Ravi  Talluri
ShareChat
click to see wallet page
@91775
91775
Ravi Talluri
@91775
feelgood
*_క‌ర్మ‌ఫ‌ల‌మే జ‌న్మ…_!* *_ఒక శరీరంతో చేసిన పాప పుణ్యాలు అదే శరీరంతో అనుభవించటం లేదు. మరో శరీరంతో అనుభవిస్తున్నారు_*.*ఒకడు ఈ జన్మలో ఎన్ని పాపాలు చేసినా పూర్వ జన్మ పుణ్యం వల్ల సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు*. *అతడు ఈ జన్మలో ఎన్ని పుణ్యాలు చేస్తున్నా, పూర్వ జన్మలో చేసిన పాప ఫలితం ఈ జన్మలో అనుభవిస్తూంటాడు*. *ఇదే పునర్జన్మలున్నాయన్న దాన్ని తెలుపుతుంది*. *జీవుడు తన జీవ పరిణామదశలో అనేక జన్మలెత్తుతూ ఉంటాడు. మానవ జన్మలలో స్త్రీగాను, పురుషునిగాను జన్మిస్తుంటాడు*. *ఇక జంతు జన్మల్లో పశు పక్ష్యాది జన్మలు కూడా ఎత్తవచ్చును. కర్మ ఫలితాలను బట్టి చర్యకు ప్రతిచర్యగా ఈ జన్మలు ఏర్పడుతుంటాయి.* *ఆధునిక పరిభాషలో చెప్పాలంటే కిందటి జన్మ యాక్షన్‌కు రియాక్షనే ఈ జన్మ.* *స్త్రీ జన్మ ఎత్తితే వారికి సంబంధించిన ధర్మాలు, పురుషునిగా జన్మిస్తే ఆ ధర్మాలు ఆచరించాల్సి ఉంటుంది*. *ఈ రెండు వర్గాల వారికి శారీరక ధర్మాలు కూడా వేరుగా ఉంటాయి. పునర్జన్మ అంటే సూక్ష్మ శరీరం కొనసాగుతూ స్థూల శరీరాన్ని మరల మరల తెచ్చుకోవడం.* *‘పునరపి జననం పునరపి మరణం’ అనగా మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్లీ మళ్ళీ మరణించడం.* *పుణ్య కర్మల వల్ల సుఖాలు, పాపాల ఫలితంగా దుఃఖాలు వస్తాయన్న విషయం తెలిసిందే.* *అయితే అందుకు విరుద్ధంగా పుణ్యం చేసేవారికి బాధలు, పాపాలు చేసే వారికి సుఖాలు కలగడం అక్కడక్కడ చూస్తుంటాం*. *పుట్టుకతో అంధుడైన వ్యక్తి, ఆగర్భ శ్రీమంతునిగా జన్మించిన వ్యక్తి ఆ జన్మలో ఎప్పుడూ పుణ్యంగాని, పాపంగాని చేసి ఉండడు కదా అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం చెప్పేదే పునర్జన్మ సిద్ధాంతం.* *‘పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ,’* *‘పూర్వ జన్మ కృతం పుణ్యం భోగరూపేణ’ అంటారు* *అంటే పూర్వ జన్మలో చేసిన పాపం రోగ రూపంలోను, గత జన్మలో చేసిన పుణ్యం ఈ జన్మలో సుఖాలకు కారణమవుతుందని దీని అర్థం.* *ఒక శరీరంతో చేసిన పాప పుణ్యాలు అదే శరీరంతో అనుభవించటం లేదు. మరో శరీరంతో అనుభవిస్తున్నారు*. *ఒకడు ఈ జన్మలో ఎన్ని పాపాలు చేసినా పూర్వ జన్మ పుణ్యం వల్ల సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు.& *ఒకడు ఈ జన్మలో ఎన్ని పుణ్యాలు చేస్తున్నా, పూర్వ జన్మలో చేసిన పాప ఫలితం ఈ జన్మలో అనుభవిస్తూంటాడు*. *ఇదే పునర్జన్మలున్నాయన్న దాన్ని తెలుపుతుంది*. *పురాణేతిహాసాల్లోను పునర్జన్మల ప్రస్తావన ఉంది…. అర్జునుడు కన్నప్పగాను, భీముడు మధ్వాచార్యులుగాను జన్మించారని చెప్పేవారున్నారు*. *గజేంద్ర మోక్షం లోని గజేంద్రుడు గత జన్మలో ఒక మహారాజు*. *3,4 సంవత్సరాల వయస్సు పిల్లలు పూర్వ జన్మ విషయాలను వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి*. *కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం తెలిసిన వాడు రాబోయే జన్మలలో మరింత సుఖ భోగాలుండేలాగున అనేక పుణ్య కార్యాలు చేయవచ్చును*. *మనం చేసే ప్రతి పనిలోని (కర్మ) స్పందనలు వాయు మండలంలో నిక్షిప్తమవుతాయి. వాయు మండలంలో బాధామయ స్పందనలు, ఆనందమయ స్పందనలు జనిస్తాయి. దుష్కర్మల వల్ల బాధలు జనిస్తాయి*. *ఈరకంగా కర్మ ఫలితం చర్యకు ప్రతిచర్య రూపం దాలుస్తుంది*. *క్షమాగుణం కలిగిన వారు కర్మ చక్రాన్ని ఆపగల శక్తి కలిగి ఉంటారు*. *పుణ్య కర్మల చేత దేవతలుగా, మిశ్రమ కర్మలచేత మానవులుగా, పాప కర్మల చేత పశు పక్షి క్రిమి కీటకాదులుగా పుట్టడం జరుగుతూంటుందనేది స్థూలంగా కర్మ సిద్ధాంతం.* *కర్మ వల్లనే పుట్టడం, పెరగడం, మరణించడం జరుగుతోంది*. *కర్మయే ఈ సృష్టికి కారణమని తెలుస్తోంది*. *పుణ్యకర్మలు చేసిన వారు దైవ గుణాలు, పాప కర్మలు చేసే వారు ఆసురీ గుణాలు కలిగి ఉంటారు*. *మానవుడు పూర్వ జన్మల్లో చేసిన కర్మలు వ్యర్థం కావు.* *దైవ గుణాలు సంసార బంధం నుంచి విడుదలకు హేతువు అవుతాయి*. *అసురీ గుణాలు జనన మరణాలకు కారణమైన కర్మ బంధాన్ని పటిష్టం చేస్తుంటాయి.* *ఒక జన్మలో ఒకరు ఒక విషయంలో పొందిన శిక్షణ మరు జన్మలో అతని గుణంగా రూపాంతరం చెందుతుంది*. *_అసురీ గుణాలు:_* *కామం…* *అన్ని రకాల దేహేంద్రియ భోగ సంబంధమైన కోరికలను కామం అంటారు.* *క్రోధం…* *క్రోధం అంటే కోపం. దీని వల్ల మనిషి గొప్పతనం సన్నగిల్లుతుంది. బ్రతుకు దుర్భరమవుతుంది. విపరీతమైన కోపం వచ్చిన వానికి, పిచ్చి వానికి తేడా ఉండదు. ఆరోగ్యం క్షీణిస్తుంది*. *లోభం…* *లోభం కలవాడు తనకు ఉన్న దానిని ఎవ్వరికీ ఇవ్వడానికి ఇష్టపడడు, అనగా అతనికి దాన గుణం ఉండదు.* *మోహం…* *మోహం అంటే పుత్ర మిత్ర కళత్రాదులందు, ధన ధాన్య వస్తు వాహనాదుల పట్ల మిక్కుటమైన ప్రేమ. యుక్తాయుక్తాలు ఎరుగని చిత్త వృత్తి*. *మదం…* *ఇది ఎనిమిది విధాలు. అవి కలం, బలం, ధనం, రూపం, యవ్వనం, విద్య, రాజ్యం, తపస్సు*. *మాత్సర్యం…* *ఎందులోనైనా తన కంటె ఇతరులు ఎక్కువగా ఉండటాన్ని ఓర్వలేక పోవటమే మత్సరం*. *రాగము…* *ఎదుట వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఇతరులపై కలిగే ఇష్టం రాగం.* *ద్వేషం…* *ఒకరు తనకు అపకారం చేశారని మరల వారికి అపకారం చేయాలనే చిత్త వృత్తి.* *ఈర్ష్య…* *తనకు మాత్రమే కష్టాలు కలుగుతున్నాయని, ఇతరులకు ఎందుకు కలగటంలేదని వారిపై ఏర్పడే కోపమే ఈర్ష్య*. *అసూయ…* *తనకు మాత్రమే సుఖం కలగాలని ఇతరులకు ఆ సుఖం రాకూడదనే చిత్తవృత్తి.* *దంభము*… *తను చేసే పనులను ఇతరులు మెచ్చుకోవాలనే చిత్తవృత్తిని దంభము అంటారు.