రాజు కుమార్
474 views
01/02/2026 పత్రికా ప్రకటన *కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గిలి మండలం బొండు మడగల గ్రామం* : *బొందిమడుగుల రమేష్ ఎమ్మార్పీఎస్ ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దాడి జరిగిన ప్రదేశాన్ని సందర్శించి అంతిమయాత్రలో పాల్గొన్న రాజు కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇన్చార్జ్ నాయకులు* కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గిలి మండలం బొండు మడగల గ్రామం లో బొంతిరాళ్ల రోడ్డులో ఇంటి నుంచి వాకింగ్ చేస్తున్న వ్యక్తిని ట్రాక్టర్ తో గుద్ది సుమారు పదిమంది దాకా దాడి చేసి రాడుతో కొట్టి తలకు హత్య చేసి చంపడం జరిగింది బోండుమడుగుల రమేష్ MRPSS ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు 30 తేదీ దినమున సాయంకాలం కర్నూలు జిల్లా బొందిమడుగుల గ్రామం సమీపంలోని బొంతిరాళ్ల రోడ్డులో ఇంటి నుంచి వాకింగ్ బయలుదేరిన సమయంలో అదే గ్రామానికి చెందిన కొంతమంది మైనార్టీ వ్యక్తులు యువకులతో పాటు మరి కొంతమంది కలిసి ఆయన వెనుక నుంచి ట్రాక్టర్ తో ఢీ కొట్టి రాడ్ తో కొట్టి చంపడానికి ప్రయత్నించారు దారుమించు కొంతమంది చూసి దారిలో బొండుమడుగుల రమేష్ స్పృహ తప్పిపోయిన తర్వాత రాడ్లతో రాడుతో కొట్టి పారిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆయనను మెరుగైన చికిత్స కోసం హుటా హుటిన కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కర్నూల్ నగర మందు ప్రైవేట్ హాస్పిటల్ నందు ట్రీట్మెంట్ తీసుకుంటూ తలకి గాయమైనందున శనివారం ఉదయం 8:30కు చనిపోవడం జరిగింది ఈరోజు తన సొంత ఊరిలో బొండుమడుగుల గ్రామంలో అంత్యక్రియలు ముగించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా దళిత జేఏసీ ,YSRCP, MRPS , BSP, నాయకులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు జై భీమ్ జై భారత్ 🇪🇺🇪🇺🇪🇺 #🏛️రాజకీయాలు