Ravi  Talluri
ShareChat
click to see wallet page
@91775
91775
Ravi Talluri
@91775
feelgood
#📽ట్రెండింగ్ వీడియోస్📱
📽ట్రెండింగ్ వీడియోస్📱 - ShareChat
01:00
#📽ట్రెండింగ్ వీడియోస్📱
📽ట్రెండింగ్ వీడియోస్📱 - ShareChat
01:45
#కలిదోషం_మనదరి_చేరకూడదు_అంటే_ఏమిచేయాలిలో_మీకు_తెలుసా? *_కలిదోష నివారణకు మహామంత్రం – నలదమయంతుల కథ_* *_నలదమయంతుల కథ కనీసం ఒక్కసారైనా చదవాలి..._* *ఈ కలికాలంలో ప్రతి మనిషిలో స్వార్థం పెనవేసుకుపోయింది*. *దేనివల్ల అంటే కలిప్రభావం వలన అని అనేక శాస్త్రాలు తెలుపుతున్నాయి*. *కలికాలంలో కలిదోషం మనదరి చేరకూడదు అంటే ఏమిచేయాలి? నలదమయంతుల కథ కనీసం ఒక్కసారైనా చదవాలి.* *ఇది కలికాలం కాబట్టి అందరికీ చదివే అవకాశం రాకపోవచ్చు. లేదా చదవాలని ఉన్నా పుస్తకం పట్టుకోగానే మైకం కమ్మి నిద్ర పట్టేయవచ్చు*. *ఇలా అనుకుంటూ కాలం గడిపేస్తే కలిపురుషుడి ప్రభావం ఎలా తగ్గుతుంది? తగ్గకపోగా ఇంకా ఇంకా పెరుగుతుంది*. *కలిప్రభావం వలన మనం నిత్యం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కున్తున్నమో, ఎన్ని కష్టాలు పడుతున్నమో చూస్తూనే ఉన్నాం కదా! మరెలా కలిప్రభావం తగ్గుతుంది.* *ధర్మపాలుడు అయిన నలుడిని ఎలాగైనా నాశనం చేయాలని 15 సంవత్సరాలు ఓపికతో ఎక్కడ దొరుకుతాడా అని చూశాడు.* *ఒకనాడు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా సూర్య నమస్కారం చేశాడు*. *అంతే! ఆ చిన్న పొరబాటు వలన నలుడిలోకి సులువుగా ప్రవేశించాడు కలి. అది కూడా కలియుగం కాదు*. *కృతయుగంలో.. కృతయుగం అంటే ధర్మానికి నిలయం. ఆయుగంలో అధర్మం పొరబాటున ప్రవేశించలేదు*. *అలాంటి యుగంలోనే మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోలేదని నలుడిని పట్టుకున్నాడంటే ఈయుగంలో మనం ఎంత ధర్మబద్దంగా బ్రతుకుతున్నామో ఒక్కసారి అలోచించి చూసుకోండి..* *కలి ప్రవేశించడంతో జూదం ఆడాలని అనిపించింది*. *అప్పటి వరకు జూదంలో విజేతగా ఉన్న నలుడు తనకంటే అల్పుడైన వాడి చేతిలో రాజ్యంతో సహా సర్వాన్ని కోల్పోయాడు*. *అడవుల పాలయ్యాడు. అయినా తన ధర్మనిష్ఠకి బద్ధుడై జీవించాడు. ఆపదలో ఉన్న కర్కోటకుడు అనే సర్పాన్ని రక్షించాడు.* *అప్పటి వరకు సుందరమైన రూపంతో ఉన్న నలుడి క్షేమం కోసం కర్కోటకుడు కురూపిగా మార్చి ఋతుపర్ణుడి రాజ్యానికి వెళ్ళేలా చేశాడు*. *ఇక్కడ తనని అడవిలో తన భర్త తనని ఒంటరిగా ఒదిలి వెళ్ళిన పిదప ఋషుల దర్శనం జరిగిన అనంతరం తన పిన్ని రాజ్యానికి చేరిన దమయంతి భర్త అన్వేషణలో భాగంగా రెండో వివాహం అని ప్రతి రాజ్యానికి వర్తమానం పంపింది*. *ఋతుపర్ణుడి రాజ్యంలో తన భర్త అయిన నలుడు ఉన్నాడని ఐతే కురూపిగా ఉన్నాడని సందేహించిన దమయంతి ప్రత్యేకించి ఋతుపర్ణుడి రాజ్యానికి రెండుసార్లు వర్తమానం పంపడం,* *తెల్లారితే స్వయంవరం కావడంతో ఋతుపర్ణుడు నలుడికి రథం తోలడంలో ఉన్న చాకచక్యం తెలిసి సారధ్యం కోరతాడు.* *అప్పటికే తన భార్య దమయంతి ఇలా ఎందుకు చేస్తుంది? అంత పతివ్రత అయిన దమయంతి నన్ను కాదని మళ్ళి వివాహం ఎందుకు చేసుకుంటుంది? ఇది ఎలాగైనా తెలుసుకోవాలని ఋతుపర్ణుడి విన్నపాన్ని అంగీకరించి రథసారధ్యం వహిస్తాడు.* *ఆ రథం వెళ్ళే వేగానికి (నిమిషానికి "నిమిషం అంటే కంటి రెప్పపాటు" అంటే కనురెప్పపాటు కాలంలో 8 యోజనాల దూరం వెళ్ళే వేగానికి) ఋతుపర్ణుడు ఆశ్చర్యపోతాడు*. *మహాత్మా! నీవు సామాన్యుడిలా లేవు. ఇంత వేగంతో రథాన్ని నడపగల సామర్ధ్యం ఈ భూమండలం మీద ఒక్కరికే ఉంది. ఆయనే నలుడు*. *అది మీరే అని నా సందేహం. నిజం చెప్పండి అంటూ ఉండగా ఆవేగానికి తన భుజం పై ఉన్న ఉత్తరీయం గాలికి ఎగిరి పడుతుంది. మహాత్మా ఒక్కసారి రథం ఆపండి*. *ఉత్తరీయం తీసుకురావాలి అనగా! నలుడు మహారాజా! ఉత్తరీయం పడి మీరు నాకు ఆ విషయం చెప్పేలోపు మనం 8యోజనాల దూరం వచ్చేసాం. ఇప్పడు వెనక్కి వెళ్ళడం అంటే సమయానికి మనం చేరుకోలేము*. *అనగానే ఆశ్చర్యపోయిన ఋతుపర్ణుడు.. మహాత్మా! ఒక్కసారి ఆ దూరంగా కనిపిస్తున్న చెట్టు వద్ద రథాన్ని నిలపండి. అంటాడు. రథాన్ని ఆపుతాడు నలుడు*. *ఋతుపర్ణుడు నలుడిని వివరం అడుగుతాడు. అప్పుడు జరిగింది చెప్పగా ఋతుపర్ణుడుఆనందాశ్చర్యలకు గురై మహాత్మా! నీకు అక్ష హృదయ విద్య ఉపదేశిస్తాను*. *నాకు అశ్వహృదయ విద్య ఉపదేశించు అనగానే మహరాజా!ప్రస్తుతం నేను కురూపిని ముందు నాకు అక్షహృదయ విద్య ఉపదేశించండి*. *ఈ రూపం నేను కోరుకున్న వెంటనే పోతుంది. ప్రస్తుతం ఈరూపం వదలకూడదు. అందుచేత రూపం మారిన వెంటనే మీకు అశ్వహృదయ విద్య బోధిస్తాను. అన్నాడు నలుడు*. *వెంటనే అక్కడే ఉన్న చెట్టు వద్దకి తీసుకెళ్ళి అక్షహృదయ విద్య బోధిస్తాడు*. *ఆ మంత్ర ప్రభావం చేత, నిత్యం తాను చేస్తున్న సంధ్యావందనం చేత, ఆచరిస్తున్న ధర్మ నిష్ఠ చేత తనలో ప్రవేశించిన కలిపురుషుడు తట్టుకోలేక నల్లటి రూపంలో బయటికి వచ్చాడు.* *"మహానుభావా!నీకు నమస్కారం. నన్ను శపించకు. నేను కలిపురుషుడిని. నిన్ను ఎలాగైనా పరీక్షించి నాశనం చేయాలనీ నీలో ప్రవేశించాను*. *ప్రవేశించాను అనే పేరే కాని నీలో ప్రవేశించిన క్షణం నుండి నువ్వు ఆచరించే ధర్మనిష్ఠ, నియమ నిష్టలకి నిరంతరం దహించుకుపోయాను.* *నిన్ను పరిక్షించడం మాట అటుంచి మొండిగా నీలో ఉన్నాను తప్ప క్షణకాలం సుఖం లేదు.* *దీనికి తోడు ఇప్పుడు నువ్వు పొందిన అక్ష హృదయ విద్య మరింతగా దహించింది*. *ఇక నావల్ల కాక ఇలా బయటికి వచ్చేశాను. నన్ను క్షమించు. నన్ను శపించకు*. *ఈనాటి నుండి నీకో వరం ఇస్తున్నాను. నిన్ను నీభార్యని, కర్కోటకుడిని, ఈ ఋతుపర్ణుడిని ఎవరైతే తలచుకుంటారో వారిని నేను పట్టుకోను.* *నీకు వరం ఇస్తున్నాను అని అక్కడే ఉన్న చేట్టులోకి ప్రవేశించాడు. ఆ శ్లోకమే ఈ క్రింద ఇచ్చిన శ్లోకం*. *ప్రతి ఒక్కరు నిత్యం ఒక్కసారైనా దీనిని స్మరిస్తే కలి భయం ఉండదు.* *_కర్కోటకస్య నాగస్య దమయంత్యాహ నలస్యచ!_* *_ఋతుపర్ణస్య_* *_రాజర్షేహే కీర్తనం కలి నాశనం!_* *_దమయంతి నలాబ్యాంచ ప్రణమామి పునః పునహా_* #మన సంప్రదాయాలు సమాచారం
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - బాగ్గకం छ७ రామం @హారం ೧ಎ೦ జీవిరాన్ని కబరించే నూరేళ్ళ రాక్షసులు వీళ్ళని అదుపులో పెట్టుకో నిన్ను నువ్వు కోల్పోక తప్పదు లేకంటే బాగ్గకం छ७ రామం @హారం ೧ಎ೦ జీవిరాన్ని కబరించే నూరేళ్ళ రాక్షసులు వీళ్ళని అదుపులో పెట్టుకో నిన్ను నువ్వు కోల్పోక తప్పదు లేకంటే - ShareChat
*_సిధ్‌ నాయుడు...ఈ తెలుగబ్బాయి ప్రకటనల రంగంలో ఓ ధృవతార! అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా, ఎయిర్‌టెల్‌, మ్యాక్స్‌, లైఫ్‌ స్టైల్‌, ఐసీఐసీఐ... ఇలా యాభై పైచిలుకు టాప్‌ బ్రాండ్‌లకి తనే ప్రకటనలు చేస్తుంటాడు. ఈ రంగానికి సంబంధించిన ఎన్నో అవార్డుల్ని వరసపెట్టి సాధిస్తున్నాడు_. ఇంతకీ సిధ్‌ ఓ బాలకార్మికుడిగా నెలకి రూ.250తో జీవితాన్ని మొదలు పెట్టినవాడు. ఇప్పుడు ఒక్కరోజు షూట్‌కే రెండు లక్షలదాకా డిమాండు చేస్తున్నాడు! ఈ కొత్త ఏడాదిలో ఏ జీవనపోరాటానికైనా మనల్ని సిద్ధంచేయగల సిధ్‌ స్ఫూర్తికథ ఇది...