nvs subramanyam sharma
2.7K views
7 days ago
బిక్కవోలు వినాయకుడి ఆలయం : క్రీ॥శ॥ 774 నుంచి క్రీ॥శ॥ 1542 వరకు వేంగిని రాజధానిగా చేసుకుని ఆంధ్రదేశాన్ని పాలించిన తూర్పుచాళుక్యుల ఆధ్యాత్మిక రాజధానిగా బిక్కవోలును చెప్పవచ్చు. 9వ శతాబ్దంలో వీరు ఇక్కడ నిర్మించిన అనేక ఆలయాలే ఇందుకు సాక్ష్యం. తమ ఇలవేల్పు వినాయకుడు, శివుడి ఆలయాలు అటు ఆధ్యాత్మికతనూ, ఇటు శిల్పకళనూ రంగరించిన చారిత్రక నిర్మాణాలుగా ప్రసిద్ధి చెందాయి. తూర్పుచాళుక్యులు బిక్కవోలు గ్రామానికి తూర్పున ముందుగా తమ ఇలవేల్పు అయిన వినాయకుడి ఆలయం నిర్మించారు. కాలక్రమంలో ఈ ఆలయం కాలగర్భంలో కలిసిపోయింది. 1960వ దశకంలో ఒక భక్తుడి కలలో కనిపించి వినాయకుడే తన ఉనికి తెలిపాడని, గ్రామస్థుల సహకారంతో ఆ ప్రదేశంలో తవ్వకాలు సాగించగా దక్షిణావృత తొండంతో వినాయకుడు బయలు పడ్డాడని కథనం. అనంతరం పందిరి వేసి భక్తులు పూజలు మొదలుపెట్టారు. కాలక్రమంలో వినాయకుడి మహిమ దశదిశలా వ్యాపించింది. భక్తుల తాకిడి ఎక్కువ అవ్వడంతో గ్రామస్థులు స్వామికి విశాలమైన ఆలయం నిర్మించారు. విగ్రహం బయటపడిన తొలినాళ్ళలో చిన్నదిగా ఉన్నా తర్వాత భారీస్థాయికి పెరిగిందన్నది స్థానికుల కథనం. చెవిలో తమ కోర్కె చెబితే తప్పక అది నెరవేరుతుందన్న భక్తుల విశ్వాసం ఆనోట ఈనోట పాకి రాష్ట్ర వ్యాప్తి పొందింది. చవితి వేడుకలకు ఈ ఆలయం భక్తకోటితో కళకళలాడుతుంది. తూర్పు చాళుక్యులు యుద్ధంలో జయం లభించినపుడల్లా అందుకు గుర్తుగా అనేక శివాలయాలు నిర్మించారు. బిక్కవోలు నలుదిక్కులా వీరు నిర్మించిన చాలా ఆలయాలు మతోన్మాదుల అహంకారానికి శిథిలమై భూమిలో నిక్షిప్తమైపోయాయి. అయితే నాలుగు శైవ ఆలయాలు మాత్రం వీరి దండయాత్రల నుంచి తప్పించుకుని నేటికీ చెక్కుచెదరక వున్నాయి. వీటిలో ఉత్తర, పడమర, దక్షిణ దిశలలో ఉన్న కంచర, నక్కల వీరభద్ర ఆలయాలు పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ఉన్నాయి. గోలింగేశ్వర ఆలయం మాత్రం నేటికీ నిత్యం భక్తకోటితో పూజలందు కుంటోంది. ఈ ఆలయ ప్రాంగణంలో రాజరాజేశ్వర, చంద్రశేఖర, గోలింగేశ్వర ఆలయాల సముదాయం ఉండి గోలింగేశ్వర ఆలయంలో గోలింగేశ్వరునితో పాటు పార్వతీదేవి, కుమార సుబ్రహ్మణ్యేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు... ఇలా మొత్తం శైవకుటుంబమే కొలువు దీరింది. యేటా మార్గశిర శుద్ధషష్ఠి ఉత్సవాలు జరుగుతుంటాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడి సహజమైన పుట్ట నేటికీ దర్శనమిస్తోంది. పెద్దాపురం మహారాజు వత్సవాయి సూర్యనారాయణ తిమ్మ జగపతి ఈ ఆలయాన్ని దర్శించి సంతానం కోసం సుబ్రహ్మణ్యేశ్వరుని కొలువగా ఆ కోర్కె నెరవేరింది. దీంతో మహారాజు ఈ ఆలయాలను పునరుద్ధరించి కొత్త శోభను చేకూర్చారు. ఏటా జరిగే షష్ఠి ఉత్సవాలలో సంతానం లేని స్త్రీలు స్వామి వారి పుట్టపై ఉంచిన నాగుల చీరను ధరించి ఆలయం వెనుక శయనిస్తే సంతానవతులవుతారని ప్రగాఢ విశ్వాసం. #🌅శుభోదయం #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🙏దేవాలయాల్లో గణపతి ఉత్సవం #🛕బిక్కవోలు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి🕉️