Ravi  Talluri
ShareChat
click to see wallet page
@91775
91775
Ravi Talluri
@91775
feelgood
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* *_ఆదివారం ఫిబ్రవరి 15 2026_* *_శ్రీ విశ్వావసు నామ సంవత్సరం_* *_ఉత్తరాయణం శిశిర ఋతువు_* *_మాఘమాసం బహుళపక్షం_* *_తిథి: త్రయోదశి సా 04.38వరకు తదుపరి చతుర్దశి_* *_వారం: ఆదివారం (భానువాసరే)_* *_నక్షత్రం: ఉత్తరాషాఢ రా 07.42వరకు తధుపరి శ్రవణం_* *_యోగం: వ్యతీపాత తె 03.01వరకు తదుపరి వరీయాన్_* *_కరణం:వణిజ సా 04.38వరకు తదుపరి భద్ర తె 05.02వరకు ఆ తదుపరి శకుని_* *_వర్జ్యం; రా 11.54-01.36_* *_దుర్ముహూర్తము: సా 04.24-05.10వరకు_* *_అమృతకాలం:మ 12.50-02.33_* *_రాహుకాలం: సా 04.30-06.00_* *_యమగండం/కేతుకాలం; మ 12.00-01.30_* *_సూర్యరాశి:కుంభం_* *_చంద్రరాశి:మకరం సూర్యోదయం:06.32 సూర్యాస్తమయం: 05.57_* *_ఓం నమో సూర్య నారాయణాయ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు సర్వేజనాః సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవతు_ _ఓం శాంతి శాంతి శాంతిః_* *_శుభమస్తు సంతోషమస్తు_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
*_MAAGHA PURANAM -- 28_* *_28వ అధ్యాయము_* *_విష్ణువు బ్రహ్మ రుద్రాదులకు చేసిన హితబోధ_* *పూర్వము బ్రహ్మ, ఈశ్వరులకు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదము జరిగింది. శివుడు నేను సర్వేశ్వరుడను, పధ్నాలుగు లోకములకు అధిపతిని నేనే అన్నాడు. కాదు, బ్రహ్మదేవుడు ఈ పధ్నాలుగు లోకాలను, సమస్త చరాచర జీవరాశినీ, సృష్టించిన సృష్టికర్తను నేను కనక నేనే గొప్ప అన్నాడు*. *వాదప్రతివాదములు, తర్కమీమాంసలతో వెయ్యేళ్ళు గడిచిపోయాయి. సృష్టి కార్యం అంతా స్తంభించి పోయింది. అప్పుడు శ్రీమహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు*. *బ్రహ్మ, ఈశ్వరులు ఇద్దరూ సమస్త లోకములు ఇమిడి ఉన్న ఆ రూపమును తిలకించి నిశ్చేష్టులైనారు. సప్త సముద్రములు, సమస్త విశ్వము, ప్రకృతి, భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపిస్తున్నాయి. అ విరాట్ రూపుని ఎడమచెవిలో శంకరుడు, కుడిచెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు. ఆ రూపమునకు ఆద్యంతములు లేక సర్వత్రా తానే అయి అనేక వేల బాహువులతో ఉన్నాడు. సమస్త దేవాధిదేవులు, దేవతలు, రాక్షసులు, మునులు అందరు భగవంతుని కీర్తిస్తూ కనపడుతున్నారు*. *నదీనదములు, పర్వతములు, కొండలు, గుట్టలు, జలపాతములు సమస్తము కనపడుతున్నాయి. భీషణమైన వేడి నిట్టూర్పులు వెదజల్లబడుతు కోటి సూర్య కాంతుల వెలుగులలో ప్రకాశిస్తున్నాడు*. *సామాన్యులకు సాక్షాత్కరించని, వీక్షించలేని ప్రకాశముతో ఉన్నాడు. ఆ విరాట్ రూపమునకు మొదలు, చివర ఎక్కడో తెలియడము లేదు. ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు తెలుసుకోవాలని అట్లు తెలుసుకున్న వారే అధికులనీ, బ్రహ్మ, ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు. ఇద్దరు వెంటనే బయలుదేరి వెయ్యేళ్ళు తిరిగి ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక యథాస్థానానికి వచ్చి ఆహా! ఏమి ఇది?