Ravi  Talluri
ShareChat
click to see wallet page
@91775
91775
Ravi Talluri
@91775
feelgood
*_నాలుగు వేల కోట్లకు అమ్మేశా!_* *కలారీ క్యాపిటల్... బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. స్టార్టప్ రంగంలో ఉన్నవారికి ఈ పేరు సుపరిచితం. స్నాప్‌డీల్, మింత్రాలాంటి విజయవంతమైన కంపెనీలకు వీరు ప్రారంభదశలో పెట్టుబడులు పెట్టారు.* *తెలుగువారైన వాణీ కోలా... ఈ సంస్థ సహ వ్యవస్థాపకురాలూ, ఎండీ. ఆమె విజయ ప్రస్థానం గురించి అడిగితే, చెబుతున్నారిలా...* *పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. నాన్న ప్రభుత్వోద్యోగి. చిన్నపుడు లెక్కలు బాగా చేసేదాన్ని. దాంతో ఇంటర్‌లో ఎంపీసీ చదివాను, ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేశాను. ఇది 1981నాటి మాట. ఇంజినీరింగ్ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ 'హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్'లో ఉద్యోగం వచ్చింది. కానీ ఎం.ఎస్. చదవడానికి అమెరికా వెళ్లాలనే నిర్ణయించుకున్నాను. దానికి ఇంకో కారణం కూడా ఉంది. మావారు శ్రీనివాస్. ఉస్మానియాలో నాకు సీనియర్. ఆయన అప్పటికే ఎం.ఎస్.చేయడానికి బోస్టన్ వెళ్లారు. నాకూ అక్కడే సీటు వచ్చింది. అమెరికా వెళ్లడానికి కొద్ది నెలల ముందు మాకు పెళ్త్లెంది.* *అమెరికాలో అడుగుపెట్టింది 1985లో. అదో కొత్త ప్రపంచం. మన నేపథ్యంకంటే మన ఆలోచనలకూ, సామర్థ్యానికీ విలువ ఇస్తారక్కడ. ఎం.ఎస్. చేస్తూనే వ్యక్తిగతంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఎం.ఎస్. తర్వాత ఉద్యోగంలో చేరాను. సిలికాన్ వ్యాలీలో అందరూ స్టార్టప్స్ గురించి ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్టార్టప్‌లో భాగమవుతుంటారు. వివిధ టెక్ కంపెనీల్లో 12 ఏళ్లు ఉద్యోగ అనుభవం తర్వాత 'రైట్‌వర్క్స్' పేరుతో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టాను. నాలుగేళ్ల తర్వాత సంస్థను సుమారు రూ.4000 కోట్లకు అమ్మాను. తర్వాత 'సెర్టస్ సాఫ్ట్ ‌వేర్' పేరుతో మరో కంపెనీని పెట్టాను. దాన్నీ తర్వాత మంచి లాభానికి అమ్మేశాను. రెండు కంపెనీల్లో భాగస్వాములకు వారివారి వాటాలు ఇచ్చాను.