* *దర్పం…* *నేను సర్వ విషయాల్లో సమర్థుడనని తనకు సాటి అయిన వాడు ఎక్కడా లేడని భావించే చిత్తవృత్తి (అదే గర్వం)* *అహంకారం…* *అకారణంగా ఇతరులను శిక్షించాలనే తమో గుణం గల చిత్తవృత్తి గలవారిని అహంకారులు అంటారు.* *_ఆసురీ గుణాల్ని తొలగించేందుకు ‘సాధన’ చేయాలి. అప్పుడు ఆ అజ్ఞానం వీడుతుంది. ‘సాధన’లకు గురువు సహకారం అవసరం. శాస్త్రాలు కూడా ఏది చేయాలో, ఏది చేయకూడదో నిర్దేశించాయి. ఇక్కడ శాస్త్ర ఆదేశానుసారం కర్మ చేయాలి_* *_మనిషి మరణానంతరం జీవుడు ఏమౌతాడు? పునర్జన్మ వున్నదా?_* *‘పునర్జన్మ అనేది వున్నది’ అని అంగీకరించడమే సనాతన ధర్మంయొక్క జీవగఱ్ఱ*. *సనాతన ధర్మమునందు వున్నాను అంటే పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించాను అని అర్థం*. *పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించాను అన్నదానికి గుర్తు ఏమిటంటే బొట్టుపెట్టుకున్నాను.* *పునర్జన్మ అన్న మాటకి అర్థం జీవుడు ఈ శరీరాన్ని వదలి ఇంకొక శరీరంలోకి వెళ్తాడు*. *శరీరం ఈశ్వరుడు ఎందుకు ఇస్తాడు అంటే చేసిన పాపాన్ని దుఃఖంగా, పుణ్యాన్ని సుఖంగా అనుభవించాలి*. *శరీరం లేకపోతే పాప ఫలితం ఎలా అనుభవిస్తారు? ఎవరి కాలిమీదో కర్రెట్టి కొట్టాను. వాడు రెండేళ్ళు ఏడ్చాడు*. *ఇప్పుడు ఈ జన్మలో నాకు మోకాళ్ళు నొప్పులు వుండాలి*. *అప్పుడా పాపం మోకాళ్ళు నొప్పులుగా పోయింది. శరీరం వుంటే కదా పోవడం!* *గతజన్మలో ఏదో పుణ్యం చేశాను,* *ఈ జన్మలో సుఖపడాలి*. *ఈ సుఖానికి పుణ్యం కారణం. దుఃఖానికి పాపం కారణం. వచ్చే జన్మలో సుఖపడాలి అనుకుంటే పాపం మానేయాలి*. *ఒక విత్తనం వేసి ఇంకొక పంట కోయడం సాధ్యం కాదు.* *వరి విత్తనాలు వేసి మొక్కజొన్న కావాలంటే కుదరదు. చేసినవి పాపపు పనులు, కావలసినవి సుఖాలు అంటే రావు. పుణ్యం చెయ్యి, సుఖాన్ని కోరుకో!* *కాబట్టి పునర్జన్మ సిద్ధాంతం ఏం చేస్తుందంటే మనిషిని మనిషిగా బ్రతికేటట్లు చేస్తుంది*. *కర్మ చేసే అధికారం మనిషికి ఒక్కడికే. మిగిలిన ప్రాణులకు లేదు. అందుకే మనిషియొక్క ప్రవర్తనని నియంత్రించేది ఏది అని అంటే పునర్జన్మ సిద్ధాంతం*. *ఒకప్పుడు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి దగ్గరికి విదేశాలనుంచి ఒక వనిత వచ్చింది*. *గడపకి అవతల ఆవిడ కూర్చుంది. లోపల మహాస్వామి అభిషేకం చేసి వున్నారు. ఆవిడ బయటినుంచి ఒక ప్రశ్న వేసింది. పునర్జన్మ వున్నది, దానికి కారణము చేసిన పాపపుణ్యములు కారణము అంటారు కదా సనాతనధర్మంలో! నిరూపించడానికి ఏదైనా ఆధారం వున్నదా? అని అడిగింది* *ఆయనేమీ మాట్లాడలేదు. ఒక అరగంట అయిపోయింది. ఆవిడ అలాగే నుంచుంది ఏమైనా చెప్తారేమో నని* *ఆయన ప్రక్కన వున్న అంతేవాసిని పిలిచి అన్నారు “ఈసందు చివరలో ఒక ప్రసూతి వైద్యశాల వుంది. ఈవిడని ఇవాళ మధ్యాహ్నం వెళ్ళమనండి. ఆ వైద్యశాలలో