* *బ్రహ్మ, ఈశ్వరులైన మేము ఈ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక పోయాము అంటే మనం అధికులము కాదన్నమాట. సమస్తమునకు మూలాధారము, సృష్టి స్థితి లయ కారకుడు, సర్వాంతర్యామి జగములనేలే జగదాధారుడు శ్రీమహావిష్ణువే మనకంటే అధికుడు. పంచభూతములు, సూర్యచంద్రులు, సర్వము ఆ శ్రీమన్నారాయణుడే*. *మనమంతా ఆయన కుక్షిలోని కణములమని నిర్ణయించుకుని శ్రీమహావిష్ణువును స్తోత్రం చేయగా విష్ణువు విరాట్ రూపము వదిలి యథారూపమును ధరించి మీరెంతో కాలమునుండి వాదించు కొంటున్న విషయము తెలుసుకొని మీకు జ్ఞానోపదేశం కలుగుటకై ఈ విరాట్ రూపమును ప్రదర్శించాను. నా విరాట్ రూపముయొక్క ఆది మధ్యాంతములను తెలుసుకొనలేక నిశ్చేష్టులై మీ కలహాన్ని ఆపుచేసారు.* *మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో చెపుతాను వినండి. ఈ సృష్టి సమస్తమునకు మూడు గుణములు నిర్దేశించబడ్డాయి. వీటీనే త్రిగుణములు అంటారు. అవి సత్త్వరజస్తమోగుణములు. మీరు రజస్తమో గుణములు కలిగిన వారు. ఎవరైతే సత్త్వరజస్తమో గుణములు కలిగిఉంటారో వారే గొప్పవారు*. *ఏకాత్మస్వరూపునికి ఆదిలో మూడు రూపములే ఉన్నాయి. అవి సృష్టిస్థితి లయలు. సృష్టికి బ్రహ్మ, స్థితికి నేను, లయమునకు ఈశ్వరుని అధిపతులుగా చేసాను. వీరిని త్రిమూర్తులు అందురు. త్రిమూర్తులు అనువారు ముగ్గురు కాదు ఏక స్వరూపమే. సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపులము అయినాము. మీరు వేరు, నేను వేరు అనునది లేదు*. *అంతా ఏకత్వస్వరూపమే. మన ముగ్గురిలో ఎవరికి పూజ చేసినా ఏకాత్మ స్వరూపునికే చెందుతాయి. త్రిమూర్తులమైన మనలో భేదము ఉండదు. రజస్తమో గుణముల ప్రభావముచే మీరిట్లు ప్రవర్తించారు*. *శాంతము పొంది ప్రవర్తించండి. బ్రహ్మదేవా! నా నాభికమలము నుండి ఉద్భవించావు కదా! నీకును, నాకును భేధము లేదు. ఓ మహేశ్వరా! ఓంకార స్వరూపుడవగు నీ గొప్పతనమును తెలియగోరి నారదుడు ఒకనాడు నీ మహాత్మ్యమును తెలుపమనగా నేను నీయొక్క మహిమను సర్వస్వమును వినిపించాను*. *నాటినుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకమూలకు విస్తరింప చేసాడు. నువ్వు నిర్వికార నిరాకల్పుడవు. శక్తి స్వరూపుడవు, త్రినేత్రుడవు, సర్వేశ్వరుడవు, ఆదిదేవుడవు, ఆత్మ స్వరూపుడవు నువ్వే. భోళా శంకరుడవైన నువ్వు ఇంత పంతము పట్టదగునా? నేనే నీవు, నీవే నేను అందుకే శివకేశవులని భక్తులు భజించి పూజిస్తారు. నిత్య సత్య స్వరూపుడవు. నిత్యానంద రూపుడవు. నిత్య ధ్యాన స్వరూపుడవు. అర్థనారీశ్వరుడవు. నువ్వు నాతో సమానుడవు” అంటూ బ్రహ్మకు, శివునకు జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేసాడు. మాఘమాసమందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడగు ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తులు ఆవుటయే కాక స్వర్గర్హత పొంది సుఖములను పొందుతారు* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - AAHTA ARnT CALEHOAR HFG Co' a TRIMURTI Copyriaht Reerved No /114 Noh CALCUTTA | Ch rpur AdRoor 0DO1 న AAHTA ARnT CALEHOAR HFG Co' a TRIMURTI Copyriaht Reerved No /114 Noh CALCUTTA | Ch rpur AdRoor 0DO1 న - ShareChat
*_అతిధిదేవో భవ_* *ఒక అడవిలో జంట పావురాలు నివసిస్తున్నాయి. ఒకరోజు వేటగాడు ఆడపావురాన్ని బాణంతో కొట్టి చంపాడు*. *అదిచూసిన మగపావురం తన నివాసమైన చెట్టుపై దుఃఖంతో ఉన్నది*. *ఆ సమయంలో గాలివాన వచ్చింది. ఆ వేటగాడు, పావురం ఉన్న చెట్టు క్రిందచేరి చలికి వణుకుతూ, ఆకలితో బాధ పడుతున్నాడు*. *వాన తగ్గగానే, తన నివాసం వద్దకు చేరిన ఆ వేటగానిని తన అతిధిగా భావించి, కొన్ని ఎండుపుల్లలు సేకరించి, మంటచేసి వాడికి వెచ్చదనం కల్పించింది. ఆ వేటగాడు ఆకలితో బాధపడటం చూసిన ఆ పావురం ఆ మంటలో దూకి ,వాడికి ఆహారం గా మారింది.* *తన ఆడ తోడును చంపిన వాడైనా తన నివాసం వద్దకు వచ్చినాడు కనుక వాడిని తన అతిధిగా భావించి తన ప్రాణాలను త్యాగం చేసి మరీ, ఆకలి తీర్చింది ఆ పక్షి.