* *2006లో ఇండియా వచ్చి రెండు నెలలు ఉన్నాను. చాలా ప్రాంతాలు తిరిగి, చాలామందితో మాట్లాడాను. ఇక్కడ వినియోగదారుల సంఖ్యా, స్వభావం మారింది. ఇక్కడా అవకాశాలున్నాయనిపించింది. నా చిన్నపుడు బయటకి వెళ్లి తినేవాళ్లం కాదు. ఇప్పుడు హోటల్‌కి వెళ్లి తినడం సాధారణ విషయం. అప్పట్లో సెలవుదొరికితే తాతగారింటికో, అత్తారింటికో వెళ్లేవారు. ఇప్పుడు ప్రపంచం చుట్టొస్తున్నారు. మౌలిక సదుపాయాలూ, రవాణా, చెల్లింపులూ, వినియోగదారులూ ఉత్పత్తిదారుల మధ్య భౌతిక దూరం... లాంటి కొన్ని పరిమితులు కనిపించాయి. ఆ లోటును సాంకేతికతతో పూడ్చవచ్చనిపించింది. ఇక్కడ ఉంటే ఆ పని నేనే చేయొచ్చనిపించింది. అదే సంవత్సరం రూ.130 కోట్లతో యూఎస్ఇండియా వెంచర్స్‌ని సిలికాన్ వ్యాలీలో పరిచయమైన వినోద్ ధామ్(ఇంటెల్‌లో ఉపాధ్యక్షుడు)తో కలిసి ప్రారంభించాను*. *ఇండోయూఎస్ వెంచర్స్ ద్వారా మొదట 'వయా' అనే ట్రావెల్ స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టాం. తర్వాత మేం పెట్టుబడి పెట్టిన స్నాప్‌డీల్, మింత్రా, అర్బన్‌లేడర్, జివామీ ఈరోజు మార్కెట్‌లో ఆయా విభాగాల్లో ఉన్నత స్థానంలో ఉన్నాయి. స్నాప్‌డీల్, అర్బన్ లేడర్ సంస్థల్లో వ్యాపార దిగ్గజం రతన్ టాటా వ్యక్తిగతంగా పెట్టుబడి పెట్టడం మరో గొప్ప విషయం. ఆయన ఈ మధ్యనే మా సంస్థలో సలహాదారుగా కూడా చేరారు. మింత్రా(ఫ్లిప్‌కార్ట్ కొనుగోలుచేసింది) ద్వారా మేం ఫ్లిప్‌కార్ట్‌తోనూ పనిచేస్తున్నాం. ఆ విధంగా దేశంలో రెండు పెద్ద ఈ-రిటైల్ కంపెనీలు స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్‌లతో మాకు అనుబంధం ఉందనడానికి గర్వపడుతున్నాం*. *మాకు ఏటా 2000 కంపెనీల నుంచి ప్రతిపాదనలు వస్తాయి. వాటిలోంచి వడపోతతో కేవలం రెండు శాతం కంపెనీలనే ఎంచుకుంటాం. నాకు ఆలోచనతోపాటు స్టార్టప్ జట్టులో ఎవరున్నారనేదీ ముఖ్యం. అర్హతలు అందరికీ ఉంటాయి. కానీ లక్ష్యాన్ని చేధించే సామర్థ్యం ఉందా లేదా అనేది చూస్తాను. కియోస్కుల ద్వారా వినియోగదారులకు ఏయే ఆప్‌లు ఉండాలో సలహా ఇచ్చే 'ఆప్స్‌డైలీ' అనే సంస్థలో పెట్టుబడి పెట్టార. ఆలోచనతోపాటు వ్యవస్థాపకుల ఆత్మవిశ్వాసం నాకు నచ్చి అందులో పెట్టుబడులు పెట్టాను. కొత్త కంపెనీలతో 6-8 ఏళ్లు కలిసి ప్రయాణిస్తాం. అనుకున్న స్థాయిలో కంపెనీని నిర్మించేందుకు అన్ని విధాలా సాయపడతాం.* *ఇండోయూఎస్ వెంచర్స్ ‌ని 2012లో కలారీ వెంచర్స్‌గా పేరు మార్చాం. కేరళలో ఒక మార్షల్ ఆర్ట్ పేరది. కలారీ క్యాపిటల్‌గా మారాక కొత్త భాగస్వాములతో కలిసి పెట్టుబడుల్ని పెంచాం. ఇప్పటివరకూ 55 కంపెనీల్లో రూ.2200 కోట్లకుపైన పెట్టుబడి పెట్టాం*. *'ఈ రంగంలో మహిళల స్థానం ఎక్కడ'అని...చాలామంది నన్ను అడుగుతుంటారు. నేను ఇంజినీరింగ్ చదివే సమయంలో 400 మందిలో ఆరుగురమే అమ్మాయిలం. కానీ ఇప్పుడు ప్రతి క్లాసులో దాదాపు సగం మంది అమ్మాయిలు ఉంటున్నారు. వీరంతా భవిష్యత్తులో మేనేజర్లుగా, సీయీవోలుగా, కంపెనీల వ్యవస్థాపకులుగా, ఆపై వెంచర్ క్యాపిటలిస్టులుగా మారబోతున్నారు. వెంచర్ క్యాపిటలిస్టుగా మారాలనుకునేవారికి మొదట లక్ష్యం స్పష్టంగా ఉండాలి. తర్వాత కుటుంబం, స్నేహితుల సహకారం ఉండేలా చూసుకోవాలి. నాకైతే ప్రతిదశలో తల్లిదండ్రుల సహకారం, మావారి మద్దతూ లభించాయి.* *బెంగళూరులో ఉంటాను. వీలైనంత ఎక్కువ సమయాన్ని భర్త, పిల్లలతో గడుపుతాను. మావారు కన్సల్టెన్సీ సంస్థను నిర్వహిస్తున్నారు. మాకు ఇద్దరమ్మాయిలు*. *బెంగళూరులో ఒకరు, బోస్టన్‌లో మరొకరు చదువుతున్నారు. నెలలో వారంపాటు పర్యటనల్లోనే ఉంటాను. ఎక్కడ ఉన్నాసరే యోగా, ధ్యానం చేస్తాను. పర్వతారోహణ నా హాబీ. మా ఇంటి తోటలోనే మాకు కావాల్సిన కాయగూరల్ని పండిస్తాను కూడా.* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
2️⃣. *_శ్రీ మహావిష్ణు పురాణం_* *_2 వ భాగం_* *_వ్యాస మహర్షి వృత్తాంతం:_* *సూత మహర్షి వ్యాస మహర్షి జనన చరిత్ర చెబుతూ “మానవుల ఇహపర జీవనానికి కావలసిన సమస్త ధర్మాలు, కర్మలు, జ్ఞానము వేదాలలో ఉంది. అందుకే వేదాలను శ్రుతి, జ్ఞానం, బ్రహ్మం అని కూడా అంటారు*. *కృతయుగం నుంచి కలియుగం వచ్చేసరికి మానవుల మేధాశక్తి, ఆయుష్యు తగ్గుతూ వస్తుంది. అందుకే ప్రతి ద్వాపరంలోను మానవులకు సులభతరంగా అర్ధమవ్వడానికి వేదాలను విభజించి రచించటం జరుగుతుంది*. *ప్రస్తుత మహాయుగంలోని ద్వాపరంలో వ్యాస భగవానుడు వేదాలతో పాటు వేదసారాంశం సులభంగా అర్ధమవ్వడానికి పద్దెనిమిది పురాణాలు, పద్దెనిమిది ఉపపురాణాలు రచించారు. పంచమ వేదం అన్న మహాభారత ఇతిహాసాన్ని రచించారు.* *ఉపనిషత్తులకు మూలమైన బ్రహ్మ సూత్రాలు రచించాడు.* *శ్రీమన్నారాయణుని జ్ఞాన రూప అవతారమైన వ్యాస మహర్షిని భక్తితో తలచుకునే పుణ్యదినం ఆషాడ శుద్ద పౌర్ణమి. ఈ రోజుని గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, వ్యాస జయంతి అని కూడా పిలుస్తారు. బ్రహ్మాండ పురాణంలో వ్యాస పూర్ణిమ గొప్పదనాన్ని తెలియచేసే కథ ఉంది.* *పూర్వము వారణాసిలో వేదనిధి, వేదవతి అనే దంపతులు నివసిస్తున్నారు. వారికి చాలా కాలం సంతానం కలుగ లేదు. వారికి తెలిసిన వారు “వ్యాస మహర్షి ప్రతిరోజు మధ్యాహ్నం మారు వేషములో వ్యాస మహర్షి గంగానదిలో స్నానం చేయడానికి వచ్చి వెళతారు. ఆయన అనుగ్రహం మీరు పొందగలిగితే సంతానం తప్పక లభిస్తుంది” అని చెప్పడంతో వారు గంగానది తీరానికి మిట్ట మధ్యాహ్నం వచ్చి వ్యాసమహర్షి రాక కోసం ఎదురు చూడసాగారు.* *కమండలం, దండం ధరించిన బిక్షువు ఒకరు స్నానానికి నది వద్దకు వచ్చాడు. దంపతులిరువురు ఆయనే వ్యాసుడని భావించి పాదాల పై పడి శరణు వేడారు. మొదట అదిలించినా, పట్టువదలని వారి దీక్షకు సంతసించి ప్రసన్నుడై వ్యాసుడు వరం ఇచ్చాడు. వేదనిధి మరుసటి రోజు తన తండ్రి శ్రాద్ధకర్మకు భోక్తగా రావాలని కోరాడు. వ్యాసుడు అంగీకరించాడు.