ఎన్ని గదులున్నాయి? ఏ ఏ గదిలో ఎవరు ప్రసవం కోసం వున్నారు? ఏ గదిలో వున్నవాళ్ళు ఏంచేసున్న వాళ్ళు? మరునాటి ఉదయంలోపల వాళ్ళకి మగపిల్లవాడు పుట్టాడా? ఆడపిల్ల పుట్టిందా? ఆ పిల్ల/పిల్లవాడు పుట్టినప్పుడు వాళ్ళెలా భావిస్తున్నారు. ఇవి వ్రాసుకొని నాదగ్గరికి రమ్మనండి జవాబు చెప్తాను” అన్నారు*. *ఆవిడ మరునాడు వచ్చి ఏమీ అడగలేదు. మహాస్వామి వారికి కొంత దూరంలో నేలమీద పడి నమస్కారం చేసి “నాకర్థమైంది, పునర్జన్మ సిద్ధాంతం ఎంత సత్యమైనదో నాకు తెలిసిపోయింది. ఇక మీరు జవాబు చెప్పక్కరలేదు.” అన్నది*. *ఎలా? ఆవిడ అక్కడికి వెళ్ళి యేమి చూసింది. పది గదులున్నాయి. 8 గదులు మామూలువి. 2 గదులు ఏ.సి. వి* *మళ్ళీ ఈ ఎనిమిది గదులలో నాలుగు స్పెషల్ రూమ్స్. నాలుగు మామూలువి. ఆవిడ మరునాటి ఉదయం వరకు పుట్టినటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రుల స్థితి సేకరించింది. ఒకరు జిల్లాకి అధికారి. ఏసి రూములో ఆయన భార్యకి మొట్టమొదటి సంతానం కొడుకు పుట్టాడు. కొన్ని వందలమంది వచ్చి జిల్లా అధికారికి చేతిలో పుష్పగుచ్ఛాలు పెట్టి పళ్ళు పెట్టి ‘అయ్యా మీకు కంగ్రాచ్యులేషన్స్ అండీ మీకు కొడుకు పుట్టాడు’ అంటున్నారు*. *ఇంకొకరికి సామాన్యమైన గదిలో ప్రసవమైనది, శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. వెయ్యి రూపాయలనుకున్నది పదివేలయింది. భర్త చూడడానికి రాలేదు ఎందుకంటే బిల్లు కట్టడానికి కావలసిన డబ్బు అప్పు చేసుకోవడానికి తిరుగుతున్నాడు. ఆయనకీ కొడుకే పుట్టాడు*. *ఇంకొక ఆవిడకి ప్రసవానికి వేళయిపోయింది. ఆవిడ గది కూడా తీసుకోలేదు. వరండాలో బల్లమీద పడుకోబెట్టి పురుడు పోశారు*. *నాలుగిళ్ళల్లో పనిచేసుకొనేటటువంటి వ్యక్తి. పుట్టడానికి ముందే ఎక్కడ పుట్టడానికి అనువుగా వుంటుందో ఎంత భోగకరమైన ప్రదేశంలో పుట్టవచ్చో ముందే నిర్ణయమైపోయిందా?* *అంటే వాడు ఎంత భోగమనుభవించాలి అని నిర్ణయింపబడితే కదూ వాడికి తెలియకపోయినా వాడికి పిల్లవాడిగా వచ్చాడు. గతజన్మలో చేసుకున్నది లేకుండా ఇలా ఎలా పుట్టారు?* *అక్కడే పుట్టేటట్లు చేసినవాడు ఒకడున్నాడు*. *అలా చేసేటప్పుడు వాడి పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ పుట్టించాడు*. *వాడి పాపాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక ఫలితాన్ని కూడా ఇస్తాడు. అందుకే ఆవిడ ఇక మాట్లాడలేదు*. *నాకు అర్థమైపోయింది ప్రసూతి కేంద్రానికి వెళితే పునర్జన్మ సిద్ధాంతం ఎంత గొప్పదో అని.* *కాబట్టి పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం*. *మోక్షం కలగడానికి భక్తితో అంటే ధార్మికమైనటువంటి జీవనాన్ని గడపగా గడపగా అనువైన సమయం చూసి పరమేశ్వరుడు యే కోరికా లేకుండా భక్తితో బ్రతుకుతున్నాడు గనుక చిత్తశుద్ధినిస్తాడు*. *ఆ చిత్తశుద్ధికి పాత్రత అంటారు. నా దగ్గర ఆవుపాలు గోరువెచ్చటివి వున్నాయి. పాలు త్రాగడానికి మీరు ఒక గిన్నె పట్టారు. అది అపరిశుభ్రంగా వుంది. అటువంటి పాత్రలో నేను పాలు పోస్తానా? పాలు విరిగిపోతాయి. వేరేది తెచ్చుకోండి అందులో పోస్తాను అంటారు.