* *ఈ సంఘటనను శ్రీ రాముడు, విభీషణుడు తనను శరణుకోరి వచ్చినపుడు, విభీషణునితో స్నేహాన్ని వ్యతిరేకించిన వానర వీరులతో చెప్పుతాడు... “ఒక పక్షి, తన భార్యను చంపిన వాడు తన నివాసం వద్దకు వచ్చి ఆకలితో బాధ పడుతుంటే అతిధిగా భావించి ప్రాణాలు వదలి ఆకలి తీర్చిందికదా! అటువంటిది మానవుడిని, నేనురక్షణ బాధ్యత కలిగిన క్షత్రియుడను, చక్రవర్తి కుమారుడను, శరణుకోరి వచ్చిన వానిని తిరస్కరించను!” అని వారిని సమాధాన పరచి విభీషణునికి అభయం ఇచ్చి, తన సోదరులలో ఒకనిగా స్థానం ఇచ్చాడు, శ్రీరాముడు*. *ఒకసారి శరణన్నవానిని కూడా రక్షించడమే నా వ్రతం అని ప్రకటిస్తాడు రాముడు*. *”మిత్రునిగా కాకపోయినా, మిత్రభావంతో నన్ను ఆశ్రయించినా, వాని దోషాలను పరిగణనలోకి తీసుకోకుండా రక్షిస్తాను” అంటాడు*. *అతిధిని దైవ భావంతో సత్కరించటం గృహస్తు బాధ్యత, అని శాస్త్రాలు చెప్పుతున్నాయి* #మన సంప్రదాయాలు సమాచారం
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:05
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:15
*_ఓo సర్వాభీష్టప్రదాయినే నమః_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:17
https://www.youtube.com/live/9WcHbWv2ZHU?si=fbXYREk5MdS8-MLb #మన సంప్రదాయాలు సమాచారం
youtube-preview
https://www.youtube.com/live/w7H0iq2wCV8?si=Arvskwoewl46cJQh #మన సంప్రదాయాలు సమాచారం
youtube-preview
*_MAAGHA PURANAM -- 27_* *_27వ అధ్యాయము_* *_ఋక్షక అనే బ్రాహ్మణ కన్య వృత్తాంతము_* *పూర్వము భృగుమహాముని వంశమందు ఋక్షక అను కన్య జన్మించి దిన దినాభివృద్ధిగా పెరుగుతున్నది* *దురదృష్టము కొద్దీ పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయాడు.* *ఋక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావముతో ఇల్లు విడిచి గంగానదీ తీరమున ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభింది.* *చాలా సంవత్సరములు చేయటము వలన అనేక మాఘ మాస స్నాన ఫలము దక్కింది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకుంటూ ప్రాణములు విడిచి పెట్టింది. ఆరోజు వైకుంఠ ఏకాదశి అవడముచే వైకుంఠమునకు వెళ్ళింది. చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు వెళ్ళింది. ఆమె మాఘ మాస వ్రత ఫలము కలిగి పవిత్రురాలు అయినందున బ్రహ్మదేవుడు ఆమెను దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి “తిలోత్తమ” అన్న పేరుతో సత్యలోకమునకు పంపాడు. ఆ కాలంలో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసారు. వారి తపస్సుకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై “మీకేమి కావలయును? కోరుకొనుము” అనగా “స్వామీ! మాకు ఇతరుల వలన మరణము కలుగకుండా ఉండునట్లు వరమిమ్మ” ని వేడుకొన్నారు. బ్రహ్మ అలాగే ఇచ్చానని చెప్పి అంతర్ధానము అయ్యాడు*. *బ్రహ్మదేవుని వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహా గర్వముతో దేవతలను హింసించి, మహర్షుల తపస్సులకు భంగము కలిగిస్తూ, యజ్ఞయాగాది క్రతువులలో మాంసం, రక్తం, వేసి నానాభీభత్సములు చేయసాగారు. దేవలోకముపై దండెత్తి దేవతలందరినీ తరిమివేసారు.