*_పర్షియా నేలపై వికసించిన భారత విజ్ఞాన జ్యోతి... జుందీషాపూర్..._*
*_యుద్ధ మేఘాల మధ్య నిలిచిన ఒక చారిత్రక కేంద్రం..._*
*_ప్రస్తుతం ఇరాన్ – అమెరికా / ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. రెండు వారాలకు పైగా కొనసాగుతున్న ఈ ఘర్షణలో పరస్పరం తీవ్ర బాంబుదాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా వైమానిక దాడులు ఇరాన్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి_*.
*_ఈ నేపథ్యంలో ఒక ప్రశ్న తలెత్తుతుంది — ఇరాన్లోని చారిత్రక ప్రదేశమైన జుందీషాపూర్ పరిస్థితి ఏమిటి?_*
*సంతోషకరమైన విషయం ఏమిటంటే ఇప్పటివరకూ జుందీషాపూర్ (Gundishapur) ప్రాంతం పెద్దగా నష్టపోలేదు. ఇరాన్లోని ఖుజెస్తాన్ రాష్ట్రంలో, పర్షియన్ గల్ఫ్ సమీపంలో ఉన్న ఈ ప్రాంతం యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రక వారసత్వ ప్రాంతంగా నిలిచింది*
*అంతర్జాతీయంగా అమలులో ఉన్న జెనీవా ఒప్పందాల ప్రకారం, యుద్ధ సమయంలో పురావస్తు ప్రాధాన్యం కలిగిన ప్రదేశాలపై దాడులు చేయడం నేరంగా పరిగణించబడుతుంది. అయినప్పటికీ, ఇటీవల జరిగిన బాంబుదాడుల్లో తెహ్రాన్లోని గోలెస్టాన్ ప్యాలెస్, అలాగే ఇస్ఫహాన్లోని చెహెల్ సోటూన్ ప్యాలెస్ వంటి చారిత్రక కట్టడాలు దెబ్బతిన్నాయని వార్తలు వెలువడ్డాయి. దీనిపైన యునెస్కో కూడా ఆందోళన వ్యక్తం చేసింది*.
*ప్రస్తుతం అమెరికా దాడులు ఎక్కువగా జరిగిన ప్రాంతాలు — ఇస్ఫహాన్, కోమ్, కరజ్, కర్మాన్షాహ్, లోరెస్టాన్, తబ్రీజ్, కనారాక్ నౌకాదళ స్థావరం వంటి ప్రాంతాలు. ముఖ్యంగా ఇస్ఫహాన్ పరిసరాల్లో ఇరాన్ క్షిపణి మరియు అణు కేంద్రాలు ఉన్నాయనే కారణంతో అక్కడ తీవ్ర దాడులు జరుగుతున్నాయి*.
*అయితే ఈ ప్రాంతాల్లో జుందీషాపూర్ లేదు. అందువల్ల ఇప్పటివరకూ అక్కడ పెద్ద ప్రమాదకరమైన దాడులేవీ జరగలేదు*.
*ప్రపంచ ప్రఖ్యాత విద్యా కేంద్రంగా జుందీషాపూర్*..
*జుందీషాపూర్ కేవలం ఒక పట్టణం మాత్రమే కాదు. ఒక కాలంలో అది ప్రపంచ ప్రఖ్యాత విద్యా కేంద్రం. అక్కడ ఒక విశ్వవిద్యాలయం ఉండేది. గణితం, ఖగోళ శాస్త్రం, వైద్యం వంటి విషయాల్లో పరిశోధనలు జరిగేవి*.
*ఈ విద్యా కేంద్రం ఏర్పడిన కాలంలో ఇరాన్ను పారసీ రాజులు పాలిస్తున్నారు. వారు జ్ఞానం, విద్య, పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు*.
*మన భారతదేశంలోని తక్షశిలా విశ్వవిద్యాలయం హూణుల దాడులతో నష్టపోతున్న కాలంలోనే, పర్షియా రాజు షాపూర్ మొదట జుందీషాపూర్లో ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడని చరిత్రకారులు చెబుతారు.*
*కానీ ఈ విశ్వవిద్యాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ భారతీయ పండితుల ప్రభావం అపారంగా ఉండేది*.
