*_ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త_*
*_🏛️ అమరావతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల_*
*_ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి_*
*_అమరావతికి చట్టబద్ధత కల్పించిన కేంద్రం_*
*_అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం_*
*_రాష్ట్రపతి ఆమోదం తర్వాత గెజిట్ విడుదల చేసిన కేంద్ర న్యాయశాఖ_*
*_2024 జూన్ 2 నుంచి ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసిన కేంద్రం_*
*_సీఆర్డీఏ 2014 చట్టంలో పొందుపరిచిన అమరావతిని రాజధానిగా నోటిఫై చేసిన కేంద్రం_* #మన సంప్రదాయాలు సమాచారం
*_పెట్టుబడి పదిహేను వందలు .... టర్నోవర్ కోటి రూపాయలు ....!_*
*అప్పుడే తాను పెద్ద ఎంటర్ప్రెన్యూర్ అయిపోయినట్టు భావించడం లేదు అనిమేష్. మరో3 సంవత్సరాల్లోపు కంపెనీని మూడు కోట్ల రూపాయల టర్నోవర్కు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడతను*.
*సెర్చింజిన్ దిగ్గజం గూగుల్కు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త వెబ్సైట్ ప్రారంభించేద్దాం అనుకొన్నాడు ఆ యువకుడు. అతడిది అతి విశ్వాసం కాదు. అతడి ఆత్మవిశ్వాసం ఆ స్థాయిలో ఉంది. అయితే ఆలోచించే కొద్దీ గూగుల్.కామ్ను చూసేవారికి తన సైట్ను చూడాల్సిన అవసరం ఉండదనిపించింది*. *అయితే ఏదో చేయాలన్న తపన మాత్రం మిగిలింది. ఆ స్ఫూర్తితో అతడు పదిహేను వందల రూపాయల పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు*. *మూడేళ్లలో కోటిరూపాయల టర్నోవర్కు దాన్ని తీసుకెళ్లాడు. ఆ యువకుడి పేరు అనిమేష్ సారింగి. భువనేశ్వర్కు చెందిన ఆ 20 యేళ్ల కుర్రాడి విజయగాథ ఇది...*
*12 యేళ్ల వయసు నుంచే ఏదో ఒక వ్యాపారం చేయాలన్న కోరిక ఉందట అనిమేష్కి. తను ఒక పెద్ద వ్యాపార వేత్త అయిపోవాలన్నది ఆ వయసులో అతడికి ఉన్న డ్రీమ్. అయితే ఆ డ్రీమ్ను అతడు మనసులో దాచేసుకొని దాని గురించి ఫాంటసీల్లో మునిగి తేలుతూ సమయాన్ని గడిపేయలేదు. ఆ కోరికను బయటపెట్టుకొన్నాడు*. *అలా బయటపెట్టినప్పుడే కదా ఎవరికైనా వాస్తవం అర్థమయ్యేది! అనిమేష్ విషయంలోనూ అదే జరిగింది. తన ఆలోచన గురించి చెబితే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. చక్కగా చదువుకొమ్మని హిత బోధ చేశారు*.
*అప్పుడు అనిమేష్ మనసులో ఫాంటసీలు మొదలయ్యాయి. అమ్మానాన్నలు చెప్పినట్టుగా చదువుకొంటూనే వ్యాపారతవేత్తగా ఎదగడానికి సంబంధించిన ప్రయత్నాలను చేయసాగాడు. ఇంటర్ పూర్తయిన తర్వాత తన ఐడియాలను స్నేహితులతో పంచుకొనే అవకాశం దొరికింది. వారితో సాధ్యాసాధ్యాలను చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ క్రమంలోనే మొదట ఒక సెర్చింజన్ను అభివృద్ధి చేయాలని అనుకొన్నాడట. అయితే అది క్లిక్ కావడం కష్టసాధ్యం అని అర్థం చేసుకొని వేరే ఆలోచన మొదలుపెట్టాడు*.