* *పాత్రత లేకుండా జ్ఞానమివ్వరు*. *పాత్రత కలగాలంటే చేసిన పుణ్యానికి ఫలితాన్ని అడగకూడదు*. *నేనొక పుణ్యం చేసి ఫలితం కావాలంటే సుఖం క్రింద ఇచ్చేస్తాడు*. *అయిపోయింది ఆ పుణ్యం అక్కడితో పోయింది.* *ఒక పుణ్యం చేసి నాకేఫలితం అక్కరలేదు, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు – ఈశ్వరుడికే ధారపోశాను. పాపం అనుభవించేశాను. అనుభవించడానికి ఇప్పుడు పుణ్యం వుందా? లేదు. అనుభవించడానికి పాపం వుందా? లేదు. ఒకవేళ పాపం వున్నా చిత్తశుద్ధిని ఇస్తాడు. అది పాత్రత అంటారు. అందులో జ్ఞానధార కటాక్షిస్తాడు*. *జ్ఞానధార పోయగానే సంచితం తగలపడిపోతుంది. ఇక అనుభవించడానికి పాపంలేదు, పుణ్యం లేదు. పాపమూ, పుణ్యమూ లేని వాడికి ఇక శరీరమెందుకు? వాడు ఈశ్వరుడియందు ఐక్యమైపోతాడు. అదే మోక్షం*. *బుద్ధుడు తిరిగి రాని విధంగా (పునర్జన్మ అంటూ లేని విధంగా ) గతించాడు కనుక ఆయన్ని సుగతుడనీ, తథాగతుడనీ కూడా పిలుస్తారు*. *మనకు తెలియకుండానే కర్మలను చేస్తున్నాం. ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన గుణం*. *త్రికరణములు:* *3.పనిముట్లు* *1. మనస్సు, 2. వాక్కు , 3. శరీరం, వీటితోనే మనం అనుక్షణం ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాం. ఇవన్నీ కర్మలే.* *_ఇవి 2 రకాలు_*. *1. బైటికి కనిపించేవి*. *2. కనిపించనివి. వాక్కాయాలతో చేసే పనులు కనిపిస్తాయి. మనస్సు తో చేసే పనులు కనిపించవు*. *ఇవి మళ్లీ 2 రకాలు.* *పుణ్యకర్మలు.* *పాపకర్మలు. పుణ్యకర్మలవల్ల సుఖం, పాపకర్మల వల్ల దుఃఖం కల్గుతాయి*. *కర్మ(పనులు) ముగిసిన తరువాత వాటిప్రభావం సూక్ష్మ శరీరం గా* *(మనోబుద్ధిచిత్యహంకారములు)* *ఏర్పడుతుంది. వీటిని కర్మవాసనలు అంటారు.* *బాల్యం లో జరిగిన వాటిని ముసలితనం లో చెప్పడం,* *కొన్ని సార్లు గత జన్మ విషయాలు చెప్పడం వంటివన్నీ ఈ వాసనలే.* *కర్మలను గురించి స్పష్టంగా తెలుసుకోవడం మేధావులకు కూడా సాధ్యం కాదు!* *కర్మలను (పనులు) గురించి చక్కగా తెలుసుకున్నప్పుడే అశుభమైన సంసార వ్యామోహం నుండి బైటపడగలం*. *కర్మను గురించి మాత్రమే కాకుండా అకర్మ, వికర్మలను గురించి కూడా తెలుసుకోవాలి*. *స్థూలంగా కర్మ, అకర్మ, వికర్మలను గురించి తెలుసుకుందాం*… *_1. కర్మ:_* *శాస్త్రవిహితమైనవే* *అంటే శాస్త్రము* *బోధించే కర్మలు*. *2. అకర్మ: ఫలితం* *కోరకుండా అంటే అహంకార మమకారాలను* *వదలి చేసే పని*. *కర్తగా భోక్త గా ఏవిధమైన* *సంబంధం లేకుండా చేసే కర్మ. దీని వల్ల కర్మవాసనలు అంటవు* *3. వికర్మ: శాస్త్రము నిషేధించిన కర్మలు. పాప కర్మలు. అంతేకాకుండా ఒకరికి కర్మ వేరొకరికి వికర్మ కావచ్చు. (వర్ణాశ్రమ ధర్మాలనుబట్టి) అందరికీ వర్తించే వికర్మలూ ఉన్నాయి. అందుకే గీతలో కర్మసిద్ధాంతం అంత లోతుగా అధ్యయనం చేయబడినది*. *మరొక విధంగా కర్మ 3 రకాలు.