శ్రీవారి సేవకులకు ముఖ్యమైన సూచనలు.
శ్రీవారి సేవ స్వచ్ఛంద సేవ. ఇది యాత్రికులకు సహాయం నిమిత్తం ఏర్పాటు చేయడమైనది.
ఎవ్వరికిగాని ధనరూపంగా, వస్తురూపంగా ఎటువంటి చెల్లింపులు చేయనవసరం లేదు. శ్రీవారి సేవ పూర్తిగా ఉచితం.
శ్రీవారి సేవకు వచ్చుటకు ఆసక్తిగలవారు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును. వివరములకు - TTD officials website and app ద్వారా పొందవచ్చును.
శ్రీవారి సేవకులుగా హిందువులను మాత్రమే అనుమతించబడును.
శ్రీవారి సేవకుల వయస్సు ఖచ్చితంగా 18 సం|| పైన మరియు 60 సం|| లోపు ఉండవలెను.
ప్రతి టీమ్లోనూ 10 మందికి తక్కువ కాకుండా 15 మందికి ఎక్కువ కాకుండా సభ్యులుండవలెను.
శ్రీవారి సేవకు ఒక్కరే కూడా ఆన్లైన్లో వ్యక్తిగతంగా రిజిస్టర్ చేసుకొని సేవకు రావచ్చును.
శ్రీవారి సేవకులకు చదువుట, వ్రాయుట తప్పక తెలిసి ఉండాలి. అట్టివారికే సేవలు కేటాయించబడును.
శ్రీవారి సేవకులందరూ తప్పనిసరిగా తిరునామం, తిలకం, కుంకుమ లేక చందనం బొట్లు స్పష్టంగా కనిపించేట్లు ధరించాలి.
శ్రీవారి సేవకుల ఆధార్ కార్డు నెంబర్లను సి.ఆర్.ఓ. వద్ద భక్తుల కొరకు ఏర్పాటు చేసిన లక్కీడిప్ / అంగప్రదక్షిణం / కరెంటు బుకింగ్ లోని ఆర్జిత సేవా టిక్కెట్స్తో అనుసంధానం చేసిన కారణమున ఏ విధమైన టిక్కెట్లు ఇవ్వబడవు.
సేవా ఆఫీసువారు ఇచ్చిన స్కార్ఫులను, ఐ.డి. కార్డు కవరు, ట్యాగ్లను సేవల అనంతరం సేవా ఆఫీసు వారికి తిరిగి అప్పగించవలెను.
ఇచ్చిన సేవను శ్రద్ధతో, క్రమశిక్షణతో, భక్తితో నిర్వహించుట.
సేవాసదన్ నందు నమోదు చేసుకొన్న తరువాత తిరుమలలో టి.టి.డి. వారు ఇచ్చిన వసతి సముదాయంలో ఉంటూ మీకు ఇచ్చిన సేవలను పూర్తి సమయము వరకు నిర్వహంపవలెను.
7 రోజులు సేవా సమయం మధ్యలో తిరుమల వదిలి వెళ్ళకూడదు.
మహిళా సేవకులు, పురుష సేవకులకు విడి విడిగా వసతి కల్పించబడినది. కాబట్టి మీకు ఇచ్చిన వసతి సముదాయంలోనే ఉండాలి.
ఖచ్చితంగా, మీరు అప్లోడ్ చేసిన రెండవ చిత్రంలోని టెక్స్ట్ ఇక్కడ ఉంది:
శ్రీవారి సేవకులకు సూచనలు (కొనసాగింపు)
సేవాసదన్ నందు హాలు, బాత్రూములు, టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచవలెను.
లడ్డూ కౌంటర్ల నందు సేవకులు లడ్డూ ప్రసాద ట్రేలలోని లడ్డూ పొడిని తినరాదు.
అన్న ప్రసాద కేంద్రము నందు కూరగాయలను తరుగునప్పుడు సేవకులు వాటిని తినరాదు.
శ్రీవారి ఆలయములలో సేవలు ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారా ప్రతిరోజూ సాయంత్రం 6 గం॥లకు కేటాయింపబడును. టీమ్ లీడర్ల సెల్ఫోన్లకు మెసేజ్ వచ్చును. ఆఫీస్ నోటీస్ బోర్డుల నందు లిస్ట్ అతికించబడును. ఇది 7 రోజులు సేవ చేయు శ్రీవారి సేవకులకు మాత్రమే.
ప్రతిరోజూ సేవాసదన్ హాలు 1 వ అంతస్తు నందు సత్సంగము హాలులో భజన మరియు సత్సంగము జరుగు సమయములు:
ఉ॥ 10.00 గం॥ నుండి ఉ॥ 11.00 గం॥ల వరకు.
సా॥ 4.30 గం॥ నుండి సా॥ 5.30 గం॥ల వరకు.
ఉదయం సేవలో ఉన్నవారు సాయంత్రం మరియు సాయంత్రం సేవలో ఉన్నవారు ఉదయం సత్సంగమునకు హాజరు కావలెను.
ప్రతి యొక్క టీమ్లీడరు మరియు శ్రీవారి సేవకులు అందరూ తప్పనిసరిగా హాజరు కావలెను. సత్సంగము నందే అందరికీ హాజరు తీసుకొనబడును. సత్సంగమునకు హాజరు కాని సేవకులకు శ్రీవారి ఆలయములలో సేవలు ఇవ్వబడవు.
సేవా సమయము నందు సేవకులు 'గోవిందా' అని నామస్మరణ ప్రేమతో, భక్తితో చేయుచూ సేవలను నిరాడంబరముగా, పవిత్రముగా చేయవలయును.
శ్రీవారి సేవకులు భక్తులతో వాదనలు చేయరాదు. (వాదన సాధనకు పనికిరాదు).
టి.టి.డి. వారు అందించిన స్కార్ఫ్లను సేవకులు భగవంతుడు ప్రసాదించిన రక్షాకవచంగా మరియు భగవంతుని గుర్తింపుగా భావింపవలెను.
స్కార్ఫ్లను సేవా సమయమునందు మాత్రమే ఉపయోగించవలెను. బయట ప్రదేశాలు, హోటళ్ళు, షాపింగ్ చేయునప్పుడు ఉపయోగించరాదు. స్కార్ఫ్ సేవా బాధ్యతకు గుర్తింపు అంతేకానీ మన అనుకూలము కొరకు కాదు.
డ్రస్ కోడ్: పురుషులు తెలుపు రంగు వస్త్రాలు, స్త్రీలు మెరూన్ బార్డర్తో కూడిన ఆరెంజ్ కలర్ చీర మరియు వి-నెక్ కలిగిన మెరూన్ కలర్ రవిక ధరించవలెను.
శ్రీవారి సేవకులు నిర్ణయించిన డ్యూటీ తేదీలు పూర్తి అయిన తరువాత మాత్రమే శ్రీవారి దర్శనం.
#తెలుసుకుందాం