*ఆ సమయంలో ‘అమాజింగ్ యూత్’ అంటూ ఒక సంస్థను రిజిస్టర్ చేయించాడు అనిమేష్. దాని పేరు మీద ఒక వెబ్సైట్ను స్థాపించాడు*. *మూడేళ్ల క్రితం ఈ రిజిస్ట్రేషన్ కోసం పెట్టిన ఖర్చు పదిహేను వందలు. స్నేహితులను కలుపుకొని ఆ సంస్థ తరపున ఏవైనా కాంట్రాక్టులు చేయించాలనేది అనిమేశ్ ఐడియా. ఆ క్రమంలో మొదట వారికి వీధి వీధి తిరిగి ఒక కంపెనీకి సంబంధించిన వాల్పోస్టర్లను అతికించే కాంట్రాక్టు దక్కింది. అనిమేష్ బ్యాచ్ అంతా ఒక్కరోజు రాత్రిలోనే 2,5000 పోస్టర్లను అతికించారు*.
*ఒక్కోపోస్టర్కు పదిరూపాయలు వచ్చిందట. అక్కడ నుంచి తన కంపెనీని విస్తరించే పనిని మొదలుపెట్టాడు. ఆ కాంట్రాక్ట్ అతడికి ఎన్నో సంపాదనా మార్గాలను చూపింది. ఆ ఉత్సాహంతో ఔత్సాహిక యువతకు, కంపెనీల హెచ్ఆర్లకు వారధిగా మారాడు. కాల్సెంటర్లు, డాటా ఆపరేటింగ్ ఏజెన్సీలకు ఎంప్లాయీస్ను కుదిర్చే పనిని మొదలుపెట్టాడు. అటు కంపెనీల నుంచి కొంత, నిరుద్యోగుల నుంచి మరికొంత కమీషన్ తీసుకొంటూ ఒక ఆదాయమార్గాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు*.
*భువనేశ్వర్లోని అనేక కంపెనీల మానవ వనరుల అవసరాలకు ‘అమేజింగ్యూత్’ వాళ్లు సోర్స్గా మారారు. నెలకు 30 నుంచి 40 కంపెనీలతో ఇలాంటి కాంట్రాక్టులు కుదుర్చుకోవడంతో అనిమేష్ స్థాపించిన ఈ కంపెనీ దశ తిరిగింది. ఆదాయం పెరిగింది. బ్రాంచ్లు పెరిగాయి. ప్రస్తుతం ఒరిస్సా, పశ్చిమబెంగాల్, చెన్నై, కర్ణాటక, ఢిల్లీ తదిరత చోట్ల ‘అమేజింగ్ యూత్’కు బ్రాంచీలు ఉన్నాయి. ఇప్పటివరకూ వేలాదిమంది యువతీ యువకులకు ఈ కంపెనీ ప్లేస్మెంట్స్ను ఇప్పించింది. దీంతో 40 నుంచి 50 శాతం ఆదాయంతో ఈ కంపెనీ టర్నోవర్ కోటి రూపాయలకు చేరింది*.