* *1. సంచిత, 2. ప్రారబ్ధ, 3. ఆగామి*. *1. సంచితకర్మ: ప్రతి జన్మలో కర్మ ఫలాన్ని నిల్వ చేసుకోవడం.* *2. ప్రారబ్ధం : సంచితకర్మ లో కొంత భాగాన్ని అనుభవించడం*. *3. ఆగామి : ఇప్పుడు చేస్తున్న కర్మ ఫలితం రాబోయే జన్మలో అనుభవించడానికి సంపాదించుకోడం.* *మన ధ్యేయమంతా దీనిపై నే ఉండాలి. దీనిని బట్టి రాబోయే జన్మలో మన కష్టసుఖాలు నిర్ణయం చేయబడతాయి. మనం చేసే కర్మలలో గొప్పది అభ్యాసయోగమే.* *అందుకే అభ్యాసయోగికి మాత్రమే పునర్జన్మ లో ఉత్తమ మానవ జన్మ సిద్ధిస్తుంది*. *కర్మ ఫలితం తప్పక అనుభవిచాల్సిందే. మరొక రకంగా కర్మ ఫలం నశించదు*. *అందుకే జ్ఞాని కూడా కర్మలను మానకూడదు. అట్లే కర్మ ఫలం అనుభవించక తప్పదు.* *_కర్మ సిద్ధాంతము:_* *_మూడవ భాగము క్రియ ప్రతిక్రియ అనే శాస్త్రీయ విధానమే కర్మసిదాంతానికి మూలం దీన్ని ఒప్పుకోని వారు హేతువాదవిరోధులు._* *కారణం ఇప్పుడు అనుభవించే వాటికి మూలం వెనుకటి కర్మలే అనడం తప్పు అన్నప్పుడు మరి అవెక్కడినుండి వచ్చినాయి ఊరకే శూన్యంనుండి ఊడిపడవుకదా*. *దీన్ని తర్కశాస్త్రము ‘అకృతాభ్యాగమం’ అనే దోషంగా పేర్కొంటుంది అంటే చేయకుండానే ఫలితం పొందడం అన్నమాట విత్తుకు కారణం చెట్టు! అట్లే చెట్టు కు కారణం విత్తు!! అట్లే తండ్రి కారణం కొడుకు. మళ్ళీ ఆ కొడుకు తన కొడుకుకు కారణం అన్నమాట …* *అందుకే జీవులు చేసే కర్మలు అంతటితోనే నశించవు మరొక రూపంగా మార్పు చందాల్సిందే దీన్ని కాదనడాన్ని“కృతవిప్రనాశము” అనే దోషము గా శాస్త్రం ఖండిస్తుంది. అంటే చేయబడిన కర్మ నశించడం అన్నమాట.* *పుణ్యకర్మలు ఎంత గొప్పవైతే అంత గొప్ప ఫలితాన్నిస్తాయి. అందుకే గీతలో వేదాధ్యయనము యజ్ఞదానతపస్సులు చేసేవారికన్నా అభ్యాసయోగి పొందే ఫలం గొప్పదని పేర్కొన్నారు.ఎందుకంటే అభ్యాసయోగి చేసే ఏకాగ్రతారూపాభ్యాసయోగము సూక్షమైనది మరియు ప్రభావవంతమైనది. కేవలం మనస్సుతో మాత్రమే చేసే అభ్యాసయోగం లోకానికి ఎంతో అభ్యుదయాన్ని కల్గిస్తుంది. అందుకే అభ్యాసయోగికి మాత్రమే పునర్జన్మలో ఉత్తమ మానవజన్మ తప్పక కల్గుతుందని భగవంతుడు నొక్కి చెప్పినాడు* #మన సంప్రదాయాలు సమాచారం
