Ravi  Talluri
ShareChat
click to see wallet page
@91775
91775
Ravi Talluri
@91775
feelgood
_*పంచ మహాపాతకములు ఏవి?*_ *బంగారాన్ని దొంగలించటము, మద్యం సేవించటము, బ్రహ్మ హత్య, గురుపత్నితో సరసము, ఈ నాలుగు పాపాలను చేసేవారితో స్నేహం. ఇవి పంచ మహాపాతకములు. చూసారా దుష్టులతో సాంగత్యం కూడా మహ పాతకం అన్నమాట*. _*దేవతల వాహనములు ఏమిటి ?*_ *గంగానదీ దేవికి మొసలి;* *యమునా నదీ దేవికి తాబేలు,* *ఇంద్రునకు ఐరావతము,* *చంద్రునకు వాయుదేవునకూ లేడి*. *శివునికి వృషభము*. *సూర్యుడునకు ఏడు అశ్వాలు పూన్చిన రథం.* *శనికి కాకి, గ్రద్ధ.* *లక్ష్మీదేవికి గుడ్లగూబ.* *రతీ మన్మథులకు చిలుక*, *బ్రహ్మ, సరస్వతులకు హంస.* *పార్వతీదేవికి సింహము*. *అమ్మవారికి సింహం, పెద్దపులి*. *హనుమంతునకు ఒంటె.* _*పెళ్ళయిన తర్వాత అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు?*_ *అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహాపతివ్రత ఆకాశం వైపు పెళ్ళి సమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసార జీవనం సుఖమయంగా కొనసాగుతుందని పండితుల నమ్మకం. మాఘ మాసం, పంచమాసాలకాలం తప్ప ఈ నక్షత్రం సాయంత్రవేళ కనబడదు*. *రాత్రిపూట చంద్రుడ్ని, నక్షత్రాలను చూడటంవల్ల కంటి శక్తి పెరుగు తుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత బలపడుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షిమండలంలో వుండే చిన్న నక్షత్రం. శిశిర, వసంత, గ్రీష్మఋతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్థరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారు జామున ఈ నక్షత్రం కనిపిస్తుంది. అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వైపు చూడండి. '?' మార్కు ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి.* *ఖచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలో ఉంటుంది* #మన సంప్రదాయాలు సమాచారం
*_పాజిటివ్ థింకింగ్:: ఒక్కోడిది ఒక్కో బాధ::_* *మహాభారతంలోని ప్రముఖులైన ఇద్దరు మహోన్నతులు - కృష్ణుడు, కర్ణుడు మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది*. *కర్ణుడు కృష్ణుడుని అడిగాడు...* *నేను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది..* *అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పా..కాదే*. *ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకునిరాకరించారు..* *ఎందుకంటే నేను క్షత్రియుని కాను అన్న కారణంతో*.. *పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడేవరకూ ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టారు*. *పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు*.. *ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది*.. *ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పటం వెనకనున్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే..* *నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే*. *అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని చెప్పాడు కర్ణుడు...