*_శని శింగణాపూర్ విశిష్టత!_*
శని శింగణాపూర్
నవ గ్రహాలలో ఏడో వాడు, సూర్య భగవానుడికి ఛాయా దేవి కి కలిగిన కుమారుడే శని దేవుడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. నిజానికి భక్తులు శనీశ్వరుడు ని భక్తి తో, శ్రద్ధతో ఎవరికి అన్యాయం చెయ్యకుండా ధర్మపథాన నడుచుకుంటే కరుణించి చల్లగా చూస్తాడని ప్రతీతి ..శనీశ్వరుడి కుడి చేతి లో దండం, ఎడమ చేతి లో కమండలం, ఖడ్గం ఉంటుంది ..శనీశ్వరుడి వాహనం కాకి ..
ఇక శని భార్య మందాదేవి మరియు లక్ష్మి దేవి సోదరి అయినా జేష్టాదేవి. ఈమెనే అంతా దారిద్ర దేవత అని పిలుచుకుంటున్నారు.శని భగవానుడు విషుణువు కి తోడల్లుడు, యమధర్మరాజు కి సోదరుడు. గ్రహాలకి యువరాజు. శని కుమారుల పేర్లు మంది, కులగున్. ఇక నలుడు, హరిచ్చంద్రుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యార్జునుడు ఇంకా అనేక మంది శని దేవుడి వలన కష్టాలు పొంది మరల మంచి ప్రవర్తన తో సుఖాలను పొందారు. శని దేవుడి దూషణ సర్వ దేవతలను తిట్టడం తో సమానమని చెప్తారు. ఆయనని పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం ఉంటుంది. త్రేతాయుగం లో లంక లో రావణుండై అధీనం లో ఉన్న ఆంజనేయుడుని శనీశ్వరడు విడిపించాడని ఒక కధనం. అందుకే హనుమత్ దీక్ష లో ఉన్న వారిని, మందుడు కి ఇష్టమైన నల్లని దుస్తులు ధరించే అయ్యప్ప భక్తులను ఎప్పుడు బాధించడని చెప్తారు.
మహా రాష్ట్ర లోని శని శింగణాపూర్ గ్రామం లో ఉన్న శని దేవుని ఆలయం ఒక అద్భుతమైన పుణ్య క్షేత్రం. ఇక్కడి దైవం స్వయంభువు అనగా భూమి నుంచి స్వయంగా ఉద్బవించిన నల్లని రాతి విగ్రహం. అనాది కలం నుంచి కొలువై ఉన్నాడని తెలుస్తుంది. కలియుగం ప్రారంభం నుంచి ఈ రాతి విగ్రహం వున్నదని పేర్కొంటారు. గొర్రెల కాపరి చెప్పిన చరిత్ర కధనం ప్రకారంగా
ఒక రోజు గొర్రెల కాపరి పదునైన చువ్వ తో రాతి ని ముట్టుకొనగా దాని నుంచి రక్తం కారడం ప్రారంభించింది .ఈ ఘటన తో గొర్రెల కాపరి దిగ్బ్రాంతి చెందగా వెంటనే ఊరు మొత్తాన్ని పిలుచుకు వచ్చాడు . ఆ అద్భుతాన్ని గ్రామ ప్రజల అందరు చూసారు .. ఆ రాత్రి గొర్రెల కాపరి కలలో శనీశ్వరుడు కనిపించి తానూ శనీశ్వరుడు ని అని .. రాతి విగ్రహం లో వెలిసానని చెప్తాడు. నల్ల రాతి విగ్రహానికి దేవాలయం కట్టించాలి అని శని ని అడిగినప్పుడు ఆకాశం తన నీడ అని …. తనకి ఎలాంటి నీడ అవసరం లేదని ప్రతి రోజు తనకి తైలాభిషేకం చెయ్యాలని ఆ గొర్రెల కాపరికి ఆదేశం ఇస్తాడు …. అంతే కాకుండా తన వలన ఈ గ్రామానికి ఎలాంటి దొంగల భయం ఉండదని చెప్పాడు అప్పటినుంచి ఈ గ్రామానికి దొంగల భయం లేదు … కన్నాలు వేసి సొమ్ము వేసి దొంగిలించడం అంటూ జరగదు.
శని దేవుడు ఆ రకం గా తనకి పూజలు జరగాలని ఆదేశించాడు కాబట్టే ఈ రోజు వరకు కూడా ఎలాంటి కప్పు గాని, దేవాలయం గోపురం గాని ఈ శని దేవుడి కి ఉండదు … ఆరు బయట ప్రదేశం లోనే చుట్టూ కొన్ని రాళ్ళని ప్రహారిగా పెట్టి నువ్వుల నూనెతో, నువ్వులతో … దేవుడికి అభిషేకం చేస్తూ పూజిస్తారు. ఇక దొంగల భయం అసలు లేని ఊరే శని శింగణాపూర్
ఇక ఈ క్షేత్రం కి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది అదేమిటి అంటే …. ప్రతి మనిషి కి జీవితం లో మూడు దస్సల్లో యేలినాటి శని వస్తుంది …ఏడు సంవత్సరాలు ఉండే ఈ శని బాధల్ని, తప్పించుకోవాలి అంటే ఇక్కడ ప్రతి శనివారం తైలాభిషేకం చేస్తే శని గ్రహ బాధల్ని తొలగించుకోవచ్చు అని నమ్ముతారు.
యేలిననాటి శని వున్న వారు హనుమంతుడిని పూజిస్తే శని వలన కలిగే ఈతి బాధలను తగ్గించుకోవచ్చని నమ్ముతారు ..త్రేతాయుగం లో రావణుడి బారి నుండి తనను కాపాడాడు కాబట్టి కృతజ్ఞత గా హనుమంతుని ఎవరైతే పూజిస్తారో, మరి ముఖ్యం గా శనివారం లో పూజిస్తే వారికి ఎలాంటి బాధలు ఉండవని వరం అందిస్తాడు … శని దేవుడు… మొత్తం కాకున్నా చాలావరకు బాధలను తగ్గించగలను అని మాట ఇస్తాడు …అప్పటినుంచి హనుమంతుడిని పూజిస్తారు అలాగే శని దశ నడుస్తున్నవారు శివుడిని పూజిస్తే కూడా ఫలితం ఉంటుంది అని విశ్వసిస్తారు. #🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు