అంతుపట్టని మధ్యతరగతి జీవితాన్ని
అందరికీ అర్థం కాని పేదరికపు పరిమళాన్నీ
పూర్తిగా చదివేసిందన్న నిజం..
అమ్మకు కూడా తెలీదు.
🙏🙏🙏
#💗నా మనస్సు లోని మాట
వంశాన్ని వృద్ధి చేసే తిరునాగేశ్వరం నాగనాథ స్వామి ఆలయం.........!!
నవగ్రహ రాహు క్షేత్రం, నవగ్రహాలలో వంశవృద్ధికీ, కుటుంబ అభివృద్ధికి కారకుడిగా వెలుగొందే రాహు భగవానుడు, తన నాగ దోష నివారణ కోసం పరమశివుడిని పూజించి అనుగ్రహం పొందిన మహా పుణ్యక్షేత్రమే ఈ తిరునాగేశ్వరం.
కుంభకోణం సమీపంలో ఉన్న ఈ క్షేత్రం యొక్క ఆధ్యాత్మిక విశేషాలు.......
రాహు భగవానుని ప్రత్యేక క్షేత్రం ఇక్కడ రాహు భగవానుడు తన ఇద్దరు దేవేరులైన నాగవల్లి మరియు నాగకన్నిలతో కలిసి 'మంగళ రాహువు'గా, అనుగ్రహ మూర్తిగా కొలువై ఉన్నాడు. అందువల్ల, నాగ దోషాల కారణంగా వంశవృద్ది ఆలస్యమవుతున్న దంపతులకు ఇది అత్యంత విశిష్టమైన పరిహార క్షేత్రం.
క్షీరసాగరాన్ని తలపించే క్షీరాభిషేకం ఈ ఆలయంలోని ఒక గొప్ప అద్భుతం ఏమిటంటే... రాహుకాలంలో రాహు భగవానునికి నిర్వహించే పాలాభిషేకం సమయంలో, విగ్రహం పైనుండి క్రిందికి జారే పాలు నీలి రంగులోకి మారుతాయి. ఈ దైవిక అద్భుతాన్ని కండ్లారా వీక్షించడమే ఒక గొప్ప పుణ్యం.
వంశవృద్ది అడ్డంకులు తొలగుతాయి జాతకంలో పుత్ర దోషం లేదా వంశవృద్దికి అడ్డుగా ఉండే సర్ప దోషాలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి, రాహుకాలంలో పాలాభిషేకం చేసి, నాగనాథ స్వామిని మరియు గిరివరాంబికా దేవిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే అడ్డంకులన్నీ మంచులా వీడిపోతాయి.
పూజా ఫలం రాహు భగవానుని అనుగ్రహంతో వివాహ అడ్డంకులు తొలగుతాయి, సంతాన భాగ్యం కలుగుతుంది, కుటుంబంలో సంతానం వర్ధిల్లి వంశానికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.
మీ ఇళ్లలో పిల్లల కిలకిలరావాలు, సంతోషాలు వెల్లివిరియాలని, ఆ తిరునాగేశ్వరం నాగనాథ స్వామి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ తోడుండాలని కోరుకుంటున్నాము!
ఆలయ లొకేషన్.... తిరునాగేశ్వరం (కుంభకోణం సమీపంలో), తంజావూరు జిల్లా, తమిళనాడు.
#తెలుసుకుందాం #గుళ్ళు #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #హిందూ దేవాలయాలు💐🎂 #hindu temples