* *బెంగళూరు కేఆర్‌ పురం బస్టాండు. వేసవి సెలవుల తర్వాత ఆ రోజే కాలేజీలు తెరిచారు. నా బస్సు కోసం వెయిట్‌ చేస్తూ ఉన్నాను. అక్కడికి నా స్నేహితులిద్దరు- మూణ్నెల్ల క్రితందాకా నాతోపాటు బడిలో చదువుకున్నవాళ్లు వచ్చారు. ఆ మిత్రుల్ని చూడగానే నా ముఖం వెలిగిపోయింది*. *‘హాయ్‌... రా!’ అంటూ ఆనందంగా పలకరించబోయాను కానీ వాళ్లు అదేదీ పట్టనట్టు ‘ఏరా... చదువుమానేశావటగా!’ అన్నారు నిర్లక్ష్యంగా చూస్తూ...* *అదేదో నా పాపం అన్నట్టు. ఆ ప్రశ్నతో పాలిపోయిన నా ముఖాన్నీ, రాలుతున్న కన్నీళ్లనీ చూపించడం ఇష్టంలేక ‘అవును... రా!’ అన్నాను తలొంచుకుని. అలా వంచిన తలని బస్సు వచ్చేదాకా పైకెత్తలేదు. బస్సులోకి వెళితే అందులో దాదాపు అందరూ నాతో చదువుకున్నవాళ్లే. ప్రతి ఒక్కరూ నన్ను అదే ప్రశ్న అడిగినవాళ్లే. నేను జవాబు చెప్పాక*. *వాళ్లలో ఎవరూ నాతో మళ్లీ మాటలు కలపలా. నేనక్కడ లేనట్టే...* *ప్రవర్తించసాగారు. నేను పలకరించినా పట్టించుకోలేదు. అది నాకు చాలా అవమానంగా అనిపించింది*. *ఏడుపుని నొక్కిపడుతూ బస్సు నుంచి అర్థాంతరంగా దిగిపోయాను. బహుశా... నేను దిగిపోయింది కేవలం బస్సు నుంచే కాదు శాశ్వతంగా చదువులమ్మ ఒడి నుంచి కూడా అన్న నిజం అర్థమైపోయిందేమో... ఇక ఏడుపుని ఆపడం నా వల్ల కాలేదు. 2007లో ఈ సంఘటన జరిగితే... 2017కల్లా నేనో సొంత యాడ్‌ ప్రొడక్షన్‌ కంపెనీని ప్రారంభించాను. ఆ పదేళ్లే ఇప్పటి నా జీవితాన్ని నిర్దేశించాయి. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు*.. *మా అమ్మానాన్నలది చిత్తూరు. ఎప్పుడో పొట్టచేతపట్టుకుని బెంగళూరుకి వచ్చేశారట. నాన్న కుమార్‌ నాయుడు బెంగళూరులోని ఓ ఆర్టీఓ కార్యాలయంలో బ్రోకర్‌గా కుదురుకున్నారు. ఆ ఉద్యోగంతోపాటూ అలవాటైందేమో తెలియదు కానీ*... *తాగుడుకి బానిసైపోయాడు. దానికి సిగరెట్టూ జతకలిసి 45 ఏళ్లకే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. లివర్‌ పూర్తిగా దెబ్బతిని మంచానపడ్డాడు. మా అమ్మ మీరాకి- ఆయనకు సపర్యలు చేయటంతోనే సరిపోయేది. దాంతో నాకన్నా ఆరేళ్ల చిన్నవాడైన నా తమ్ముడు కిరణ్‌ బాధ్యతలు నేనే చూసేవాణ్ణి. నేను ఆరోతరగతిలో ఉన్నప్పుడు అనుకుంటాను... బడిలో మధ్యాహ్నం లంచ్‌ చేస్తుండగా మా పక్కింటాయన వచ్చాడు*. *రావడంతోనే ‘నాన్నకి ఆరోగ్యం బాగా పాడైపోయింది బాబూ... అర్జెంటుగా రండి!’ అన్నాడు.* *ఎల్‌కేజీ చదువుతున్న నా తమ్ముణ్ణి చంకనెత్తుకుని*... *బయల్దేరాను. మా వీధిలోకి అడుగుపెట్టేసరికే*.. *నాన్న పోయారని అర్థమైపోయింది. చావంటే అర్థమయ్యీ కానీ ఆ వయసులో అమ్మని నేనే ఓదార్చాల్సి వచ్చింది. కర్మకాండలు పూర్తయి... దుఃఖం కాస్త ఉపశమించగానే*... *ఆకలి బాధ మొదలైంది. మా కడుపులు నిపడంకోసం- అప్పటిదాకా ఇల్లుదాటని అమ్మ ఓ ఇంట్లో వంటమనిషిగా కుదిరింది. ఆ ఇంటివాళ్లే నా స్కూల్‌ ఫీజు కడతామని ముందుకొచ్చారు. మరో బంధువు మా తమ్ముడి చదువుకి అవసరమైన డబ్బుని సర్దడం మొదలుపెట్టారు*. *అలా ఎంతకాలమని అనుకుందేమో అమ్మ... వంట మనిషిగానే కాకుండా దొరికిన పనులన్నీ చేసింది. ఓ స్కూల్లో పారిశుద్ధ్య కార్మికురాలిగానూ మారింది. నేనూ ఉదయం పేపర్‌బాయ్‌గా పనిచేయడం మొదలుపెట్టాను. ఈ డబ్బుతోనే తమ్ముడికీ, నాకూ స్కూలు ఫీజులు కడుతుండేవాణ్ణి*. *అంతటితోనే ఆగిపోకూడదు అనిపించి...