* *ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవుని “మహానుభావా! సుందోపసుందులనే రాక్షసులకు మీరు ఇచ్చిన వరములతో గర్వము గలవారై తపశ్శాలురను బాధిస్తూ దేవలోకమునకు వచ్చి మమ్ములను తరిమి చెరసాలలో పెట్టి నానా భీభత్సం చేస్తున్నారు. వారి మరణమునకు ఏదైనా ఉపాయము ఆలోచించమ” ని దేవేంద్రుడు ప్రార్థించాడు. బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమను పిలిచి “అమ్మాయీ! సుందోపసుందులను రాక్షసులకు ఎవరి వలన మరణం కలుగదని వరం ఇచ్చి ఉన్నాను. వర గర్వంతో వాళ్ళు చాలా అల్లకల్లోలం చేస్తున్నారు. నువ్వు వెళ్ళి నీ చాకచక్యంతో వారికి మరణం కలుగు విధముగా ప్రయత్నించు” అని చెప్పాడు.* *తిలోత్తమ బ్రహ్మదేవునకు నమస్కరించి చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుతూ అరణ్యములో ఆ రాక్షస సుందోపసుందులు ఉన్న నివాసమునకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదము, ఆమె మధుర గానము విని సుందోపసుందులు తిలోత్తమును సమీపించారు. ఆమె ఎటు వెళ్ళినా, ఎటు తిరిగినా ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుతూ ఆమెను “నన్ను వరింపుమ” ని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమలాడ సాగారు*. *తిలోత్తమ “ఓ రాక్షసాగ్రేసరులారా! మిమ్ములను పెండ్లియాడుట నాకు ఇష్టమే. మీరు ఇద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి పట్ల ప్రేమతో ఉన్నాను. ఇద్దరినీ వివాహమాడుట సాధ్యం కానిది. నాకు బలవంతులైన వారిని వరించవలెనన్న ఒక కోరిక ఉన్నది. “మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే నేను వరించగలను” అని చెప్పింది*. *తిలోత్తమ మాటలు వారిని ఆలోచింప చేసాయి. నీకంటే నేను బలవంతుణ్ణి అని సుందుడు అంటే, లేదు నేనే బలవంతుణ్ణి అని ఉపసుందుడు అన్నాడు. వాదము పెరిగి పౌరుషం వచ్చి ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకుందాం అంటూ ఘోర యుద్ధానికి తలపడ్డారు*. *గదాయుద్ధము, మల్లయుద్ధము చేసారు. పలురకాల ఆయుధాలతో పోరాడుకున్నారు. చివరిగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తితో మరొకరి కంఠానికి ఖండించు కోవడముతో ఇద్దరూ చనిపోయారు.* *ఇద్దరూ మరణించడముతో దేవతలందరూ సంతోషించారు.* *తిలోత్తమను పలువిధముల శ్లాఘించారు. బ్రహ్మదేవుడు కూడా సంతోషించి “తిలోత్తమా! నీ చాకచక్యంతో సుందోపసుందుల పీడను తొలగించావు*. *దేవతలందరికీ ఆరాధ్యురాలఉ అయినావు. ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితము. ఇకనుండి నీవు దేవలోకములో అందరిచే అధికురాలిగా ఆదరింపబడతావు. నీ జన్మ ధన్యమైనది. వెళ్ళి దేవలోకములో సుఖించు” అంటూ ఆమెను దేవలోకమునకు పంపాడు* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - హహ్ హహ్ - ShareChat
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* *_శనివారం ఫిబ్రవరి 14 2026_* *_శ్రీ విశ్వావసు నామ సంవత్సరం_* *_ఉత్తరాయణం శిశిర ఋతువు_* *_మాఘమాసం బహుళపక్షం_* *_తిథి: ద్వాదశి మ 03.24వరకు తదుపరి త్రయోదశి_* *_వారం: శనివారం (స్థిరవాసరే)_* *_నక్షత్రం: పూర్వాషాఢ సా 06.00వరకు తదుపరి ఉత్తరాషాఢ_* *_యోగం: సిద్ది తె 03.22వరకు తదుపరి వ్యతీపాత_* *_కరణం:తైతుల మ 03.24వరకు తదుపరి గరిజ రా తె 04.32వరకు ఆ తదుపరి వణిజ_* *_వర్జ్యం; రా 02.34-04.17_* *_దుర్ముహూర్తము: ఉ 06.31-08.03వరకు_* *_అమృతకాలం:మ 12.46-02.30_* *_రాహుకాలం: ఉ 09.00-10.30_* *_యమగండం/కేతుకాలం; మ 01.30-03.00_* *_సూర్యరాశి:కుంభం_* *_చంద్రరాశి:ధనుస్సు సూర్యోదయం:06.33 సూర్యాస్తమయం: 05.56_* *_ఓం నమో వెంకటేశాయ శని త్రయోదశి సర్వేజనాః సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవతు_ _ఓం శాంతి శాంతి శాంతిః_* *_శుభమస్తు సంతోషమస్తు_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat