🛕బిక్కవోలు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి🕉️

2 Posts • 190 views
Rochish Sharma Nandamuru
1K views 3 months ago
🌿🌼🙏#కాణిపాకం #శ్రీశ్రీశ్రీ #వరసిద్ధి #వినాయక #స్వామివారు🙏🌼🌿 🌿🌼🙏సత్య ప్రమాణాలకు నెలవుగా.. అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాకం- శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం భాసిల్లుతోంది. కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నారు. ఈ స్వామికి హిందువులే కాదు. ఇతర మతస్థులూ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు రావడం విశేషం. దేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర మతస్థులు పాల్గొంటారు.🙏🌼🌿 🌿🌼🙏క్షేత్రచరిత్ర, స్థలపురాణం🙏🌼🌿 🌿🌼🙏సుమారు 1,000 ఏళ్ల కిత్రం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్లుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ.. ఉన్న పొలాన్ని సాగు చేసుకొంటూ జీవించేవారు. ఒక దశలో ఆ గ్రామం కరవు కాటకాలతో అల్లాడింది. గ్రామస్థులకు కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. కరవును జయించాలని సంకల్పించిన ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు చేయాలనుకున్నారు. ఆ మేరకు బావిలో తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది. రక్తం అంగవైకల్య సోదరులను తాకగానే.. వాళ్ల వైకల్యం తొలగింది. జరిగిన ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలో ‘గణనాథుని’ రూపం కన్పించింది. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో దాన్ని పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. స్వామికి గ్రామస్థులు సమర్పించిన కొబ్బరికాయల నీరు ‘కాణి’భూమి( కాణి అంటే ఎకరం పొలం అని అర్థం) మేర పారింది. అప్పట్నుంచి విహారపురి గ్రామానికి ‘కాణిపారకరమ్‌’ అన్న పేరు వచ్చింది. కాలక్రమంలో అదే ‘కాణిపాకం’గా మారిందని ప్రశస్తి.🙏🌼🌿 🌿🌼🙏ఈ బొజ్జ గణపయ్య.. ప్రమాణాల దేవుడయ్య!🙏🌼🌿 🌿🙏🌼కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగానూ ప్రసిద్ధికెక్కారు. స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు (తాగుడు, దురలవాట్లు) స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకం. అసెంబ్లీలో సైతం రాజకీయ నేతలు ‘కాణిపాకం’లో ప్రమాణం చేద్దామా? అని సవాల్‌ విసురుకోవడం స్వామి మహిమను చెప్పకనే చెబుతోంది..! #☀️శుభ మధ్యాహ్నం #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🙏దేవాలయాల్లో గణపతి ఉత్సవం #🛕కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి🙏
26 likes
24 shares
nvs subramanyam sharma
2K views 7 days ago