* *అమ్మతోపాటూ నేనూ పనిచేసి తమ్ముణ్ణి బాగా చదివించాలనుకున్నాను. అందుకే చదువుమానేస్తానని మొండికేశాను. తనూ ఒప్పుకోక తప్పని పరిస్థితి. అలా పనికెళ్లిన మొదటిరోజే బస్సులో స్నేహితుల నుంచి నాకు ఆ అనుభవం ఎదురైంది*. *_తొలి మలుపు..._* *_నేను తొలిసారి పనికి కుదరింది ఓ ఆడిటింగ్‌ కంపెనీలో..._* *ఆఫీస్‌బాయ్‌గా. ఆ సంస్థ మేమున్న ప్రాంతానికి చాలాదూరంలో ఉండేది... మూడు బస్సులు మారి వెళ్లాల్సి వచ్చేది. ఉదయం ఎనిమిదికి బయల్దేరితే... రావడానికి రాత్రి ఎనిమిదయ్యేది. ఒక నెలపాటు ఉత్సాహంగానే పనిచేశాను కానీ... ఆ తర్వాత నా ఆరోగ్యం దెబ్బతింది*. *కోలుకోవడానికి పదిరోజులు పట్టింది. అమ్మ డాక్టర్‌ దగ్గరకి తీసుకెళితే ‘పసివాడుకదమ్మా! అంతంతసేపు ప్రయాణాలని శరీరం తట్టుకోలేకపోతోంది. వాణ్ణి చదువుకోనివ్వండి...’ అన్నారు*. *అమ్మా అదే మాట అన్నా నేను ఒప్పుకోలేదు. పైగా, మా ఇంటి దగ్గర కొత్తగా ఓ సూపర్‌మార్కెట్‌ తెరిస్తే ‘ఉద్యోగం ఇవ్వండి!’ అంటూ వెళ్లాను. నాన్న చనిపోవడం, అమ్మ కూలీపనులతో ఒళ్లు గుల్లచేసుకోవడం*... *అన్నీ అక్కడి మేనేజర్‌కు వివరించాను. అంతా విని జాలిపడ్డారుకానీ... నాకు పదహారేళ్లే కాబట్టి పనిలోకి తీసుకోలేమని చెప్పారు*. *ఉసూరుమంటూ బయటకు వస్తున్న నన్ను ఓ వ్యక్తి ఆపాడు. ప్రకాశ్‌ అన్న అతను ఈ సూపర్‌ మార్కెట్‌లోని ఓ చిన్న స్థలంలో ‘డెయిలీ బ్రెడ్‌’ పేరుతో కాఫీ షాపుని నడుపుతుండేవాడు*. *నా కథ అతనూ విన్నాడేమో ‘ఇందిరానగర్‌లో ఉన్న మా కాఫీ షాపులో చేరు!’ అంటూ విజిటింగ్‌ కార్డు ఇచ్చాడు. అప్పటికప్పుడే వెళ్లి వెయిటర్‌గా చేరిపోయాను*. *ఎవ్వరూలేకున్నా షాపుని కనిపెట్టుకుని ఉండటం, కస్టమర్‌ లతో చక్కగా మాట్లాడగలగడం, అప్పగించిన పనుల్ని నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పూర్తిచేయడం*... *నాలోని ఈ క్రమశిక్షణ వాళ్లకి బాగా నచ్చినట్టుంది. చేరిన ఏడాదికే నన్ను క్యాషియర్‌ని చేశారు. ఆ కాసింత ప్రగతి*... *నాకిచ్చిన ఆత్మవిశ్వాసం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత నా ఎదుగుదలకి కావాల్సిన మనోబలాన్ని అదే ఇచ్చిందని చెప్పాలి.* *నాకు ఉద్యోగం ఇచ్చిన ప్రకాశ్‌ వేరే సంస్థకి మారుతూ నన్నూ అక్కడికి తీసుకెళ్లాడు. కానీ...* *ఈ కొత్తచోటకి వెళ్లిన ఆరునెలల్లోనే సంస్థ మూతపడిపోయింది. ‘ఐరన్‌ లెగ్‌’ అనుకోలేదు ప్రకాశ్‌... వాళ్లావిడ ద్వారా నాకు డాబర్‌ సంస్థవాళ్ల ‘న్యూ యూ’ ఔట్‌లెట్‌లో ఉద్యోగం ఇప్పించాడు. నా కెరీర్‌ ప్రయాణం మొదటి మలుపు తిరిగింది అక్కడే*... *_ఫ్యాషన్‌ రంగంవైపు..._* *‘న్యూ యూ’లో క్యాషియర్‌గా చేరిన నేను ఏడాదిలోపే స్టోర్‌ మేనేజర్‌ స్థాయికి ఎదిగాను*. *బెంగళూరులోని అతిపెద్దదైన ‘మంత్రీస్క్వేర్‌ మాల్‌’లో ఉండేది ఆ షాపు. మాకు ఎదురుగా ఉన్న పెద్ద ఖాళీ ప్రదేశంలో రకరకాల వేడుకలూ, కొత్త ప్రొడక్ట్‌ల పరిచయాలూ, యాడ్‌ షూటింగ్‌లూ జరుగుతుండేవి. కన్నడ, హిందీ సినిమా ప్రముఖులూ తరచూ వస్తుండేవారు*. *వారంలో కనీసం మూడునాలుగురోజులపాటు జరిగే ఈ యాడ్‌ సందడి నన్ను సూదంటు రాయిలా లాక్కుంది. నేనూ ఈ రంగంలోకి వెళ్లాలన్న ఆశలు రేకెత్తించింది. అప్పుడే మంత్రీమాల్‌ తరపున ఈ కార్యక్రమాలకి ఈవెంట్‌ మేనేజర్‌గా ఉండే ఉల్లాస్‌తో నాకు స్నేహం కుదిరింది.