*_భారతీయ పండితుల ప్రభావం..._*
*మూడవ శతాబ్దం నుంచి ఏడవ శతాబ్దం వరకు, అంటే ఇస్లామిక్ దాడుల వరకు, జుందీషాపూర్ విశ్వవిద్యాలయం అత్యంత వైభవంగా కొనసాగింది*.
*ఆరవ శతాబ్దంలో పర్షియా రాజు ఖోస్రోవ్ ఈ విద్యా కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేశాడు. కొత్త విద్యా కార్యక్రమాలను ప్రారంభించేందుకు పండితులను ప్రోత్సహించాడు.*
*ఇక్కడ ప్రధానంగా అధ్యయనం చేసిన విషయాలు... ఆయుర్వేదం, శరీర శాస్త్రం, ఖగోళ శాస్త్రం, గణితం*.
*సంస్కృత గ్రంథాలను పహ్లవి (మధ్య పర్షియన్) మరియు అరబిక్ భాషల్లోకి అనువదించే కేంద్రంగా జుందీషాపూర్ మరో ముఖ్యమైన పాత్రను పోషించింది.*
*ప్రసిద్ధ సంస్కృత గ్రంథం పంచతంత్రం అక్కడ “కలిలా వ దిమ్నా” అనే పేరుతో పహ్లవి భాషలోకి అనువదించబడింది.*
*ఆ కాలంలో పర్షియన్ పండితుడు బోర్ఝుయా భారతదేశానికి వచ్చి అనేక సంస్కృత గ్రంథాలను సేకరించి జుందీషాపూర్కు తీసుకెళ్లినట్లు చారిత్రక ప్రస్తావనలు ఉన్నాయి.*
*_భారత గణిత శాస్త్ర ప్రభావం..._*
*జుందీషాపూర్లో భారతీయ మహావిద్వాంసులైన ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుల రచనలు బోధించబడేవి. తరువాత ఈ గ్రంథాలు అరబిక్, పహ్లవి భాషల్లోకి అనువదించబడ్డాయి*.
*పర్షియా ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త అల్-ఖ్వారిజ్మీ భారతీయ గణిత పద్ధతుల ఆధారంగా ఒక గ్రంథాన్ని రచించాడు. అది అనేక శతాబ్దాల పాటు ఇరాన్లో గణిత అధ్యయనానికి ప్రధాన గ్రంథంగా నిలిచింది.*
*పర్షియాలో వరాహమిహిరుడి ఖగోళ పరిశోధన*.
*భారతదేశంలోని ఉజ్జయినిలో ఖగోళ శాస్త్రంలో గొప్ప పండితుడిగా ఎదుగుతున్న వరాహమిహిరుడు (505–587) గురించి పర్షియా రాజు ఖోస్రోవ్ మొదటి విన్నాడు.*
*ఆయనను జుందీషాపూర్కు ఆహ్వానించి అక్కడ ఖగోళ పరిశీలన కేంద్రం ఏర్పాటు చేయమని కోరాడు. వరాహమిహిరుడు అక్కడి పండితులకు ఖగోళ శాస్త్రాన్ని, గణితాన్ని బోధించాడు*.
*_తరువాత భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత వరాహమిహిరుడు “పంచ సిద్ధాంతిక” అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించాడు_. _అందులో ఐదు ఖగోళ సిద్ధాంతాలను వివరించాడు:_*
*_సూర్య సిద్ధాంతం – భారతీయ_*
*_వశిష్ఠ సిద్ధాంతం – భారతీయ_*
*_పితామహ సిద్ధాంతం – ప్రాచీన భారత_*
*_పౌలిస సిద్ధాంతం – గ్రీకు_*
*రోమక సిద్ధాంతం – రోమన్.*
*ఇతర దేశాల జ్ఞానాన్ని గౌరవించి అధ్యయనం చేసే మన పూర్వీకుల విశాల దృక్పథాన్ని తెలియజేస్తుంది*
*బాగ్దాద్లో “హౌస్ ఆఫ్ విజ్డమ్”*
*651లో పర్షియాపైన అరబ్బులు దాడి చేశారు. అక్కడ ఇస్లామిక్ పాలన ఏర్పడింది. పారసీ ప్రజల్లో కొందరు భారతదేశానికి వలస వచ్చారు*.
*జుందీషాపూర్ పండితుల్లో చాలామంది బాగ్దాద్కు వెళ్లారు. అక్కడ ఖలీఫా హారూన్ అల్-రషీద్ “బైత్ అల్ హిక్మా” (House of Wisdom) అనే గొప్ప విద్యా కేంద్రాన్ని స్థాపించాడు.*
*ఈ కేంద్రంలో భారీ స్థాయిలో సంస్కృత గ్రంథాలను అరబిక్ భాషలోకి అనువదించే కార్యక్రమం జరిగింది*.
*తరువాత ఈ అరబిక్ గ్రంథాలు ఇటలీలోని సిసిలీ మరియు టోలెడో ప్రాంతాల్లో లాటిన్ భాషలోకి అనువదించబడ్డాయి. అలా భారతీయ జ్ఞానం యూరప్కు చేరింది.*
*భారతీయ విజ్ఞానాన్ని ప్రశంసించిన అరబ్ పండితులు...*
*_పర్షియన్ పండితుడు అల్-జాహిజ్ (776–868) ఇలా పేర్కొన్నాడు:_*
*“భారతీయులు ఖగోళ శాస్త్రం, గణితం, వైద్యంలో ప్రత్యేక ప్రతిభ కలవారు.”*
*_ఇరాన్ పండితుడు అల్-మసూది ఇలా రాశాడు:_*
*“ప్రపంచ దేశాల్లో భారతీయులు ఖగోళ శాస్త్రం మరియు గణితంలో అత్యుత్తములు.”*
*_ప్రసిద్ధ పండితుడు అల్-బీరూనీ (973–1048) తన “కితాబ్-అల్-హింద్” గ్రంథంలో ఇలా పేర్కొన్నాడు:_*
*“హిందువులు సంఖ్యా శాస్త్రం మరియు గణనలో అత్యంత నైపుణ్యం కలవారు.”*
*_అతను మరోచోట ఇలా రాశాడు:_*
*“ఖగోళ శాస్త్రం, గణితం, గ్రహణాల లెక్కింపులో హిందువులకు అపారమైన శాస్త్రీయ జ్ఞానం ఉంది.”*
*చరిత్ర చెబుతున్న సందేశం...*
*పారసీ రాజుల కాలంలో పర్షియా ఒక గొప్ప జ్ఞాన కేంద్రంగా ఎదిగింది. ఆ సమయంలో భారతీయ పండితులకు అక్కడ విశేష గౌరవం లభించింది*
*వారిని ఆహ్వానించి పరిశోధనలకు అవకాశాలు కల్పించారు. వరాహమిహిరుడి వంటి మహావిద్వాంసులు అక్కడ పరిశోధనా కేంద్రాలు స్థాపించారు. అనేక సంస్కృత గ్రంథాలు పహ్లవి మరియు అరబిక్ భాషల్లోకి అనువదించబడ్డాయి*.
*ఈ జ్ఞాన పరంపర పర్షియాలో అరబ్ పాలన వచ్చిన తరువాత కూడా పదకొండో, పన్నెండో శతాబ్దాల వరకూ కొనసాగింది*.
*కానీ తరువాత కాలంలో పరిస్థితులు మారాయి*. *భారతదేశంలోనే విదేశీ ఆక్రమణలు పెరిగిన తరువాత, పర్షియా నుంచి భారత పండితులను ఆహ్వానించే సంప్రదాయం క్రమంగా తగ్గిపోయింది*
*ఒక చారిత్రక జ్ఞాన వారసత్వం... జుందీషాపూర్*...
*అందువల్ల జుందీషాపూర్ కేవలం ఒక పురాతన నగరం మాత్రమే కాదు. అది ఒక కాలంలో భారతీయ జ్ఞానం ప్రపంచానికి అందడానికి ఒక మహత్తర వేదికగా నిలిచిన విద్యా కేంద్రం*
*ఇప్పుడు యుద్ధ మేఘాల మధ్య నిలిచినప్పటికీ... ఈ ప్రాచీన జ్ఞాన క్షేత్రం, హిందూ - పర్షియన్ నాగరికతల మధ్య ప్రవహించిన జరిగిన గొప్ప విజ్ఞాన ధార యొక్క కథను ఈరోజుకీ గుర్తు చేస్తూనే ఉంది* #మన సంప్రదాయాలు సమాచారం