*అమెరికాలో కూడా ఇప్పుడు ఈ ఏజెన్సీ కార్యకలాపాలు మొదలయ్యాయి. అయితే అనిమేష్కు అప్పుడే తాను పెద్ద ఎంటర్ ప్రెన్యూర్ అయిపోయినట్టు భావించడం లేదు*. *మూడు సంవత్సరాల్లోపు కంపెనీని మూడు కోట్ల రూపాయల టర్నోవర్కు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడతను*. *ఇప్పటివరకూ తను సాధించిన విజయంలో తన స్నేహితుల సహకారం మరవలేనిదని అంటాడు అనిమేష్. అమేజింగ్ యూత్ను బెటర్ స్థాయి నుంచి బెస్ట్కు తీసుకెళ్లాలన్నదే తన ప్రస్తుత లక్ష్యం అని అనిమేష్ చెబుతాడు.* #మన సంప్రదాయాలు సమాచారం
*_ఎవరు ఇతను ?_*
*_'' నేను పెళ్ళి వద్దనుకుంటున్నాను , '' అన్నాడు అతను. తల్లి తండ్రులు చాలా బాధ పడ్డారు. వారి బాధను చూసి చలించి '' దేశం కోసం , పేదలకోసం జీవించాలనుకున్న నా ఆలోచనను సమర్థించి , నాకు సహకరించే ఆమె ఇతే పెళ్ళి చేసుకుంటాను, '' అన్నాడు మళ్ళీ అతనే. అలాంటి ఒక అమ్మాయి ముందుకు వచ్చింది. అఙ్ఞానం , పేదరికం , దోపిడి తప్ప మరేమి తెలియని కోసింద్రా [ గుజరాత్] లోయలో అతను భార్య ప్రభ తో పాటు ఎద్దులబండి దిగినపుడు అతని వయసు 24 ఏళ్ళు. చదువుకున్న వారిని నమ్మని అక్కడి కోయలు , గిరిజనులు చేతుల్లో బాణాలతో ఎదురు నిలబడ్డారు. ' నా దగ్గర మీ పట్ల ప్రేమ తప్పా ఏమీలేదు, ' అన్నాడు అతను. అప్పులిచ్చి గిరిజనుల , పేదల భూములను లాక్కొనే భూస్వాములు , వ్యాపారులు ' వుండేందుకు ఇతనికి ఎవరైనా ఇల్లు ఇచ్చారంటే చంపుతామని ' బెదిరించారు. ఆరు రోజులపాటు ఎండలో , చలిలో ఆ ఇద్దరు ఒక చెట్టు క్రిందే వున్నారు. నెమ్మదిగా వారి నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. వారికి శుభ్రంగా ఎలా వుండాలో నేర్పాడు , సాయంకాలాల్లో కథలు , మహాపురుషుల జీవితాల్లోని త్యాగాలు హత్తుకునేలాగా చెప్పడం మొదలు పెట్టాడు. ' మీరు వడ్డీ వ్యాపారులనుండి ఎంత అప్పు తీసుకున్నారో వారిని అడిగి రండి ' అని ఆ ప్రజలకు చెప్పాడు. అలా అడిగిన ఒక హరిజనుడిని , వ్యాపారులు నిప్పంటించి కాల్చేసారు. ఆ కొండ , కోన మూగబోయాయి. కానీ , అతను వదలిపెట్టలేదు.' భయ పడొద్దు , పలకలు తీసుకురండి , వాటి మీదే మీరు తీసుకున్న అప్పుల వివరాలను రాయించుకుందాం, '' అని అతను వారితో అన్నాడు.' కానీ , ఎవ్వరూ తెచ్చుకోలేదు. ' ఇతే నేను ఇవాళ భోజనం మానేస్తున్నాను , ' అన్నాడు. ఆ చిన్న త్యాగమే ఆ మనసున్న మట్టి మనుషులను కరిగించింది , కదిలించింది. పలకలు తెచ్చుకున్నారు. వ్యాపారులను లెక్కలడిగారు. 300 శాతం వడ్డి ఎలా న్యాయమో చెప్పండి అన్నారు._* *_వ్యాపారులు వివరాలు చెప్పడానికి వొప్పుకోలేదు. అతనూ వెనుకడుగు వెయ్యలేదు. ఆ సాయంత్రమే బరోడ వెళ్ళి ఎవరితోనో మాట్లాడి వచ్చాడు. వుదయాన్నే పోలీసులొచ్చారు. వ్యాపారులు భయపడి పోయారు , లెక్కలు చెప్పారు. పేదలకు మోసం అర్థమయ్యింది. ధైర్యం పెరిగింది. వ్యాపారులు తప్పు వొప్పుకున్నారు. బాణాలు పట్టుకున్న ఆ కోయలు , చెంచులు, బలపాలు పట్టుకున్నారు_*. *_ఇళ్ళలో దీపాలు వెలిగాయి, వూళ్ళో పాపాలు తగ్గాయి. ఆ నేలను కాచిన వెన్నెల కోదండ రాముని కోవెలే అయ్యింది. 5000 కి.మీ. నడిచి , 18,000 ఎకరాల భూమిని పేదలకు ఇప్పించాడు. వారికి తోటల పెంపకం, పాడిపరిశ్రమ, పారిశుభ్రత, నేర్పాడు. 27 చెక్ డాములు నిర్మించి , వాన నీటిని పట్టుకున్నాడు. చెట్లు నరకడం మానిపించి గోబర్ గ్యాస్ అలవాటు చేయించాడు. 45 ఏళ్ళలో 3300 గ్రామాలు తిరిగి , 20 లక్షల మంది పేదల జీవితాల్లో గులాబీలు పూయించాడు. కొన్ని తరాలను వెలిగించి , తాను మాత్రం ప్రపంచానికి తెలియకుండా మౌనంగానే వుండిపోయిన ఆ మహాత్యాగి హరివల్లభ్ మనలో ఎంత మందికి తెలుసు ?_* #మన సంప్రదాయాలు సమాచారం
*ఇది అచ్చంగా సినిమా స్టోరీలా ఉన్నప్పటికీ ఎంతమాత్రమూ కాదు. ఒకరి జీవితంలో ఎంతో విషాదం ఉన్నప్పటికీ వాటన్నింటిని దాటుకుని సంతోషకరమైన జ్ఞాపకాలతో బతికేస్తూ ఎంతోమందికి సహాయం అందిస్తున్నారు.*
*ఆయన ఉన్నత చదువులు చదివారు. అది పూర్వపు రోజుల్లో అక్కడనుండి దేశం కానీ దేశంలో గొప్పస్థాయిలో స్థిరపడ్డారు*.
*ఆపై ఒక తెలుగింటి అమ్మాయిని వివాహమాడారు. వారికి ఇద్దరు పిల్లలు జీవితం సంతోషకరంగ నడుస్తుంది అనుకునేలోపు అనుకోని విషాదం ఎదురైంది అది ఎవ్వరు ఊహించని విధంగా*
*ఇప్పుడు చెబుతున్న ఆ గొప్పవ్యక్తి #కాకినాడ కు చెందిన డాక్టర్ #శ్రీ_చంద్రశేఖర్ గారు.*
*బహుశా ఇలా డాక్టర్ చంద్రశేఖర్ గారు అని చెబితే అతికొద్ది మందికి మాత్రమే తెలుస్తుందేమో అదే* *డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్* *గారు అంటే మరెంతోమందికి ఆయన సుపరిచితులు.*
*1943 నవంబర్ 20 తేదీన ప్రకాశం జిల్లా సింగరాయకొండ గ్రామంలో జన్మించారు చంద్రశేఖర్ గారు. చిన్నతనం నుండి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో పెరిగిన ఆయన అక్కడే హైస్కూల్ లో అలానే ఆర్ట్స్ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. అక్కడ నుండి విశాఖపట్నం లో బీఎస్సి, ఎమ్మెస్సీ చేశారు. ఆ పై చదువుల కోసం 1965 లో కెనడా వెళ్లారు. అక్కడే ఉద్యోగ రీత్యా స్థిరపడ్డారు. కానీ ఎంత ఉన్నత స్థానాలు చేరిన స్వదేశం అంటే ఎంతో అభిమానం ఆయనకు. తెలుగింటి అమ్మాయి అయిన శ్రీమతి మంజరి గారిని 1975 సంవత్సరంలో వివాహమాడారు. వారికీ ఇద్దరు పిల్లలు శ్రీకిరణ్, శారద*.
*వివాహం చేసుకొని కెనడాలో కుటుంబ జీవితాన్ని ప్రారంభించారు. మంజరి గారు తమ్ముడు పెళ్లి కోసం అని 1985 జూన్ 23 తేదీన ఇద్దరి పిల్లలు ఆరేళ్ళ కిరణ్, మూడేళ్ళ శారద లతో కెనడా నుండి ఇండియా బయలుదేరారు. 329 మంది ప్రయాణికులతో కెనడా నుండి ఢిల్లీ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం తీవ్రవాదులు బాంబ్ బ్లాస్ట్ చేశారనే వార్త ఎవత్తు దేశాన్నే శోకసంద్రం లో ముంచేసింది. ఐర్లాండ్ తీరంలో అట్లాంటిక్ మహాసముద్రం లో కుప్పకూలిన విమానం వార్త విన్న కాసేపటికి మొత్తం 329 మంది ప్రయాణికులు మరణించారని ద్రువీకరించగా తమ వారికోసం ఎయిర్పోర్ట్ లో ఎదురుచూస్తున్న బంధువుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా ఎంతో విషాదం నెలకొంది*.
*కొన్ని గంటల ముందే తమ వాళ్ళని ఎయిర్ ఇండియా విమానం ఎక్కించిన చంద్రశేఖర్ గారికి ఆ వార్త తెలిసింది. కానీ ఆ వార్తను అయన ఎంతవరకు నిముర్చుకోలేదు కొన్ని నెలల పాటు తీవ్రవాదులు వాళ్ళని బంధించి ఉంటారని ఎక్కడో ఒక చోట బ్రతికే ఉంటారు అనే ఆశతో ఉన్నారు. కానీ ఆశ కు నిరాశ తోడై ఇద్దరి పిల్లలతో సహా తన భార్య మంజరి గారు మరణించారని తెలిసి ఎంతో కృంగిపోయారు. మంజరి గారితో వివాహం అనంతరం కెనడా లో ఉన్న సమయం లోనే స్వదేశంలో నిరుపేదల కోసం తమ వంతుగా ఏమైనా చేయాలని ఆకలితో ఎవరు అలమటించకూడదని అందరూ బాగుండాలని దానికి తమవంతుగా ఏమైనా చేయాలని అనుకునేవారు దానికి గాను కొన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారు. భార్య పిల్లలు మరణం అనంతరం తన జీవితం ఎలాంటి ఉపయోగకరంగా లేకుండా ఉండకూడదని భార్య ఆశయాలను భాద్యతగా నెరవేర్చాలని చంద్రశేఖర్ గారు నిర్ణయించుకున్నారు.*
*కెనడా లో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియా కు బయలుదేరారు*. *1989 సంవత్సరం లో మంజరి సంకురాత్రి మెమోరియల్ ఫౌండేషన్ ను స్థాపించారు. కాకినాడ కు దగ్గరలో ఉన్న తిమ్మవరం గ్రామంలో అనాధ శరణాలయం ఏర్పాటు చేసి ఆకలి బాధలు తీర్చాలనుకున్నారు*. *ఆ రోజుల్లో చదువు మీద అంతగా అవగాహన లేకపోవడం వలన ఎంతోమంది పిల్లలు పనులకు వెళ్లడం చూసి చలించిన ఆయన వారితో మాట్లాడి గ్రామీణ పిల్లలకు సాయంత్రం బడి ఏర్పాటు చేసి చదువు చెప్పేవారు. 1992 లో 25 మంది విద్యార్థులతో మొదలైన సాయంత్రం పాఠశాల నేడు శారద విద్యాలయం పేరుతొ వందల మంది విద్యార్థులకు చదువును బోధిస్తున్నారు*.
*చదువు చెప్పడం అంటే పాఠాలు భోదించడం మాత్రమే కాదని వారికి వృత్తి విద్యా కోర్సులు నేర్పించడం లాంటివి చేస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఈ విద్యాలయం నెలకొంది*.
*1993 సంవత్సరం లో మంజరి #సంకురాత్రి_మెమోరియల్_ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుమారుడు పేరుమీద శ్రీకిరణ్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ను ఏర్పాటు చేశారు*.