బిక్కవోలు వినాయకుడి ఆలయం : క్రీ॥శ॥ 774 నుంచి క్రీ॥శ॥ 1542 వరకు వేంగిని రాజధానిగా చేసుకుని ఆంధ్రదేశాన్ని పాలించిన తూర్పుచాళుక్యుల ఆధ్యాత్మిక రాజధానిగా బిక్కవోలును చెప్పవచ్చు. 9వ శతాబ్దంలో వీరు ఇక్కడ నిర్మించిన అనేక ఆలయాలే ఇందుకు సాక్ష్యం. తమ ఇలవేల్పు వినాయకుడు, శివుడి ఆలయాలు అటు ఆధ్యాత్మికతనూ, ఇటు శిల్పకళనూ రంగరించిన చారిత్రక నిర్మాణాలుగా ప్రసిద్ధి చెందాయి. తూర్పుచాళుక్యులు బిక్కవోలు గ్రామానికి తూర్పున ముందుగా తమ ఇలవేల్పు అయిన వినాయకుడి ఆలయం నిర్మించారు. కాలక్రమంలో ఈ ఆలయం కాలగర్భంలో కలిసిపోయింది. 1960వ దశకంలో ఒక భక్తుడి కలలో కనిపించి వినాయకుడే తన ఉనికి తెలిపాడని, గ్రామస్థుల సహకారంతో ఆ ప్రదేశంలో తవ్వకాలు సాగించగా దక్షిణావృత తొండంతో వినాయకుడు బయలు పడ్డాడని కథనం. అనంతరం పందిరి వేసి భక్తులు పూజలు మొదలుపెట్టారు. కాలక్రమంలో వినాయకుడి మహిమ దశదిశలా వ్యాపించింది. భక్తుల తాకిడి ఎక్కువ అవ్వడంతో గ్రామస్థులు స్వామికి విశాలమైన ఆలయం నిర్మించారు. విగ్రహం బయటపడిన తొలినాళ్ళలో చిన్నదిగా ఉన్నా తర్వాత భారీస్థాయికి పెరిగిందన్నది స్థానికుల కథనం. చెవిలో తమ కోర్కె చెబితే తప్పక అది నెరవేరుతుందన్న భక్తుల విశ్వాసం ఆనోట ఈనోట పాకి రాష్ట్ర వ్యాప్తి పొందింది. చవితి వేడుకలకు ఈ ఆలయం భక్తకోటితో కళకళలాడుతుంది. తూర్పు చాళుక్యులు యుద్ధంలో జయం లభించినపుడల్లా అందుకు గుర్తుగా అనేక శివాలయాలు నిర్మించారు. బిక్కవోలు నలుదిక్కులా వీరు నిర్మించిన చాలా ఆలయాలు మతోన్మాదుల అహంకారానికి శిథిలమై భూమిలో నిక్షిప్తమైపోయాయి. అయితే నాలుగు శైవ ఆలయాలు మాత్రం వీరి దండయాత్రల నుంచి తప్పించుకుని నేటికీ చెక్కుచెదరక వున్నాయి. వీటిలో ఉత్తర, పడమర, దక్షిణ దిశలలో ఉన్న కంచర, నక్కల వీరభద్ర ఆలయాలు పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ఉన్నాయి. గోలింగేశ్వర ఆలయం మాత్రం నేటికీ నిత్యం భక్తకోటితో పూజలందు కుంటోంది. ఈ ఆలయ ప్రాంగణంలో రాజరాజేశ్వర, చంద్రశేఖర, గోలింగేశ్వర ఆలయాల సముదాయం ఉండి గోలింగేశ్వర ఆలయంలో గోలింగేశ్వరునితో పాటు పార్వతీదేవి, కుమార సుబ్రహ్మణ్యేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు... ఇలా మొత్తం శైవకుటుంబమే కొలువు దీరింది. యేటా మార్గశిర శుద్ధషష్ఠి ఉత్సవాలు జరుగుతుంటాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడి సహజమైన పుట్ట నేటికీ దర్శనమిస్తోంది. పెద్దాపురం మహారాజు వత్సవాయి సూర్యనారాయణ తిమ్మ జగపతి ఈ ఆలయాన్ని దర్శించి సంతానం కోసం సుబ్రహ్మణ్యేశ్వరుని కొలువగా ఆ కోర్కె నెరవేరింది. దీంతో మహారాజు ఈ ఆలయాలను పునరుద్ధరించి కొత్త శోభను చేకూర్చారు. ఏటా జరిగే షష్ఠి ఉత్సవాలలో సంతానం లేని స్త్రీలు స్వామి వారి పుట్టపై ఉంచిన నాగుల చీరను ధరించి ఆలయం వెనుక శయనిస్తే సంతానవతులవుతారని ప్రగాఢ విశ్వాసం. #🌅శుభోదయం #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🙏దేవాలయాల్లో గణపతి ఉత్సవం #🛕బిక్కవోలు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి🕉️
79 likes
10 shares
Rochish Sharma Nandamuru
13K views 21 days ago
🌿🌼 కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దర్శనం 🌼🌿 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ | నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ||  🌿🌼🙏ఓం గం గణపతయే నమః🙏🌼🌿 #🌅శుభోదయం #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🙏దేవాలయాల్లో గణపతి ఉత్సవం #🛕కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి🙏
474 likes
2 comments 708 shares