తెలుసుకుందాం

8K Posts • 4M views
🌿🌼 శ్రీ విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్రం 🌼🌿 వాసుదేవం హృషీకేశం వామనం జలశాయినమ్ | జనార్దనం హరిం కృష్ణం శ్రీవక్షం గరుడధ్వజమ్ || 1 || వారాహం పుండరీకాక్షం నృసింహం నరకాంతకమ్ | అవ్యక్తం శాశ్వతం విష్ణుమనంతమజమవ్యయమ్ || 2 || నారాయణం గదాధ్యక్షం గోవిందం కీర్తిభాజనమ్ | గోవర్ధనోద్ధరం దేవం భూధరం భువనేశ్వరమ్ || 3 || వేత్తారం యజ్ఞపురుషం యజ్ఞేశం యజ్ఞవాహనమ్ | చక్రపాణిం గదాపాణిం శంఖపాణిం నరోత్తమమ్ || 4 || వైకుంఠం దుష్టదమనం భూగర్భం పీతవాససమ్ | త్రివిక్రమం త్రికాలజ్ఞం త్రిమూర్తిం నందకేశ్వరమ్ || 5 || రామం రామం హయగ్రీవం భీమం రొఉద్రం భవోద్భవమ్ | శ్రీపతిం శ్రీధరం శ్రీశం మంగలం మంగలాయుధమ్ || 6 || దామోదరం దమోపేతం కేశవం కేశిసూదనమ్ | వరేణ్యం వరదం విష్ణుమానందం వాసుదేవజమ్ || 7 || హిరణ్యరేతసం దీప్తం పురాణం పురుషోత్తమమ్ | సకలం నిష్కలం శుద్ధం నిర్గుణం గుణశాశ్వతమ్ || 8 || హిరణ్యతనుసంకాశం సూర్యాయుతసమప్రభమ్ | మేఘశ్యామం చతుర్బాహుం కుశలం కమలేక్షణమ్ || 9 || జ్యోతీరూపమరూపం చ స్వరూపం రూపసంస్థితమ్ | సర్వజ్ఞం సర్వరూపస్థం సర్వేశం సర్వతోముఖమ్ || 10 || జ్ఞానం కూటస్థమచలం జ్ఞ్హానదం పరమం ప్రభుమ్ | యోగీశం యోగనిష్ణాతం యోగిసంయోగరూపిణమ్ || 11 || ఈశ్వరం సర్వభూతానాం వందే భూతమయం ప్రభుమ్ | ఇతి నామశతం దివ్యం వైష్ణవం ఖలు పాపహమ్ || 12 || వ్యాసేన కథితం పూర్వం సర్వపాపప్రణాశనమ్ | యః పఠేత్ ప్రాతరుత్థాయ స భవేద్ వైష్ణవో నరః || 13 || సర్వపాపవిశుద్ధాత్మా విష్ణుసాయుజ్యమాప్నుయాత్ | చాంద్రాయణసహస్రాణి కన్యాదానశతాని చ || 14 || గవాం లక్షసహస్రాణి ముక్తిభాగీ భవేన్నరః | అశ్వమేధాయుతం పుణ్యం ఫలం ప్రాప్నోతి మానవః || 15 || || ఇతి శ్రీవిష్ణుపురాణే శ్రీ విష్ణు అష్టోత్తర శతనాస్తోత్రమ్ || ఓం శ్రీలక్ష్మీ నారాయణాయ నమః #తెలుసుకుందాం #శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి #🌺లక్ష్మీనారాయణ🌺 #లక్ష్మినారాయణలు #నమో లక్ష్మీనారాయణాయ నమః
31 likes
18 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1K views 1 months ago
#దేవాలయం దేవుని వద్ద కొబ్బరి కాయను కొట్టేది ఎందుకు? సర్వదేవతలను పూజించే సమయాల్లోను, యజ్ఞ హోమదుల్లోను కొన్ని శుబకార్యాల్లోను కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతిక. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కోడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని, లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసు స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలను ఉంచమని అర్థం. -------------------------------------------------------- గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు? “ప్రదక్షిణం ” లో “ప్ర” అనే అక్షరము పాపాలకి నాశనము, “ద” అనగా కోరికలు తీర్చమని, “క్షి” అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మ జ్ఞానము ఇమ్మని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతి, పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కాబట్టి భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వా ప్రదిక్షణ అవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా నేను అన్ని వైపులా నుంచి నిన్నే అనుసరిస్తూ ద్యానిస్తున్నాని అర్థం. -------------------------------------------------------- ఏ గుడికి ఏ ఏ వేళల్లో వెళితే ఎంత పుణ్యం? ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు ఆలయానికి, సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళడం మంచిది. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు.కాబట్టి ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు. మన బుద్ధి ద్వార ఆపదలను తొలగించి మనల్నిసుఖంగా ఉండేలా చూస్తాడు. మహేశ్వరుడు లయకారుడు. కాబట్టి రోజు పూర్తి అవుతున్న సమయంలో దర్శిస్తే రెట్టింపు ఫలాన్ని అందిస్తాడు. తొందర పడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతున్ని దర్శించాలి. ------------------------------------------------------- గుడికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేసి వెళితే మరింత శుబమా? తలస్నానం చేసి వెళితే శరీరం మొత్తం శుచిగా ఉంచుకొని దర్శనం చేసుకున్నట్టు. మన నిత్య కృత్యాలతో మనసు ఎల్లప్పుడూ అనేక విధాలుగా కామ, క్రోధ, లోభ ,మదాలతో నిండి ఉంటుంది. ఆ మనసుని పవిత్రంగాపరిశుద్ధంగా చేసుకొని వెళ్ళే ఆధ్యాత్మిక శక్తి మనకు లేదు కనుక కనీసం శరీరం మొత్తాన్ని శుబ్రపరచుకొని దర్శించుకున్తున్నాము. ఈ శరీరంలా మనసుని శుచిగా, నిర్మలంగా ఉండేలా చెయ్యమనే అర్థమే పూర్తి స్నానం యొక్క భావము. -------------------------------------------------------- గుడిలో శడగోప్యం (శతగోపనం) తలమీద పెట్టడం ద్వారా ఎం ఫలితం వస్తుంది? దేవాలయం లో దర్శనం అయ్యాక తీర్ధం, శాదగోపం తప్పక తీసుకోవాలి. శతగోపనం అంటే అత్యంత రహస్యం. అది పెట్టె పూజారికి కూడా విన్పించానంతగా కోరికను తలచుకోవాలి. అంటే మీ కోరికే శదగోపం. మానవునికి శత్రువులైన కామం. క్రోధం, లోభం, మొహం మదం, మాత్సర్యములు వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవడం మరో అర్ధం. షడగోప్యం ను రాగి,కంచు, వెండి లతో తయారు చేస్తారు. పైన విష్ణు పాదాలు ఉన్ట్టాయి. షడ గోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటికివేలుతుంది. తద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశం తగ్గుతాయి. -------------------------------------------------------- దేవాలయాల్లో తల నీలాలు ఎందుకు సమర్పిస్తారు? బ్రతుకు జీవన పోరాటంలో మనం చెప్పే అబద్ధాలకు, చిన్న మోసాలకు అంతే ఉండదు. మనావుడు చేసే సర్వ కర్మల పాపఫలం వెంట్రుకలను చేరుతుంది. అందుకే పాపాలకి నిలయమైన వెంట్రుకలను స్వామికి సమర్పించి, స్వామి ఇంతవరకు పాపాలను వదిలేస్తున్నాను. ఇకపై మంచిగా, ధర్మంగా, న్యాయంగా ఉంటానని చెప్పడమే తలనీలాలు ఇవ్వడము. -------------------------------------------------------- దేవాలయపు వెనుక బాగాన్ని ఎందుకు తాకరాదు? చాల మంది ప్రదిక్షినలు చేస్తున్నప్పుడు దేవాలయం వెనుక భాగాన్ని అద్ది నమస్కరిస్తుంటారు. అలా చేయరాదు. ఆ బాగంలో రాక్షసులు ఉంటారు. అలాగే ఆలయానికి గజం దూరం నుంచి ప్రదిక్షిణ చేయాలి. -------------------------------------------------------- దేవాలయంలో ప్రదిక్షిణ చేసేటప్పుడు ఎలా నడవాలి? వింటి నుంచి వెలువడ్డ బాణంలా వెనేకేవరో తరుముతున్నట్టు ప్రదిక్షణం చేయరాదు. నిండు గర్భిని నడిచి నట్టు అడుగులో అడుగు వేస్తూ అడుగడుగునా దేవుణ్ణి స్మరిస్తూ ప్రదిక్షణలు పూర్తి చేయాలి. అలాగే అర్ధ రాత్రి, మధ్యాహానము దైవదర్శనం చేయరాదు. ------------------------------------------------------- గుడిలో ఎలా ఉండాలి? గట్టిగ నవ్వడము, అరవడము,ఐహిక విషయాల గురించి మాటలాడడం చేయరాదు. గుడి పరిసరాలని పరిశుబ్రంగా ఉంచాలి. బగవంతున్ని కనులార వీక్షించి ఆపై కనులు మూసుకొని ధ్యానం చేయాలి. దేవాలయం లో నిలుచుని తీర్థం తీసుకోవాలి. ఇంట్లో కూర్చుని తీర్దం పుచ్చుకోవాలి. దీపారాధన శివుడికి ఎడమ వైపు, శ్రీ మహా విష్ణువుకు కుడివైపు చేయాలి. అమ్మవారికి నూనె దీపమైతే ఎడమపక్కగా, ఆవు నేతి దీపమైతే కుడు వైపు వెలిగించాలి. #ధర్మ సందేహాలు 🚩 #ధర్మ సందేహాలు ##ధర్మ సందేహాలు -నిత్య సత్యాలు🙏🙏 #ధర్మ సందేహాలు #తెలుసుకుందాం
67 likes
3 comments 23 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
2K views 1 months ago
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏 #ఓం నమః శివాయ" అనేది శివునికి చేసే ఒక పవిత్రమైన పంచాక్షరి మంత్రం, దీని అర్థం "నేను శివునికి నమస్కరిస్తున్నాను" అని. ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన హిందూ మంత్రాలలో ఒకటి, దీనిని శైవ సంప్రదాయంలో ముఖ్యంగా భక్తులు ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ మంత్రం శివుని దివ్యతత్వాన్ని, ఆయన శుభప్రదమైన స్వభావాన్ని సూచిస్తుంది. మంత్రం యొక్క ప్రాముఖ్యత 💥 భక్తి మరియు సమర్పణ: "నమః" అంటే నమస్కారం, "శివాయ" అంటే శివునికి. కాబట్టి, ఈ మంత్రం శివుని పట్ల భక్తి మరియు సమర్పణను తెలియజేస్తుంది. పంచాక్షరి మంత్రం: ఇది ఐదు అక్షరాలతో కూడిన మంత్రం, ఇది శివుని ఐదు అంశాలను సూచిస్తుంది. శైవ మతంలో ముఖ్యమైనది: శైవ సంప్రదాయంలో ఇది అత్యంత ముఖ్యమైన మంత్రంగా పరిగణించబడుతుంది మరియు యజుర్వేదంలో దీనిని ప్రస్తావించారు. ఆధ్యాత్మిక ప్రయోజనాలు: ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఆంతరంగిక శాంతి లభిస్తుందని, ప్రతికూలత తొలగిపోతుందని నమ్ముతారు. శివుని శుభత: "శివ" అంటే కల్మషం లేనివాడు అని అర్థం. ఈ మంత్రం శివుని పరిశుద్ధమైన, శుభప్రదమైన రూపాన్ని ధ్యానించడానికి సహాయపడుతుంది. శివుని సౌందర్యం సాధారణ శారీరక అందంలా కాదు. అది లోతైన ఆధ్యాత్మిక ప్రకాశం, ఒకే సమయంలో శాంతి మరియు శక్తిని ప్రతిబింబిస్తుంది. ఆయన శరీరం భస్మంతో అలంకరించబడి ఉంటుంది, ఇది వైభవం కాదు.త్యాగం మరియు వైరాగ్యానికి సంకేతం. జటాజూటం నుండి పవిత్ర గంగానది ప్రవహించడం శుద్ధి మరియు జీవన శక్తిని సూచిస్తుంది. తలపై ఉన్న చంద్రుడు శాంత స్వభావాన్ని తెలియజేస్తాడు ఆయన నీలకంఠ రూపం లోకమంతటినీ రక్షించడానికి చేసిన మహా త్యాగాన్ని గుర్తు చేస్తుంది. మూడవ కన్ను మాయను దాటి ఉన్న పరమ జ్ఞానానికి ప్రతీక. శివుని నిజమైన సౌందర్యం ఆయన ద్వంద్వ స్వభావంలో ఉంది.ఒకవైపు భయంకర సంహారకుడు, మరోవైపు అపార కరుణ కలిగిన రక్షకుడు. ఒకవైపు మౌనంగా ధ్యానంలో లీనమైన యోగి, మరోవైపు భక్తుల పట్ల అపార ప్రేమ చూపే పరమేశ్వరుడు. ఆయన ఉనికి ప్రశాంతతతో కూడిన గాఢతను, సరళతతో కూడిన అనంతత్వాన్ని కలిగి ఉంటుంది. అందుకే శివుని సౌందర్యం కళ్లతో చూసే దానికన్నా, హృదయంలో అనుభవించే దివ్య అనుభూతి..* . “ఓం నమః శివాయ” 108 సార్లు జపం చేసే ప్రయోజనాలు 108 సార్లు జపం చేయడం వల్ల లాభాలు: 1. మనశ్శాంతి & ఒత్తిడి తగ్గింపు ఈ మంత్రం జపం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. టెన్షన్, ఆందోళనలు తగ్గుతాయి. 2. పాపక్షయం & శుద్ధి మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగి, ఆత్మ శుద్ధి జరుగుతుందని నమ్మకం. 3. శివ కృప లభిస్తుంది భక్తితో జపం చేస్తే Lord Shiva అనుగ్రహం పొందుతారు. జీవితంలో మంచి మార్పులు వస్తాయి. 4. ఆర్థిక స్థిరత్వం & విజయాలు నిరంతరం జపం చేయడం వల్ల పనుల్లో విజయం, ఆర్థికంగా స్థిరత్వం వస్తుందని చెబుతారు. 5. రక్షణ శక్తి పెరుగుతుంది దుష్ట శక్తుల నుంచి రక్షణ కలిగిస్తుంది. ఒక రకంగా కవచంలా పనిచేస్తుంది. 6. ఏకాగ్రత పెరుగుతుంది ధ్యానం సమయంలో జపం చేస్తే concentration పెరుగుతుంది, నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలుగుతారు. 7. ఆధ్యాత్మిక పురోగతి ఈ మంత్రం మోక్ష మార్గంలో ముందుకు నడిపిస్తుంది. 108 సంఖ్య ప్రాముఖ్యత: హిందూ ధర్మంలో 108 సంఖ్య పవిత్రమైనది 12 రాశులు × 9 గ్రహాలు = 108 జపమాలలో 108 మణులు ఉంటాయి ఎలా జపం చేయాలి? ఉదయం లేదా సాయంత్రం శుభ్రమైన ప్రదేశంలో కూర్చొని రుద్రాక్ష మాలాతో 108 సార్లు జపించాలి భక్తి, నమ్మకం చాలా ముఖ్యం..* . ధ్యాన నిమగ్నుడైన శివుడు ప్రపంచ దృష్టి మరల్చే అన్ని విషయాలకు అతీతమైన పరమ శాంతి, స్పృహ మరియు అతీంద్రియ స్థితిని ప్రతిబింబిస్తాడు. ఆదియోగిగా శివుడు గాఢమైన ధ్యానంలో కూర్చొని ఉంటాడు. ఆయన శుద్ధ స్పృహను, ఆలోచనలు, కోరికలు, ద్వంద్వాలు ఏవీ తాకని స్వచ్ఛమైన చైతన్య స్వరూపాన్ని ధరించి ఉంటాడు. ఆయన శాంత సాన్నిహిత్యం ప్రతి సాధకుడు చేరుకోవాలని కోరుకునే అంతర్గత మౌనాన్ని సూచిస్తుంది. ఆ స్థితిలో మనస్సు ప్రశాంతమవుతుంది మరియు ఆత్మ యొక్క నిజమైన స్వభావం బయటపడుతుంది. ఆ స్థితిలో ఎలాంటి కదలిక లేదు, అల్లరి లేదు కేవలం అపారమైన, అనంతమైన స్పృహ మాత్రమే ఉంటుంది, అది సమస్త సృష్టిని అనుసంధానం చేస్తుంది. ధ్యానమగ్న శివుని రూపం నిజమైన శక్తి చర్యలో కాకుండా స్థిరత్వంలో ఉందని, నిజమైన జ్ఞానం లోపలి నుండే ఉద్భవిస్తుందని బోధిస్తుంది. సాధకుడికి ఈ దృశ్యం అంతర్గత శాంతి మరియు ముక్తి వైపు మార్గదర్శకంగా మారుతుంది. ఈ పవిత్ర రూపంలో ధ్యానమగ్న శివుడు శాశ్వత చైతన్య స్వరూపం. ఆత్మను మౌనంలో కలిసిపోయి, తన దైవిక స్వభావాన్ని సాక్షాత్కరించుకోవడానికి ఆహ్వానిస్తాడు....* హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 #తెలుసుకుందాం #హర హర మహాదేవ 🙏 #ఓం నమః శివాయ #🕉️హర హర మహాదేవ 🔱 #om Arunachala siva🙏
49 likes
53 shares