ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి
* రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నా అధిగమించి ముందుకు వెళ్తున్నాం
* నిర్ణయాల అమలు, పనుల పూర్తి విషయంలో అలసత్వం వద్దు
* క్షేత్ర స్థాయిలో ఇంకా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి
* ఉదాసీనత వీడండి.. పారదర్శకతే మా విధానం
* మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
‘కూటమి ప్రభుత్వం ప్రజలకు పారదర్శకమైన పాలన, అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు నిబద్ధతతో పని చేస్తోంది. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి అనుభవం మార్గదర్శకాలుగా ముందుకు వెళ్తున్నాం. దీనికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాల్సిన అవసరం ఉంద’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. నాలుగు గోడల మధ్య మంత్రులు, ఉన్నతాధికారులు తీసుకునే ప్రజోపయోగ నిర్ణయాలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అర్ధవంతంగా అందాలంటే అంతా సమష్టిగా పనిచేయాలని సూచించారు. సోమవారం సచివాలయంలో మంత్రులు, శాఖల కార్యదర్శుల సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీపడటం లేదు. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసే ప్రతి రూపాయి విలువైనదే. పెట్టే ఖర్చు, దానివల్ల అందే ప్రయోజనం ప్రజలకు ఉపయోగపడేలా క్షేత్రస్థాయి సిబ్బంది పని చేయాలి. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి.
•రూ.వేల కోట్ల పనులను మొదలుపెట్టాం
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పన మీద దృష్టిపెట్టాం. దీనిలో భాగంగా మొదటి విడత పల్లె పండుగ కార్యక్రమం కింద రూ.2,500 కోట్లు, పల్లె పండుగ 2.0 కింద రూ.5,700 కోట్లు ఖర్చు చేశాం. గిరిజన ప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగుపర్చే కార్యక్రమం ‘అడవి తల్లి బాట’ పథకం కింద రూ.1005 కోట్లను వెచ్చించాం. దీంతోపాటు సాస్కీ నిధులు రూ.2,123 వేల కోట్లతో నియోజక వర్గాల్లో ప్రాధాన్యతను బట్టి పనులు చేస్తున్నాం. మొత్తంగా రూ.11,328 కోట్లతో చేస్తున్న పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జల్ జీవన్ మిషన్ పథకం కింద రూ.28 వేల కోట్ల పనులకు అనుమతులు లభిస్తే, దానిలో రూ.10 వేల కోట్ల పనులను ప్రారంభించాం. ఇక అటవీ శాఖ పరిధిలో రూ.200 కోట్లతో నగరవనాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా అనేక పనులను పారదర్శకంగా క్రమపద్ధతిలో, ప్రాధాన్యతలను అనసరించి చేస్తున్నాం.
•నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలి
అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులతో పనులను క్రమపద్ధతిలో చేస్తున్నాం. మొదలుపెట్టిన పనులను ఓ ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి. నిర్దేశిత సమయంలో పనులను పూర్తి చేయడం అవసరం. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల అమలు, పనుల పూర్తి విషయంలో క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. కొన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రభుత్వం అప్పగించిన పనిని నిబద్ధతతో నిజాయతీగా పూర్తి చేయండి.
ప్రభుత్వ నిర్ణయాల అమలు, పనులు జరుగుతున్న తీరు విషయంలో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తే కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. దీనిని అధిగమించాలి. ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి పనుల పూర్తి విషయంలో దిశానిర్దేశం చేయాలి. నిర్ణయాలను అమలు చేసే బృహత్తర బాధ్యతలు క్షేత్రస్థాయి సిబ్బంది మీదనే ఉన్నాయి. దాన్ని సరైన రీతితో నిర్వర్తించండి. ప్రభుత్వం మీకు తగిన విధంగా సహకరిస్తుంది’’ అన్నారు.
#
#🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟥జనసేన #👊పొలిటికల్ ఫైట్స్🎤 #🏛️రాజకీయాలు