* *మరుసటి రోజు వేదవతి తమకు ఉన్నంతలో అన్ని వంటకాలు శుచిగా రుచిగా చేసింది. బిక్షుక రూపంలో వ్యాసుడు భోక్తగా వచ్చాడు. తృప్తిగా శ్రాద్ధ భోజనం తిని సంతుష్టుడై వారిని చూసి “మీకు పదిమంది కుమారులు జన్మిస్తారు సుఖ భోగాలు అనుభవించిన తరువాత వైకుంఠ ప్రాప్తి మీక కలుగుతుంది.* *ఆషాడ శుద్ద పౌర్ణమి నాడు ప్రజలు ప్రతి పౌరాణికులలో నన్ను దర్శించి అతిథి సత్కరాలు చేసి పూజించాలి*. *అలా చేసినవారికి నా అనుగ్రహం తప్పక లభిస్తుంది” అని ఆశీర్వదించి వెళ్లి పోయాడు.* ``` *_వ్యాసాయ విష్ణు రూపాయ_* *_వ్యాసరూపాయ విష్ణవే_* *_నమోవై_* *_బ్రహ్మనిధయా వాసిష్ఠాయ నమో నమః_* *వ్యాస రూపంలో ఉన్న విష్ణువుకి, విష్ణరూపంలో ఉన్న వ్యాసునికి, వసిష్ట మహర్షి ముని మనవడైన వ్యాస భగవానుడికి నమస్కరిస్తున్నాను. ధర్మ సంస్థాపన చేసే భగవంతుడు, దర్మాధర్మ విచక్షణ బోధించే గురువు ధర్మం అనే నాణానికి రెండు ముఖాలవంటి వారు. వ్యాస మహర్షి మహాభారతం రచించడమే కాకుండా ఆ మహాభారత కథలో ముఖ్య పాత్ర వహించారు*. *పంచమ వేదమైన మహాభారతం రచన తరువాత వ్యాస మహర్షి మనస్సులో నారాయణుని గురించి పూర్తిగా వివరించ లేదన్న అసంతృప్తి మిగిలిపోయింది. నారద మహర్షి గ్రహించి వ్యాసుని వద్దకు వచ్చి “పురాణాలు, ఉప పురాణాలు, మహాభారతం రచించిన నీవు నారాయణుని లీలలను కీర్తించే పురాణం రుచించలేదు. మీ తండ్రి పరాశర మహర్షి మహావిష్ణు పురాణం చెప్పాడని నారాయణుని లీలలను వర్ణించి వ్రాయడం నీవు వదలి వేశావు. అందుకే నీ మనస్సు అసంతృప్తిగా ఉంది. భగవంతుడైన విష్ణు లీలలు, అవతారాలను వర్ణిస్తూ భాగవత పురాణం రచించు! నీ మనస్సులో ఉన్న దుఖం తొలుగుతుంది” అని బోధించాడు. వ్యాసుడు భాగవత రచన చేసి దుఖ విముక్తుడైనాడు*. *తను రచించిన భాగవతం లోకానికి అందించడానికి ఒక కుమారుడు ఉంటే బాగుండేది అని వ్యాసునికి తన ఆశ్రమంలో చెట్టుపై కాపురం చేస్తున్న చిలుకల సంసారం చూసి అనిపించింది*. *ఆ విషయం నారదునికి చెప్పగా, నారదుడు పార్వతీ పరమేశ్వరులను ఆరాధించి పుత్ర సంతానం పొందమని చెప్పి వెళ్లిపోయాడు. తపస్సు చేసిన వ్యాసునికి పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమై "పంచ భూతాలతో సమానమైన కుమారుడు నీకు జన్మిస్తాడని" వరమిచ్చి అదృశ్యమయ్యారు.* *కొంతకాలానికి వ్యాసుడు అగ్ని కోసం అరణి మధిస్తుండగా ఘృతాచి అనే అప్సరస కనిపించింది*. *వ్యాసుడు ఆమెను మోహించి చూడసాగాడు. మహర్షి తేజోమయ తీక్షణ చూపులకు భయపడి ఘృతాచి చిలుకగా మారి ఎదురుగా ఎగర సాగింది. వ్యాసుని తేజస్సు మధిస్తున్న అరణిలో పడి చిలుక ముఖం కలిగిన శుకుడు అవతరించాడు.