తెలుసుకుందాం

8K Posts • 4M views
🌹🙏 FRIENDLY RELATIONS 🙏🌹🍀 ___________________________________________ All the Viewvers and users of Sharechat , Facebook , Instragram and other Social Media platforms are hereby informed not to force anything in online interactions. Don't for love , don't force emotional bonds and don't force connections , don't force conversations that are not naturally meant to grow. 🙏🍀🌿👏🌹💐🧿 Relationships formed through Social Media should always be based on mutual understanding , respect and willingness from both sides . Forcing feelings or expectations can lead to discomfort , misunderstanding and unnecessary complications. 🧿💐🌹👏🌿🍀🙏 Instead , let us maintain healthy and positive environment by valueing genuine friendship. Enjoy the content that other share , appreciate posts , exchange good wishes and engage in conversations that promote friendly and mutual happiness. 🙏🍀🌿👏🌹💐🧿 Let interactions remain light , respectful and meaningful. True connections will naturally develop over time without pressure. Until then, let us focus on spreading positivity , kindness and good vibes across all platforms.🧿💐🌹👏🌿🍀🙏 __________________________________________ HARI BABU.G _________________________________________ #తెలుసుకుందాం #😃మంచి మాటలు #✌️నేటి నా స్టేటస్ #🌅శుభోదయం #నా మనసులోని మాటలు...! 💕
12 likes
7 shares
*🌻 'మకరతోరణం' అంటే ఏమిటి? దాని విశేషం ఏమిటి? ఈరోజు తెలుసుకుందాం. 🌻* 🍃🌺 మన దేవాలయాలలో దేవతా/దేవుని విగ్రహాల వెనుక అమర్చిన తోరణం మధ్యభాగంలో కనుబొమ్మలు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షసముఖం కనిపిస్తుంది. దానికే 'మకరతోరణం' అని పేరు. 🍃🌺 ఈ రాక్షసముఖాన్ని తోరణం మధ్యభాగంలో అమర్చడానికి గల కారణం గురించి స్కంద మహాపురాణంలో ఒక కథ ఉంది. పూర్వం "కీర్తిముఖుడు" అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరాలను పొంది, ఆ బలపరాక్రమాలతో సమస్త భువనాల సంపదలను తన సొంతం చేసుకున్నాడు. 🍃🌺 చివరకు పరమశివుని పత్నియైన జగన్మాతను కూడా పొందాలని ఆశించాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మ్రింగివేయమని భీకరమైన అగ్నిని సృష్టించాడు. పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు ఆ జ్వాలాగ్ని ఆ రాక్షసుణ్ణి తరిమింది. 🍃🌺 మరణం లేకుండా వరం పొందినప్పటికీ, శివుని ఆజ్ఞ వల్ల ఆ అగ్ని తనను ఎక్కడ దహించి వేస్తుందో అని భయంతో లోకాలన్నీ తిరిగి, ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుని శరణు కోరాడు. భక్తసులభుడైన బోళాశంకరుడు ఆ రాక్షసుణ్ణి రక్షించటానికి ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుటి మూడవ కన్నుగా ధరించాడు. 🍃🌺 ఆ తరువాత కీర్తిముఖుడు తనకు తీవ్రమైన ఆకలి ఉందని, తినడానికి ఏదైనా ఇవ్వమని మహాదేవుని ప్రార్థించాడు. అప్పుడు శివుడు "నిన్ను నువ్వే తిను" అని చెప్పాడు. శివుని ఆజ్ఞ మేరకు కీర్తిముఖుడు మకర (మొసలి) రూపం ధరించి తనను తాను తోక భాగం నుండి కంఠం వరకూ తిన్నాడు. 🍃🌺 అయితే తన తలను తానే ఎలా తినాలో తెలియక, ఇంకా ఆకలి తీరక మళ్లీ శివుని ప్రార్థించాడు. ఆ ప్రార్థన విన్న పరమశివుడు, ఇకపై దేవాలయాలలో దేవతామూర్తుల వెనుక తోరణాగ్రభాగాన్ని అలంకరించి, దైవ దర్శనానికి వచ్చే ప్రజలలోని అహంకారం, దురాశ వంటి దుష్ట వికారాలను తినుతూ ఉండమని వరమిచ్చాడు. నీవు అందరికీ పూజనీయుడవుతావు అని అనుగ్రహించాడు. 🍃🌺 అప్పటి నుండి కీర్తిముఖుడు దేవాలయాలలో దేవతా విగ్రహాల వెనుక తోరణ మధ్యభాగంలో తన మకరముఖంతో స్థిరపడి, భక్తులలోని అహంకారం, దురాశ వంటి దుష్ట భావాలను తొలగిస్తున్నాడు. 🍃🌺 ఈ కారణంగానే దేవతామూర్తుల వెనుక మధ్యభాగంలో అమర్చబడిన తోరణాన్ని 'మకరతోరణం' అని పిలుస్తారు. మన సంస్కృతిలో ప్రతి అంశానికి పురాణాల్లో ఒక కథ ఉంటుంది. __________________________________________ Haribabu.G ___________________________________________ #✌️నేటి నా స్టేటస్ #🏹 జై శ్రీ రామ్! #🙏రామ నవమి శుభాకాంక్షలు🌸 #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #తెలుసుకుందాం
5 likes
7 shares
ఏ పురాణంలో ఏముందో తెలుసుకుందాము 1. మత్స్యపురాణం 2. కూర్మపురాణం 3. వామన పురాణం 4. వరాహ పురాణం 5. గరుడ పురాణం 6. వాయు పురాణం 7. నారద పురాణం 8. స్కాంద పురాణం 9. విష్ణుపురాణం 10. భాగవత పురాణం 11.అగ్నిపురాణం 12. బ్రహ్మపురాణం 13. పద్మపురాణం 14. మార్కండేయ పురాణం 15. బ్రహ్మవైవర్త పురాణం 16.లింగపురాణం 17.బ్రహ్మాండ పురాణం 18. భవిష్యపురాణం ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది. *మత్స్యపురాణం* మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు. *కూర్మపురాణం* కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది. *వామన పురాణం* పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, ఋతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి. *వరాహపురాణం* వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి. *గరుడ పురాణం* గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలు తెలుపడం జరిగింది. *వాయుపురాణం* వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి. *అగ్నిపురాణం* అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు. *స్కందపురాణం:* కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి. *లింగపురాణం* లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది. *నారద పురాణం* బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. *పద్మపురాణం* ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది. *విష్ణుపురాణం* పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది. *మార్కండేయ పురాణం* శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి. *బ్రహ్మపురాణం* బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు. *భాగవత పురాణం* విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు. *బ్రహ్మాండ పురాణం* బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది. *భవిష్యపురాణం* సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది. *బ్రహ్మావైపర్తపురాణము * ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, *రోగనివృత్తిసాధనాలు, తులసీ, సాలగ్రామమహత్మ్యం ఉంటాయి #తెలుసుకుందాం
77 likes
10 shares