* *నాకు ఖాళీ దొరికినప్పుడల్లా అతనికి సాయం చేస్తుండేవాణ్ణి. కొన్నాళ్లకి అతను ఉద్యోగానికి రాజీనామా చేస్తూ*... *ఆ స్థానంలో నన్ను పెట్టాడు. నచ్చిన రంగం, పైగా కొత్తదీ కావడంతో మంచి పేరు తెచ్చుకున్నాను*. *ఆ తర్వాత- ఈ మాల్‌కి బయట-ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలో మరెన్నో మంచి అవకాశాలున్నాయని తెలుసుకున్నాను. మాల్‌లో మానేసి బెంగళూరులోని అతిపెద్ద ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల్లో ఒకటైన ‘స్క్వేర్‌ వన్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ మార్కెటింగ్‌’ సంస్థలో చేరాను. వీళ్లు కొన్ని ఫ్యాషన్‌ బ్రాండ్‌లకీ ప్రకటనలు చేసి ఇస్తుండేవారు. నేను ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌కన్నా...* *వీటిపైనే ఎక్కువ దృష్టిపెట్టాను. అలా ప్రకటనల రంగానికి సంబంధించి తొలి అక్షరాలు ఇక్కడే దిద్దుకున్నాను*. *క్రియేటివ్‌గా రాయడం దగ్గర్నుంచీ కంప్యూటర్‌ స్కిల్స్‌ దాకా అన్నీ నేర్చుకున్నాను. నేనిప్పుడు మాట్లాడే హై-ఫై ఇంగ్లిషు కూడా ఆ సంస్థ చలవే. ఈ రంగంలోకి వెళ్లాక ఫ్యాషన్‌ డిజైనర్‌లూ, స్టైలిస్టులూ, మోడళ్లూ, పేరున్న ఫ్యాషన్‌ ఫొటోగ్రాఫర్‌లూ... ఇలా అందరితోనూ పరిచయాలు ఏర్పడ్డాయి. మూడేళ్ల తర్వాత నేనూ ఫ్రీలాన్సర్‌గా మారి కొన్ని యాడ్‌లు చేయడం ప్రారంభించాను. అప్పట్లోనే ప్రఖ్యాత ఫ్యాషన్‌ మేగజైన్‌ ‘వోగ్‌’ కోసం కవర్‌ పేజీ చేసిచ్చాను. అంతర్జాతీయ మోడల్‌ హాలీవుడ్‌ నటి ప్రియాంకా బోస్‌ పాల్గొన్న ఈ యాడ్‌ నాకు మంచి పేరు తేవడంతో... ఎలె వంటి పత్రికలూ నాతో పనిచేయడానికి ముందుకొచ్చాయి. కాకపోతే ఫ్రీలాన్సర్‌గాకన్నా... ఓ సంస్థని పెడితేనే బిజినెస్‌ చేస్తామని చెప్పాయి. దాంతో ‘సిధ్‌ ప్రొడక్షన్స్‌’ పేరుతో 2017లో సొంత సంస్థని ప్రారంభించాను*. *_అంత ఈజీ... కాదు!_* *మామూలుగా ఫ్యాషన్‌ రంగంలో యాడ్‌ క్రియేషన్‌ ఏజెన్సీలూ, ప్రొడక్షన్‌ హౌస్‌లూ వేర్వేరుగా ఉంటాయి*. *యాడ్‌ ఏజెన్సీ ఐడియా చెబితే, దాన్ని ప్రొడక్షన్‌ హౌస్‌వాళ్లు పక్కాగా అమలు చేసి ఇస్తుంటారు. నేను ఈ రెండు రంగాలనీ కలిపాను. నేరుగా నేనే బ్రాండ్‌ వాళ్లతో టై అప్‌ పెట్టుకుని ప్రకటనలు చేయడం మొదలుపెట్టాను*. *తొలిసారి మింత్రావాళ్లు 15 లక్షల రూపాయలకి యాడ్‌ ఇచ్చారు. ఈ రంగంలో ఎవరూ ముందస్తు అడ్వాన్స్‌ ఇవ్వరు. సొంత డబ్బులు పెట్టి మనం చేస్తే... నచ్చితేనే తీసుకుంటారు. అంత రిస్కు ఉంటుందీ రంగంలో! మింత్రావాళ్లు యాడ్‌ ఇచ్చినప్పుడు అప్పటిదాకా నేను దాచుకున్న సొమ్ము ఒకటిన్నర లక్ష మాత్రమే ఉంది*. *ఎక్కడెక్కడో అప్పులు చేసి ఏడు లక్షలు పోగేసి... నేనే మోడల్స్‌నీ, ఫొటో-వీడియోగ్రాఫర్‌లని ఎంపిక చేసి షూటింగ్‌ ముగించాను. ఖర్చు తడిసిమోపెడై 15 లక్షలయ్యింది. అంటే... మింత్రావాళ్లు ఇస్తామన్న పారితోషికం అంతన్నమాట! నా తొలి అసైన్‌మెంటులో ఒక్కపైసా లాభం రాలేదు*. *అయితేనేం... అది నాకెన్నో ద్వారాలు తెరిచింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఐసీఐసీఐ, యాక్సిస్‌... ఇలా ఎన్నో బ్రాండ్‌లని నా చెంతకు రప్పించింది*. *కేవలం నా అనుభవమే పెట్టుబడిగా పెట్టిన సంస్థ... ఏడాదిలోనే కోటిరూపాయల లాభాన్ని ఆర్జించింది. ఆ తర్వాత తిరిగి చూసుకున్నదే లేదు. 2019లో ‘బిజినెస్‌ మింట్‌’ పత్రిక నాకు ‘ఎమర్జింగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డునిస్తే... 2020లో ఎకనామిక్‌ టైమ్స్‌ నుంచి ‘పవర్‌ ఐకాన్‌’ పురస్కారం అందుకున్నాను. ఇటీవల అదే పత్రిక నుంచి మా సంస్థకి ప్రతిష్ఠాత్మక ‘ఎక్సలెన్స్‌ ఇన్‌ అడ్వర్టైజింగ్‌ అవార్డూ’ వచ్చింది! బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న మేము... ఈ కొత్త సంవత్సరంలో ఫ్యాషన్‌ కేంద్రాలైన ముంబై, దిల్లీలోకీ అడుగుపెడుతున్నాం. వచ్చే ఐదేళ్లలో ప్రపంచ మేటి ఫ్యాషన్‌ కేంద్రాలైన ప్యారిస్‌, ఇటలీలకీ వెళ్లాలన్నది నా కల...!