*_అహల్య రాయి కాలేదు_*
*_రామాయణం మనకు ఏం చెప్పింది?_*
*ఇంద్రుడివల్ల అహల్య మోసపోలేదు. తప్పు చేసినందుకుగానూ రాయిలా జడపదార్థమై పడి ఉండమని గౌతముడు శపించినట్టుగానే చెప్పింది వాల్మీకి రామాయణం*.
*చేసిన తప్పుకు అహల్య కూడా సంఘ బహిష్కరణకు గురై అన్నిటినీ కోల్పోయి జడపదార్థమై ఒక రాయిలా జీవనాన్ని సాగిస్తోంది.*
*అప్పటికే చాలా కాలం గడిచిపోయింది..*
*_తప్పులు చెయ్యడం మానవ నైజం!_*
*_ఎంత కాలం ఒక మనిషికి శిక్ష కొనసాగుతుంది?_*
*ఇక అహల్యను సహజమైన జీవితంలోకి తీసుకురావాలన్న ఆలోచనతో విశ్వామిత్రుడు జడపదార్థంలా, రాయిలా, జీవచ్చవంలా పడి ఉన్న అహల్య ఆశ్రమానికి రాముణ్ణి తీసుకువెళతాడు*.
*తన ఆశ్రమంలో రాముని పాదం పడగానే అహల్యకు ప్రాణం లేచివచ్చింది.*
*స్వయానా రాముడే వెళ్లి అహల్యను పరిగణించడం జరిగాక ఇతర ఆశ్రమవాసులు కూడా అహల్యను తమలోకి తీసుకున్నారు*.
*అప్పటి నుంచి ఆమె మామూలు మనిషి అయింది*.
*అలా రాముడి పాదం వల్ల అహల్య పాపం కడగబడింది.* *“కామిని పాపము కడిగిన పాదము” అని అన్నమయ్య అన్నారు*.
*అహల్య రాయిగా మారడమూ, రాముడి పాదం తగలగానే మళ్లీ స్త్రీ అవడమూ వాల్మీకి రాసింది కాదు.*
*తరువాతి నాళ్లలో మార్చి చెప్పబడింది అది*.
*తప్పు జరిగాక, శిక్ష అనుభవించాక ఎవరినైనా మళ్లీ మామూలు జీవనంలోకి తీసుకురావాలి అన్న విశ్వామిత్రుడి చింతన విప్లవాత్మకమైంది ఆపై మహోన్నతమైంది*.
*ఇది రామాయణం మనకు నేర్పే సంస్కారం.*
*రామాయణంలో ఉన్నదాన్ని మార్చి అహల్య రాయిగా మారి ఆపై రామ పాదం సోకి మళ్లీ స్త్రీ అయిందని చెప్పడం వల్ల రామాయణం మనకు చెప్పిన మహోన్నతమైన తత్త్వం మనకు అందకుండా పోయింది*.
*మహర్షులు, మహనీయులు చెప్పినదాన్ని ఉన్నదున్నట్టుగానే తీసుకుని అర్థం చేసుకోవాలి*
#మన సంప్రదాయాలు సమాచారం