Ravi  Talluri
ShareChat
click to see wallet page
@91775
91775
Ravi Talluri
@91775
feelgood
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ಬಿಮ್ಬಗೌಳ್ಲಿ ಜೆಛು ನಿಂದುತು ಒಲ್ತಿಗಾ ఉంటుంది? మన జుట్టు ఎందుకు రాలిపోతుంది? వాళ్లు షాంపూ, కెమికల్ ప్రొడక్ట్స్ వాడరు వల్ల మనం ఎక్కువ కెమికల్స్ వాడటం వేర్లు బలహీనపడతాయి జుట్టు వాళ్లు ఎండలో ఉంటారు అందుకే విటమిన్-D బాగా లభిస్తుంది a డ్రైయర్ ವೌಳು ರಿ್ಜ ಅಲನ್ನೌ)ನಂ ವೆಯರು; కూడా వాడరు వాళ్లు టెన్షన్ పడరు, రోజూ బాగా నిద్రపోతారు జుట్టును ఎక్కువగా పట్టించుకోరు. ಮನಂ ಎತ್ುಏಗೌ ದುಖ್ದSಡಂ, ಲೌಗಡಂ 8 జుట్టు రాలిపోతుంది వాళ్ల సరళ జీవితం జుట్టును కాపాడుతుంది మన అతిశ్రద్ధ జుట్టును నాశనం చేస్తుంది ಬಿಮ್ಬಗೌಳ್ಲಿ ಜೆಛು ನಿಂದುತು ಒಲ್ತಿಗಾ ఉంటుంది? మన జుట్టు ఎందుకు రాలిపోతుంది? వాళ్లు షాంపూ, కెమికల్ ప్రొడక్ట్స్ వాడరు వల్ల మనం ఎక్కువ కెమికల్స్ వాడటం వేర్లు బలహీనపడతాయి జుట్టు వాళ్లు ఎండలో ఉంటారు అందుకే విటమిన్-D బాగా లభిస్తుంది a డ్రైయర్ ವೌಳು ರಿ್ಜ ಅಲನ್ನೌ)ನಂ ವೆಯರು; కూడా వాడరు వాళ్లు టెన్షన్ పడరు, రోజూ బాగా నిద్రపోతారు జుట్టును ఎక్కువగా పట్టించుకోరు. ಮನಂ ಎತ್ುಏಗೌ ದುಖ್ದSಡಂ, ಲೌಗಡಂ 8 జుట్టు రాలిపోతుంది వాళ్ల సరళ జీవితం జుట్టును కాపాడుతుంది మన అతిశ్రద్ధ జుట్టును నాశనం చేస్తుంది - ShareChat
*_‘పాత పుస్తకాలు’.. ఈసారి రోడ్డు పక్కన కనిపిస్తే కాస్త ఆగండి: పూరి జగన్నాథ్_* *ఈసారి రోడ్డు పక్కన పాత పుస్తకాలు కనిపిస్తే కాస్త ఆగి వాటిని చూడమంటున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. ‘పూరి మ్యూజింగ్స్' పేరుతో ఆయన అనేక అంశాలు మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా 'పాత పుస్తకాలు' అనే అంశంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు*. *“రోడ్డు పక్కన చాపలు, పెట్టెలు, నేలపై పాత పుస్తకాలు పెట్టుకుని అమ్ముతారు. వాటి కవర్లు, రంగులు కోల్పోయి.. పేజీలు పసుపు రంగులోకి మారిపోయి ఉంటాయి. అవి కేవలం పుస్తకాలు కావు. కాలాన్ని దాటుకుని వచ్చిన కథలు.* *రోడ్డు పక్కన పుస్తకాల దుకాణాల్లో ప్రత్యేక ఆకర్షణ ఏమి ఉంటుంది. గ్లాస్ డోర్లు, ఏసీలు ఉండవు. కేవలం ఆకాశం కింద నీకోసం ఎదురు చూస్తున్న పాత జ్ఞాపకాలు అవి*. *అక్కడున్న ప్రతి పుస్తకంలో నీ జీవితం ఉంటుంది.ఈ పుస్తకాలు అమ్మేవాళ్లు సాధారణంగా కనిపిస్తారు. కానీ, ప్రతి పుస్తకం గురించి ఒక జ్ఞాపకం ఉంటుంది*. *మీరు ఒక పుస్తకం గురించి అడిగితే, కేవలం ధర మాత్రమే చెప్పరు. ఆ పుస్తకం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెబుతారు. ఇలాంటి పాత పుస్తకాలు కొనడం ఒక ప్రత్యేక అనుభూతి”* *కొత్త పుస్తకాల్లో కనిపించని చాలా విషయాలు ఇందులో ఉంటాయి. పుస్తకం తెరిస్తే, మొదటి పేజీలో ఎవరో రాసిన పేరు. మధ్యలో పెట్టి మర్చిపోయిన పాత రైల్వే టికెట్. గీతలు పెట్టిన వాక్యాలు, పక్కనే పెన్నుతో రాసిన నోట్స్.* *ఖరీదైన పుస్తకాలు కొనలేని విద్యార్థికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.చిన్న డబ్బుతో పెద్ద ప్రపంచాన్ని అందిస్తాయి. ఈ పుస్తకాలు అమ్మేవాళ్లు గొప్పవాళ్లు. వేడి, దుమ్ము, శబ్దాల మధ్య రోజంతా కూర్చొని వాటిని అమ్ముతూ ఉంటారు.* *వాళ్లు కథల్ని కాపాడుతున్నారు. మర్చిపోయే పుస్తకాలకు కొత్త జ్ఞాపకాలు ఇస్తున్నారు.ఫోన్, ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత పుస్తకాల దుకాణాలు తగ్గిపోతున్నాయి*. *ఒక్కోసారి మీరు వెతుకుతున్న పుస్తకం కాకుండా మరో పుస్తకం దొరకవచ్చు. పుస్తకాలన్నీ కొత్తగా ఉండాల్సిన అవసరం లేదు. పాతవాటిలో మీకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి"* *ఈసారి రోడ్డు పక్కన పాత పుస్తకాలు కనిపిస్తే ఆగండి. ఆ పుస్తకాన్ని ఎవరో మనసు పెట్టి రాశారు. ఇంకెవరో మనసు పెట్టి చదివారు.మరో వ్యక్తి కొన్ని వాక్యాలను అండర్ లైన్ చేసుకున్నారు.* *ఇప్పుడు ఆ పుస్తకం మీకోసం ఎదురు చూస్తోంది.అదే పుస్తకం మీ జీవితాన్ని మార్చవచ్చు*. *పారిస్లో నోట్రాడ్యామ్ కేథడ్రిల్ పక్కన బుకినిస్ట్స్ ఆఫ్ సెయిన్ ఏరియా ఉంది. సెయిన్ రివర్కు ఇరువైపులా పాత పుస్తకాలు అమ్ముతారు*. *16వ శతాబ్దం నుంచి ఇప్పటివరకూ ఎంతో మంది బుక్ సెల్లర్స్ అక్కడ పాత పుస్తకాలు అమ్ముతూనే ఉన్నారు*. *అక్కడకు అరుదైన పుస్తకాలు, వింటేజ్ పోస్ట్ కార్డులు, పాత మ్యాప్లు, క్లాసిక్ ఫ్రెంచ్ లిటరేచర్ దొరుకుతాయి.* *చాలామంది కాఫీ తాగుతూ పుస్తకాలు చదువుతూ* *కనిపిస్తారు*. *పారిస్లో ఉన్న* *కవులు,సంగీతకారులు* *విద్యార్థులు, నటులు అందరూ కలుసుకునే* *ప్రదేశమది*. *ఎప్పుడైనా పారిస్* *వెళ్తే, ఈ ప్రదేశాన్ని* *చూడండి.* *ప్రతి పుస్తకం ఒక జీవితాన్ని గడిపిందే. వాటి వయసు మీకంటే ఎక్కువే ఉండవచ్చు. వృద్ధాప్యంలో కూడా అవి మీకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి” అని పూరి జగన్నాథ్ అన్నారు.* *_@ఈనాడు వెబ్ నుండి సేకరణ_* #మన సంప్రదాయాలు సమాచారం
*_అందం చూసి మోసపోకండి.. మీరు తినే అరటిపండు అసలైందేనా? ఇలా చిటికెలో గుర్తించండి!_* *_ఇందులో ఉండే విటమిన్ B6, విటమిన్ C, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు మన శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా.. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి._* *_రంగు చూసి మోసపోకండి:_* *మార్కెట్‌లో కనిపించే తళతళలాడే పసుపు రంగులో అందంగా కనిపించే అరటిపండ్లన్నీ సహజంగా పండినవి కావు.* *పండ్లను త్వరగా పండించి, ఎక్కువ లాభాలు గడించడం కోసం వ్యాపారులు 'కాల్షియం కార్బైడ్' వంటి ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారు.* *ఇవి చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నా, లోపల మాత్రం విషతుల్యమై ఉంటాయి*. *_రసాయనాలతో పండించిన పండ్లను గుర్తించే మార్గాలు:_* *భారత ఆహార భద్రత, ప్రమాణాల అధికారం (FSSAI) ప్రకారం, రసాయనాలతో పండించిన పండ్లను మనం సులభంగా గుర్తించవచ్చు .* *_రంగులో తేడా:_* *పండు మొత్తం ముదురు పసుపు రంగులో ఉండి, దాని చివరలు (కాడ,అడుగు భాగం) మాత్రం పచ్చగా ఉంటే, అది ఖచ్చితంగా రసాయనాలతో పండించినదే అని గుర్తించాలి.* *_మచ్చలు లేకపోవడం:_* *సహజంగా పండిన అరటిపండుపై అక్కడక్కడా చిన్న చిన్న నల్లటి లేదా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. కానీ కెమికల్స్ వాడిన పండ్లు మచ్చలు లేకుండా చాలా శుభ్రంగా, పసుపు రంగులో మెరిసిపోతుంటాయి.* *_కాడ భాగం:_* *పండు సహజంగా పక్వానికి వచ్చినప్పుడు దాని కాడ నలుపు రంగులోకి మారుతుంది. రసాయనాలు వాడితే అది పచ్చగా లేదా లేత పసుపు రంగులోనే ఉంటుంది*. *_రుచి మరియు ఆకృతి:_* *రసాయనాలతో పండిన పండు పైన మెత్తగా ఉన్నా, లోపల కొన్నిసార్లు గట్టిగా ఉంటుంది. అంతేకాకుండా, దీని రుచి కూడా అంత తియ్యగా ఉండదు.* *_ఆరోగ్యానికి కలిగే నష్టాలు:_* *కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలు వాడిన పండ్లను తినడం వల్ల కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో ఇవి శ్వాసకోస సంబంధిత ఇబ్బందులకు, గొంతు సమస్యలకు దారితీయవచ్చు*. *అందుకే FSSAI మన దేశంలో కాల్షియం కార్బైడ్ వాడకాన్ని పూర్తిగా నిషేధించింది. దీనికి బదులుగా కేవలం అనుమతించిన స్థాయిలో 'ఇథిలిన్ గ్యాస్'ను మాత్రమే వాడాలని సూచిస్తోంది.* *అరటిపండును కొనేటప్పుడు కేవలం దాని అందం, రంగును మాత్రమే చూడకండి. సహజంగా పండిన అరటిపండ్లనే ఎంచుకోండి.* *పండ్లను తినే ముందు కనీసం 10-15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత శుభ్రంగా కడిగి తినడం వల్ల వాటిపై ఉండే రసాయన అవశేషాల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు.* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
*_లిసా ఫిలిప్స్_* *_అందాల కలల నుంచి అగాధపు చీకటి వరకు.._* *_ఒక పోరాట యోధురాలి కథ_* *_నల్ల పుస్తకం"లో దాగి ఉన్న అశుద్ధ సత్యాలు_* *_"నేను ఎంత భయపడుతుంటే.. వారు అంతగా ఆనందించారు" — లిసా ఫిలిప్స్ పెదవుల నుంచి వెలువడిన ఈ ఒక్క మాట నేడు ప్రపంచాన్ని నిద్రపోనివ్వడం లేదు. కేవలం 24 గంటల్లోనే 28 కోట్ల మంది వీక్షించిన ఆమె కథనం, ఇన్నాళ్లూ కవచంలా ఉన్న 'అధికార' గోడలను బద్దలు కొట్టింది. ఇది కేవలం పాత ఫోటోల గురించి కాదు, 15 మంది అతిరథ మహారథుల పేర్లు ఉన్న ఒక 'నల్ల పుస్తకం' (Black Book) గురించిన సంచలనం. ప్రిన్స్ ఆండ్రూ పేరు అందులో మొదటి వరుసలో ఉండగా, దశాబ్దాల పాటు భయంతో తను దాచుకున్న రహస్యాలను లిసా నేడు ప్రపంచం ముందుకు తెచ్చింది. ఆమె వెల్లడిస్తున్న విషయాలు కేవలం వ్యక్తిగత జ్ఞాపకాలు కావు, ఒక వ్యవస్థీకృత నేర సామ్రాజ్యానికి సంబంధించిన రహస్య మ్యాప్‌లు._* *_​బెల్జియం నుంచి న్యూయార్క్ వీధుల వరకు.._* *_లిసా ఫిలిప్స్ నేపథ్యం సాదాసీదాగా మొదలైంది. ఆమె తండ్రి అమెరికన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేస్తుండటంతో బెల్జియంలో జన్మించిన లిసా, బాల్యం నుంచే గమ్యాలను మారుస్తూ పెరిగింది. పొడవుగా, ఆకర్షణీయంగా ఉండే లిసాకు టీనేజ్ నుంచే మోడలింగ్ రంగంపై మక్కువ పెరిగింది. 90వ దశకం చివరలో మయామి బీచ్‌లో తన కెరీర్‌ను ప్రారంభించి, దక్షిణాఫ్రికా, గ్రీస్ మీదుగా చివరకు మోడలింగ్ కలల రాజధాని న్యూయార్క్‌కు చేరుకుంది. 1999 చివరలో ఆమె వేసిన ఆ అడుగు, తన జీవితాన్ని ఒక అంతుచిక్కని సుడిగుండంలోకి నెడుతుందని ఆమె ఊహించలేదు._* *_​మెంటార్ ముసుగులో మృగం_* *_మోడలింగ్ రంగంలో రాణించాలనే కలలతో 21 ఏళ్ల వయసులో ఎప్‌స్టీన్ వలలో చిక్కుకున్న లిసా ఫిలిప్స్ అనుభవం వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఒక హెల్త్ మ్యాగజైన్ కవర్ షూట్ కోసం బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌కు వెళ్లినప్పుడు లిసాకు ఎప్‌స్టీన్ పరిచయమయ్యాడు. ఒక 'మెంటార్' లాగా నటిస్తూ, కెరీర్ సలహాలిస్తూ అత్యంత చాకచక్యంగా ఆమెను తన వలలో వేసుకున్నాడు. "అతను చాలా తెలివైనవాడు,_* *_ఎదుటివారిని ఇట్టే ఆకర్షించే వ్యక్తిత్వం అతనిది" అని లిసా గుర్తుచేసుకున్నారు. ఒక అందమైన దీవికి విందుకు పిలిచి, అక్కడ తన బలాన్ని, పరపతిని ప్రదర్శించి ఆమెను భయపెట్టాడు. ఆ రాత్రే మసాజ్ పేరుతో మొదలైన వేధింపులు, ఆ తర్వాత ఏళ్ల తరబడి సాగిన అంతులేని లైంగిక దోపిడీకి నాంది పలికాయి. లిసాను తన గుప్పిట్లో ఉంచుకోవడానికి ఆమెకు అగ్రశ్రేణి మోడలింగ్ ఏజెన్సీలలో అవకాశాలు కల్పించి, తనపై ఆమె ఆధారపడేలా ‘గ్రూమింగ్’ చేశాడు._* *_​అధికార గర్వం.._* *_ఆవేదనల సముద్రం_* *_ఎప్‌స్టీన్ కేవలం తన కోసమే కాకుండా, తన వద్ద ఉన్న యువతులను ఇతర శక్తివంతుల విలాసాలకు వస్తువులుగా వాడుకునేవాడు. "చాలామంది ప్రముఖులు నేడు నోరు విప్పడం లేదు, ఎందుకంటే ఎప్‌స్టీన్ వారి కెరీర్‌లను, కుటుంబాలను ప్రభావితం చేయగల స్థాయిలో ఉండేవాడు" అని లిసా వెల్లడించారు. లిసా ఎదుర్కొన్న వేధింపుల్లో రాజకుటుంబీకుల నుంచి ఆర్థిక దిగ్గజాల వరకు అనేక మంది భాగస్వాములుగా ఉన్నారు. ఆ భయంకరమైన రోజుల్లో ఆమె ఎదుర్కొన్న మానసిక క్షోభ, అవమానం ఆమెను డ్రగ్స్, మద్యానికి బానిసను చేశాయి. తనను తాను రక్షించుకోవడానికి చివరకు ఆమె న్యూయార్క్ వదిలి లాస్ ఏంజిల్స్ పారిపోవాల్సి వచ్చింది_*. *_​చీకటి నుంచి వెలుగు వైపు.._* *_2019లో ఎప్‌స్టీన్ మరణం తర్వాతే లిసాకు తిరిగి ప్రాణం వచ్చినట్లయింది. ఇన్నాళ్లూ తనలో తాను దాచుకున్న నిజాన్ని బయటపెట్టే ధైర్యం వచ్చింది. థెరపీ సహాయంతో తన గాయాలను మాన్పుకుంటూనే, నేడు ఇతర బాధితులకు అండగా నిలవడానికి "ఫ్రమ్ నౌ ఆన్" (From Now On) అనే పోడ్‌కాస్ట్ ద్వారా గళం ఎత్తుతోంది. "ఇకపై నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదు, తప్పు చేసిన వారే తలదించుకోవాలి" అని గర్జిస్తున్న లిసా, నేడు కోట్లాది మంది బాధితులకు ఆశాకిరణంగా మారింది. ఆమె చేతిలో ఉన్న ఆ 'నల్ల పుస్తకం' ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అపరాధ నీడల్లో దాగున్న వేటగాళ్లకు చమటలు పట్టిస్తోంది. ​లిసా ఫిలిప్స్ గొంతులో ఉన్న వణుకు నేడు నాగరిక సమాజం నైతికతను నిలదీస్తోంది. ఒకే ఒక్క పేరు బయటకు వస్తేనే బ్రిటన్ రాజకుటుంబం గందరగోళంలో పడితే, ఇక పూర్తి జాబితా బయటపడితే ఆ ప్రకంపనలు ఇంకెంత తీవ్రంగా ఉంటాయో ఊహించుకోవడమే కష్టంగా ఉంది_*. *_ఒకప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అనిపించిన సమాచారం, ఇప్పుడు ఒక భయంకరమైన నేర నమూనాగా (Pattern) రూపాంతరం చెందుతోంది. సత్యం వెలుగులోకి వస్తున్న వేళ, అపరాధ నీడల్లో దాగున్న వారు ఇక ఎంతకాలం తప్పించుకోగలరు అన్నదే నేటి అతిపెద్ద ప్రశ్న._* #😁Hello🙋‍♂️
😁Hello🙋‍♂️ - ShareChat
*_VAISAKHA PURANAM -- 08_* *_వైశాఖ పురాణం - 08_* *_8వ అధ్యాయము - వైశాఖమాస దానములు_* *అంబరీష మహారాజు నారదమహర్షికి నమస్కరించి యిట్లనెను. మహర్షీ! నేను చూచినది సత్పురుషుల చరిత్రవలె మహాశ్చర్యకరముగ నున్నది. ఇక్ష్వాకు మహారాజగు హేమాంగదుడు ముక్తినందిన ధర్మమును మరింత వివరముగ తెలిసికొన గోరుచున్నాను. దయయుంచి నాకు వివరింపగోరుచున్నాను. శ్రుతకీర్తిని మాటలను విని శ్రుత దేవమహాముని నాయనా నీవడిగినది మంచి విషయము తప్పక చెప్పదగినది. బాగు బాగు వినుమని యిట్లు వివరింపసాగెను* *రాజర్షీ శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములగు ధర్మములను వినవలయునను కోరిక యుక్తమైనది. నీ బుద్దికి గల సదాసక్తిని తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణు కథాప్రసంగము నందాసక్తి కలుగును. నీవు యువకుడవు రాజాధిరాజువు. నీకిట్టి విష్ణుకధాసక్తి ధర్మజిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్దుడవైన ఉత్తమ భాగవతుడవని తలచుచున్నాను. కావున జన్మసంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములగు భాగవత ధర్మములను వివరింతును వినుము. యధోచితములగు శుద్ది, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృ శ్రాద్దము మానకుండుట, వైశాఖవ్రతాచరణము యివి మిక్కిలి పుణ్యప్రదములు. వైశాఖమాస ధర్మముల నాచరింపనివానికి ముక్తి లేదు*. *సర్వధర్మములయందును వైశాఖవ్రత ధర్మముత్తమము సాటిలేనిది. రాజులేని రాజ్యప్రజలవలె పెక్కు ధర్మములున్నవి. కాని అవి దుఃఖప్రదములు అనగా కష్టములను కలిగించును. సుఖసాధ్యములు కావు.* *వైశాఖధర్మములు సులభములు, సువ్యవస్థితమగు రాజు పరిపాలనలో నున్న ప్రజలకువలె సుఖశాంతి ప్రదములు. అన్ని వర్ణములవారికి, అన్ని ఆశ్రమములవారికి సులభములు ఆచరణ సాధ్యములు పుణ్యప్రదములు. నీటితో నిండిన పాత్రను యిచ్చుట, మార్గమున చెట్లనీడలో చలివేండ్రము నేర్పరచుట, చెప్పులను, పావుకోళ్లను దానమిచ్చుట, గొడుగును, విసనకఱ్ఱలను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవుపాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న వీనిని దానము చేయుట, ప్రయాణము చేయువారికి సౌకర్యముగ మార్గముల యందు బావులు, దిగుడుబావులు, చెరువులు త్రవ్వించుట, కొబ్బరి, చెరకు గడల రసము, కస్తూరి వీనిని దానము చేయుట, మంచి గంధమును పూయుట, మంచము, పరుపు దానమిచ్చుట, మామిడిపండ్ల రసము, దోసపండ్ల రసము దానముచేయుట, దమనము, పుష్పములు, సాయంకాలమున గుడోదకము(పానకము) పూర్ణిమయందు పులిహోర మొదలగు చిత్రాన్నముల దానము ప్రతిదినము దధ్యోదనము దానము చేయుట, తాంబూల దానము చైత్ర అమావాస్య నాడు వెదురుకొమ్మలదానము ముఖ్యములు. ఆ కాలమున వచ్చు సర్వవిధములగు ఫల పుష్పములను వివిధ వస్తువులను దానము చేయవలెను*. *ప్రతిదినమున సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలయును. శ్రీమహావిష్ణు పూజ తరువాత విష్ణుకథాశ్రవణము చేయవలయును. అభ్యంగస్నానము వైశాఖమున చేయరాదు. ఆకులో భుజింపవలెను. ఎండలో ప్రయాణములో అలసిన వారికి విసనకఱ్ఱతో విసరుట, సుగంధ పుష్పములతో ప్రతి దినము విష్ణుపూజ, పండ్లు, పెరుగన్నము నివేదించుట ధూపదీపముల సేవ, గోవులకు ప్రతి దినము గడ్డిని పెట్టుట, సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తనపై జల్లుకొనుట, ముఖ్యకర్తవ్యములు. బెల్లము, శొంఠి, ఉసిరిక, పప్పు, బియ్యము, కూరగాయలు వీనిని దానము చేయవలెను. ప్రయాణీకులను ఆదరించి కుశలప్రశ్నలడిగి వలసిన ఆతిధ్యము నీయవలెను. ఇవి వైశాఖమాసమున తప్పక చేయవలసిన ధర్మములు. పుష్పములతో చిగుళ్లతో విష్ణుపూజ, విష్ణువును తలచుకొని పుష్పములను దానమిచ్చుట దధ్యన్ననివేదనము మున్నగునవి సర్వపాపములను హరించును. అఖండ పుణ్యమునిచ్చును.* *పుష్పములతో శ్రీమహావిష్ణువు నర్చింపక, విష్ణుకథాశ్రవణము చేయక వ్యర్థముగ కాలమును గడుపు స్త్రీ పతి సౌఖ్యమును, పుత్రలాభమును పొందదు. ఆమె కోరిక లేవియును తీరవు. శ్రీమహావిష్ణువు వివిధరూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖమాసమున సంచరించు సపరివారముగ మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతిగృహమున నివసించును. అట్తి పవిత్ర సమయమున వైశాఖ పూజాదికములను చేయని మూడుఢు శ్రీహరి కోపమునకు గురియగును. రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మనైదుమార్లు పొందును. ఇట్టి కష్టములు వలదనుకొన్న వారు యధాశక్తిగ వైశాఖవ్రతము నాచరించుచు ఆకలిగలవారి కన్నమును, దప్పిక కలవారికి జలమును యీయవలెను. జలము, అన్నము సర్వప్రాణుల ప్రాణములకును ఆధారములు కదా. అట్టి దానములచే సర్వప్రాణుల యందున్న సర్వాంతర్యామియగు శ్రీమహావిష్ణువు. సంతోషించి వరములనిచ్చును. శ్రేయస్సును సర్వసుఖ భోగములను, సంపదలను, కలిగించి ముక్తినిచ్చును. జల దానము చేయనివారు పశువులై జన్మింతురు. అన్నదానము చేయనివారు పిశాచములగుచున్నారు. అన్నదానము చేయక పిశాచత్వమునందిన వారి కథను చెప్పుచున్నాను వినుము. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయము సుమా!*. *_వైశాఖ పురాణం 8వ అధ్యాయము సంపూర్ణం._* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
*_మన ఆరోగ్యం…!_* *_సామెతల్లో ఆయుర్వేదం!_* *_“తల్లిని చేసినవాడే కాయమూ పిప్పళ్ళు తెస్తాడు”_* ..అని! *కాయము అంటే బాలింతకు పాలు ఎక్కువగా రావటానికిమూలికలతో తయారు చేసే లేహ్యం! పిప్పలి త్రిదోషాలను పోగొడుతుంది!* *“పేరులేని వ్యాధికి పెన్నేరు గడ్డ!”*` *_ఏ రోగము ఎందుకొచ్చిందో తెలియక పోతే ‘అశ్వగంధ’ యే రోగానికైనా పెద్ద మందు!(పెన్నేరుగడ్డ అంటే అశ్వగంధ)_* *త్రిదోషహరం తిప్పతీగ అని సామెత!!* *‘ఉత్తరేణు ఉత్తమం, మధ్యమం మారేడు, కనీసం కందిపుల్ల!’* *ఇవి పళ్ళుతోముకోవడానికన్నమాట!* *వాస్తే వాయిలాకు పాస్తే పాయలాకు ..* *అప్పుడే పుట్టిన శిశువుకు దొండాకు పసరు పోసేవారు లోపలి కల్మషాలు పోతాయని* ...సామెత. *ఏమంటే. “కొడితే చిన్నప్పుడు తాగిన దొండాకు పసరు కక్కుతావు”* *పుండుమీదకు ఉమ్మెత్త, నీరుల్లి నూరి నూనెలో వెచ్చజేసి గాయాలపై కట్టేవారట* ...సామెత. ఇలా ...*”పుండు మీదకు నూనె లేదంటే గారెలొండే పెండ్లామా అన్నట్లు"..."ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు "...* *వెల్లుల్లి చాలా రోగాలు నయం చేస్తుంది. అది క్షయరోగాన్ని కూడా హరించే శక్తి కలది* సామెత ...ఇలా ... *”ఆశపడి వెల్లుల్లి తిన్నా రోగము అట్లానే ఉన్నది.” *_కరక్కాయ_* *పువ్వు ,పిందె,పండు చాలా ఉపయోగకరమైనవి ... శ్వాస, కాస, ఉదర, క్రిమి, గుల్మ, హృద్రోగం , గ్రహణి, కామిల, పాండు.. ఇన్ని రోగాలు హరిస్తుంది.* అందుకే ... *"మున్నూట ఇరవై రోగాలకు మూడు గుప్పిళ్ళ కరక్కాయ పొడి”* ```..అని సామెత! *ఆయుర్వేదం మితంగా తినమని చెపుతుంది* ..*సామెత!* *ఇదుగో ...**_"పిడికెడు తిన్నమ్మ పీటకోడు లాగ ఉంటే చాటెడు తిన్నమ్మచక్కపేడులాగుంది!”_* _"ఒక పూట తింటే యోగి, రెండు పూటలా తింటే భోగి, మూడు పూటలా తింటే రోగి!"_* *_అలానే..._* *శిశువు పాలు వాంతి చేసుకోవడం ఆరోగ్యలక్షణమని చెప్పే సామెత...* *"కక్కిన బిడ్డ దక్కుతుంది”* *అని..!* *ఇలా ఎన్నో సామెతలు ఒక్కొక్కటీ కనుమరుగవుతున్నాయి!* *పిల్లవాడు భాషనే నేర్వనప్పుడు సామెత ఎలా వస్తుంది?* *సామెత తెలియనప్పుడు సంస్కృతి ఎలా తెలుస్తుంది?* *అందుకే భాషను చంపితే సంస్కృతి చస్తుంది!* *_జాతి జీవనాడి నశిస్తుంది!_* #మన సంప్రదాయాలు సమాచారం
2️⃣0️⃣5️⃣ *_సంపూర్ణ మహాభారతము_* *_205 వ రోజు_* *_ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము_* *_శల్యుడు సుయోధనునికి సాయం అందించుట:_* *ధర్మరాజు పంపిన దూతలు శల్యుని వద్దకు వెళ్ళి పాండవులకు సైన్య సహాయం చేయమని ధర్మజుని కోరిక వెలిబుచ్చారు*. *శల్యుడు ఆనందంగా సైన్య సమేతుడై మహారధులైన పుత్రులతో కలిసిఉపప్లావ్యంకు బయలుదేరాడు. చారుల ద్వారా విషయం గ్రహించిన సుయోధనుడు శల్యుడు వచ్చు మార్గంలో తన మనుషుల ద్వారా వారి సైన్యానికి సకల మర్యాదలు, ఆహార పానీయములు, సౌకర్యాలు సమకూరేలా చేసాడు. విందులూ, వినోదాలు ఏర్పాటు చేసి రాజమర్యాదలు చేసాడు. ఇవి చూసిన శల్యుడు “ఈ మర్యాదలు చేస్తున్న వారు నా మర్యాదకు అర్హులు. ఈ ఏర్పాట్లను చేసిన ధర్మరాజు అమాత్యులను పిలిపించండి” అన్నాడు*. *దుర్యోధనుడి సేవకులు ఆశ్చర్యపోయి దుర్యోధనుడికి విన్నవించారు. అప్పుడు శల్యుడు తన ప్రాణములు ఇవ్వడానికి కూడా సిద్ధమైనంత సంతోషంతో వున్నాడు. అప్పుడు సుయోధనుడు శల్యుని వద్దకు వెళ్ళి అవన్నీ తాను చేసినట్లు చెప్పాడు*. *శల్యుడు దుర్యోధనుడి ప్రయత్నం అర్ధం చేసుకున్నాడు. కానీ మాట తప్పలేడు. శల్యుడు "ఏమి కావాలో కోరుకో" అన్నాడు*. *అందుకు సుయోధనుడు "ఆర్యా! సత్యవాక్కువై నాకు మాట ఇవ్వు. నీవు సర్వసైన్యానికి అధ్యక్షుడవు కాదగిన వాడవు. నీకు పాండవులు ఎలాంటి వారో నేనూ అంతే. నేను నీ భక్తుడను. ఆదరించ దగిన వాడను. కాబట్టి నా కోరికను మన్నించి నాకు సహాయం చేయి." అన్నాడు*. *శల్యుడు అందుకు సమ్మతించాడు*. *ఆ తరువాత శల్యుడు నేను ధర్మరాజు వద్దకు వెడుతున్నాను. అతనిని దర్శించిన తరువాత నీ దగ్గరకు వస్తాను" అన్నాడు*. *సుయోధనుడు "అలాగే వెళ్ళండి కాని నాకిచ్చిన మాట మరవ వద్దు" అన్నాడు*. *శల్యుడు అందుకు అంగీకరించి ధర్మరాజును చూడటానికి ఉపప్లావ్యం చేరాడు. ధర్మరాజు తన తమ్ములు, ద్రౌపది, సుభద్ర, అభిమన్యుడు ఇతర బంధు మిత్రులతో శల్యునికి సాదర స్వాగతం పలికాడు*. *శల్యుడు ధర్మరాజును ఆలింగనం చేసుకుని “ధర్మరాజా! కష్టసాధ్యమైన అరణ్యవాసాన్ని, అంతకంటే కష్టమైన అజ్ఞాత వాసాన్ని పూర్తి చేసారు. మీరు నమ్ముకున్న సత్యనిష్ఠా, ధర్మ నిష్ఠకు నిలబడ్డారు” అని శ్లాఘించి సుయోధనునికి ఇచ్చిన వరాన్ని వివరించాడు*. *ధర్మరాజు "మీరు సుయోధనునికి ఇచ్చిన వరం మంచిదే. దానిని నెరవేర్చండి. అలాగే నా కోరిక నెరవేర్చండి. రాబోవు యుద్ధంలో అర్జునునకు శ్రీకృష్ణుడు సారధ్యం వహిస్తున్నాడు. సుయోధనుని పక్షంలో మీకంటే సారధ్యంలో నేర్పరి లేడు. కర్ణుడు అర్జునుని మీద పగద్వేషంతో రగిలి పోతుంటాడు. నా పరిశీలనను బట్టి కర్ణార్జునులు ఇద్దరికీ ద్వంద్వయుద్ధం వచ్చిన్నప్పుడు కర్ణునికి మిమ్మల్ని సారధ్యం చేయమంటే ఆ బాధ్యత తీసుకుని కర్ణునికి ఉత్సాహ భంగం చేస్తూ అర్జునుని కాపాడండి. ఇది అకృత్యం అని తలపక నా కోరిక మన్నించండి" అని కోరాడు*. *శల్యుడు ధర్మరాజు అంతర్యం గ్రహించాడు "ధర్మనందనా ! సుయోధనుడు కోరితే కర్ణునికి సారధ్యం వహించి నీ కోరిక నెరవేరుస్తాను. జూద సమయంలో కర్ణుడు పలికిన పరుష వాక్యాలు, అందు వలన మీరు పడిన కష్టాలు అన్ని సుఖ దయాలు అవుతాయి*. *ధర్మరాజా! ఇదే కాదు నీవు ఇంకేమి కోరినా చేస్తాను. మీకు జరిగిన అవమానం అడవులలో మీరు పడిన కష్టాలు మరవడం ఎవరి తరం? నువ్వే కాదు ఇంతకు పూర్వం ఇంద్రుడు కూడా ఇలాగే అనుభవించాడు. విధి రాతను తప్పించడం పరమ శివునకు కూడా సాధ్యం కాదు కదా?" అన్నాడు* #మన సంప్రదాయాలు సమాచారం
6️⃣7️⃣ *_శ్రీ మహావిష్ణు పురాణం_* *_(అరవై ఏడవ భాగం)_* *_పరశురామ అవతారం:_* *_కార్తవీర్యార్జునుడు కామధేనువు కోసం జమదగ్ని మహర్షిని హత మార్చుట - రేణుకాదేవిని గాయ పరచుట:_* *కార్తవీర్యార్జునుడు తన సేనలతో వేటకోసం అరణ్యంలోకి వచ్చాడు. వేటాడుతూ అడవి మధ్యలో సహ్యాద్రి పర్వతము పైన ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమం చూశాడు. ఈ ఆశ్రమం ఎవరిది అని మంత్రుల నడుగగా వారు ఒక దూతను పంపి వివరాలు తెలుసుకు రమ్మన్నారు*. *దూత వెళ్లి వచ్చి నమస్కరించి “ప్రభూ! జమదగ్ని మహర్షి వారి ఆశ్రమం అది. ఆయనను సంద ర్శించడం పుణ్యదాయకం. మహిమా న్వితులైన మహర్షి వారి ఆశీస్సులు తమకు, తమ రాజ్యానికి శుభం చేకూర్చగలవు” అని చెప్పడంతో కార్తవీర్యార్జునుడు సేనను అక్కడ ఉంచి కొంతమంది ముఖ్యులతో జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్లారు.* *తేజోరూపుడైన జమదగ్ని మహర్షికి ప్రణామం చేశారు. జమదగ్ని మహర్షి, వచ్చిన కార్తవీర్యుడు, పరివారానికి స్వాగతం పలికి అతిథిసత్కరించి, గౌరవించాడు.* *రాజు, అతని పరివారం అక్కడ ఉన్న సరోవరం లో స్నానాలు చేసి జమదగ్ని మహర్షి శిష్యులు చేసే వేదఘోషలు, శాస్త్రచర్చలు శ్రద్దగా ఆలకించారు*. *జమదగ్ని మహర్షి కార్తవీర్యార్జును ని చూసి "రాజా! ఎవరు నీవు? ఇటు అరణ్యం వైపు వేటకు వచ్చారా!" అని అడిగాడు.* *కార్తవీర్యుడు నమస్కరించి "నేను కృతవీర్యుని పుత్రుడైన కార్తవీర్యుడను. నన్ను కార్తవీర్యార్జునుడు అని పిలుస్తారు. వేట కోసం అడవికి సేనలతో వచ్చాను*. *మీ ఆశ్రమాన్ని చూడటానికి వచ్చిన నాకు మీసందర్శన భాగ్యం కలిగింది. మీ అతిథి సేవలకు సంతుష్టుడనయ్యాను. అనుమతిస్తే మా నగరానికి తిరిగి వెళ్తాను" అని వినయంగా పలికాడు*. *జమదగ్ని మహర్షి చిరునవ్వుతో* *“రాజా! నీ పేరు ప్రఖ్యాతులు ముల్లో కాల్లో వ్యాపించి ఉన్నాయి. నీవంటి వారు మా ఆశ్రమానికి అతిథిగా రావడం చాలాసంతోషంగా ఉంది.నీవంటి అతిలోక పరాక్రమవంతునికి అతిథ్యం ఇచ్చే అవకాశం మాకు కలుగచేయండి.* *భోజన సమయమైంది. మీరు భోజనం స్వీకరించి వెళ్లండి" అన్నాడు*. *కార్తవీర్యుడు "మహర్షీ! భోజన సమయానికి వచ్చినప్పుడు భోజనం స్వీకరించడం మంచిదే. కానీ నా వెంట పరివారం, సేనలు ఉన్నాయి. వారందరికి భోజనం ఏర్పాటు చేయడం కష్టము. నా పరివారం, సైన్యం తినకుండా నేను ఒక్కడను భోజనం చేయడం మర్యాద కాదు. కనుక అనుమతిస్తే వెళ్లివస్తాను" అని పలికాడు.* *జమదగ్ని మహర్షి మందహాసం చేస్తూ "రాజా! తపస్సు వలన సాధించలేనిది ఏదీ లేదు. కనుక సందేహం వీడండి. మీ పరివారాన్ని సైన్యాన్ని నదిలో స్నానం చేసి రమ్మన్నండి. భోజన ఏర్పాట్లు మీరే చూద్దురు గాని" అనడంతో ఆశ్చర్యం చెంది కార్తవీర్యుడు పరివారం, సైన్యం తీసుకుని నదీతీరానికి వెళ్లాడు.* *జమదగ్ని భార్య రేణుకను పిలిచి జరిగింది చెప్పాడు*. *భార్య భర్తలు ఇద్దరు స్వర్గలోకంలో ఉన్న కామధేను వుని స్మరించి పూజించాడు. కామధేనువు జమదగ్ని దంపతుల ముందు ప్రత్యక్షమైంది. నమస్కరించి “మాతా! కామధేనూ! కార్తవీర్యుడు తమ పరివారం, సైన్యంతో వచ్చారు. వారిని భోజనానికి ఆహ్వానించాము. మా ఆతిథ్యంలో లోటు లేకుండా వారికి తగిన సౌకర్యాలు, భోజన ఏర్పాట్లు చేయుము" అని ప్రార్ధించారు*. *మహర్షి దంపతుల ప్రార్థన మన్నించిన కామధేనువు అక్కడ కార్తవీర్యుడు, అతని పరివారం, సేనలకు విడిది ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేసింది.* *షడ్రషోపేతమైన భోజనం భోజనశాలతో ఏర్పాటు చేసి వడ్డించడానికి సేవకులను సృష్టించింది. ఏర్పాట్లను చూసి సంతృప్తి చెందిన జమదగ్ని మహర్షి కార్తవీర్యుని పరివార, సైన్య సమేతంగా భోజనానికి రావలసిందిగా ఆహ్వానించాడు*. *కార్తవీర్యుడు, అతని పరివారం, సైన్యం వచ్చి ఏర్పాటు చేయబడిన అతిథి భవనాన్ని చూసి విస్మయం చెందారు*. *మహారాజుకి తగినట్టు సౌకర్యాలు అల్పసమయం లో ఎలా ఏర్పాటు చేయగలిగారు అని ఆశ్చర్యపోయారు. భోజన పదార్థాల రుచులు, సువాసనలు నోరూరేలా ఉన్నాయి. అందరు తనివితీరా భోజనం చేసారు. ప్రతి ఒక్కరి మనస్సులో ఒకటే సందేహం ‘ఇంతటి రాజభోగ్యమైన రుచికరమైన భోజనం అరణ్యంలో మహర్షి ఎలా ఏర్పాటు చేయగలిగారు. నిజంగా తపశక్తి ప్రభానమే!’ భోజనమైన తరువాత అతిథులందరికి నూతన వస్త్రాలు అలంకరణ వస్తువులు బహు మతులుగా ఇచ్చారు*. *జమదగ్ని మహర్షి చేత విలువైన ఆభరణాలు, వస్త్రాలతో సత్కరింపబడిన కార్తవీర్యుడు జమదగ్నికి నమస్కరించి “మహర్షీ! మేము మొదట వచ్చినప్పుడు ఈ భవనాలు, భోజనశాల ఇక్కడ లేవు. మీ తపశ్శక్తి ప్రభావమా లేక మాయ తో కల్పించినవా?” అని తన మనస్సులో గల సందేహం వ్యక్తపరిచాడు*. *జమదగ్ని మహర్షి “రాజా! ఇది మాయ కాదు. నా తపశక్తి వినియోగించ లేదు. నిజం చెబు తున్నాను. మామీద అనుగ్రహంతో అమరలోకం నుంచి వచ్చిన కామధేను మాత అనుగ్రహము” అని అక్కడే ఉన్న కామధేనువును, గోవత్సమును చూపించాడు.* *కార్తవీర్యార్జునుడిలో స్వార్ధం కలిగింది. "ఇటువంటి మహిమ గల కామధేనువు తన దగ్గర ఉండాలి కాని అరణ్యంలో ఒంటరిగా ఉండే ముని వద్ద ఉండకూడదు" అనుకున్నాడు*. *దురాశకు విచక్షణ ఉండదు.* *జమదగ్నితో “మహర్షీ! ఇటువంటి కామధేనువు ముల్లోక రాజునైన నా దగ్గర ఉండటం ఉచితము. కనుక కామధేనువుని నాకు సంతోషముతో సమర్పించండి. లేదంటే బలవంతంగా నైనా తీసుకువెళతాను. వరప్రసాదమైన నా బల పరాక్రమాలు గురించి తమకు పూర్తిగా తెలుసు" అని హెచ్చరిస్తూ మాట్లాడాడు*. *జమదగ్ని మహర్షి మందహాసం తో "మహారాజా! కామధేను మాతకు అనుగ్రహం కలిగితేనే వస్తుంది. ఆమెను ఎవరూ బలవంతాన ఇష్టం లేకుండా తీసుకు వెళ్లలేరు. రమ్మని ప్రార్ధించండి. వస్తే తీసుకు వెళ్లండి. బలవంతం చేస్తే మాత్రం సర్వ నాశనం అవుతారు. ఆలోచించండి" అని చెప్పాడు*. *కార్తవీర్యుడు మహర్షి మాటలు పట్టించుకోకుండా తన భటులను కామధేనువుని బంధించి తీసుకు రమ్మని ఆదేశించాడు*. *జమదగ్ని మహర్షి కామధేనువుకి నమస్కరించి “మాతా! నిన్ను నీవే రక్షించుకో" అనిప్రార్ధించాడు.* *తనను బంధించడానికి వచ్చిన భటులను చూసి కామధేనువు గట్టిగా అరిచింది. ఆ అరుపుకే భటులు గుండెలు పగిలి మరణించారు.* *కార్తవీర్యుడికి రోషము వచ్చి సమస్త సైన్యాన్నిపంపాడు*. *కామధేనువు శరీరం నుంచి వేలాది గో వీరులు పుట్టుకువచ్చి సేనలతో తలపడ్డారు*. *చూస్తుండగానే* *కార్తవీర్యుని సైన్యం నశించిపోయింది* *చావకుండా మిగిలిన కొద్దిమంది పారిపోయారు. కార్తవీర్యార్జునుడు తన సహస్ర బాహువులతో ఐదు వందల బాణాలు ఒకేసారి వదిలాడు. ఎన్నిసార్లు బాణవర్షం కురిపించినా కామధేను గోసేనలు ఒక్కరు కూడా మరణించలేదు. తన బలం, సామర్ధ్యం ఎందుకూ పనికిరాలేదు అని చింతలో పడిపోయాడు. ఓడిన వాడితో యుద్దం ఎందుకు అని కామధేనువు తన గోసైన్యం తో స్వర్గలోకానికి వెళ్లి పోయింది*. *కార్తవీర్యార్జునుడికి ఓటమినుంచి ఉక్రోషం కలిగింది. ఇందుకు కారణం మహర్షి అని జమదగ్ని పై కోపం చెందాడు. "మహర్షీ! నీ వద్దకు రావడం వలనే నాకు అవమానం జరిగింది. ఓటమి సంభవించింది. హృదయంలో ఇంత కాపట్యమున్న నీవు బ్రాహ్మణు డవు కావు" అంటూ గుండెల్లో దిగేలా వాడి బాణము ప్రయో గించాడు*. *జమదగ్నిమహర్షి తనకు మరణం సమీపించిందని తెలుసుకుని దానిని ఆపడానికి తపశక్తి వినియోగించ లేదు*. *జమదగ్ని మహర్షి మరణించడం తో రేణుకాదేవి రోదిస్తూ కోపంతో "బ్రహ్మహత్యకు అకారణంగా పూనుకున్నావు. నా భర్త నీకు అతిథి సత్కారం చేసి భోజనం పెట్టాడు. సిగ్గులేదా" అని ఆక్రోశించింది*. *కార్తవీర్యుడు అసహనం పొంది "మాట్లాడకుండా ఉండు! లేదంటే నిన్నూ సంహరిస్తాను" అంటూ ఇరవై ఒక్క బాణాలు ఆమె దేహము పై ప్రయోగించి కదలనీయకుండా చేశాడు*. *రేణుకాదేవి ఆగ్రహం చెందింది* *"దుర్మార్గుడా! బలవంతుడన్న గర్వంతో నిరాయుధులు, నిరప రాధులైన మమ్మల్ని సంహరిస్తున్నావు. నీ సహస్ర బాహువులను ఖండించి నిన్ను సంహరించే రోజు దగ్గరలో ఉంది" అని శపించింది*. *పతివ్రతా శాపంతో కార్తవీర్యార్జునుడి కళ్ళు తెరచుకున్నాయి. తను చేసినదానికి తననే నిందించుకుంటూ తన నగరానికి తిరిగి వెళ్లాడు* #మన సంప్రదాయాలు సమాచారం
*_దొంగ, దొంగ, దొంగ..దొంగ_* *_ఉదయం 11 గంటలు!_* *తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి దర్శనం చేసుకున్న జనం బయటకు వస్తున్నారు.* *గర్భాలయం బయట చుట్టూ తిరిగి విమాన వెంకటేశ్వరుని దర్శనం చేసుకుని ఇంక బయటకు వెళ్లిపోవడానికి వాకిలి దగ్గర గుమికూడారు. ఎప్పుడూ ఉండే విధంగానే అప్పుడూ రద్దీ ఉంది. సెక్యూరిటీ గార్డులు ఇద్దరూ, వలంటీర్లు ఇద్దరూ ఆ ద్వారం గుండా లోపలికొస్తున్న వాళ్లను ఆపి బయటకు వెళ్లటానికి వీళ్లని అనుమతిస్తున్నారు*. *లాల్చీ పైజమాలతో ఉన్న యాభై ఏళ్ల ఆసామీ ఒకతను బయటికి వెళ్లబోతూ తన కుడిచేతి వేళ్లు తడుముకున్నాడు*. *హఠాత్తుగా గట్టిగా, ‘దొంగ.. దొంగ, దొంగ..’ అని అరిచాడు. తన చుట్టూ ఉన్న జనాన్ని చూశాడు. ఎక్కువ మంది నడివయస్సు ఆడా మగా జనమే. వాళ్లు ఇతని వైపు విచిత్రంగా చూసి నిశ్శబ్దంగా వెళ్లిపోతున్నారు.* *ఈ ఆసామి మళ్లీ, ‘దొంగండీ.. దొంగ! ఎవరో నా ఉంగరం దొంగిలించారు.. ఎవరు? ఎవరు?’ అన్నాడు*. *ద్వారంలో ఎదురుగా నుంచునున్న వలంటీరు గబగబా ఇతని వైపు వచ్చాడు. ‘మీతోబాటు వచ్చిన వాళ్లు బయటికి వెళ్లిపోయారు. మీ వెనకాల వచ్చిన వాళ్లని మీరు తప్పు పట్టలేరు గదా. ఇట్లా ఇవతలికి రండి’* *ఆ ఆసామి అన్నాడు. ‘అంటే నా ఉంగరం దొంగిలించిన వాడిని వదిలెయ్యాలంటారా?’* *‘మీరు ఆవేదన పడకండి. సెక్యూరిటీని పిలుస్తాను. అతన్తో చెప్పండి’ అంటూ సెక్యూరిటీ గార్డు వైపు చెయ్యి ఊపాడు. సెక్యూరిటీ గార్డు రాగానే వలంటీర్ అతన్తో ‘ఈయన ఉంగరాన్ని ఎవరో దొంగిలించారట’ అన్నాడు*. *సెక్యూరిటీ తికమకగా, ‘దొంగిలించారా? స్వామి సన్నిధిలో దొంగతనమా? ఎన్నడూ ఎరగమే.. ఇంతకీ ఏం పోయింది?’* *ఆ ఆసామి అన్నాడు. ‘నా ఎడమచేతి ఉంగరాలు రెండూ ఉన్నాయి. నా కుడిచేతి వేలి ఉంగరమే పోయింది’*. *‘మీ పేరేమిటి? ఎక్కడి నుంచొచ్చారు? ఏం చేస్తూంటారు? రండి*, *ఈ పక్క మంటపం మీద మాట్లాడుకుందాం’* *ముగ్గురూ పక్కనే ఉన్న అన్నమాచార్య గ్రంథాలయం మెట్ల మీద కెళ్లారు.* *సెక్యూరిటీ గార్డు అన్నాడు, ‘మీ పేరేమిటి?’.* *ఆ ఆసామి అన్నాడు ‘నా పేరు అంబాలాల్. మాది సూళ్లూరుపేట. నేను రాత్రి వచ్చాను. ఒక్కణ్ణే వచ్చాను. స్పెషల్ గెస్ట్‌హౌస్ తీసుకున్నాను. నాకు స్పెషల్ దర్శనం టిక్కెట్టు ఉంది. కనుక ఇందాక పది గంటలకి శ్రీవారి దర్శనార్థం మహాద్వారంలో ప్రవేశించి బంగారు వాకిలి దాటి ధ్వజస్తంభం దాటి, వెండి వాకిలి ద్వారా జయవిజయుల పక్కనించి లోపలికి వస్తూనే నా స్వామికి రెండు చేతులూ జోడించి నమస్కరించాను. నా మూడు ఉంగరాలూ స్వామికి చూపించాను. ఆయన ముచ్చట పడ్డాడనుకోండి. స్వామి దర్శనం తర్వాత రద్దీలో బయటకొచ్చి ప్రదక్షిణంగ చుట్టూ తిరిగాను. ఇప్పుడింక వెళ్లిపోతూ చూసుకుంటే కుడిచేతి ఉంగరం లేదు.’* *‘ఎక్కడన్నా పడిపోయిందేమో గమనించారా?’* *‘అహహ పడిపోలేదు. అట్లా పడిపోతే అరవను గదా!’* *‘దర్శనంలో ఉండగా ఎవరైనా మీ వేలు పట్టుకున్నారా?’* *‘లేదు.. కానీ ఒక వాలంటీరు అమ్మాయి మాత్రం నా ఉంగరం చూస్తూ ముచ్చటగా ‘మీ వస్తువులు జాగర్తండి’ అంది.* *అప్పుడు నా ఉంగరం నాకు కనిపిస్తూనే ఉంది’* *‘సరే ప్రదక్షిణం చేస్తూ మీరు ఎక్కడెక్కడ తిరిగారు?’* *‘నేను బయటికొచ్చి ముందర వకుళాదేవిని దర్శించుకున్నాను. స్వామి వారికిచ్చే ప్రత్యేక నైవేద్యాల పోటు చూసాను. మండపంలో తీర్థం పుచ్చుకున్నాను. ఆ తరువాత వెంకటేశ్వర స్వామి పెళ్లి శిల్పాలు, మండపంపై చిత్రించి ఉన్నవి, చూసుకుంటూ నడిచాను. స్వామి వారి హుండీ లెక్కించే స్థలం పరకామణిని చూసాను. నేను అలా చూస్తూండగా నా పక్కన నుంచుని చూస్తూ ఉన్న ఇద్దరు కుర్రాళ్లల్లో ఒకడు ఎర్రగళ్ల చొక్కావాడు నా దగ్గరకొచ్చి నా వేలును పట్టుకుని ‘చాలా బాగుంది సార్ ఉంగరం’ అన్నాడు. నేను పరకామణిని, అక్కడున్న మీ సెక్యూరిటీ వాళ్లని చూస్తూ నుంచుండిపోయాను. ఆ కుర్రాళ్లు వెళ్లిపోయారు. ఆ తర్వాత గంధం తీసేచోట కొంచెంసేపు నుంచున్నాను. ఆ తరువాత విమాన వెంకటేశ్వరుణ్ణి దర్శించుకున్నాను..’* *‘మళ్లీ ఉంగరం చూసుకున్నారా?’* *‘లేదు. ఇప్పుడు చూసుకుంటే మాత్రం అది లేదు’* *‘మీకు అనుమానం ఆ కుర్రాళ్ల మీదనా?’* *‘అవునండి. ఆ ఎర్రగళ్ల చొక్కావాడి మీదనే- వాడే ఇప్పుడు నా ముందు నుంచి బయటకి వెళ్లిపోయాడు*. *‘బోజనం చేసి వెడదాం రా’ అని రెండోవాడితో వాడు అనటం నేను విన్నాను.’* *సెక్యూరిటీ వెంటనే వలంటీర్‌తో ‘బయటికెళ్లి చూడు. కనిపిస్తే పిలుచుకురా!’ అన్నాడు*. *వలంటీర్ వేగంగా వెళ్లిపోయాడు*. *సెక్యూరిటీ గార్డు అంబాలాల్‌ని అడిగాడు ‘మీరేం చేస్తుంటారు?’ ‘ఏదో.. చిన్న బంగారం వ్యాపారం’* *‘కుటుంబంతో వచ్చినట్లు లేదు కదూ!’* *‘అవునండి. వాళ్లకి ఏర్పాట్లన్నీ చూడాలి. వెళ్లడం ఆలస్యమయితే నా వ్యాపారం దెబ్బతింటుంది. అందుకని వాళ్లని తీసుకురాలేదు’* *‘అది సరే. అసలు ఎందుకని అంతా మీ ఉంగరం వైపు పరిశీలించి చూశారు?’* *‘అదీ అదీ.. వజ్రపు టుంగరం. వజ్రం అరంగుళం పొడుగు, పావు అంగుళం వెడల్పు. దానికి అన్నీ నగిషీలే. ఏ కొంచెం కాంతిలోనయినా అది అన్ని వైపులా చురుక్కు చురుక్కుమని అనేక రంగులు మెరుస్తూ ఉంటుంది. ఆ వజ్రం ఖరీదే ఏభై వేలు. బంగారమేమో కాసు. ఉంగరం మొత్తం లక్ష. కనక అందరినీ అది ఆకర్షిస్తూ ఉంటుంది’* *బయటకెళ్లిన వలంటీర్ ఊడిపడ్డాడు. సెక్యూరిటీతో అన్నాడు ‘కుర్రాళ్లిద్దరూ కనిపించారు. ఎర్రగళ్ల చొక్కాతను ‘ఆ ఉంగరాన్ని నేను తియ్యలేదు. అసలు, ముట్టుకోలేద్సార్.* *ఎంత రోగ్ అయినా స్వామి వారి దగ్గర ఇలాంటి డర్టీ పని చేస్తాడా? అసలు నేను బ్యాంకు ఉద్యోగిని దాన్ని ఇచ్చినా పుచ్చుకోన్సార్?’ అన్నాడు. నేను డ్యూటీలో కెళతాను’ చెప్పి వలంటీర్ వెళ్లిపోయాడు.* *సెక్యూరిటీ గార్డు అంబాలాల్‌ను గుచ్చిగుచ్చి చూసాడు.* *‘తెలిసిందిగా. ఆ కుర్రాడు తియ్యలేదు. విమాన స్వామిని చూసాక మీరేం చేశారు?’ అని అడిగాడు*. *‘ఆ ఏముందిలెండి. హుండీ దగ్గరికెళ్లి నా పాకెట్ పడేసాను. వెంటనే...’* *‘ఆగండి.. ఆ పాకెట్‌లో ఏం వేశారు?’* *‘డబ్బండి.. నేను వ్యాపారంలో బాగా నష్టపోయాను. కిందట ఏడాది ఇక్కడికొచ్చి నన్ను గట్టెక్కించి కాపాడమని స్వామిని ప్రార్థించాను. ‘నాకు వచ్చే లాభంలో టెన్ పర్సెంట్ నీకిస్తానయ్యా’ అని మొక్కుకున్నాను. ఈ ఏడాదిలో నాకు కోటి లాభం వచ్చింది.* *కనుక అందులో టెన్ పర్సెంట్ తెచ్చి హుండీలో పడేసాను అంతే. ఆ తరువాత బయటికొచ్చి జనంలో కలిసిపోయాను. ఇప్పుడు మళ్లీ చూసుకుంటే ఉంగరం లేదు.’* *‘మీరు హుండీలో పేకెట్ వేస్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని తోసారా?’* *‘చిన్న తోపులాట జరిగిందండి’* *ఒక్క నిమిషం ఆగి సెక్యూరిటీ గార్డు అన్నాడు. ‘సరే ఈ విషయం అంతా మా విజిలెన్స్ ఆఫీసర్ గారికి చెబుతాను. ఆ తోపులాటలో హుండీలో పడిందేమో చూడమని కోరతాను’* *‘హుండీలో ఇప్పుడు చూసేయొచ్చు గదా! నేను మళ్లీ ఈ సాయంత్రానికి మా ఊరు వెళ్లిపోవాలి’* *‘అట్లా కుదరదండి. హుండీలన్నీ రాత్రి రెండు గంటలకి స్వామికి పవళింపు సేవ అయ్యాకే తీస్తారు. వాటిని పరకామణిలో పెట్టి పొద్దునే్న లెక్కిస్తారు*. *మీరు ఈ రాత్రికి ఆగిపొండి. రోజూ మేము యాత్రీకుల్లో పెద్ద మనుషులనుకున్న ముగ్గుర్ని సాక్షులుగా పరకామణి దగ్గరికి తీసుకెళ్లాలి.* *రేపు మిమ్మల్ని మూడోవారుగా తీసుకోమని విజిలెన్స్ ఆఫీసర్‌గారికి చెబుతాను.* *రేపు ఉదయం అయిదు గంటలకి వైకుంఠ ద్వారం దగ్గరికి మీరు రండి. నేను మిమ్మల్ని లోపలికి తీసుకొస్తాను*. *పరకామణి లెక్కించడం మీరు చూద్దురుగాని.* *‘అన్నట్టు మీ ఉంగరం విషయం ఇదిగో ఈ కాగితం మీద మా విజిలెన్స్ ఆఫీసర్ గారికి రాసివ్వండి’ ఇట్లా అంటూ గార్డ్ కాగితం ఇచ్చాడు*. *‘అంటే అసలు దొంగే లేడంటారా? నా లక్ష రూపాయల ఉంగరానికి ఇంతే సంగతులా!’* *గార్డ్ కటువుగా అన్నాడు, ‘అది రాసిచ్చి రేపుదయం రండి. అంతే’* *అంబాలాల్ రాసిచ్చాడు.* *ఇద్దరూ చెదిరిపోయారు* *మర్నాడు ఉదయం అంబాలాల్ వైకుంఠ ద్వారం దగ్గరికి రాగానే అదే సెక్యూరిటీ గార్డు అక్కడున్నాడు. అంబాలాల్‌ను తీసుకుని లోపలికి చుట్టూ తీగ జల్లెడ కట్టి ఉన్న పరకామణి దగ్గరకొచ్చాడు. లోపల స్వామివారి హుండీలన్నీ కుమ్మరించబడ్డాయి. లెక్కించడం మొదలైంది. చుట్టూ ఉన్న తితిదే సిబ్బందీ, సాక్షులూ నిశితంగా గమనిస్తున్నారు.* *హఠాత్తుగా ఎర్ర కాగితంతో చుట్టబడిన తొమ్మిది వెయ్యి రూపాయల కట్టలు బయటపడ్డాయి. అంబాలాల్ వెంటనే ‘అదిగో అదిగో నా కట్ట. తొమ్మిది లక్షల కట్ట’ అన్నాడు. మళ్లీ వెంటనే, ‘అదిగో ఆ దారానికి వేలాడుతున్నదే నా వజ్రపు ఉంగరం. నాదే, నాదే’* *సెక్యూరిటీ గార్డు అన్నాడు. ‘మీ కోటి లాభంలో పది పర్సెంట్ అంటే, పది లక్షలు స్వామికి ఇస్తానని మొక్కుకున్నారు గదా. తొమ్మిది లక్షలే ఇచ్చారేం?’* *‘ఆ ఏముంది, ఆ పదిలోంచే ఒక లక్ష నేను తీసుకుని ఉంగరం చేయించుకున్నానండి. మిగిలిన తొమ్మిదీ స్వామికిచ్చాను. ఇందులో పెద్ద పాయింటేముంది?’* *‘అదే అసలు పాయింటు. స్వామికి ఇస్తానన్నది ఇవ్వకుండా మీరు తీసుకున్నారు.* *ఆయన ఊరుకుంటాడా! దారంతో గేలం వేసి మీ వేలు మీంచి ఊడ లాక్కున్నాడు. తనది తాను తీసుకున్నాడు. ఇస్తానన్నది ఇవ్వకపోవడం దొంగతనమా, తనది తాను తీసుకోవడం దొంగతనమా?.. అంటే దొంగ ఎవరో తెలుస్తోంది కదా! మీరు ఇంకెవర్నో దొంగ అంటారేమిటి?’* *అంబాలాల్ మొహం మాడిపోయింది. ఉండుండి అన్నాడు, ‘పొరబాటయింది’* *‘నిన్న మీరు హడావిడి చేశారు. కానీ ఇక్కడ స్టాఫ్ అందరికీ తెలుసు. స్వామి వారి అనుగ్రహమేమిటో..* *‘దొంగనోట్ల కట్టలు గోడల్లో దాచుకోవడం, తిరువనంతపురంలో రంగనాథుడి మీద కేసు వెయ్యడం - ఇవన్నీ స్వామి చేయించినవా? చేసుకున్న వాళ్లు అనుభవించారు. అనుభవించి తీరుతారు. ఎందుకంటే స్వామి తన త్రాసుతో కచ్చితంగా తూస్తాడు కనక!... ఒక ముస్లిం కుటుంబంలో మూడు తరాల వారు తిండి మానేసి స్వర్ణ కమలాలు చేయించి తెచ్చి స్వామికి సమర్పించుకున్నారు. స్వామి త్రాసు ఏమిటో తెలుసా, అవి ఇప్పుడు భాండాగారంలో లేవు. ఆర్జిత సేవలో ప్రతి మంగళవారం ఉపయోగించ బడుతున్నాయి. ఆ ఆర్జితసేవకిప్పుడు విపరీతమైన డిమాండ్..! కనుక స్వామి విషయంలో మేం మాట జారం. పొల్లుపోనివ్వం.. అన్నట్టు, దొంగ దొరికాడని మీరు ఒక రిపోర్టు రాసివ్వండి.’* *అంబాలాల్ చటుక్కున అతని చెయ్యి పట్టుకుని ‘నన్ను వదిలెయ్యండి. వెళ్లిపోవాలి. ప్లీజ్!’ అంటూ విసవిసా బయటకు దారితీసాడు* #మన సంప్రదాయాలు సమాచారం
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:13