ఈ స్తంభాలు సంగీతాన్ని వినిపిస్తాయ్!
విజయనగర సామ్రాజ్య కళా వైభవానికి నిదర్శనం హంపిలోని విజయ విఠల ఆలయం. 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలోని రాతి స్తంభాలను తాకితే చాలు.. సప్తస్వరాలు వినిపిస్తాయి. సంగీత వాయిద్యాల శబ్దాన్ని పలికించే ఈ 'మాయా స్తంభాల' వెనుక ఉన్న రహస్యం నేటికీ శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు. నాటి శిల్పుల అద్భుత సృజనాత్మకతకు, చారిత్రక వారసత్వానికి ఈ కట్టడమే నిదర్శనం. ఇలాంటి వింత విషయాలు 'వంద రోజుల్లో- వంద వింతలు'లో..
#📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