Sekhar Digitals & Reporter 9603197203
751 views
3 months ago
#🗞️అక్టోబర్ 26th అప్‌డేట్స్💬 #వాతావరణం #ప్రకృతి వాతావరణం #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం ... తుఫాను “మోన్థా”పై ప్రభుత్వ సన్నద్ధత – అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులు నియామకం సమన్వయ బాధ్యతల్లో సిసోడియా, అజయ్ జైన్ కీలక పాత్ర అమరావతి, అక్టోబర్ 26: బంగాళాఖాతంలో ‌ ఏర్పడిన వాయుగుండం తీవ్రత పెంచుకుంటూ తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అక్టోబర్‌ 28న “మోన్థా” అనే తీవ్ర తుఫాను రూపంలో ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అప్రమత్తమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌ తీర ప్రాంత జిల్లాలన్నింటికీ సీనియర్‌ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. వీరు తక్షణమే తమ తమ జిల్లాలకు చేరుకొని సైక్లోన్‌ కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేసి, కలెక్టర్లతో సమన్వయంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్‌.పి. సిసోడియాను తూర్పు తీర ప్రాంతాల జోనల్‌ ఇన్‌చార్జిగా నియమించారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నుండి చిత్తూరు వరకు సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. అజయ్‌ జైన్‌కు శ్రీకాకుళం జిల్లా నుండి కోనసీమ జిల్లాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇతర జిల్లాలకు కూడా ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. కె.వి.ఎన్‌. చక్రధరబాబు (శ్రీకాకుళం), పట్టణశెట్టి రవి సుబాష్‌ (విజయనగరం), నారాయణ భారత్‌ గుప్తా (మన్యం), వదరేవు వినయ్‌ చంద్‌ (ఏఎస్‌ఆర్‌), కె. కన్నా బాబు (తూర్పు గోదావరి), వి.ఆర్‌. కృష్ణ తేజా (కాకినాడ), విజయరామరాజు (కొనసీమ), వి. ప్రసన్న వెంకటేశ్‌ (పడమర గోదావరి), కాంతిలాల్‌ డాండే (ఏలూరు), అమ్రపాలి కటా (కృష్ణా), శశిభూషణ్‌ కుమార్‌ (ఎన్‌టిఆర్‌), ఎం. వేను గోపాల్‌ రెడ్డి (బాపట్ల), కోనా సశిధర్‌ (ప్రకాశం), డా. ఎన్‌. యువరాజ్‌ (నెల్లూరు), పి. అರುణ్‌ బాబు (తిరుపతి), పి.ఎస్‌. గిరీశా (చిత్తూరు) జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు. వీరు తుఫాను సమయంలో ఉపశమన, రక్షణ, సహాయక చర్యలను సమన్వయంగా నిర్వహించాలి. ప్రతి బాధిత కుటుంబానికి సాయం చేరేలా పర్యవేక్షించాలి. తుఫాను అనంతరం నష్టాల అంచనా, పరిహారం పంపిణీ, సాధారణ జీవనం పునరుద్ధరణ వరకు ఈ అధికారులు తమ బాధ్యతలు కొనసాగిస్తారు. వీరు అన్ని శాఖల మధ్య (రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ఇంధనం, రోడ్లు & భవనాలు, నీటివనరులు, ఆరోగ్యం) సమన్వయం తో పనిచేయాలని సూచించారు. అనుభవజ్ఞులైన అధికారులు సిసోడియా మరియు అజయ్‌ జైన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం తుఫాను “మోన్థా” ప్రభావాన్ని తగ్గించే దిశగా పటిష్టంగా ఏర్పాట్లు చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పుకార్లను నమ్మవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.