* *శుకునికి భాగవతంతో పాటు వేద శాస్త్రములు బోధించాడు. పరీక్షతు మహారాజు శాపానికి గురై మరణం పొందే ముందు భాగవత పురాణం వినాలనుకుని వ్యాసుని అర్ధిస్తాడు. వ్యాసుడు తన కుమారుడు శుకునికి ఆ బాధ్యత అప్పగించాడు*. *తరువాత తన తండ్రి పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి చెప్పిన శ్రీ మహావిష్ణువు లీలలను మహావిష్ణు పురాణంగా రచించి లోకానికి అందించాడు. కనుక మీకు వ్యాసుని తండ్రి పరాశర మహర్షి కథను కూడా మహావిష్ణు పురాణానికి ముందు వినిపిస్తాను* #మన సంప్రదాయాలు సమాచారం
*_స్నేహితుడంటే…?_* *అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం.* *స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న మొదలైన బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా స్నేహితులను మాత్రం మనల్నే ఎంచుకోమన్నాడు.* *అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది.* *తెలుగు కవి ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి "సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ" అన్నారు.* *మంచి స్నేహాన్ని సంపాదించుకోవడం అంత సులభం కాదు.* *స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు.* *మనలా ఆలోచించే, మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు.* *మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమైనప్పుడు నిస్సంకోచంగా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు.* *కష్ట సమయంలో కలత చెందిన మనసుకి వెన్నలా చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం.* *స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయస్సుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలోను స్నేహ భావం ఉంటుంది. స్నేహానుభూతిని అనుభవిస్తేనే తెలుస్తుంది. ఒక్కోసారి కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని సమస్యలను ఈ ఆత్మీయ స్నేహితులతో నిర్మొహమాటంగా చర్చించవచ్చు.* *స్నేహంగా ఉన్నప్పుడు అనుమానం, కోపం, ద్వేషం కూడా దరిదాపులకు రావడానికి జంకుతాయి. స్నేహం అద్భుతమైంది. స్నేహానికి ఎల్లలు లేవు. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు.* *మంచి స్నేహం… వ్యక్తి వికాసానికి బాటలు వేస్తుంది. మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలోను విలువైన స్నేహాన్ని జీవితాంతం నిలుపుకునే ప్రయత్నం చేయాలి.* *’స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా...’ అన్నట్లు ఆ విలువైన బంధాన్ని అపురూపంగా కాపాడుకోవాలి.* #మన సంప్రదాయాలు సమాచారం
