KING 777
617 views
నేటి నుండే ఇంటర్ పరీక్షలు ఐదు నిమిషాల ఆలస్యమైన పరీక్షకు అనుమతి జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి 30 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అయితే విద్యార్థులు వారి హాల్ టికెట్ లో సూచించిన కాలమానం ప్రకారం కంటే అరగంట ముందుగానే ఎగ్జామ్స్ సెంటర్లకు చేరుకోవాలని సూచించారు, అదేవిధంగా ఎవరైనా విద్యార్థి పరీక్షలకు ఐదు నిమిషాలలో లేటుగా వచ్చిన పరీక్ష హాల్లో అనుమతించాలని సెంటర్ల యాజమాన్యానికి సూచించడమైనది. జిల్లా వ్యాప్తంగా మొదటి సంవత్సరం 7699 మంది విద్యార్థులు మరియు రెండవ సంవత్సరంలో 7424 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థులు వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ పై ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా విద్యార్థులను పరీక్ష హాలుకు అనుమతించాలని సూచించడమైనది. ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపల్ మరియు మేనేజ్మెంట్ లు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుంటే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని సూచించడమైనది. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద వైద్య శిబిరం ఉంటుంది, విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురైనట్లయితే టెలి మానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14416 కు నేరుగా ఫోన్ చేయవచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. బి.నారాయణ జిల్లా పరీక్షల కన్వీనర్. #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🌍నా తెలంగాణ #📘ఇంటర్ సైన్స్ & మ్యాథ్స్