* *దానికి కృష్ణుడు సమాధానంగా కర్ణునికి చెప్పాడు*... *నేను పుట్టటమే కారాగారంలో పుట్టాను*.. *నేను పుట్టటం కంటే ముందే నా చావు నాకోసం కాచుకుని కూర్చుంది*. *నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లితండ్రి నుండీ వేరుచేయబడ్డాను*.. *చిన్నతనంలో నువ్వు కత్తులు , రధాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు*.. *నేను గోశాలలో పేడ వాసనల మధ్యన ఉన్నాను...* *నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి..అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు..కానీ ఎన్నో దాడులు ఎదుర్కున్నాను*.. *నాచుట్టూ ఉన్న వారు వారి సమస్యలకు నేనే కారణం అని నన్ను నిందించేవారు కూడా*.. *నాకు సైన్యమూ లేదు, విద్య కూడా లేదు*.. *మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచీ అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడానూ*. *సాందీపుని రుషి వద్ద నా పదహారో ఏట నా చదువు ప్రారంభం అయ్యింది*. *జరాసంధుని బారి నుంచీ కాపాడుకోవటానికి నా గోకులాన్నంతా నేను యమునవడ్డునుంచీ దూరంగా తీసుకెళ్ళాల్సివచ్చింది*.. *అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డపేరు నాకొచ్చింది*. *సరే ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో నీకు మంచిపేరు వస్తుంది*... *అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు...పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకూ నేనే కారణం అన్న నింద వేస్తారు అందరూ నాపైన*. *ఒకటి గుర్తుంచుకో కర్ణా..* *జీవితంలో సమస్యలు, సవాళ్ళు అందరికీ ఉంటాయి*.. *జీవితం ఏ ఒక్కరికీ పూలబాట కాదు..అన్నివేళలా అంతా సవ్యంగానే ఉండదు..* *దుర్యోధనుడు అవనీ యుధిష్టరుడు అవనీ అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసినవారే*. *ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుసు*. *మనకు ఎంత అన్యాయం జరిగినా..* *మనకు ఎన్ని పరాభవాలు జరిగిన..* *మనకు రావల్సినది మనకు అందకపోయినా*... *మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం...అదే చాలా ముఖ్యమైనది*. *జీవితం ఆటుపోట్లు భరించామనో, మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో..అనే కారణాలు మనకు అధర్మమార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా (licence ) అనుకోకూడదు..మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు...ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు..అని కర్ణునికి కృష్ణుడు బోధించాడు..* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - S sweo Z ஈ0 S sweo Z ஈ0 - ShareChat
*వ్యాస మహర్షిచే రచించబడిన అష్టాదశ పురాణాలలో* *గరుడపురాణం* *ఒకటి...ఇది వైష్ణవ సంప్రదాయానికి చెందినది..శ్రీ మహావిష్ణువు తనకు అత్యంత ఇష్టుడైన గరుత్మంతునికి ఈ పురాణాన్ని ఉపదేశించాడు*..*అందుకే ఈ పురాణానికి గరుడ పురాణం అని పేరు వచ్చింది*..*ఈ పురాణంలో మొత్తం* *18000 వేల శ్లోకాలు ఉన్నాయి*....*మానవుడు పుట్టిన నాటి* *నుండి మరణం* *సంభవించినంతవరకు చేసిన పాప ఫలితాలు శిక్షలు ఎలా ఉంటాయో ఈ పురాణంలో వివరంగా చెప్పబడింది....* *గరుడపురాణం మనకు చాలా విషయాలు తెలుపుతుంది* *_మరణించిన తర్వాత......._* *మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు. మనిషి బతికి ఉన్నప్పుడు చేసిన పాపాలకు ఏయే శిక్షలు పడతాయని గరుత్మంతుడు విష్ణువును అడుగుతాడు. విష్ణుమూర్తి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాడు. విష్ణువు గరుడుని కోసం చెప్పింది కాబట్టి దీనికి గరుడ పురాణం అని పేరొచ్చింది. ఇందులో ప్రధానంగా రెండు భాగాలున్నాయి. ఒకటి... పూర్వఖండం. రెండోది ఉత్తర ఖండం..* *_ఏ తప్పునకు ఎలాంటి శిక్ష_* *పూర్వఖండంలో బ్రహ్మాదుల ఆవిర్భావం, రాజుల కథలు, వ్యాకరణం, ఛందస్సు, యుగధర్మాలు, విష్ణువు దశావతారాలు వంటివి ఉన్నాయి. ఉత్తర ఖండంలోని ప్రథమాధ్యాయంలో ప్రేతకల్పం అనే భాగం ఉంది. అందులో మరణానంతరం జీవుడు ఏం చేస్తాడు... వంటి విషయాలుంటాయి*. *ఎవరైనా మరణించినప్పుడు ఈ అధ్యాయాన్నే పఠిస్తారు*. *ద్వితీయాధ్యాయాన్ని ఎవరైనా, ఎప్పుడైనా చదువుకోవచ్చు.గరుడపురాణంలో చెప్పినట్టు నరకంలో విధించే శిక్షలు ఏమిటి.. అవి ఎలా ఉంటాయి. ఏ తప్పునకు ఎలాంటి శిక్ష విధిస్తుందో తెలుసుకుందామా* *_1...తమిశ్రం._* *గరుడ పురాణం ప్రకారం తమిశ్రం అంటే ఇతరుల సొమ్మును, భార్యాపిల్లలను కాజేసిన వాళ్ళను శిక్షించడం. దీని ప్రకారం శిక్ష చాలా గోరంగా ఉంటుంది. యమదూతలు కాలపాశంతో కట్టేసే చిమ్మచీకటి నరక కూపాన్నే తమిశ్రం అంటారు*. *_2..కుంభీపాకం_* *కుంభీపాకం ప్రకారం వేట ఒక ఆట అనుకుని.. సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపునింపుకునే వారిని శిక్షిస్తారు. అనవసరంగా ఇతరులను హింసించే చంపేవారిని కుంభీపాకం ద్వారా శిక్ష పొందుతారు. ఈ నరకం చాలా భయంకరంగా ఉంటుంది. కణకణలాడే రాగిపాత్రలాగా ఉంటుంది. పైనుంచి సూర్యుడు, కింద భగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది. అందులో పాపులను వేసి శిక్షిస్తారు.* *_3. రౌరవం_* *రురు అంటే భయంకరమైన విషనాగు అని అర్థం. శరీరం శాశ్వతమని తనకోసం, తన వారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కుని అక్రమంగా అనుభవించే వాళ్ళు రౌరవం అనే నరకానికి వస్తారు. వారికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది*. *_4..మహారౌరవం_* *న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తులను అక్రమంగా లాక్కుని అనుభవించే వారిని, ఇతరుల భార్యను, ప్రేమికురాలిని అక్రమంగా లోబరచుకుని అనుభవించే వారు ఇక్కడకు వస్తారు. ఇక అంధతమిశ్రం ప్రకారం.. స్వార్థ చింతనతో ముక్కుమునగ తినే వారిని, అవసరాలు తీరే వరకు భార్యను వాడుకుని ఆ తరువాత వదిలిపారేసే వారిని శిక్షిస్తారు. భార్యా భర్తలను శిక్షించేందుకు యముడు ఈ నరకానికి పంపుతాడు.* *_5..అసితపత్రవనం_* *అసితపత్రవనం ప్రకారం విధ్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలుపెట్టి వాళ్ళనూ చెడగొట్టే వాళ్ళు ఇక్కడకు వస్తారు. సూకరముఖం ప్రకారం అధికార దుర్వినియోగానికి పాల్పడి, అక్రమాలు, అన్యాయాలలో దిగబడి విధినిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు*. *_6..అంధకూపం_* *అంధకూపం ప్రకారం చిన్న చీమకు అపకారం తలపెట్టని వాళ్లని బాధించేవారు, అపకారికైనా ఉపకారం చేసే వాళ్ళను బుద్ధిపూర్వకంగా తొక్కిపట్టి బాధించే వాళ్ళు, కాపాడమని ప్రాథేయపడేవారిని అవకాశం ఉండి కూడా కాపా డని వాళ్ళు ఈ నరకానికి వస్తారు*. *_7..తప్తమూర్తి_* *నరకం ఒక కొలిమిలా ఉంటుంది. ఇక్కడ పెను మంటలు నాల్కలు సాచి భగభగ మండుతుంటాయి. బంగారం, విలువైన రత్నాలు, రత్నాభరణాలు కాజేసిన వారిని ఇందులో పడేసి సజీవదహనం చేస్తారు*. *_8..క్రిమిభోజనం_* *క్రిమిభోజనం ప్రకారం క్రిమికీటకాలతో నరకం నిండి ఉంటుంది. ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్ళను ఆదరించకుండా, వాళ్ళకు మెతుకు విదిల్చకుండా మింగేవాళ్ళను, ఎదుటి వాళ్ళను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకుని అవసరం తీరాక విసిరిపారేసే వాళ్ళను ఇక్కడికి తీసుకువచ్చి క్రిమికీటకాలకు ఆహారంగా పడేస్తారు*. *_9.. శాల్మలి_* *ప్రకారం వావీ వరస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలకు ఎగబడే ఆడ, మగ వారు శిక్షించబడతారు.* *_10..వజ్రకంటకశాలి_* *జాతి రీతి లేకుండా జంతువులతోనూ శృంగారం నడిపే వారు వజ్రకంటకశాలి ప్రకారం శిక్ష విధిస్తారు*. *_11..వైతరణి ప్రకారం_* *అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్లు వాటిని పూర్తిగా దుర్వినియోగపరచి అక్రమాలకు, అనుచితాలకు పాల్పడితే శిక్షకు గురవుతారు*. *_12...పూయోదకం_* *వైతరిణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది. వివాహం చేసుకునే ఉద్దేశం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లను ముగ్గులోకి దింపి అనుభవించే పురుషపశువులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది* *_12...ప్రాణరోధం_* *కుక్కలు వగైరా జంతువులను వేటకు ఉసిగొల్పి సాధు జంతువుల ప్రాణాలు హరించే వారికి శిక్ష ఉంటుంది*. *_13..వైశాసనం_* *పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలి బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు* *_14..లాలభక్షణం_* *అతి కాముకులు, భార్యను కట్టుబానిసంగా కన్నా నీఛంగా చూసే వాళ్ళు తమ ఆధిక్యతను చాటుకోడానికి వీర్యం తాగించేవాళ్లకు శిక్ష విధిస్తారు.* *_15..సారమేయాదానం_* *ఆహారంలో విషం కలిపే వాడు, ఊచకోతకు దిగేవాడు, దేశాన్ని సర్వనాశనం చేసే వాడు ఈ నరకానికి వస్తాడు.* *ఇక అవీచి ప్రకారం.. శిక్ష చాలా కఠినంగా ఉంటుంది* *నీటిబొట్టులేని నరకం ఇది. అక్కడ రాతిపలకలు పరుచుకున్న తీరు చూస్తే అక్కడ సముద్రమేదో ఉందేవెూ అనిపిస్తుంది. తప్పుడు సాక్ష్యం చెప్పేవాళ్ళను, తప్పుడు ప్రమాణాలు చేసే వాళ్ళను, వ్యాపార వ్యవహారాలలో అబద్ధాలు చెప్పి వెూసం అవీచి ప్రకారం శిక్షిస్తారు*. *_16..అయోపానం_* *ఈ నరకం తాగుబోతుల కోసమే ఉంది. ఆడా, మగ తాగుబోతులకు వేరువేరుగా శిక్షలుంటాయి. పాపులు బతికి ఉండగా ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారో లెక్కలు తీసి అన్నిసార్లు ఈ శిక్షలు విధిస్తారు. తాగుబోతు ఆడదైతే ఇనపద్రవాన్ని తాగాలి. అదే తాగుబోతు మగవాడైతే లావా తాగాలి* *_17..రక్షోభక్ష_* *జంతుబలిని, నరబలిని విచ్చలవిడిగా చేసి మాంసాన్ని ఇష్టానుసారంగా తినే వారికి శిక్ష విధిస్తారు*. *_18..శూలప్రోతం_* *ఎదుటి వాడు ఏ అపకారం చేయకపోయినా నిష్కారణంగా ప్రాణాలు తీసే వాళ్ళను, నమ్మకద్రోహం చేసే వాళ్ళను శూలప్రోతం లోకి పంపుతాడు యముడు*. *_19..క్షరకర్దమం_* *మంచి వాళ్ళ పట్ల అవమానకరంగా వ్యవహరించి దబాయించి బతికేసే వాళ్ళను శిక్షిస్తారు.* *_20..దందశూకం_* *తనతోటి మానవులను జంతువుల్లా భావించి విచ్చలవిడిగా వేటాడడం, తక్కువ చూపు చూడడం, మానవహక్కులను హరించి వేయడంలాంటివి చేస్తాడో వాడు ఈ నరకానికి వస్తాడు*. *_21..వాతరోదం_* *అడవులలో, చెట్లమీద, కొండకొమ్ములలో ఉంటూ ఎవ్వరి జోలికీ రాని జంతువులను పట్టి పల్లార్చే వారిని శిక్షిస్తారు*. *_22..పర్యావర్తనకం_* *ఆకలితో అలమటించిపోయే వాడు ఒక్క ముద్ద అన్నం పెట్టమని అడిగితే పెట్టకపోగా నానా దుర్భాషలాడేవాడిని పర్యావర్తనకం ప్రకారం శిక్ష అనుభవిస్తారు*. *_23...సూచీముఖం_* *గర్వం, పిసినారితనం ఉన్న వారిని, రోజు వారి ఖర్చులకు కూడా డబ్బు తీయకుండా దాచేసే పరమలోభులు శిక్ష అనుభవిస్తారు*. *_సేకరణ_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - 11.20 11.20 - ShareChat
*_రాళ్లు కూడా పెరుగుతాయా?_* *నంది విగ్రహం పెరుగుతోందంటే తప్పకుండా చిత్రమే. తప్పకుండా ఇది మాయే అనే భావన ఏర్పడుతుంది. అయితే, దీని వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉంది. అది తెలుసుకోవాలంటే.. ముందుగా యూరప్‌లోని రోమేనియాలో ఎదిగే రాళ్లు గురించి తప్పకుండా తెలుసుకోవల్సిందే. ఈ రాళ్లు కూడా నంది విగ్రహం కంటే వేగంగా పెరుగుతాయి. అంతేకాదు.. పిల్లలను కూడా పెడతాయి. ఇది వినడానికి చిత్రంగా ఉంది కదూ. అయితే, అదెలా సాధ్యమో చూడండి.* *రోమేనియాలోని రాళ్లు ఏకంగా జీవిస్తాయని చెప్పవచ్చు. ఈ రాళ్ల చుట్టూ చిన్న వలయాలుగా మరికొన్ని రాళ్లు పెరుగుతుంటాయి. వాటినే ఆ రాళ్లకు పుట్టిన పిల్లలు అంటారు. కొన్ని రోజుల తర్వాత అవి బాగా ఎదిగి తల్లి రాయి నుంచి విడిపోతాయి. అవి మళ్లీ కిందపడి పెరుగుతాయి. వాటి ద్వారా మరికొన్ని రాళ్లు ఏర్పడతాయి. అలా రాళ్లు తమ సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. అయితే, వీటిలో జీవం ఉండదు. కేవలం రసాయానిక క్రియ వల్లే అది సాధ్యం. అదెలాగంటే..* *రొమేనియాలోని రాళ్లు ఎదగాలంటే తప్పకుండా వర్షాలు పడాలి. ఇవి వేసవి కాలంలో సాధారణ రాళ్లలాగే కనిపిస్తాయి. కానీ, వర్షకాలం వచ్చేసరికి క్రమేనా ఎదుగుదల ప్రారంభం అవుతుంది. ఇందుకు కారణం.. ఆ రాళ్లలో ఉండే కాల్షియం కార్బొనేట్, సోడియం సిలికేట్. ఈ రాళ్ల అవి చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. వర్షం పడగానే రసాయనిక చర్య జరిగి రాళ్ల మధ్య చిన్న చిన్న ఖాళీలు ఏర్పడతాయి. ఒత్తిడి వల్ల రాళ్లు క్రమేనా ఎదుగుతాయి. అయితే, రొమేనియా రాళ్లలో ఉన్న కాల్సియం కార్బొనేట్, సోడియం సిలికేట్లే యాగంటి నంది విగ్రహంలో కూడా ఉన్నాయి. కానీ, రోమానియా రాళ్లంత వేగంగా పెరగకపోవడం వెనుక చిన్న తేడా ఉంది*. *తేమతోనే ఎదుగుతున్న యాగంటి నంది* *రోమేనియా రాళ్లకీ, మన నంది విగ్రహానికి మధ్య ఉన్న తేడా ఏమిటంటే.. రాళ్లలో కాల్షియం కార్బొనెట్ తక్కువగా ఉండి, సోడియం సిలికేట్ ఎక్కువగా ఉండటం వల్ల రోమానియా రాళ్లు వేగంగా పెరుగుతున్నాయి*. *కానీ, యాగంటి నందిలో మాత్రం కాల్షియం కార్బొనేట్ పాళ్లు ఎక్కువగా, సోడియం సిలికేట్ ఎక్కువగా ఉంది*. *దీనివల్ల ఎదుగుదల నెమ్మదిగా ఉంటుంది. పైగా ఈ నంది ఆలయంలో ఉండటం వల్ల నేరుగా వానలో తడవదు. కేవలం గాల్లో ఉన్న తేమను గ్రహించి మాత్రమే రసాయన క్రియకు గురవ్వుతుంది. ఇలాంటి ప్రక్రియ మిగతా రాళ్లలో కూడా కనిపిస్తుందని పరిశోధకులు తెలుపుతున్నారు*. *_సేకరణ:_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
*_6️⃣3️⃣_* *_సంపూర్ణ మహాభారతము_* *_63 వ రోజు_* *వికర్ణుడు* *దుర్యోధనుని తమ్ముడు వికర్ణుడు “ఈ సభలో ఉన్న కురువృద్ధులు, గురువులు, పెద్దలు అందరూ మౌనంగా ఉన్నారు. మిగిలిన వారైనా ధర్మం చెప్పండి.* *ఆలోచించండి ఇక్కడ జరుగుతున్నది ధర్మమా?” అన్నాడు*. *ఎవరూ బదులు చెప్పక పోవడం చూసి వికర్ణుడు “నేను ఇక్కడ ధర్మనిర్ణయం చేస్తాను. జూదం, వేట, మద్యపానం,విషయాసక్తి దుర్వ్యసనాలు. వీటి వలన మానవులు ధర్మం తప్పి ప్రవర్తిస్తారు. అలాంటి వారు చేసే పనులు లెక్కలోకి రావు. ఒక జూదరి చేత పిలువబడిన వ్యసనపరుడైన మరో జూదరి ధర్మరాజు  పాండవుల ఉమ్మడి భార్య అయిన ద్రౌపదిని తను ముందు ఓడి తర్వాత ఫణంగా పెట్టి ఆడి ఓడడం ధర్మం కాదు. పైగా శకునియే ద్రౌపదిని పణంగా పెట్టే విషయాన్నీ ప్రస్తావించాడు. పైగా ఏకవస్త్రను సభకు తీసుకు రావడం అన్యాయం” అన్నాడు*. *కర్ణుడు వికర్ణుని చూసి “ఎందుకీ అధిక ప్రసంగం? చిన్నవాడివి ధర్మం గురించి నీకేమి తెలుసు. ఇంత మంది పెద్దలు ఉండగా ధర్మ నిర్ణయం చెయ్యడం నీకు తగదు. ద్రౌపది ధర్మరాజు ధనం. కనుక ధర్మ విజిత. లేకుంటే పాండవులు అంగీకరిస్తారా. పెక్కు మంది భర్తలు కలిగిన ద్రౌపది బంధకి. అలాంటి వారిని ఏకవస్త్రగానే కాదు. విగత వస్త్రగా తెచ్చినా అధర్మం కాదు" అన్నాడు.* *అపుడు దుర్యోధనుడు ఇలా అన్నాడు “కర్ణుడు బాగ చెప్పాడు. దుశ్శాశనా!  ద్రౌపది పాడవుల వస్త్రాలు తీసుకో" అన్నాడు.*  *దుశ్శాసనుడు ఇది ధర్మం కాదు అని ఆలోచించక ద్రౌపది కట్టుకున్న చీరను లాగనారంభించాడుడు.* *ద్రౌపది శ్రీకృష్ణుడిని “గోవిందా! కృష్ణా! ద్వారకా వాసా! గోపీజనప్రియా! కేశవా! నన్ను ఉద్దరించవా!” అని మాటిమాటికి పిలుస్తూ ముఖాన్ని కప్పుకుని రోదించింది.* *శ్రీకృష్ణుడు అదృశ్యుడై వివిధ సుందర వస్త్రాలతో ద్రౌపదిని అచ్ఛాదించాడు. విచిత్రంగా ద్రౌపది నడుముకు ఉన్న చీర నడుము భాగాన్ని వదలలేదు. లాగుతుంటే అలాంటి వస్త్రాలు వస్తూనే ఉన్నాయి. లాగిన చీరలు గుట్టలుగా పడ్డాయి కాని ద్రౌపది నడుముకు చీర అలాగే ఉంది. దుశ్శాసనుడు ఇక చేతగాక అలసిపోయి సభామధ్యంలో సిగ్గుతో కూలబడ్డాడు*. *ఇది చూసి భీముడు ఆగ్రహంతో* *“కురువృద్ధులు, బంధువులు సభాసదులు చూస్తుండగా ద్రౌపదిని ఇలా అవమానించిన దుశ్శాశనుని* *సుయోధనుడు చూస్తుండగా యుద్ధ భూమిలో ఘోరంగా చంపి అతని రక్తం దోసిలి పట్టి తాగకుంటే నేను నా పితృ పితామహులకు పుట్టలేదు"అని  భీముడు భీకర ప్రతిజ్ఞ చేసాడు*. *సభలోని వారు “కుమారుడి మీద ప్రేమతో ధృతరాష్ట్రుడు ద్రౌపది అడిగిన దానికి ఉపేక్షించాడు" అని అనుకున్నారు*. #మన సంప్రదాయాలు సమాచారం
*_మన ఆరోగ్యం…!_* *_వంకాయ!_* *వంకాయ పేరు చెబితే చాలు చాలా మంది ఎక్స్‏ప్రెషన్స్ మరిపోతాయి. తినడం ఇష్టముండదని.. తింటే ‘స్కిన్ ఎలర్జీ’ వస్తుందని.. కాళ్ల నొప్పులు వస్తాయని అంటుంటారు. మరికొందరు అస్సలు వంకాయను కూడా టచ్ చేయరు. వంకాయ కర్రీకి ఆమడ దూరంలో ఉంటారు. కానీ వంకాయ వలన మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి చాలా మందికి తెలియదు.* *ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.* *వంకాయలో విటమిన్లు, ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, మాంగనీస్, ఫోలేట్, పొటాషియం మొదలైన పోషకాలు అధికంగా ఉన్నాయి.* *అలాగే ఇందులో నియాసిన్, మెగ్నీషియం మరియు రాగి కూడా చిన్న మొత్తంలో ఉంటాయి.* *యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా కనిపిస్తాయి.* *యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తుంది.* *ఫ్రీ రాడికల్స్ శరీరంలోని కణజాలాలకు హాని కలిగిస్తాయి.* *యాంటీ-ఆక్సిడెంట్లు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉండే వర్ణద్రవ్యం వంకాయలో ఆంథోసైనిన్స్ కనిపిస్తాయి.* *గుండె ఆరోగ్యం నుండి ఊబకాయం వరకు అన్ని రకాల వ్యాధులను తగ్గిస్తుంది.* *గుండె ఆరోగ్యాన్ని వంకాయ కాపాడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు గుండె సమస్యలను తగ్గిస్తాయి.* *వంకాయను తీసుకోవడం వలన గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.* *ఇక ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో అధిక కొలెస్ట్రాల్ ఉన్న ఎలుకలకు రెండు వారాల పాటు 10 మి.లీ. ఈ రసం ఇచ్చారు. దీంతో వాటి కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గాయి.* *వంకాయ రక్తంలోని చక్కెరను నియంత్రిస్తుంది.* *వంకాయలో ఫైబర్ అధికంగా ఉన్నందున ఇది జీర్ణక్రియ, చక్కెర శోషణ రేటును తగ్గిస్తుంది. చక్కెర నెమ్మదిగా శోషణ కారణంగా రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.* *వంకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. దీంతో వంకాయ ఊబకాయాన్ని నియంత్రిస్తుంది.* *అధిక ఫైబర్ ఉండటం వలన ఇది మీ పొట్టని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.* *అయితే ఇందులో ఉండే సూక్ష్మపోషకాలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. బరువును కాపాడుకోవడంలో సహాయపడతాయి. వంకాయ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.* *ఇందులో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. రోజువారీ ఆహారంలో వంకాయను చేర్చడం ద్వారా మలబద్ధకం లేదా కడుపు సమస్యలను తగ్గించుకోవచ్చు.* *_సేకరణ_* #మన సంప్రదాయాలు సమాచారం
*_గోసేవకు వరం_* *ఒకసారి అర్జునుడు, శ్రీ కృష్ణుడు ఒక వృద్ధ విధవరాలి ఇంటికి అతిథులుగా వెళ్లారు. ఆ వృద్ధ విధవరాలు శ్రీకృష్ణునికి పరమ భక్తురాలు కూడ. ఆమె నిత్యం కన్నయ్యను స్మరిస్తూ తన జీవితాన్ని గడుపుతోంది*. *ఆమెకు నా అన్నవాళ్లు ఎవరూ లేరు. సమాజ సేవ చేసుకుంటు ఈ లోకం లో* *ఆ భక్తురాలు ఉండేది ఒక పూరి గుడిసెలో..! ఆమె వద్ద ఒక ఆవు ఉండేది. ఆమె ఆ గోమాత ప్రసాదించిన పాలను గ్రామ వాసులకు దానం ఇచ్చి కాస్తో కూస్తో పుణ్యం సంపాదించేది. ఆమె తన జీవనాధారమైన ఆవును బాగా చూసుకునేది*. *ఆ పుణ్య ప్రభావంతోనే, తాను ఎంతగానో అభిమానించే కన్నయ్య తన ఇంటికి రావడం చూసి, ఎంతగానో సంతోషపడింది*. *కన్నయతో పాటు ధర్మశ్రేష్ఠుడైన దనుర్థారి అయిన పార్థుడు కూడా అతని వెంట రావడం చూసి ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది.* *ఆ రోజు వచ్చిన అతిథి దేవునితో సమానం అంటారు. అలాంటిది ఏకంగా దేవాది దేవుడే అతిథిగా వచ్చాడు. కనుక అమె సంతోషం అధికమై ఆమె తన ఆవు ఇచ్చిన పాలు ఇతరుల పిల్లల కు ఇవ్వగా వచ్చిన ఆహార పదార్థాలను అన్నిటినీ ఆరోజు కృష్ణార్జునులకు నివేదించింది.* *శ్రీకృష్ణుడు ఆమె ఆతిథ్యానికి, అలాగే ఆమె నిష్కల్మషమైన భక్తికి మెచ్చాడు. అలా కొద్దిసేపు ఆమెతో మాట్లాడిన తరువాత ఆ నర నారాయణులు వెళ్లిపోయారు*. *బయటికి వచ్చిన పిమ్మట అర్జునుడు మాధవునితో ఇలా అన్నాడు...* *“మాధవా..! మీరు ఆమె భక్తికి మెచ్చారు కదా మరి ఆమెకు ఒక వరాన్ని ఎందుకు ఇవ్వలేదు?"* *దీనికి సమాధానంగా గోపాలుడు చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు- “అర్జునా నాభక్తులెవరూ అయాచిత ధనాన్ని కలలో కూడ ఆశించరు. ధనం ఐతే నేను ఆమెకు ఎప్పుడో ఇచ్చేవాడినే. కాని ఆమె ఏ రోజూ నన్ను అడగలేదు. ఇచ్చినా తీసుకోదు కూడ.* *ఎందుకంటే అది మితి మీరీన ప్రాణ హాని కూడ అనీ విజ్ఞులకు విధితమే, నన్ను ప్రేమించే తనకు ఆ ఆవుకు కామధేనువు వరాన్ని ప్రసాదించాను. ఆ గోవు అక్షయ పాత్రలా క్షీరం లేదనక కాదనక ఎప్పుడూ ప్రసాదిస్తుంది. దాని గోష్ణాన్నీ తాగిన ఆ వూరి పిల్లలంతా మహా బలవంతులౌతున్నారు. వారిని కన్నవారు చాల సంతోషపడి, అలా అందరి ఆశీస్సులు ఆమెకు అందేవి. అది చాలాదా,అర్జునా మానవజన్మకు*. *సంభ్రమాశ్చర్యాలకు లోనైన పార్ధుడు తిరిగి కన్నయ్యతో “మాధవా! గోవు కామధేనువు ఎలా ఔతుంది?” అని అన్నాడు.* *మళ్లీ కృష్ణయ్య నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చారు...* *“కౌంతేయా..! నీవు నన్ను అర్థం చేసుకోలేదు. ఆమె ఆవు[నా] గురించే ఎక్కువగా ఆలోచించి చేసే సేవ నా ఒక్కడికే చెందదు. ముక్కోటి దేవతలకు ఈ సేవ గోవు ద్వారా ఆమెకు సమకూరుతుంది. ఆవును ఎలా పోషించాలి, ఆవుకు మేత ఎలా సేకరించాలి, ఆవు శుచిగా, శుభ్రంగా ఉండటానికి ఎలా నీటితో స్నానం చేయించాలి....ఇలా పలు విధాలుగా ఎక్కువ సమయం ఆ గోవు గురించే ఆలోచించడం వలన, నన్ను పదే పదే స్మరించడ మవుతుందనేది నీకు తెలుసు కదా అర్జునా”* *అదే ఆ ఆవును కామధేనువు చేస్తే మేపే పనే వుండదు. ఆ పనే గనుక లేకపోతే, ఆ భక్తురాలు రోజంతా నన్ను సేవిస్తూ, స్మరిస్తూ నా గురించి ఇతరులకు చెబుతూనే పాలను దానం చేస్తూనే వుంటుంది కదా! ఆ పుణ్యకర్మ తోనే తుది సమయం వచ్చినప్పుడు నేను తనని [ఇహలోకం] భూమి నుంచి దాటి నా లోకము [పరలోకం ]తీసుకు వెళ్ళిపోతాను. నా శాశ్విత సేవలో తరించి తన జన్మను ధన్యం చేసుకుంటుంది. ఈ జన్మాంతరం తాను తప్పక నా లోకాన్ని చేరుకుంటుంది.”* *వాసుదేవుని మాటలు విన్న పార్థుడు ఎంతగానో సంతోషించాడు.* *చూశారా మనకు ఎన్నో కష్టాలు వస్తుంటాయి. ఆ కష్టాలు అనేవి భగవంతుడు పెట్టే పరీక్ష వంటిది*. *కష్టాలు నశించిన పిమ్మట మనకు తప్పక ఆనందం లభిస్తుంది.* *ఎన్ని కష్టాలు వచ్చినా కృష్ణయ్య లీలలోని భాగమేనని సర్దుకుపోవాలి..* *ఆ తర్వాత అంతా ఆ పరమాత్ముడే చూసుకుంటాడు* #మన సంప్రదాయాలు సమాచారం
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
01:18
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:13