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:10
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:08
*_ఓo సర్వాలోకేశాయై నమః_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:30
https://www.youtube.com/live/00-ZIIEAqYY?si=A_LYUqhIRixNIdy8 #మన సంప్రదాయాలు సమాచారం
youtube-preview
బాల్య మిత్రులు... అప్పుడు నేను బాపట్లలో ఉండే వాణ్ణి... కూరగాయలు కొందామని మిత్రుడు పున్నయ్య దుకాణానికెళ్ళాను ఆరోజు ఉదయం.... చాలా బిజీగా ఉండే కూరగాయల దుకాణం పున్నయ్యది... ఆ రోజు ఏదో పెద్ద గలాటా జరుగుతోంది అతడి దుకాణం దగ్గర... మార్కెట్లో జనమంతా ఇంచుమించుగా అక్కడే గుమి గూడి ఉన్నట్టుగా అనిపించింది... లోపల నుండి ఒకటి రెండు గొంతులు గట్టిగా వినిపిస్తున్నాయి. జనాన్ని తప్పించుకుని ముందుకు వెళ్ళాను. తగాదా జరుగుతున్నది ముగ్గురి మధ్య అనిపించింది ! ఒకరు పున్నయ్య, రెండో వ్యక్తి సినీ నటుడు పి. యల్. నారాయణ గారి అన్నగారైన చలం గారు. మూడో వ్యక్తి ఎవరో నాకు తెలియదు. టై లేకుండా సూటులో ఉన్నారు. "ఏమైంది? ఎందుకీ గొడవ?" అన్నాను జోక్యం చేసుకుని... "మీరు న్యాయం చెప్పండి సార్." అన్నాడు పున్నయ్య నా చేతులు పట్టుకుని... "అసలు విషయం ఏమిటి?" అన్నాను. "నేనూ, చలం మీకు తెలుసు కదాండీ. ఈ మూడో వ్యక్తి కుంభంపాటి బలరాం గారు ..." "అదిగో! అందుకే నిన్ను తంతానంటున్నాను! 'గారుట! గారు!!" అంటూ సూటూ బూటూ వ్యక్తి అంత ఎత్తున లేచాడు! "ఇదెక్కడ గొడవండీ? నేనతడిని 'గారు' అనకూడదట!" అన్నాడు పున్నయ్య. "అసలు మన తగాదా అందుకే మొదలైంది!" అంటూ గుడ్లురిమి చూశాడు సూ.బూ.వ్యక్తి. "గారు అంటే తప్పేమిటండీ? మిమ్మల్ని గౌరవిస్తూ అన్నాడు." అన్నాను. "తప్పా? తప్పున్నరా? ఇంతకీ మీరెవరు? మీకేం తెలుసని మామధ్య జోక్యం చేసుకుంటున్నారు?" నావైపు కోపంగా చూశాడు. నన్ను పరిచయం చేశాడు చలం. సూ.బూ. వ్యక్తి పెద్ద ఉపన్యాసమే ఇచ్చాడు. సారాంశమేమిటంటే - పున్నయ్య , చలం , అతడూ బాల్య స్నేహితులు!! ముగ్గురూ ఒకే బెంచి మీద కూర్చునేవారు స్కూల్లో. కలసి ఆడుకుంటూ తిరిగే వారు. వారి బాల్య స్నేహం ఎంతో అపురూపమైనది. పున్నయ్య , చలం బాపట్ల లోనే ఉండిపోతే, సూ. బూ. వ్యక్తి పై చదువులు చదివి బొంబాయిలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఐదారు సంవత్సరాల కోసారి బాపట్ల వస్తూంటాడు... ఆ ఉదయం పున్నయ్య ని చూడడానికి దుకాణానికి వస్తే పున్నయ్య "ఎలా ఉన్నారు బలరాం గారూ?" అని పలుకరించాడట!! అక్కడ మండింది సూ. బూ. వ్యక్తికి!!