🪷94శ్రీలింగమహాపురాణం🪷
🍀శివాలయ నిర్మాణం వలన లభించే పుణ్యఫలం🍀
# తొంభై నాలుగవ భాగం#
శౌనకాది మునులు సూత మహర్షితో "రోమహర్షణ మహర్షీ! శివలింగాలలో బేధాలు, వివిధ శివ విగ్రహాల నిర్మాణం, , వివిధ శివ విగ్రహ ప్రతిష్ట వలన లభించే పుణ్య ఫలాల గురించి వివరించి చెప్పారు. ఇప్పుడు మాకు శివాలయాల నిర్మాణం వలన లభించే మానవులకు లభించే పుణ్య ఫలాలను వివరించండి" అని అడిగారు.
సూత మహర్షి నవ్వుతూ "మునులారా! శివ జ్ఞానము పొంది శివ భక్తి పరాయణుడై సంసార బంధములలో నుంచి విముక్తుడైన వ్యక్తికి శివాలయ నిర్మాణం వలన లభించే అధిక లేదా విశేష ఫలము ఇంకా ఏముంటుంది? అయినా సామాన్యులలో శివ భక్తి పెంపొందిచడానికి బ్రహ్మాది దేవతల నుండి మానవుల వరకు స్వయంభువ శివలింగాలకు, ప్రతిష్ఠించిన మృత్తిక శివలింగం నుండి రత్నాది శివలింగం వరకు అనేక శివాలయాలు నిర్మించారు.
మీకు ఇటువంటి వివిధ శివాలయాల నిర్మాణం వలన లభించే ఫలాలను వివరిస్తాను. పిల్లలు మట్టితో, ఇసుకతో, రాళ్ళతో, ధూళితో శివలింగము, శివాలయం ఆటలలో భాగంగా నిర్మించి పూజిస్తే రుద్రత్వం పొంది రుద్రలోకం చేరుకుంటారు.
శివభక్తులు ధర్మార్థకామ మోక్ష సాధనకు శివాలయాలను భక్తి శ్రద్థలతో నిర్మించాలి. తమ శక్తి సామర్థ్యాల బట్టి కేసర, నాగర, ద్రావిడ నిర్మాణ విధానాలలో ఒక విధానము అనుసరించి శివాలయ నిర్మాణం చేయాలి. శివాలయ నిర్మాణం చేసినవారు శివలోకంలో ఉత్తమ గౌరవం, గణాధిపతి పదవి పొందుతారు. వివిధ నామాలతో వివిధ ఆకారాలలో నిర్మాణం చేసిన శివాలయాల వలన కలిగే పుణ్యఫలం చెబుతాను.
కైలాసము అనే పేరుతో శివాలయం నిర్మించిన భక్తుడు కైలాసశిఖర సమాన ఆకారం గల దివ్య విమానంలో కైలాసం చేరుకుంటాడు. మందర పర్వతం పేరుతో శివాలయం నిర్మించిన భక్తుడు శివలోకంలో గణాధిపత్యం పొందుతాడు. మేరువు అనే పేరుతో శివాలయం నిర్మించిన వ్యక్తి సకల యజ్ఞ తప దాన తీర్థ ఫలాలు పొందుతాడు.
నిషధము అనే పేరుతో శివాలయం నిర్మించి శివలింగ ప్రతిష్టించిన భక్తుడు శివలోకం చేరి శివునితో సమానంగా సుఖాలు పొందుతాడు. హిమశైలము పేరుతో శివాలయం నిర్మించిన భక్తుడు దివ్య విమానంలో హిమాలయాల గుండా ప్రయాణం చేసి శివలోకం చేరుకుంటాడు
తమ శక్తి సంపదల బట్టి నీలశిఖరము అనే శివాలయ ప్రాసాదం నిర్మించిన భక్తుడు దేవతల గౌరవం పొంది రుద్రలోకం చేరి రుద్రులతో కలసి సుఖభోగాలు అనుభవిస్తాడు. మహేంద్ర శైలము అనే శివప్రాసాదము నిర్మించిన వ్యక్తి మహేంద్రగిరితో సమానమైన విమానంలో శివలోకము చేరుకుని సకల భోగాలు అనుభవించి శివసాయిజ్యం పొందుతాడు.
ధనసంపదలు కలిగిన వారు రత్నములతో కూర్చబడిన సువర్ణ శివ ప్రాసాదాలు నాగర లేక ద్రావిడ లేక కేసర విధానంలో మండప, చతురస్ర దీర్ఘ చతురస్ర ఆకారాలలో నిర్మిస్తే అంతులేని మహాపుణ్యం పొందుతారు. జీర్ణమైన, శిథిలమైన శివాలయాలను తిరిగి నిర్మించి పునరుద్ధరణ చేసినవారికి మొదట ఆ శివాలయాలు నిర్మించిన వారికి లభించిన పుణ్యం కంటే అధిక పుణ్యం లభిస్తుంది.
శిధిలమైన శివాలయపు మండపం గాని, ద్వారము గానీ గోపురం గానీ గర్భగుడి గానీ మరమ్మతు చేసి పునరుద్ధరించిన వారికి అశేష పుణ్య ఫలం, శివానుగ్రహం లభిస్తుంది. శివాలయ నిర్మాణంలో కూలి తీసుకుని పని చేసిన వ్యక్తి కూడా కుటుంబ సమేతంగా స్వర్గలోకం చేరుకుంటాడు. భక్తితో శివాలయ నిర్మాణంలో ఇటుకలు, కలప మొదలైన నిర్మాణ సామాగ్రి ఇచ్చినవారు, ధన రూపంలో విరాళం ఇచ్చినవారు కూడా శివానుగ్రహం పొంది సుఖసంతోషాలతో జీవితం గడుపుతారు.
శివాలయం నిర్మాణం చేసే శక్తి సామర్థ్యాలు లేని, ధన వస్తువులు విరాళం ఇచ్చే శక్తి లేని భక్తులు శివాలయాలలో ఆలయ ప్రాంగణం చిమ్మి శుభ్రం చేసి , గోమయ సుగంధ జలముతో అలికి ముగ్గులు, పువ్వులు పెట్టి శివానుగ్రహం పొందవచ్చును. ఒక నెల పాటు ఆలయాన్ని చిమ్మి శుభ్రం చేసిన వ్యక్తికి వేయి చాంద్రాయణ వ్రతములు చేసిన పుణ్యం లభిస్తుంది. వస్త్రము చేత వడగట్టబడిన సుగంధ గోమయ జలముతో విధి పూర్వకంగా శివాలయ ప్రాంగణం అలికిన వ్యక్తికి ఒక సంవత్సరం చాంద్రాయణ వ్రతము చేసిన ఫలము లభిస్తుంది.
https://chat.whatsapp.com/I9GuM11QcSYCmHyQXHO5cQ
#🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు #🙏ఓం నమః శివాయ🙏ૐ
*తరువాతకధ రేపటి భాగంలో చదువుదాం*.
🌹శ్రీకాంత్ గంజికుంట
కరణంగారి సౌజన్యంతో🌹
💜 ఓం శ్రీఉమా
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః
సుఖినోభవన్తు🙏
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
(సర్వం శ్రీశివార్పణమస్తు)
🌷🙏🌷
శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