తెలుసుకుందాం
8K Posts • 4M views
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
888 views 14 days ago
విజయాలకి భక్తి మార్గాలు.........!! సాధారణంగా రోజూ చేసే పూజాదికాలతోపాటు, గ్రహస్థితి బాగా లేదని తెలిసినపుడు, ఆయా గ్రహాలకు జపాలు, శాంతులు చేయించాలని చెబుతారు. దాని వలన ఆ గ్రహ ప్రభావం తగ్గుతుందని కూడా అంటారు. అలాగే మనం ఏదైనా ఓ పని జరగాలని కోరున్నప్పుడు ఆ పని సవ్యంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే వివిధ దేవతా స్తోత్రాలు పఠించాలని చెబుతున్నారు పెద్దలు. ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠించాలి, ఏ దేవతా పూజ చేయాలనే వివరాలు మీకోసం... 1. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నపుడు మంచి అవకాశాలు రావాలన్నా, చేసే ప్రయత్నాలు ఫలించాలన్నా రోజూ సూర్యాష్టకం, ఆదిత్య హృదయం చదవాలి. సూర్యధ్యానం చేయాలి. 2. ఇక వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నపుడు "కనకధారా స్తోత్రం" రోజు చదివితే ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుందట. 3. ఇక మంచి విద్య రావాలన్నా, చదువులో ఏకాగ్రత కుదరాలన్నా రోజూ హయగ్రీవ స్తోత్రం" పిల్లలతో చదివించాలి. అలాగే "సరస్వతి ద్వాదశ నామాలు" చదువుకోమనాలి. 4. కుటుంబ వ్యక్తుల మధ్య మంచి సత్సంబంధాలకు విష్ణు సహస్రనామం, లలితా సహస్ర నామం పారాయణ చేయాలిట. 5. పిల్లలు కలగాలని కోరుకునే దంపతులు "గోపాల స్తోత్రం " చదివితే మంచిదట. అలాగే గర్భవతిగా వున్న స్త్రీ ఈ స్తోత్రాన్ని రోజు పఠిస్తే సుఖప్రసవం అవుతుంది అంటారు పెద్దలు. 6. ఇక వివాహానికి "లక్ష్మీ అష్టోత్తర పారాయణం" చెయ్యాలి. మంచి సంబంధం దొరికి, పనులన్నీ చక్కగా జరగాలని, పెళ్లితంతు సక్రమంగా జరగాలని సంకల్పించి ఈ పారాయణాన్నీ రోజు చేస్తే ఆ కోరికలు తీరుతాయట. 7. ఋణబాధలు ఇబ్బంది పెడుతుంటే రోజూ నవగ్రహ స్తోత్రం చదువుకోవాలిట. అలా చదివితే ఆ ఇబ్బందులలోంచి బయట పడతారుట. 8. ఇవే కాక ఇక ఇతర ఏ కోరికలు సిద్ధించాలన్నా విష్ణు సహస్ర నామ పారాయణ చేస్తే చాలు ఆ కోరికలన్నీ తీరుతాయట. #తెలుసుకుందాం #success #విజయం #విజయమంత్రం
13 likes
11 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
670 views 29 days ago
. స్త్రీని "గృహలక్ష్మి" అని పిలుస్తారు, కాబట్టి ఆమె చేసే దీపారాధన ఆ ఇంటిని ఆధ్యాత్మికంగా రక్షిస్తుంది. 1. దీపారాధన నియమాలు (Lighting the Lamp) పురాణాల ప్రకారం దీపారాధన అనేది కేవలం వెలుగును ఇవ్వడం కాదు, అది అజ్ఞానాన్ని పోగొట్టి చైతన్యాన్ని నింపే ప్రక్రియ. సమయం: సూర్యోదయానికి ముందు (బ్రాహ్మీ ముహూర్తం) మరియు సూర్యాస్తమయం తర్వాత సంధ్యా సమయంలో తప్పనిసరిగా దీపం వెలిగించాలి. దిశలు: * తూర్పు: ఆరోగ్యం మరియు గ్రహ దోష నివారణ. ఉత్తరం: ఐశ్వర్యం మరియు కార్యసిద్ధి. (పడమర, దక్షిణం వైపు దీపపు ప్రమిద ముఖం ఉండటం గృహస్థులకు అంత శ్రేయస్కరం కాదు). వత్తుల సంఖ్య: రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి వెలిగించాలి (ఇది దంపతుల ఐక్యతకు ప్రతీక). మూడు వత్తులు వేయడం వల్ల సంతాన వృద్ధి కలుగుతుందని పురాణోక్తి. నూనె/నెయ్యి: ఆవు నెయ్యితో దీపారాధన అత్యంత శ్రేష్ఠం. అది సాధ్యపడనప్పుడు నువ్వుల నూనెను ఉపయోగించాలి. వేరుశనగ నూనెను దీపారాధనకు ఉపయోగించకూడదని 'నారద సంహిత' చెబుతోంది. 2. స్త్రీల 'సంధ్యా వందనం' (Evening Rituals) స్త్రీలకు పురుషుల వలె యజ్ఞోపవీతధారణ మరియు గాయత్రీ మంత్ర జపం విధిగా లేకపోయినప్పటికీ, వారు చేసే 'సంధ్యా దీపారాధన' మరియు 'తులసి పూజ' సంధ్యావందనంతో సమానమైన ఫలితాన్ని ఇస్తాయి. తులసి కోట పూజ: సాయంత్రం వేళ తులసి కోట వద్ద దీపం ఉంచి, మూడు ప్రదక్షిణలు చేయడం వల్ల అకాల మృత్యువు తొలగి సౌభాగ్యం కలుగుతుంది. శుచిత్వం: సంధ్యా సమయంలో నిద్రపోవడం, ఆహారం తీసుకోవడం, తల దువ్వుకోవడం వంటివి స్త్రీలు చేయకూడదు. ఈ సమయంలో లక్ష్మీదేవి గృహంలోకి ప్రవేశిస్తుందని 'పద్మ పురాణం' చెబుతోంది. శ్లోక పఠనం: దీపం వెలిగించిన తర్వాత "దీపం జ్యోతి పరబ్రహ్మ..." మరియు "సౌభాగ్య లక్ష్మి" స్తోత్రాలను పఠించడం వల్ల ఇంటిపై ఉన్న నకారాత్మక శక్తి (Negative Energy) తొలగిపోతుంది. 3. ముఖ్యమైన సూక్ష్మ ధర్మాలు అగ్నిని ఆర్పడం: దీపాన్ని నోటితో ఊది ఆర్పకూడదు. పువ్వుతో లేదా వత్తిని వెనక్కి లాగడం ద్వారా శాంతింపజేయాలి. అక్షర బలం: దీపారాధన సమయంలో గృహిణి మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఆమె కోపంతో దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో అశాంతి పెరుగుతుందని 'సప్రమాణ జ్యోతిస్సరము' హెచ్చరిస్తోంది. ప్రమిదల శుద్ధి: ప్రతిరోజూ ప్రమిదలను శుభ్రం చేయాలి. పాత వత్తులను తీసివేసి కొత్త వత్తులతో దీపం వెలిగించడం వల్ల నిత్య నూతన ఐశ్వర్యం లభిస్తుంది. #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
13 likes
14 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
730 views 21 days ago
పెద్దల మాట చద్దన్నం మూట సామెత బాగా పాపులర్ చద్దన్నంతో ఎన్ని లాభాలు ఉన్నాయో చూద్దాం:- 1. టిఫిన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఇడ్లీ, దోశ, చపాతి కానీ రాత్రి వండిన అన్నాన్ని తెల్లవారి ఆవకాయ, పెరుగు, కలుపుకుని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ నంజుకుని తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. 2. సద్దన్నం ఫులవడం ఒక రాత్రి ఉండడం వల్ల పెరిగే పోషకలు. ఉదాహరణకు 50 గ్రాముల అన్నంను తీసుకొని రాత్రి పుల్లపెట్టినట్లయితే1.6 మిల్లీగ్రాములు ఉన్న ఐరన్ 35 మిల్లీగ్రాములుగా పెరుగుతుంది. అలాగే పొటాషియం మరియు క్యాల్షియంలు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి. 3. రాత్రిపూట మిగిలిన అన్నంలో కొంచెం పాలు పచ్చి ఉల్లిపాయ ముక్కలు అల్లం కరివేపాకు జీలకర్ర వేసి కలిపి దానిలో కొంచెం పెరుగు వేసి పొద్దునే తింటే అనారోగ్య సమస్యలు అన్ని తొలగిపోతాయి ఎముకలకు బలం కూడా చేకూరుతుంది. 4. వేడి ఎక్కువగా ఉన్నవారు చద్దన్నంలో పెరుగు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని తింటే వేడి తగ్గుతుంది. 5. చద్దన్నం తింటే మంచిదే కదా అని మధ్యాహ్నం సాయంత్రం తిందామంటే కుదరదు. తెల్లారిన తర్వాత కూడా ఎక్కువ సమయం అలాగే ఉంచేస్తే పాడైపోయే అవకాశం ఉంది అందుకే ఉదయం 9:00 గంటల్లోపే తినేయాలి. 6. పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలకు సైతం ఈ చద్దన్నం తగ్గిస్తుంది. 7. పలు చర్మ వ్యాధుల నుండి చద్దన్నం కాపాడుతుంది. #తెలుసుకుందాం
10 likes
12 shares