🤓 "ఇప్పుడు చెప్పండి. ఏఁరా బలరాం! ఎప్పుడొచ్చావ్? అనాలి గాని 'గారూ' అనొచ్చా?" అన్నాడు సూ.బూ. వ్యక్తి కోపంగా ఊగిపోతూ... చలించిపోయాను నేను! "నిజమే, పున్నయ్యా. బాల్య మిత్రుణ్ణి అలా అనొచ్చా?" అన్నాను. "ఇదెక్కడి న్యాయమండీ? ఆయన భాభా అటామిక్ ఇన్స్టిట్యూట్ లో ఛీఫ్ మేనేజర్! పేరున్న కెమికల్ ఇంజనీర్!నేను సామాన్య కూరగాయల కొట్టు వాణ్ణి! ఆయన్ని అలా ఎలా అంటాను?" అన్నాడు పున్నయ్య. "నువ్వు నన్ను అలా అనవా? నన్ను 'మీరు' అనేవారు చాలా మంది ఉన్నారురా. 'నువ్వు' అనేవారు నువ్వూ , చలం మాత్రమే! అలా పిలిపించుకుందుకే అంత దూరం నుండి వస్తూంటాను. క్రిందటి సారి వచ్చినప్పుడు నువ్వు ఊళ్ళో లేవు! ఇప్పుడున్నావంటే నన్నిలా దూరం పెట్టేస్తావా? సరే ! నేను వెళ్తున్నా." అన్నాడు సూ.బూ. వ్యక్తి! అతడి కళ్ళ నిండా నీరు చేరడం అందరం గమనించాం!😒 వారి మైత్రీ, ఆప్యాయతకి అందరం చలించిపోయాం... నిండు మనసుతో వారిని అభినందిస్తూ సయోధ్య కుదిర్చాం. 🤝 పిల్ల వాడిలా ఏడుస్తూ పున్నయ్య అతణ్ణి కౌగిలించుకొన్నాడు! బాల్య స్నేహితులు అంటే వారే! కాదంటారా? (ఈ యదార్ధ గాధను ఉటంకించినవారు శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారు) బాల్య స్నేహం ఒక భాగ్యం!!! దానిని అనుభవిస్తున్న వారెవరైనా ఉన్నారా మనలో? ఉంటే కొనసాగించండి... #మన సంప్రదాయాలు సమాచారం
https://www.youtube.com/live/aACGdiqe1AA?si=59Mt-NLTdikKzknr #మన సంప్రదాయాలు సమాచారం
youtube-preview
*జగ్గీ వాసుదేవ్ ప్రయాణం కర్ణాటకలోని మైసూర్ వీధుల్లో ఒక సాదాసీదా కోళ్ళ ఫారం యజమానిగా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మొదలైంది*. *లాభనష్టాల లెక్కల మధ్య సాధారణంగా సాగుతున్న ఆయన జీవితం ఒక్కసారిగా 'ఆధ్యాత్మిక గురువు'గా మలుపు తిరగడం వెనుక అనేక మిస్టరీలు ఉన్నాయి*. *ముఖ్యంగా 1997లో ఆయన భార్య విజయకుమారి మరణం ఈ కథలో అత్యంత చీకటి అధ్యాయం. ఆరోగ్యంగా ఉన్న 31 ఏళ్ల మహిళ 'మహాసమాధి' పేరుతో ప్రాణాలు వదిలిందని జగ్గీ ప్రకటించినప్పటికీ*, *అది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని ఆమె తండ్రి గంగాధరన్ అప్పట్లోనే బెంగళూరు, మైసూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగ్గీకి ఆశ్రమంలోని మరో మహిళతో ఉన్న సంబంధం వల్లే తన కూతురిని వదిలించుకున్నారని ఆయన ఆరోపించారు*. *అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఆమె మృతదేహానికి పోస్టుమార్టం