ShareChat
click to see wallet page
search
6️⃣8️⃣ *_శ్రీ మహావిష్ణు పురాణం_* *_(అరవై ఎనిమిదవ భాగం)_*``` *_దత్తాత్రేయుడు పురోహితుడై పరశురాముని చేత తల్లిదండ్రులకు అపరకర్మలు చేయించుట:_* *రేణుకాదేవి తన కుమారుడైన పరశురాముని “పుత్రా! మీ తండ్రి గారిని కార్తవీర్యార్జునుడు అనే రాజు దుర్మార్గంగా చంపాడు. నన్ను తీవ్రంగా గాయపరిచాడు.* *ప్రాణం పోయేట్టు ఉంది. ఎక్కడ ఉన్నా వెంటనే ఇక్కడకు రా” అని స్మరించింది*. *పరశురాముడు వెంటనే అక్కడ ప్రత్యక్షమైనాడు.* *మరణించిన తండ్రి జమదగ్నిని, బాణాలు గ్రుచ్ఛుకుని తీవ్రంగా గాయపడిన తల్లి రేణుకను చూసి బాధ పడ్డాడు. కన్నీరు వస్తుంటే తల్లిని ఒడిలోకి తీసుకుని బాణాలు లాగివేశాడు.* *పరశురాముడి రోదన విని రేణుక కళ్లు తెరచి చూసింది. నెమ్మదిగా ఓపిక కూడతీసుకుంటూ..* *“రామా! ఈ రాజ్యానికి రాజైన కార్తవీర్యార్జునుడు సైన్య సమేతంగా వేటకు వచ్చి మన ఆశ్రమానికి వచ్చాడు*. *నేను, మీతండ్రి వారికి కామధేనువు సహాయంతో భోజనం, వసతి ఏర్పాట్లు చేసాము.* *కార్తవీర్యుడు అతిథి సత్కరాలు, భోజనాలు చేసిన తరువాత ప్రసాదించిన కామధేనువుని దుర్భుద్ధి తో బలవంతంగా తీసుకుపో దలిచాడు*. *కామధేనువు యొక్క గోసైన్యంతో ఓడిపోయి ఉక్రోషంతో మీతండ్రిని చంపాడు*. *అడిగిన నన్ను ఇరవై ఒక్క బాణాలతో గాయపరిచాడు*. *నీ రాక కోసం ప్రాణాలు నిలుపుకుని ఉన్నాను. నీవు ఈవిధంగా అధర్ములైన క్షత్రియ వంశాలను భరతఖండమంతా ఇరవై ఒక్కసార్లు తిరిగి గాలించి సంహరించుము. మాకు ఆత్మ శాంతి లభిస్తుంది. ఎవరు ఎక్కడ దహింపని ప్రదేశంలో మాకు అగ్ని సంస్కారాలు చేయుము. అనసూయా పుత్రుడైన దత్తాత్రేయుని పురోహితునిగా చేసుకుని మాకు పదమూడవ రోజు వరకు అపర కర్మలు జరిపించుము*. *దత్తుని నిర్వహణలో చేయబడిన ఉత్తర క్రియల వలన మాకు ఉత్తమ గోతులు లభిస్తాయి” అని పలికి రేణుకాదేవి పరశురాముని ఒడిలో ప్రాణాలు వదిలింది*. *పరశురాముడు తల్లి తండ్రులకు అగ్ని సంస్కారాలు నిర్వహించాడు*. *తలనీలాలు తీసివేసిన పరశురాముడు పురోహితునిగా అపర కర్మలు చేయించమని అడగటానికి దత్తాత్రేయుడి వద్దకు వెళ్లాడు. దత్తాత్రేయుడు పరశురాముని పరీక్షించాలని పంచముడిగా రూపం ధరించి, శిష్యులు శునకములై అనుసరిస్తుండగా పరశురామునికి మలిన రూపంలో దర్శనమిచ్చాడు*. *పరశురాముడు దత్తాత్రేయుడి నిజరూపం ధ్యానం ద్వారా తెలుసుకుని చేతులు జోడించి నమస్కరించాడు. ఒకరు మహా విష్ణువు అంశ అయితే మరొకరు మహావిష్ణువు అవతారం. పరశురాముని మనస్సు లోని భావం గ్రహించి ”రామా! క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు చేయరాని బ్రహ్మహత్య చేసి మహాపాపం చేశాడు. అన్నం పెట్టిన మనిషిని చంపిన అతను తగిన శిక్ష పొందుతాడు. మీ తల్లితండ్రులకు అపర కర్మలు నీచేత చేయిస్తాను" అని పరశురాముని వెంట బయలుదేరాడు.* *తన ఆశ్రమం చేరిన పరశురాముడు దత్తాత్రేయుడు చెప్పినట్లు రెండవ రోజు నుండి తల్లిదండ్రులకు భక్తి శ్రద్థలతో ఉత్తర కర్మలు చేయసాగాడు. రెండవ రోజు కర్మ కాండ పూర్తవ్వగానే దత్తా త్రేయుడు తాను కొల్హాపురం వెళతానని చెప్పడంతో పరశురాముడు “మరల ఎప్పుడు వస్తారు?” అని అడిగాడు.* *“తలచిన వెంటనే వచ్చి చేయిస్తాను” అని దత్తాత్రేయుడు వెళ్లిపోయాడు*. *ఆవిధంగా ప్రతిరోజు వచ్చి పరశురాముని చేత ఉత్తరక్రియలు చేయిస్తూ, అశౌచాన్నము అభోజ్యము కనుక బిక్షాటనకై కొల్హాపురం వెళ్లేవాడు. ఒకరోజు దత్తాత్రేయుడు కొల్హాపురం వెళ్లిన తరువాత కర్మలు పూర్తి చేస్తున్న పరశురాముడి వద్దకు పులి వచ్చింది.* *చూసిన పరశురాముడు నిరాయుధుడై ఉండటం వలన "అమ్మా" అని తల్లి రేణుకను తలచి అరిచాడు*. *వెంటనే రేణుకాదేవి అక్కడ ఆవిర్భవించింది. అపరకర్మలు పూర్తి కాకపోవడం వలన ఆమె దివ్య శరీరానికి శిరస్సు ఏర్పడ లేదు. "రామా! ఏం జరిగింది నాయనా" అని శిరస్సు లేని రేణుక అడిగింది. అప్పుడే వెనక్కి తిరిగి వచ్చిన దత్తాత్రేయుడు "రామా! అపరకర్మలు పూర్తి కాకుండా ఆమెను ఎందుకు పిలిచావు. పిండీకరణ అయిన తర్వాత పిలిస్తే సంపూర్ణ శరీరంతో వచ్చి ఉండేది" అన్నాడు*. *తల్లికి, దత్తాత్రేయునికి నమస్కరిస్తూ "మునీంద్రా! పులిని చూసిన క్షణంలో అమ్మ గుర్తుకు వచ్చి పిలిచాను. ఈ శిరస్సు లేని అమ్మ రూపం చూసాను" అన్నాడు*. *దత్తాత్రేయుడు "ముందు మనం మిగిలిన రోజుల ఉత్తర క్రియలు పూర్తి చేద్దాం" అని పలికాడు.* *పద కొండవ రోజు వృషోత్సర్జనం చేసి పరశురాముడు పన్నెండవ రోజున తల్లిదండ్రులు ఇద్దరికి సపిండీకరణ శ్రాద్దకర్మ ఆచరించాడు.* *పదమూడవ రోజు పుణ్యాహవచనము చేసి బ్రాహ్మణులకు దానధర్మాలు చేశాడు. జమదగ్ని మహర్షి దివ్య దేహము పొంది బ్రహ్మలోకానికి వెళ్లి పోయాడు. రేణుకాదేవి మాత్రం అసంపూర్ణ దేహముతో భూలోకములోనే ఉంటూ భక్తజనుల కోరికలు తీరుస్తోంది*. *పరశురాముడు ఒకరోజు తల్లిని తలచుకుని ఆమె ప్రత్యక్షం కాగానే "కార్తవీర్యార్జునుడిని సంహరించడానికి, ఇరవై ఒక్క సార్లు భూభ్రమణం చేసి అధర్మ క్షత్రియ వంశాలను నిర్మూలించ డానికి తగిన శక్తి సామర్థ్యాలు పొందే మార్గం చెప్పమ్మా!" అని అడిగాడు*. *రేణుకాదేవి ప్రేమతో పుత్రుని తల నిమురుతూ "కుమారా! నీ సంకల్పం నెరవేరే శక్తి సామర్థ్యాలు పొందడానికి అఘోర రుద్రుని అనుగ్రహం లభించాలి. నీవు శివుని ఆరాధించి ప్రసన్నం చేసుకో. శుభం కలుగుతుంది" అని ఆశీర్వదించింది.* *తల్లి అనుమతి పొంది పరశురాముడు శివానుగ్రహం కోసం కైలాసం బయలుదేరి వెళ్లాడు* #మన సంప్రదాయాలు సమాచారం