* *నడిచొచ్చిన దారి...* *చిన్నప్పుడు నేనూ మా అమ్మా కలగన్నట్టే తమ్ముణ్ణి బాగా చదివించగలిగాము.* *కాకపోతే తను ఫ్యాషన్‌ ఫొటోగ్రాఫర్‌గా మారి... ఇప్పుడు నాతోనే ఉంటున్నాడు*. *ప్రస్తుతం మా దగ్గర దేశంలోని యాడ్‌ రంగంలో ఉత్తమ సృజనకారులు అనదగ్గ పాతికమంది ఉద్యోగులున్నారు. ఆరో తరగతిలో నాన్న చనిపోతే...* *కొంతకాలంపాటు మా చదువుకి కొందరు సాయం చేశారని చెప్పాను కదా! నా స్థాయిలో నేను ఇప్పుడు ఐదుగురు పేద విద్యార్థుల చదువుల బాధ్యత మొత్తం చూస్తున్నాను. సంస్థ ఎదిగేకొద్దీ... ఈ సంఖ్యా పెంచుతూ పోవాలన్నదే మా అందరి ఆకాంక్ష!* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
*_ఢిల్లీ లిక్కర్ “స్కామ్” పూర్తిగా బట్టబయలు – ఇది ఒక పెద్ద విచ్ హంట్ మాత్రమే!_* *_కేవలం కొన్ని నిమిషాల క్రితం సంచలన తీర్పు!_* *_రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జితేంద్ర సింగ్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఉన్న 23 మంది నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేశారు!_* *_ఇందులో మణిశ్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్, కే. కవిత వంటి AAP కీలక నేతలు కూడా ఉన్నారు!_* *_సాక్ష్యాలు లేవు – కేసే లేదు! 💥⚖️_* *_⚡ కోర్టు ఏమన్నదంటే?_* *_📄 CBI దాఖలు చేసిన భారీ చార్జ్‌షీట్‌లో లెక్కలేనన్ని లోపాలు, తప్పుదోవ పట్టించే ఆరోపణలు, అసత్యాలు!_* *_❌ ఒక్క నమ్మదగిన సాక్ష్యం లేదు! ఒక్క సాక్షి మద్దతు లేదు!_* *_🔄 అంతర్గత విరుద్ధతలు – వారి కుట్ర సిద్ధాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి!_* *_🚨 దర్యాప్తు అధికారి (IO)పై శాఖాపర విచారణకు ఆదేశాలు!_* *🔥 మణిశ్ సిసోడియాపై కోర్టు ఘాటు వ్యాఖ్యలు* *⛓️ 530 రోజులు జైలులో – కానీ ఒక్క ఆధారం కూడా లేదు!* *📉 పాలసీ తయారీలో పాల్గొన్నట్లు గానీ, లంచం తీసుకున్నట్లు గానీ – ఏ రుజువూ లేదు!* *😡 ఇది న్యాయవ్యవస్థపై ఒక మచ్చ!* *_🔥 అరవింద్ కేజ్రీవాల్ విషయంలో_* *🏛️ ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని – సరైన ఆధారాలు లేకుండా కేసులో ఇరికించారు!* *❌ ఏమాత్రం బలమైన సాక్ష్యం లేదు! ఇది చట్టపాలనకు పూర్తిగా విరుద్ధం!* *😳 ప్రధాన నిందితుడు కుల్దీప్ సింగ్‌పై కోర్టు సంచలన వ్యాఖ్య* *❓ “అసలు ఇతన్ని నిందితుడిగా ఎందుకు చేర్చారో అర్థం కావడం లేదు – ఒక్క ఆధారం కూడా లేదు!”* *_💣 అసలు నిజం ఏమిటంటే?_* *🛑 ఇది ఎప్పటికీ అవినీతి కేసు కాదు!* *🎯 AAP నేతలపై బురద జల్లడానికి, జైలులో పెట్టడానికి, అధికారాన్ని లాక్కోవడానికి పన్నిన రాజకీయ కుట్ర!* *🪑 తాత్కాలికంగా బొమ్మ సీఎం‌ను కూర్చోబెట్టారు – కానీ చివరికి న్యాయం గెలిచింది!* *✊ న్యాయం గెలిచింది!* *🔓 సిసోడియా – 530 రోజుల నరకం తర్వాత విడుదల!* *🔓 కేజ్రీవాల్ – 156 రోజుల తర్వాత బయటకు!* *⚖️ న్యాయం ఆలస్యం అయినా – అబద్ధం ఓడిపోయింది!* *ఇది కేవలం తీర్పు కాదు – రాజకీయ కుతంత్రాలపై న్యాయవ్యవస్థ ఇచ్చిన చెంపపెట్టు!* *_సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది! జై హో న్యాయం! ✊⚖️_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - Sanlay Silgh  Allishtk Bulllpall  Kavitha Arulnd Nujrlval  Suralli Ruddy La Manish Sisudia Raghav Magunta | Sanlay Silgh  Allishtk Bulllpall  Kavitha Arulnd Nujrlval  Suralli Ruddy La Manish Sisudia Raghav Magunta | - ShareChat
*_🔟_* *_శ్రీ మహావిష్ణు పురాణం_* *_పదవ భాగం_* *_బ్రహ్మ సృష్టి ప్రారంభం:_* *నారాయణుడు,లక్ష్మీదేవి బ్రహ్మకి, సరస్వతికి సృష్టి బాధ్యత అప్పగించి అదృశ్యమయ్యారు*. *తండ్రి శ్రీమహావిష్ణువు ఆదేశం ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి కార్యం ఆరంభించాడు. తనతో సృష్టిలో పాల్గొనటానికి మనస్సులో సంకల్పించి సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే నలుగురు మానస పుత్రులను సృష్టించాడు*. *సనకసనందాదులు నలుగురు బాలుర రూపంలో నారవస్త్రాలతో, దండకమండలాలతో జన్మించి తండ్రి బ్రహ్మకు నమస్కరించారు. బ్రహ్మ వారిని చూసి "మీరు నలుగురు బ్రహ్మ మానస పుత్రులుగా ప్రసిద్ధి చెందుతారు. నా తండ్రి నారాయణుని ఆదేశం ప్రకారం చేయబోయే సృష్టిలో నాకు సహకరించండి" అని అడిగాడు*. *సనకసనందాదులు బ్రహ్మతో "తండ్రీ! మాకు సృష్టి కార్యం పై ఆసక్తి లేదు. లోకాల నిర్మాణమే ఇంకా జరుగలేదు. మీ మానసం ద్వారా జన్మించిన మాకు నారాయణుడే ప్రియ దైవం. మా జీవితమంతా నారాయణ సంకీర్తనంలో గడుపుతాము. శ్రీహరి పాద సేవ చేయడమే మా కర్తవ్యం. మమ్మల్ని క్షమించండి" అని నారాయణ నామ సంకీర్తనం చేస్తూ వెళ్లి పోయారు*. *బ్రహ్మదేవుడికి నిరాశ కలిగింది. సనకాదులు చెప్పినట్టు ముందు లోకాల నిర్మాణం చేస్తాను అని నిర్ణయించుకుని నారాయణుని సహకారం కోరుతూ అష్టాక్షరి మంత్రం నియమ నిష్టలతో జపం చేశాడు. శ్రీమహావిష్ణువు కరుణించి బ్రహ్మకు సహాయం చేయడానికి తన అంశతో విశ్వకర్మను సృష్టించి పంపాడు*. *దేవశిల్పి బ్రహ్మ వద్దకు వచ్చి బ్రహ్మ మనస్సులో గల లోకాల నిర్మాణం ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాడు. ఆ ప్రకారం లోకాల నిర్మాణం చేశాడు. సృష్టి సౌలభ్యం కోసం బ్రహ్మాండాన్ని మూడు లోకాలుగా విభజించాడు. వాటికి భూ, భువర్లోక, సువర్లోకాలు అని పేరు పెట్టారు*. *ఆకాశంలో సూర్య కిరణాలు ఎంత వరకు ప్రసరిస్తాయో అంతవరకు భూలోకం ఏర్పాటు చేయబడింది. భూమికి లక్ష యోజనాల దూరంలో చంద్ర మండలం, చంద్ర మండలానికి పదివేల యోజనాల దూరంలో సూర్య మండలం ఏర్పాటు చేయబడ్డాయి. రెండు లక్షల యోజనాల దూరంలో నక్షత్రం మండలం ఏర్పాటు అయ్యింది. ఆపైన రెండు లక్షల యోజనాల దూరంలో బుధ లోకము, బుధలోకానికి రెండు లక్షల యోజనాల దూరంలో శుక్రలోకము ఏర్పడింది.* *శుక్రలోకానికి రెండు లక్షల ఆమడల దూరంలో కుజ లోకము, కుజలోకానికి రెండు లక్షల ఆమడల దూరంలో గురు (బృహస్పతి) లోకము, గురులోకానికి రెండు లక్షల ఆమడల దూరంలో శనిలోకము ఏర్పడ్డాయి. శని లోకానికి పది లక్షల ఆమడల దూరంలో సప్తఋషి మండలము, సప్త ఋషి మండలానికి లక్ష ఆమడల దూరంలో ధృవమండలము ఏర్పాటు చేయబడ్డాయి. భూమి పైన ఇంతవరకు ఏర్పాటు చేయబడిన లోకాలన్నింటిని కలిపి "భువర్లోకాలు" అంటారు.* *భూమి నుండి రెండు కోట్ల ఆమడల దూరంలో జనలోకము, భూమి నుండి నాలుగు కోట్ల దూరంలో తపోలోకము ఏర్పడ్డాయి. తపోలోకానికి నాలుగు కోట్ల దూరంలో బ్రహ్మదేవుని నివాసానికి సత్యలోకం ఏర్పడింది. సత్యలోకం నుండి ఎనిమిది కోట్ల దూరంలో లక్ష్మీనారాయణుల నివాసం కోసం వైకుంఠం నిర్మించబడింది. వైకుంఠానికి ఎడమవైపున పదహారు కోట్ల ఆమడల దూరంలో శివుని నివాసము కోసం కైలాసం ఏర్పాటు చేయబడింది. లోకాలన్నిటి పైన కృష్ణుడు, రాధదేవిల శాశ్వత నివాసమైన గోలోకము ఉంది. జనలోకము నుండి గోలోకము వరకు గల లోకాలను సువర్లోకాలు అంటారు*. *భూమి క్రింద సప్త మహా రంధ్రాలు ఉన్నాయి. ఒక్కొక్క బిలం యోజనాల విస్తీర్ణం ఉంటుంది. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళము అనే ఏడు అధోలోకాల నిర్మాణం ఈ బిలాలలో జరిగింది. వీటినన్నింటిని కలిపి పాతాళ లోకాలు అంటారు.* *పద్నాలుగు లోకాలలో ఆ లోకవాసులు నివసిండానికి అసంఖ్యాక భవనాలు ఏర్పరచబడ్డాయి. బ్రహ్మ ఇచ్చిన దివ్య దృష్టితో భూత వర్తమాన, భవిష్యత్తు కాలాల అవసరాలు గమనించి విశ్వకర్మ తన శిల్పకళా నైపుణ్యంతో ఈ లోకాల నిర్మాణం చేశాడు.* *ఈ భూ భువర్లోక సువర్లోకాలు అన్ని అశాశ్వతాలు. వైకుంఠం, గోలోకం మాత్రమే శాశ్వతంగా నిలిచి ఉంటాయి.* *కల్పాంత ప్రళయంలో లోకాలన్ని పరబ్రహ్మలో విలీనం అవుతాయి.* *మహావిష్ణువు తిరిగి సృష్టి చేయ సంకల్పించినప్పుడు లోకాలు పునః ఉత్పన్నమవుతాయి. బ్రహ్మతో సహా పునఃసృష్టి ప్రారంభం అవుతుంది* #మన సంప్రదాయాలు సమాచారం
*ఉత్తర త్రిపురలోని రఘునందన కొండలలో ఉన్న ఉనకోటి, 7వ-9వ శతాబ్దాల పురాతన శైవ క్షేత్రము. ఈ దట్ట మైన అరణ్య ప్రాంతములో 30 అడుగుల భారీ రాతి శివ శిరస్సు (ఉనకోటీశ్వర కాల భైరవ), భారీ గణేశ విగ్రహాలు, ఇంకా చెల్లాచెదురుగా ఉన్న వందలాది శిల్పాలు వున్నవి. దీనిని తరచుగా "ఈశాన్యంలోని అంగ్కోర్ వాట్" అని పిలుస్తారు ఇది ఉత్కంఠభరితమైన, మైన మరియు చారిత్రాత్మకంగా ముఖ్యమైన రాక్ ఆర్ట్‌ను కలిగి ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం.* *కీలక ఆకర్షణలు & వివరాలు భారీ శిల్పాలు: ఈ ప్రదేశంలో 99 లక్షల 99,999 (కోటి కంటే తక్కువ) శిల్పాలు ఉన్నాయి, దీని వలన దీనికి "ఉనకోటి" అనే పేరు వచ్చింది*. *ముఖ్యాంశాలు 30 అడుగుల ఎత్తైన కొండల మధ్య శివ తల, దీనిలో 10 అడుగుల తలపాగా మరియు మూడు పెద్ద సగం పాతిపెట్టిన నంది ఎద్దులు ఉన్నాయి*. *ముఖ్యమైన శిల్పాలు: శివుడితో పాటు, ఇతర ప్రముఖ దేవతలలో 35 అడుగుల పొడవైన గణేశుడు, హనుమంతుడు, విష్ణువు మరియు వివిధ దేవతల బాస్-రిలీఫ్‌లు ఉన్నాయి, అన్నీ కొండ గోడలపై చెక్కబడ్డాయి*. *సాంస్కృతిక ప్రాముఖ్యత: సజీవ తీర్థంగా పిలువబడే ఇది స్థానికులకు ఒక ప్రధాన తీర్థయాత్ర స్థలం. ఏప్రిల్‌లో జరిగే వార్షిక అశోకాష్టమి నాడు మేళా వేలాది మంది సందర్శకులను ఆకర్షిస్తుంది.* *సహజ సౌందర్యం: పచ్చని, ప్రకృతి దృశ్యాలతో కూడిన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ప్రదేశంలో జలపాతాలు (ముఖ్యంగా వర్షాకాలంలో) మరియు వాగులు ఉన్నాయి.* *సందర్శకుల సమాచారం: ఉత్తర త్రిపురలోని రాజధాని నగరం అగర్తల నుండి దాదాపు 175-200 కి.మీ దూరంలో ఉన్న కైలాషహర్ సమీపంలో.* *సందర్శించడానికి ఉత్తమ సమయం:* *శీతాకాల నెలలు (అక్టోబర్ నుండి మార్చి వరకు) ఈ ప్రాంతాన్ని అన్వేషించడానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి, అయితే ఏప్రిల్‌లో జరిగే అశోకాష్టమి మేళా సందర్శించడానికి ఉత్సాహభరితమైన, సాంస్కృతిక సమయం. ప్రవేశం: ఈ ప్రదేశాన్ని పర్యాటక శాఖ నిర్వహిస్తుంది.* *ఉనకోటి పురాణం 99,99,999 మంది దేవుళ్ళు మరియు దేవతలతో కాశీకి ప్రయాణిస్తున్నప్పుడు, శివుడు రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ ఆగాడని పురాణం చెబుతోంది. సూర్యోదయానికి ముందు మేల్కొనమని ఆయన వారిని ఆదేశించాడు, కానీ వారు అలా చేయడంలో విఫలమైనప్పుడు, అతను వాటిని రాతిలో స్తంభింపజేసి, లెక్కింపును "కోటి కంటే ఒకటి తక్కువ"గా మార్చాడు.* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - 1 1 - ShareChat
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:09