*ఒక డాక్టర్ ఆరుగురి సిబ్బందితో మొదలైన ఆ వైద్యశాల నేటికి సుమారు మూడు లక్షల నలభై వేళ మందికి కాటరాక్ సర్జరీ లు ఉచితంగా చేశారు, దాదాపు ఇరవై ఐదు లక్షల మందికి అవుట్ పేషెంట్ సర్వీసును ఉచితంగా అందించారు. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు శస్త్ర చికిత్సలు, ఆపరేషన్ లు చేస్తూ కేవలం డబ్బు ఉన్న వారి దగ్గర మాత్రమే అంటే స్థోమత ఉన్న వారి దగ్గర నుండి మాత్రమే తీసుకొని లేనివారికి పూర్తిగా ఉచితంగా సేవలను అందిస్తుంది ఈ సంస్థ*
*అంతేకాదు ఆసుపత్రి కి వచ్చిన వారికి భోజన ఏర్పాట్లు కూడా ఉచితంగా అందిస్తారు. ఇక్కడ జరిగిన కంటి ఆపరేషన్ లు తొంభై శాతం ఉచితంగా జరిగినవే అంటే ఆశ్చర్యపోతారు కానీ అదే నిజం. కెనడా, అమెరికా దేశాల నుండి అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్ లు కూడా సంవత్సరం లో ఒకసారి ఇక్కడికి వచ్చి వైద్యం చేస్తారు. అలానే ఇక్కడ డాక్టర్ లకు తమ సలహాలు, సూచనలు అందిస్తారు. దూర ప్రాంతం నుండి వైద్యానికి వచ్చే వారికోసం కాకినాడ బస్ స్టేషన్ లో శ్రీకిరణ్ ఆసుపత్రి బస్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి అవి ఉచితంగా ఆసుపత్రి వద్దకు చేర్చే ఏర్పాట్లు కూడా చేసారు*.
*ఇంతటితో ఆగకుండా తన సేవాకార్యక్రమాలలో మరింత ముందుకు కొనసాగుతూ* *1998 సంవత్సరం లో స్పందన సంస్థ ఏర్పాటు చేసి కాకినాడ పరిసర ప్రాంతాలలో ప్రకృతి విపత్తులు ఏర్పడినపుడు నిరాశ్రయులైనా ఎందరికో వారికి కావలసిన వసతులు భోజనం, బట్టలు లాంటి మరెన్నో అందించి స్పందన సంస్థ ద్వారా అండగా నిలిచారు, నేటికి నిలుస్తున్నారు.*
*చంద్రశేఖర్ గారి సేవలకు గుర్తింపుగా జాతీయ , అంతర్జాతీయ అవార్డులు, డాక్టరేట్ లు ఎన్నో ఆయనను వరించాయి*.
*ఒక కష్టం వస్తే కృంగిపోయి మానసికంగా దెబ్బతిన్న ఎంతో మంది వ్యక్తులు మనం చూశాం, ఆ బాధ నుండి బయట పడలేక మత్తుమందుల కి మద్యానికి బానిస అయిన వారిని చూసాము, చివరికి తమ జీవితాన్ని త్యజించిన వారిని కూడా మనం చూశాం. కానీ అటువంటి బాధ నుండి బయటపడి , తాను ఎంతగానో ప్రేమించిన తన కన్న కొడుకుని కూతుర్ని సమాజంలో ప్రతి ఒక్కరిలోనూ చూసుకుంటూ, చివరికి అదే తన జీవిత పరమార్థం గా మార్చుకుని, కొన్ని వేల మంది జీవితాలలో వెలుగులు నింపిన ఈ సంకురాత్రి చంద్రశేఖర్ గారి జీవితం ప్రస్తుత సమాజంలో యువతీ యువకులు కి ఎంతో ఆదర్శనీయం*.
*వారి భార్య గోదావరి జిల్లాకి చెందిన వారు కావడం అదృష్టం అయితే , ఆయన గోదారికే అల్లుడుగా లభించడం ఇక్కడి ప్రజల అదృష్టం* #మన సంప్రదాయాలు సమాచారం