జరగకుండా, పోలీసులు వచ్చేలోపే అత్యంత వేగంగా దహనం చేయడం వెనుక సాక్ష్యాలను రూపుమాపే కుట్ర ఉందనేది నేటికీ ఒక బలమైన వాదన*. *ఇక్కడ గమనించాల్సిన కీలకమైన విషయం ఏమిటంటే, భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయం ప్రకారం సిద్ధులను లేదా మహాసమాధి పొందిన యోగులను ఎన్నడూ దహనం (తగలబెట్టడం) చేయరు, కేవలం ఖననం (పూడ్చిపెట్టడం) మాత్రమే చేస్తారు*. *కానీ జగ్గీ మాత్రం ఆమె సిద్ధురాలు అని చెబుతూనే, నిబంధనలకు విరుద్ధంగా ఆమె శరీరాన్ని తగలబెట్టించడం వెనుక ఏదో పెద్ద క్రైమ్ దాగి ఉందనే అనుమానాలు అప్పుడు ఇప్పుడు వున్నాయి* *మైసూర్ నుండి తమిళనాడులోని కోయంబత్తూర్ వెళ్ళిఆర్ కొండల పాదాల వద్దకు చేరినఇతడి ఈషా ఆశ్రమం, అక్కడ ఉన్న అమాయక గిరిజనుల కొంపలు ముంచింది*. *'పల్లాంటి' అనే తెగకు చెందిన గిరిజనులను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి వారి భూములను లాక్కోవడం ద్వారా ఆశ్రమ సామ్రాజ్యం విస్తరించింది*. *ఇది కేవలం మనుషులకే కాదు, మూగజీవాలకు కూడా శాపమైంది. ఏనుగుల సహజ సంచార మార్గాలను ఆక్రమించి భారీ కట్టడాలు నిర్మించడంతో, దారి తప్పిన ఏనుగులు జనారణ్యంలోకి వచ్చి ప్రాణాలు కోల్పోతున్నాయి*. *ప్రకృతి ప్రేమికుడినని చెప్పుకునే వ్యక్తి, వన్యప్రాణుల మరణాలకు కారణమవుతున్నారనేది కచ్చితమైన ఆరోపణ*. *ఇక ఇతడి ఆర్థిక కోణం చూస్తే, 'కావేరీ కాలింగ్' మరియు 'ర్యాలీ ఫర్ రివర్స్' వంటి కార్యక్రమాల పేరుతో సామాన్య ప్రజల నుండి వందల కోట్ల రూపాయల విరాళాలు సేకరించారు*. *ఒక్కో మొక్కకు 42 రూపాయల చొప్పున వసూలు చేసిన ఆ నిధులు ఏమయ్యాయో చెప్పే లెక్కల్లో పారదర్శకత లేదని కాగ్ (CAG) వంటి ప్రభుత్వ సంస్థలే వేలెత్తి చూపాయి*. *మరోవైపు, ఆశ్రమానికి వచ్చే యువతీ యువకులను 'మైండ్ కంట్రోల్' చేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తన స్వంత కూతురికి వైభవంగా పెళ్లి చేసి విదేశాల్లో స్థిరపరిచిన జగ్గీ,* *ఇతరుల కూతుళ్లను మాత్రం సన్యాసినులుగా మారాలని ప్రబోధించడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనం. తమ పిల్లలను అక్రమంగా నిర్బంధించారంటూ తల్లిదండ్రులు నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు*. *ఈ వివాదాలన్నీ ఒకెత్తయితే, తాజాగా తన 'కాలు ఫోటోను' భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని 3200 రూపాయలకు విక్రయానికి పెట్టడం ఆధ్యాత్మికత పతనానికి పరాకాష్టగా కనిపిస్తోంది.అతడికి గుడ్డి భక్తుల మీద ఉన్న నమ్మకం తెలియజేస్తుంది* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat