*_Vaisakha Puranam --4_*
*_వైశాఖ పురాణం 04_*
*_నాల్గవ అధ్యాయము_*.
*_వివిధ దానములు - వాని మాహత్మ్యములు_*.
*నారదమహర్షి మాటలను వినిన అంబరీష మహారాజు నారదమహర్షికి నమస్కరించి మహర్షీ !* *వైశాఖమాసమున చేయదగిన దానము లివియేనా ? మరి యింకనూ ఉన్నవా ? అవి యేవి ? వాని ఫలితములను గూడ దయ యుంచి వివరింపుమని కోరెను*.
*అప్పుడు నారదమహర్షి యిట్లనెను. చల్లనిగాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును (మంచమును) సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చినవారు ధర్మసాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవింతురు. ఎట్టి తాపత్రయములు ఆధివ్యాధులు లేకుండా సుఖముగ జీవింతురు. ఇహలోకసుఖముల ననుభవింతురు. పాపములు లేకుండనుందురు. అంతియేకాదు మహాయోగులు సైతము పొందలేని అఖండమోక్ష సామ్రాజ్యమునందుదురు. వైశాఖమాసపు ఎండలకు బాధపడినవారికి, బ్రాహ్మణ శ్రేష్ఠులకు, శ్రమను పోగొట్టునట్టి యుత్తమ పర్యంకమునిచ్చిన, ఇహలోకముననెట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు, సద్బ్రాహ్మణుడు ఆ శయనముపై శయనించినను, కూర్చున్నను, దాత తెలిసీ తెలియక చేసిన సర్వపాపములును అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు నశించును. ఇహలోక సుఖములననుభవించి మోక్షమును పొందును. స్నానమాత్రముననే పుణ్యములనిచ్చు వైశాఖమాసమున కశిపును (పరుపు లేక వస్త్రము) మంచముపై మంచి ఆచ్ఛాదనము గల పరుపును, ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తులై చక్రవర్తి సమానులై తమ వంశము వారితో బాటు శారీరక , మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధినందుదురు. ఆయురారోగ్యములను, కీర్తిప్రతిష్ఠలను పొందుదురు. నూరు తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు. తుదకు ముక్తినందును. శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతోబాటు దిండును గూడ దానమిచ్చినచో, సుఖనిద్రకు కారణమైన మంచమును, పరుపును, దిండును ఇచ్చుటచే ఆ దాత, అందరకు అన్నివిధముల ఉపకారము చేయువాడై ప్రతిజన్మయందును, సుఖవంతుడు, భోగవంతుడు, ధర్మపరాయణుడై అన్నిటా విజయమునందుచు ఏడు జన్మల వరకు మహావైభవముగ గడిపి తుదకు ముక్తినందును. తనతోబాటు ఏడు తరములవారికిని ముక్తిని కలిగించును. గడ్డి తుంగ మున్నగువానిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీమహావిష్ణువు సంప్రీతితో తానే దానియందు శయనించును. ఊర్ణ , ఉన్ని , గొఱ్ఱె బొచ్చు నీటియందు పడినను తడవకనుండునో అట్లే పర్యంక శయ్యా దానము చేసినవారు. సంసారసముద్రములోనున్నను ఆ వికారములంటని స్థితిని పొందుదురు. అట్టి పర్యంక శయ్యాదానమును చేయలేనివారు కట (చాప) దానమును చేయవచ్చును. శక్తియుండి పర్యంక శయ్యాదానము చేసిన వచ్చునట్టి పుణ్యమే అశక్తులై కట శయ్యాదానము చేసినవారికిని వచ్చును. పడుకొనిన వారికి నిద్రచే శ్రమ , దుఃఖము నశించును. అట్టి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వసుఖములనిచ్చును. రాజా ! వైశాఖమాసమున కంబళి దానము చేసినవానికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవానిని గావించును*.
*ఎండచే పీడింపబడినవానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయమునంది తుదకు ముక్తినందును. లోని తాపమును పోగొట్టి కర్పూరమును దానమిచ్చినచో ముక్తి, ఆనందము కలుగును. దుఃఖములు నశించును. ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పములు దానమిచ్చినచో సర్వజనులను వశపరచుకొన్న మహారాజై చిరకాలము సుఖించును. కుమారులు, మనుమలు మున్నగువారితో సర్వసౌఖ్యములనంది ముక్తినందును. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమాసమున కర్పూర, తాంబూల దానమిచ్చినచో చక్రవర్తియై మోక్షమునందును. చర్మమునకు ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయమునశించి సుఖించును. దుఃఖములు, పాపములు లేకుండ జీవించి ముక్తి నందును. కస్తూరి మున్నగు సుగంధ ద్రవ్యముల నిచ్చినచో నెట్టి బాధలు లేకుండా జీవించి మోక్షమునందును. పద్మమాలను గాని అడవిమల్లెల మాలనుగాని దానమిచ్చినచో చక్రవర్తియై సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తినందును. వైశాఖమున మొగలి, మల్లెపువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని యనుగ్రహమున సుఖ భోగములనంది ముక్తి నందును. పోక చెక్కలను , సుగంధద్రవ్యమును , కొబ్బరి కాయలను దానమిచ్చినచో ఏడు జన్మలవరకు బ్రాహ్మణుడై జన్మించి వేదపండితుడు , ధనవంతుడై యుండి ఏడు తరములవారితో గలసి ముక్తినందును*.
*సద్బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మండపమును కట్టించి ఇచ్చినచో వాని పుణ్యము ఇంతయని చెప్పుటకు మాటలకందనిది సుమా. నీడనిచ్చు మండపము , నీడలోనున్న ఇసుక తిన్నెలు , చలివేంద్రము వీనిని నిర్మించి బాటసారులకు , జనులకు ఉపకారము చేసినవారు లోకాధిపతులగుదురు*.
*మార్గమున తోట , చెరువు , నూయి , మండపము, వీనిని నిర్మింపజేసినవానికి పుత్రులు లేకున్నను ధర్మలోపము కదా యని భయము లేదు. నూయి , చెరువు , తోట , విశ్రాంతి మండపము , చలివేంద్రము , పరులకుపయోగించు మంచి పనులు చేయుట , పుత్రుడు ఇవి ఏడును సప్తసంతానములని పెద్దలు చెప్పుచున్నారు. వీనిలోనేయొకటి చేయకున్నను మానవునకు పుణ్యలోకప్రాప్తి లేదు*.
*సచ్ఛాస్త్రశ్రవణము, తీర్థయాత్ర , సజ్జన సాంగత్యము , జలదానము , అన్నదానము , అశ్వర్థరోపణము (రావి చెట్టును నాటుట) పుత్రుడు అను ఏడును సప్తసంతానములని వేదవేత్తలు చెప్పుచున్నారు. వందలకొలది ధర్మకార్యములను చేసినను సంతానము లేనివానికి పుణ్యలోకప్రాప్తి లేకుండుటచేనతడు పైన చెప్పిన ఏడు సంతానములలో యథాశక్తిగ వేనినైనను ఏ ఒకదానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలోకములనందవచ్చును. పుణ్యపాప వివేకములేని పశువులు , పక్షులు , మృగములు , వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవుటచే పుణ్యలోకప్రాప్తినందవు. కానీ పుణ్యపాప వివేచనాశక్తి కలిగిన మానవులీ సద్ధర్మముల నాచరింపనిచో వారికి పుణ్యలోకములెట్లు కలుగును*.
*ఉత్తమములైన పోకచెక్కలు , కర్పూరము మున్నగు సుగంధద్రవ్యములు కల తాంబూలమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారి పాపములన్నియు పోవును. తాంబూల దాత కీర్తిని ధైర్యమును , సంపదను పొందును. నిశ్చయము , రోగియైనవాడు తాంబూల దానము నిచ్చినచో రోగవిముక్తుడగును. ఆరోగ్యము కలవాడు తాంబూల దానమిచ్చినచో ముక్తినందును. వైసాఖమాసమున తాపహారకమైన తక్రమును(మజ్జిగ) దానమిచ్చినవాదు విద్యావంతుడు , ధనవంతుడు నగును. కావున వేసవి కాలమునందు తక్రదానము తప్పక చేయదగినది సుమా. వేసవికాలమున ప్రయాణము చేసి అలసినవానికి మజ్జిగ నిచ్చిన మరింత పుణ్యమును కలిగించును. నిమ్మపండ్ల రసము ఉప్పు కలిపిన మజ్జిగయైన దప్పిక కలవానికి హితకరముగ నుండును. వైశాఖమాసమున దప్పిక తీరుటకై బాటసారులకు సద్బ్రాహ్మణులకు పెరుగు కుండనిచ్చినచో కలుగు పుణ్యమెంతటిదో నేను చెప్పజాలను. అనంత పుణ్యము కలుగునని భావము. లక్ష్మీవల్లభుడైన మధుసూదనునకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్ఠమైన బియ్యమును దాన మిచ్చినవారు పూర్ణాయుర్దాయమును , అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమునుపొందును. తేజోరూపమైన గోఘృతమును (ఆవునేయి) సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు అశ్వమేధయాగ పుణ్యమునంది తుదకు విష్ణుపదమును చేరుదురు*.
*విష్ణుప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లమును దోసకాయను దానమిచ్చినవారు సర్వపాపములను పోగొట్టుకొని శ్వేతద్వీపమున వసింతురు. పగటి ఎండకు అలసినవానికి సాయంకాలమున చెరకు గడను బ్రాహ్మణునకు దానమిచ్చినచో వానికి గలుగు పుణ్యమనంతము. వైశాఖమాసమున సాయంకాలమున ఎండకు అలసిన బ్రాహ్మణునకు పానకమును దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరును. పండ్లను పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందమును పొందుదురు. దాతకు వాని పితృదేవతల ఆశీస్సులు లభించును. వైశాఖమాసమున పానకముతో బాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వపాపములు హరించును. పుణ్యలోకప్రాప్తి కలుగును. చైత్రమాసమునందలి అమావాస్యయందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో గయాక్షేత్రమున నూరుమార్లు పితృశ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగును. ఆ పానకమున కస్తూరి, కర్పూరము, వట్టివేళ్లు మున్నగువానిని కలిపి చైత్రమాసము నందలి అమావాస్యయందు దానమిచ్చినచో వివిధ రీతులలో చేయవలసిన శ్రాద్ధముల నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజునకు వివరించెను*.
*_వైశాఖ పురాణం నాలుగవ అధ్యాయము సంపూర్ణం_* #మన సంప్రదాయాలు సమాచారం
*_21/04/2026 - వైశాఖ శుద్ధ పంచమి - శ్రీ శంకర భగవత్పాద జయంతి_*
*_శ్రీ శంకరాచార్య జయంతి_*
*_సదాశివ సమారంభాం_*
*_శంకరాచార్య మధ్యమాం_*
*_అస్మదాచార్య పర్యంతాం_*
*_వందే గురు పరంపరాం_*
*హిందూ / భారతీయ ధర్మం మీద దాడి జరిగిన ప్రతిసారీ, ధర్మం తన వైభవాన్ని మర్చిపోయిన ప్రతిసారీ పరమాత్ముడు అనేకమంది మహాపురుషులను ప్రేరేపణ చేసి, కొన్ని సందర్భాల్లో స్వయంగా తానే అవతరించి, ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నాడు*.
*సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి సరిగ్గా 2524 సంవత్సరాల క్రితం, 509 BCE లో వైశాఖ శుద్ధ పంచమి రోజున కర్కాటక లగ్నమందు శివుడి జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు*, *శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా దక్షిణ* *భారతదేశంలోని నేటి కేరళ రాష్ట్రంలో పూర్ణా నది ఒడ్డున ఉన్న*
*కాలడి అనే* *గ్రామములో కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబుతిరి అనే బ్రాహ్మణ వంశంలోని ఆర్యాంబ, శివగురువు అనే పుణ్య దంపతులకు బిడ్డగా, వేద* *ప్రమాణాన్ని నిలబెట్టడానికి, ధర్మ పునః ప్రతిష్ట చేయడానికి పరమశివుడి అంశతో శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యలు అవతరించారు*.
*శంకరులు ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే సన్యాసం స్వీకరించి "చతుర్వేదాలను, పన్నెండు సంవత్సరాల వయస్సులో ప్రస్థానత్రయాది భాష్యాలను రచించారు*. *వేదవేదాంతలను, తత్వశాస్త్రాన్ని (Philosophy) , Metaphysics, Theology మొదలైన ఇతర శాస్త్రాలనుకంఠస్థం చేసారు*. *ఆ సమయంలో భారతదేశంలో బౌద్ధ, జైన మతాలు, నాస్తిక వాదం విపరీతంగా ప్రబలాయి.* *ప్రజలంతా హిందూ ధర్మాన్ని వదిలి, నాస్తికం, చార్వాక మతాల వైపు నడవడం ప్రారంభించారు*. *దాదాపు 90% ప్రజలు సనాతన ధర్మాన్ని విడిచిపెట్టేసారు*. *అలాంటి సమయంలో *శంకరాచార్యుల వారు జనులందరికీ సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని,* *స్వధర్నాచరణను ప్రబోధిస్తూ అవైదిక మతాలను ఖండిస్తూ*
*వారిని ఓడించి, వైదిక ధర్మంలోకి వారిని తీసుకువచ్చారు. ఆ చర్చల సమయంలో వచ్చిందే అద్వైత సిద్ధాంతం*. *యావత్ భారతదేశం పాదచారిగా పర్యటించి, హిందూ ధర్మాన్ని ప్రచారం చేశారు. ధర్మ సంస్థాపన చేశారు*.
*శంకరాచార్యులు కనుక అవతరించి ఉండకపోతే హిందు అనేవాడు గాని, హిందూ ధర్మం కానీ మిగిలి ఉండేవికావు. ఇదంతా ఏ ఒక్క మానవ మాత్రునికీ సాధ్యం కాని పని*.
*ఈయన కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించి 477 BCE లో మహనిర్యాణం చెందారు. తన 32 ఏళ్ళ జీవితకాలంలో అనేక రచనలు చేశారు. జీవుడు, దేవుడు, ఇద్దరూ ఒక్కటే, ఇద్దరికి బేధంలేదు అంటూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ప్రస్థాన త్రయంగా చెప్పబడే భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, కర్మసిద్ధాంతాలకు బాష్యం రాశారు. అనేక స్తోత్రాలు అందించారు. శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య మొదలైన 6 మతాలను స్థాపించారు*. *కలియుగంలో ప్రజల్లో శౌచం తగ్గిపోయిందని, దేవాలయాల్లో ఉన్న దేవాత విగ్రహాల శక్తిని ఇటువంటి మానవసమూహం తట్టుకోలేదని, దేవాతశక్తిని శ్రీ చక్రయంత్రాల్లోకి ప్రవేశపెట్టారు*.
*ఆత్మతత్త్వాన్ని తెలుసుకొన్నవాడు, నేను జడత్వాన్ని కాను, చైతన్యాన్ని అని నిశ్చితమైన జ్ఞానం కలవాడు, అతడు చండాలుడైనా, బ్రాహ్మణుడైనా, అతనే నాకు గురువు. ఇది తధ్యము అంటూ శంకరాచార్యుల వారు ఎలుగెత్తిచాటారు. అలా వచ్చిందే మనీషా పంచకం. జ్ఞాన్మ మార్గాన్ని పునరుద్ధరించిన శంకరులు, కేవలం జ్ఞానభోధకే పరిమితం కాక, అనేకస్తోత్రాలు అందించారు*.
*_చాతుర్మఠాల -పీఠముల స్థాపన_*
*వైదిక ధర్మాన్ని ఎప్పటికి ప్రచారం చేసేవిధంగా భారతదేశం నాలుగు దిక్కుల నాలుగు వేదాలకు ప్రతీకగా నాలుగు మఠాలను*
*_1. దక్షిణ భారతదేశం శృంగేరీలో శారదపీఠం_,*
*_శృంగేరీ మఠము_*
*ఇది దక్షిణామ్నాయ మఠమని, శారదా పీఠమనీ పిలువబడుతుంది. కర్ణాటక రాష్ట్రములోని శృంగేర (శృంగ లేక ఋష్యశృంగ)లో ఈ మఠము స్థాపించబడింది*.
*_2. ఉత్తరమున ఉత్తరాఖండ్లో జ్యోతిర్మఠం_,*
*_జ్యోతిర్మఠము_*
*దీనిని ఉత్తరామ్నాయమనీ, బదరికాశ్రమమనీ కూడా అంటారు. ఈ పీఠ క్షేత్రం బదరికాశ్రమం, పీఠ దేవత నారాయణుడు*.
*_3. తూర్పున పురీలో గోవర్ధన పీఠం,_*
*_గోవర్ధన మఠము_*
*దీనినే పూర్వామ్నాయ మఠము అని అంటారు. ఇది దేశానికి తూర్పున గల పూరీ పట్టణంలో స్థాపించబడింది*.
*_4. పశ్చిమాన ద్వారకలో ద్వారకాపీఠం స్థాపించారు_.*
*_ద్వారకా మఠము_*
*ఈ మఠము శంకరులచే, దేశానికి పశ్చిమంగా, మొదటగా స్థాపించబడింది. దీనిని కాళికామఠమనీ, సిద్ధేశ్వరమఠమనీ, పశ్చిమామ్నాయ మఠమనీ అంటారు*.
*సన్యాసులు, బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరులు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించారనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని, మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుల వ్యవస్థా నైపుణ్యానికి, కార్యనిర్వహణా దక్షతకూ తార్కాణం. హిందూధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి, సుస్థిరంచేయడానికి, వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం, ఎప్పుడొ 2492 సంవత్సరాల క్రితం ఈయన ఏర్పాటు చేసిన పరంపర ఈనాటికి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. అదేకాకుండా సన్యాస ఆశ్రమాన్ని సంస్కరించి పది సంప్రదాయాలను ఏర్పరిచారు*.
*_శంకర మఠము (కంచికామకోటి పీఠము)_*
*సాక్షాత్తూ శంకరాచార్యుడు అద్వైత మత పరిరక్షణ కోసం దేశం నాలుగు దిక్కులా ఏర్పరచిన నాలుగు మఠాలు పైవి. ఇవి కాకుండా, శంకరుడు విదేహ ముక్తి పొందిన కంచి మఠం అయిదవది*.
*నలుగురు శిష్యులను నాలుగు పీఠాలకు అధిపతులను చేసారు.*
*'’కంచికామకోటి '’* *పీఠాన్ని తానే స్వయంగా కొన్ని రోజులు అధిరోహించారు*.
*శంకరులు బోధించిన తత్వం అద్వైతం. అది ఈ దేశపు అఖండత్వాన్ని కాపాడటానికి అక్షయమైన సిద్ధాంతం. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ వంటి శ్రుతి వాక్యాలు అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదికలు. నాలుగు వేదాల నుంచి ఈ నాలుగు వాక్యాలు గ్రహించి బ్రహ్మ స్వరూపాన్ని వివరించడంలో వాటిని సమన్వయించారు. శంకరాచార్యులు జ్ఞానమార్గానికి అత్యంత ప్రాముఖ్యం ఇచ్చారు*.
*ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మ సూత్రాలు అనే ప్రస్థానత్రయానికి భాష్యం రాశారు. వివేక చూడామణి, శివానందలహరి, సౌందర్య లహరి, భజగోవిందం, కనకధారాస్తవం వంటి గ్రంథాల్లో వారి పాండిత్యం వెల్లడవుతుంది. సర్వజనామోదంగా ఉండేలా శివ, విష్ణు, గణపతి, సూర్య, శక్తి రూపాలతో కూడిన పంచాయతన పూజా విధానాలను ప్రవేశపెట్టారు*.
*భారతదేశంలో అందరిని తన వాదన పటిమతో అందరిని ఓడించిం కాశ్మీర్లో ఉన్న సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. వారి తర్వాత అంతటి మేధావి, సూక్ష్మదర్శి ఇంకొకరు రాలేదు, అందువల్ల సర్వజ్ఞపీఠాన్ని శంకరాచార్యుల తర్వాత ఈ 2000 సంవత్సరాలలో ఎవరు అధిరోహించలేదు. కానీ ఇప్పుడా సర్వజ్ఞపీఠం, కశ్మీర్ సరస్వతీ దేవాలాయం ముష్కరులు, దేశద్రోహుల దాడిలో శిధిలమైపోయింది. ఇక్కడొక విషయాన్ని గమనించాలి. శంకరులు సర్వజ్ఞపీఠాన్ని అధిరోహిస్తారనగా, వారితో వాదించడానికి ఒక 8 ఏళ్ళ పిల్లవాడు వచ్చాడు. ఉద్దండులనే ఓడించాను, నీతో వాదించేదేంటీ అని శంకరాచార్యులు అనలేదు. ఆ పసిపిల్లవాడితో కూడా అమోఘమైన శాస్త్రచర్చ జరిపారు. ఇది శంకరుల యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తోంది. అంత గొప్పవారైనా, కాస్తంత అహాకారం కూడా శంకరాచార్యులవారికి లేదు*.
*ఈ భారత ఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు, మతాలూ పుట్టుకొచ్చి, ప్రజలకి సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య. శ్రౌత, స్మార్త క్రియలను సుప్రతిష్టితం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.*
*_శంకరులను భగవత్పాదులు అని ఎందుకు పిలుస్తారు?_*
*మనుష్య శరీరం పొందిన వారికి గొప్ప ప్రయోజనం ఏమిటంటే, భగవంతుని పాదములు పట్టుకోవడం. భగవంతుని పాదములు పట్టుకోవడానికి ఒక నిచ్చెన కావాలి. ఆ నిచ్చెన ఎక్కితే భగవంతుని పాదములు దొరుకుతాయి. ఏ పాదములు నిచ్చెనగా ఉన్నాయో, ఏ పాదములు పట్టుకుంటే భగవంతుని పాదములు పట్టుకోగలమో, ఆ పాదములని భగవత్పాదులు అని పిలుస్తారు. శంకర భగవత్పాదులు అంటే, శంకరుల పాదములు పట్టుకుంటే భగవంతుని పాదములు పట్టుకోవచ్చు. భగవంతుని పాదాలు అందేటట్టు చేయగల మహాపురుషుడు కాబటి ఆయన్ని భగవత్పాదులు అని పిలుస్తారు*.
*ఆదిశంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి, హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు, మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం. శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం. భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మిక వనంగా మార్చి, అడుగడుగునా భక్తిభావ సుమాలను వికసింపజేసిన అపరశంకరులు శ్రీ శంకరాచార్యులవారికి హిందువులంతా సదా ఋణపడి ఉంటారు.*
*ఆదిశంకరులు అవతరణకు ముందు దేశంలో ఏ పరిస్థితులుఉన్నాయో ఇప్పుడు అవే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు శంకరుడు అవతరించారు. ఇప్పుడు హిందువులందరూ తమలో నిద్రాణమై ఉన్న ఆదిశంకరులను జాగృతం చేయాలి. ప్రతి హిందువు శంకరుడు అవ్వాలి. ఆయన మనకు స్ఫూర్తి. ఆయన మనలోనే, మనతోనే ఉన్నారు. అందుకే మనము ఈ ధర్మంలో జన్మజన్మలుగా పుడుతూనే ఉన్నాం. సనాతన ధర్మం మన తల్లి. తల్లి రుణం తీర్చుకో వలసిన సమయం ఆసన్నమైంది*. *సనాతన ధర్మాన్ని తెలుసుకొని, ఆచరించి, శక్తిని సంపాదించి, స్ఫూర్తిని పొంది ధర్మం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలి. ధర్మాన్ని కాపాడు. ధర్మాన్ని విస్మరిస్తే జాతి అధోగతి పాలు కాక తప్పదు. గురువైన శ్రీ ఆదిశంకరాచార్యులు రక్ష సదా మనపై ఉంటుంది. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని అనుసరించు. ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది* #మన సంప్రదాయాలు సమాచారం
*_ఓం శ్రీ గురుభ్యోనమః_*
*_మంగళవారం ఏప్రిల్ 21 2026_*
*_శ్రీ పరాభవ నామ సంవత్సరం_*
*_ఉత్తరాయనం వసంత ఋతువు_*
*_వైశాఖమాసం శుక్లపక్షమి_*
*_తిథి: చవితి ఉ08.39వరకు తదుపరి పంచమి_*
*_వారం:మంగళవారం (భౌమ్యవాసరే)_*
*_నక్షత్రం:కృత్తిక 08.01 వరకు తదుపరి రోహిణి_*
*_యోగం: శోభనం సా 04.52వరకు తదుపరి అతిగండ_*
*_కరణం: భద్ర ఉ08.39వరకు తదుపరి బవ రా 07.25వరకు ఆ తదుపరి బాలువ_*
*_వర్జ్యం: ఉ 11.33-01.02వరకు_*
*_దుర్ముహూర్తం;ఉ 08.28-09.17 మరల రా 11.01-11.47వరకు_*
*_అమృతకాలం: రా 08.29-09.58_*
*_రాహుకాలం: మ 03.00-04.30_*
*_యమగండం/కేతుకాలం :ఉ 09.00-10.30_*
*_సూర్యరాశి:మేషం_*
*_చంద్రరాశి: వృషభం_*
*_సూర్యోదయం: 05.46_*
*_సూర్యాస్తమయం:06.12_*
*_జై శ్రీరాం శంకర భగవత్పాద జయంతి_*
*_సర్వేజనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవతు ఓం శాంతి శాంతి శాంతిః_*
*_శుభమస్తు సంతోషమస్తు_* #మన సంప్రదాయాలు సమాచారం
*_'చక్రం' సినిమాలో 'జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది" అంటూ ఆర్డ్రత నిండిన గొంతుతో గానం చేసిన గాయకులు, డబ్బింగ్ ఆర్టిస్ట్ మరియు మంచి సంగీత సామర్థ్యం ఉన్న సినిమా సంగీత దర్శకులు "శ్రీ " అసలు పేరు కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి గారి వర్ధంతి_*
*_శ్రీ గా తెలుగు ప్రేక్షకులకు_* *_సుపరిచితుడైన_* *_ఆయన అసలు_*
*_పేరు కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి_*. *గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో 1966, సెప్టెంబర్ 13 న శ్రీ జన్మించారు. ప్రముఖ సంగీత దర్శకులైన కె. చక్రవర్తి రెండవ కుమారులు. తమ పక్కింటి అమ్మాయి అరుణను ప్రేమించి పెళ్ళి చేసుకోవడం, కులాలు వేరు కావడంతో వీరి పెళ్ళిని కుటుంబసభ్యులు అంగీకరించలేదు. అందువలన తన కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. తర్వాత కొంతకాలానికి శ్రీ చెల్లెలికి ఆరోగ్యం బాగా లేనపుడు భార్య అరుణ చేసిన సేవలు, కుటుంబసభ్యులతో కలసిమెలసి పోవడం చూసి వీరి వివాహాన్ని ఆమోదించారు*.
.
*మణిపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఇంజినీరింగ్ పట్టభద్రుడైన శ్రీ సంగీతంపై మక్కువతో సినిమా రంగంవైపు అడుగులు వేశారు. రెండు దశాబ్దాల క్రితం జెమినీలో ప్రసారమై ప్రాచుర్యం పొందిన అంత్యాక్షరి ధారావాహిక సంగీత కార్యక్రమానికి సింగర్ సునీత గారితో కలిసి వ్యాఖ్యాతగా ప్రేక్షకులకు చేరువయ్యారు*. *తొలిసారిగా బాలకృష్ణ నటించిన లారీ డ్రైవర్ సినిమాకు రీ రికార్డింగ్ చేశారు. పోలీస్ బ్రదర్స్ ఆయన తొలిచిత్రం. హీరోగా అవకాశాలు చాలామంది ఇస్తానన్నా అవి కాదనుకుని సంగీత దర్శకుడుగానే ఉండిపోయారు. సింధూరం సినిమా వర్క్ జరుగుతున్న సమయంలో దర్శకుడు రవిరాజా పినిశెట్టి రుక్మిణి సినిమాలో హీరోగా చేయమని అడిగారు. ‘‘మ్యూజిక్ అయితే చేస్తాను, యాక్టింగ్ నా వల్ల కాదు’’ అని శ్రీ చెప్పడం జరిగింది.. దాంతో వినీత్ నీ హీరోగా తీసుకొని ఆ సినిమా తీశారు*.
*_సంగీత దర్శకుడుగా...._*
*1993లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన "గాయం" సినిమా శ్రీ కెరీర్కు టర్నింగ్ పాయింట్.* *ఇందులో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని..* *అనే గీతం ఒక ఆణిముత్యం.* *తర్వాత*
*వర్మ దర్శకత్వంలో "మనీ", "మనీ మనీ",* *"అనగనగా ఒకరోజు" సినిమాలకు శ్రీ సంగీతాన్ని అందించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన సింధూరం చిత్రం ఆయన కెరీర్లో మరో పెద్ద విజయం. లిటిల్ సోల్జర్స్, ఆవిడా మా ఆవిడే, అమ్మోరు, నా హృదయంలో నిదురించే చెలి, కాశీ, సాహసం, ఆడు మగాడ్రా బుజ్జీ, చంటిగాడు, నీకే మనసిచ్చాను చిత్రాలకు సంగీతాన్ని అందించారు*.
......
*చిరంజీవి నటించిన అంజి చిత్రంలోని ఒక పాటను స్వరపరిచారు. అప్పూ అనే బాలల చిత్రం ఆయన చివరి చిత్రం. హాయ్రబ్బా పేరుతో స్మితతో కలిసి ప్రైవేటు ఆల్బం రూపొందించారు శ్రీ. 'సాహసం', 'ఆడు మగాడ్రా బుజ్జి', 'చందమామలో అమృతం' చిత్రాలకు పనిచేశాడు. 'అప్పు' అనే చిత్రం విడుదల కావాల్సి ఉంది*
▪️*నేపధ్యగాయకుడుగా......*
*సంగీత దర్శకుడిగానే కాకుండా నేపథ్య గాయకుడిగా, అనువాద కళాకారుడిగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేశాడు శ్రీ. 'చక్రం' సినిమాలో 'జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది' అనే గీతాన్ని, 'అనగనగా ఒక రోజు', 'గాయం', 'అమ్మోరు', 'సింధూరం' తదితర చిత్రాల్లోనూ పాటలు ఆలపించారు. సంగీత దర్శకుడిగా శ్రీ చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రతీ చిత్రంలోనూ ఒక్క పాటైనా ప్రాచుర్యం పొందేది. శ్రోతలు పదేపదే పాడుకునేలా ఆ పాటలు ఉంటాయి. 'అనగనగా ఒక రోజు' చిత్రలో 'మా ఫ్రెండు చెల్లెల్ని కొందరు ఏడిపించారు..' అనే పాట శ్రీ శైలిని చాటి చెబుతుంది. మామూలు మాటల్ని సైతం పాటగా ఎలా చేయొచ్చో ఆ పాటతో చూపించాడు శ్రీ.*
▪️*ప్రజాదరణ పొందిన గీతాలు.....*
*శ్రీ సంగీతాన్ని అందించిన సినిమాల్లో మనీ చిత్రంలోని భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్..., వారెవా ఏమి ఫేసు అచ్చం హీరోలా ఉంది బాసూ... గీతాలు బాగా ఆదరణ పొందాయి. సింధూరం చిత్రంలో అర్ధ శతాబ్ధపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, హాయ్రే హాయ్ జాం పండురోయ్ తోపాటు.. ఐయామ్ వెరీ గుడ్గాళ్ (లిటిల్ సోల్జర్స్), ఓం నమామి అందమా, ఇంటికెళ్దాం పదవయ్యో ( ఆవిడా మా ఆవిడే), చికుబుక్ పోరి (అంజి), నా హృదయంలో నిదురించే చెలి (నా హృదయంలో నిదురించే చెలి) గీతాలు ప్రజాదరణ పొందాయి*. *గాయకుడిగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చక్రం చిత్రంలో ఆయన పాడిన జగమంత కుటుంబం నాది,ఈ చిత్రానికి శ్రీ సంగీతం అందించాడు. ఖడ్గం సినిమాలో సత్యంపలికే హరిచంద్రులం అనే పాటలు ఎనలేని పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టాయి*.
▪️*అనువాద కళాకారుడిగా....*
*అనువాద కళాకారుడిగా కూడా పలు చిత్రాలకు పనిచేశారు శ్రీ. లిటిల్ సోల్జర్స్ సినిమాలో రమేష్ అరవింద్ కు, ఆనందం సినిమాలో జై ఆకాశ్ కు, '143'లో సాయిరాం శంకర్కి డబ్బింగ్ చెప్పారు*.
▪️*శ్రీ సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు....*
*1) పోలీస్ బ్రదర్స్ (తొలి చిత్రం)*
**2) మొగుడుగారు*
*3) లిటిల్ సోల్జర్స్*
*4) నా హృదయంలో నిదురించే చెలి*
*5) మనీ మనీ*
*6) గాయం (1993)*
*7) ఆవిడా మా ఆవిడే*
*8) సింధూరం*
*9) అనగనగా ఒకరోజు*
*10) అమ్మోరు*
*11) చంటిగాడు*
*12) నీకే మనసిచ్చాను*
*13) కాశి (2004)*
*14) సాహసం*
*15) ఆడు మగాడ్రా బుజ్జి*
*16) అప్పు*
*17) చందమామలో అమృతం (2014) చివరి సినిమా*.
.......
*కిడ్నీ సమస్యలతో శ్రీ, 2015 ఏప్రిల్ 18 న హైదరాబాదు కొండాపూర్ లోని స్వగృహంలో కన్నుమూశారు*. #😁Hello🙋♂️
*_🚨🇺🇸🇮🇷🇮🇱 ఇరాన్ యుద్ధం వెనుక ఉన్న అసలు కథపై 'వాల్ స్ట్రీట్ జర్నల్' ఒక సంచలన నివేదికను విడుదల చేసింది..._*
*ముఖ్యమైన విషయాలు:*
*ట్రంప్ గతంలో మధ్యప్రాచ్యాన్ని "రక్తం మరియు ఇసుక" (blood and sand) అని పిలిచేవారు మరియు ఆ ప్రాంతంతో తనకు ఎలాంటి సంబంధం వద్దని అనుకునేవారు*.
*ఆ తర్వాత, నెతన్యాహు సిట్యుయేషన్ రూమ్లో ఇచ్చిన ఒక "ప్రభావవంతమైన ఫిబ్రవరి బ్రీఫింగ్", అలాగే లిండ్సే గ్రాహం పదేపదే చేసిన ఫోన్ కాల్స్తో ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు*.
*ఈ యుద్ధం వెనిజులా లాగే చాలా సులభం అని ఆయన భావించారు*.
*బాంబుల ధాటికి ట్రంప్ "విస్మయానికి" గురయ్యేవారు, ప్రతిరోజూ ఉదయం పేలుళ్లకు సంబంధించిన క్లిప్లను చూసేవారు*.
*కానీ ఈ యుద్ధం గురించి అమెరికన్ ప్రజలను ఒప్పించడానికి ఆయన "పెద్దగా ప్రయత్నించలేదు" మరియు దానికి తనకు తగిన గుర్తింపు రాకపోవడంతో నిరాశ చెందారు*.
*ఈ యుద్ధం వల్ల రిపబ్లికన్ అభ్యర్థుల గెలుపు అవకాశాలు దెబ్బతింటున్నాయని ఆయన సొంత బృందమే మిడ్టర్మ్ పోలింగ్ గణాంకాలను చూపించింది*.
*దీంతో "ఈ సైనిక చర్య విపత్తుగా ఎలా మారవచ్చు" అనే అంశంపై ఆయన వెంటనే ఆలోచించడం మొదలుపెట్టారు*.
*స్ట్రెయిట్ (జలసంధి) గురించి: ఇరాన్ ఆ జలసంధిని మూసివేయక ముందే "లోంగిపోయే అవకాశం ఉంది" అని యుద్ధానికి ముందు ట్రంప్ తన బృందంతో చెప్పారు.*
*కానీ ట్యాంకర్ల రాకపోకలు అంత త్వరగా ఆగిపోవడంతో ఆయన సలహాదారులు "ఆశ్చర్యపోయారు".*
*ఆ తర్వాత, "ఒక డ్రోన్ ఉన్న వ్యక్తి కూడా దీన్ని మూసివేయగలడు" అని చెబుతూ, ఆ జలసంధిని అంత సులభంగా మూసివేయడంపై ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు*.
*మార్చి చివరి నాటికి, F-15 విమానం కూల్చివేయబడక ముందే, చర్చలు ప్రారంభించే మార్గాన్ని వెతకాలని ట్రంప్ తన బృందాన్ని ఆదేశించారు*.
*కాల్పుల విరమణకు వారాల ముందే, ఆయన మనసులో యుద్ధం ముగిసిపోయింది.*
*బహిరంగంగా ఒకదానికొకటి విరుద్ధంగా మాట్లాడుతున్నారని, అప్పటికప్పుడు ఇచ్చే ఇంటర్వ్యూలను ఆపాలని ఆయన సహాయకులు బ్రతిమాలారు.*
*అందుకు ఆయన అంగీకరించారు, కానీ మళ్ళీ వెంటనే రిపోర్టర్లకు కాల్ చేయడం మొదలుపెట్టారు.*
*"ట్రంప్ దగ్గర ఒక ప్రణాళిక ఉందని దేశానికి భరోసా ఇవ్వడానికి" ఏప్రిల్ 1న దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం సూసీ వైల్స్ ఆలోచన*.
*ట్రంప్కు అది చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే ఆయన మాటల్లోనే చెప్పాలంటే, తాను విజయాన్ని ప్రకటించలేనని మరియు యుద్ధం ఎటు దారితీస్తుందో తనకు తెలియదని అన్నారు.*
*ఈ నివేదిక ప్రకారం.. నెతన్యాహు మరియు గ్రాహం మాటలు విని ఒక యుద్ధంలోకి దిగి, అది తప్పని కొన్ని వారాల్లోనే గ్రహించి, మిగిలిన సమయమంతా ఆ వివాదం నుండి బయటపడటానికి ప్రయత్నిస్తూ, ఎవరూ తనకు క్రెడిట్ ఇవ్వడం లేదని అసంతృప్తి చెందిన అధ్యక్షుడి చిత్రాన్ని ఇది ఆవిష్కరిస్తోంది*.
*ఈ యుద్ధం ఒక ఆవేశపూరిత నిర్ణయం. భిన్నమైన లక్ష్యాలు కలిగిన ఒక మిత్రదేశం దీనిని ప్రోత్సహించగా, 'కాదు' అని చెప్పలేని సలహాదారులు సహకరించారు.* *చివరకు ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే వరకు తన తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడని ఒక అహంభావి అయిన అధ్యక్షుడి వల్ల ఇది కొనసాగింది.* #😁Hello🙋♂️
*_'అందవిహీనంగా' ఉన్నాడనే కారణంతో 1000 ఆడిషన్లలో తిరస్కరించబడిన ఒక కుర్రాడు ..._*
*_తన భార్య గర్భధారణ ఖర్చుల కోసం తాను ఎంతో ప్రేమించుకున్న కుక్కను అమ్ముకోవలసి వచ్చింది..._*
*_అదే వ్యక్తి ఆ తర్వాత ప్రపంచంలోనే నంబర్ వన్ యాక్షన్ హీరోగా ఎదిగాడు!_*
*_ఇది సిల్వెస్టర్ స్టాలోన్ కథ—పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా, సంకల్పం బలంగా ఉంటే, అదృష్టం మారడానికి ఎక్కువ సమయం పట్టదని చూపించే ఒక స్ఫూర్తి._*
*_బాల్యం నుంచే పోరాటాలతో నిండిన జీవితం_*
*జూలై 6, 1946న న్యూయార్క్లోని హెల్స్ కిచెన్లో జన్మించిన స్టాలోన్ జీవితం మొదటి నుంచీ సులభంగా లేదు. పుట్టుకతో జరిగిన ఒక వైద్యపరమైన పొరపాటు వల్ల అతని ముఖంలో ఒక వైపు పక్షవాతానికి గురైంది. అతని గొంతు బొంగురుగా ఉండేది మరియు ముఖం విభిన్నంగా కనిపించేది*.
*దీని కారణంగా, అతను తన బాల్యం అంతా ఎగతాళిని, అవహేళనను ఎదుర్కొన్నాడు. అతని తల్లిదండ్రులు విడిపోవడం అతని జీవితాన్ని మరింత కష్టతరం చేసింది. కొన్నిసార్లు అతను అనాథాశ్రమం లాంటి పరిస్థితులలో కూడా జీవించవలసి వచ్చింది.*
*_వెయ్యికి పైగా తిరస్కరణలు_*
*స్టాలోన్ నటుడు కావాలని కలలు కన్నాడు, కానీ అతని రూపం, గొంతు అతని మార్గంలో అతిపెద్ద అడ్డంకిగా మారాయి.*
*వెయ్యికి పైగా ఆడిషన్లు ఇచ్చాడు*
*ప్రతిసారీ తిరస్కరణకు గురయ్యాడు*
*కాస్టింగ్ డైరెక్టర్లు అతన్ని చూసి నవ్వారు*
*పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే, అతను చాలా రాత్రులు బస్ స్టేషన్లోనే నిద్రపోవాల్సి వచ్చింది*.
*తన కుక్కను అమ్మవలసి వచ్చినప్పుడు*
*ఒకానొక సమయంలో అతని భార్య గర్భవతిగా ఉంది, ఇంట్లో తిండికి కూడా డబ్బు లేదు*
*తప్పనిసరి పరిస్థితుల్లో, అతను తన ప్రియమైన బుల్మాస్టిఫ్ జాతి కుక్క "బుట్కస్"ను కేవలం $40కి అమ్మేశాడు*.
*అది అతని జీవితంలో అత్యంత బాధాకరమైన నిర్ణయం.*
*ఒక బాక్సింగ్ మ్యాచ్ అతని తలరాతను మార్చింది*
*1975లో మహమ్మద్ అలీ, చక్ వెప్నర్ల మధ్య జరిగిన పోరాటం అతని జీవితాన్ని మార్చేసింది*.
*ఈ మ్యాచ్ స్ఫూర్తితో, స్టాలోన్ 'రాకీ' సినిమా స్క్రిప్ట్ను కేవలం మూడు రోజుల్లోనే రాశారు*.
*"రాకీ" కోసం కోట్లాది రూపాయల ఆఫర్ను తిరస్కరించారు*
*స్టూడియోకి స్క్రిప్ట్ నచ్చడంతో, వారు $360,000 ఆఫర్ చేశారు*.
*_కానీ షరతు ఏమిటంటే—_*
*సినిమాలో హీరో ఒక పెద్ద స్టార్ అయి ఉండాలి*
*స్టాలోన్ ఖచ్చితంగా నిరాకరించారు.*
*ఎందుకంటే "రాకీ" కేవలం ఒక కథ కాదు... అది ఆయన సొంత జీవితం*.
*ఆ తర్వాత చరిత్ర సృష్టించబడింది.*
*చివరకు, ఈ సినిమా తక్కువ బడ్జెట్తో నిర్మించబడి 1976లో విడుదలైంది*.
*బాక్సాఫీస్ వద్ద $225 మిలియన్లకు పైగా వసూలు చేసింది*
*మూడు ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది*.
*స్టాలోన్ ఉత్తమ నటుడు మరియు ఉత్తమ స్క్రీన్ప్లే విభాగాలలో నామినేషన్లు అందుకున్నారు*.
*"రాకీ" హాలీవుడ్ యొక్క అత్యంత ప్రసిద్ధ చిత్రాలలో ఒకటిగా నిలిచింది*.
*_విజయం తర్వాత అతను మొదటగా ఏమి చేసాడు?_*
*విజయం సాధించిన వెంటనే, స్టాలోన్ మొదట తన కుక్క "బుట్కస్"ను తిరిగి కొనుక్కున్నాడు—*
*_$15,000కు._*
*అంతేకాకుండా, బుట్కస్ "రాకీ" సినిమాలో ఒక చిన్న పాత్రను కూడా సంపాదించింది*
*స్టాలోన్ జీవితాన్ని మార్చే సంభాషణ*
*"నువ్వు ఎంత బలంగా కొట్టావన్నది ముఖ్యం కాదు*
*ఎంత పట్టుదలతో ముందుకు సాగుతున్నావన్నదే ముఖ్యం."*
*_ఇప్పటికీ నెం. 1 యాక్షన్ హీరో_*
*ఈ రోజుకీ, 79 ఏళ్ల వయసులో కూడా, సిల్వెస్టర్ స్టాలోన్ ప్రపంచంలోని గొప్ప యాక్షన్ హీరోలలో ఒకరిగా పరిగణించబడుతున్నాడు*.
*అతని కథ మనకు నేర్పేది—*
*పరిస్థితులు ముఖ్యం కాదు, ధైర్యమే ముఖ్యం*.
*వైఫల్యం అనేది కేవలం ఒక మెట్టు మాత్రమే*.
*_మిమ్మల్ని మీరు నమ్మితే, ఏదీ అసాధ్యం కాదు._* #😁Hello🙋♂️
#😁Hello🙋♂️ వారం రోజులపాటు ఖమ్మం టౌన్, జిల్లా వ్యాప్తంగా మోడిఫై చేసిన సైలెన్సర్లు గల వాహనాలకు, విపరీతమైన శబ్దాలతో, భయభ్రాంతులకు గురిచేస్తూ నడిపే వారికి చెక్ పెట్టే దిశగా, వాహనాలు సీజ్ చేసేలా పోలీస్ శాఖా సమాయత్తం అవుతోంది.*