*_VAISAKHA PURANAM -- 07_* *_వైశాఖ పురాణం - 07_* *_7వ అధ్యాయము - జలదాన మహత్మ్యము - గృహగోధికా కథ_* *నారదుని మాటలను వినిన అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి మహర్షీ! వైశాఖమాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖమాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నానని ప్రార్తించెను. అప్పుడు నారదమహర్షి యిట్లనెను. మహారాజా! వినుము మాసవ్రతములన్నిటిలో ఉత్తమమగు వైశాఖమాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటినీయనివారు పశు పక్ష్యాది జన్మముల నందుదురు. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఈ కథ వైశాఖమాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ*. *పూర్వము యిక్ష్వాకురాజ వంశమున హేమాంగుడను రాజు కలడు. అతడు గోదానముల ననేకములగావించెను. భూమియందు రేణువులను లెక్కించుట, నీటిబొట్టులను గణించుట, ఆకాశామునందలి నక్షత్రములిన్నియని లెక్కించుట యెంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము. అనేక యజ్ఞములను చేసెను. గోదానము, భూదానము, తిలదానము మున్నగు దానములను గూడ లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరచెను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్దినందెను. అందరకు సులభముగ దొరుకునది జలము. అది దైవదత్తము సులభము. అట్టి జలమును దానమిచ్చుటయేమని తలచి జల దానమును మాత్రము చేయలేదు. బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునగు గురువు పురోహితుడు. అతడును జలదానము చేయుమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పెను. నీరు అమూల్యమైనది అట్టిదానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును. ఎవరికిని సులభము కాని దానిని దానమిచ్చిన పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చెను. అట్లే యెవరును గౌరవింపని వారిని ఆదరించుటయే యుక్తమని తలచి అంగవైకల్యము కల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవించెను. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింప లేదు గౌరవింపలేదు. అందరును ప్రసిద్దులను, ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాధులు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చేయు వారెవ్వరు? నేను అట్టివారినే గౌరవింతునని అట్టివారిని మాత్రమే గౌరవించెను ఆదరించెను. ఈ విధముగ అపాత్రులకు మాత్రమే దానముల నిచ్చెను*. *ఇట్టి దోషముచే నా రాజు యొకప్పుడును జలదానము చేయకపోవుట వలన చాతక పక్షిగా ముమ్మారు జన్మించెను. ఒక జన్మలో గ్రద్దగను, కుక్కగ నేడుమార్లు జన్మించెను. అటు పిమ్మట మిధిలాదేశమును పాలించు శ్రుతకీర్తి మహారజు గృహమున గోడపైనుండు బల్లిగా జన్మించెను. అచట వ్రాలు కీటకములను భక్షించుచు బల్లియై హేమాంగద మహారాజు జీవనము గడుపుచుండెను. ఈ విధముగ ఎనుబదియేడు సంవత్సరముల కాలముండెను*. *మిధిలాదేశ రాజగృహమునకు శ్రుతదేవమహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్నకాలమున వచ్చెను. మహారాజు అగు శ్రుతకీర్తి ఆ మునిని జూచి సంభ్రమముతో ఆ మునికి యెదురు వెళ్ళి సగౌరవముగ ఇంటిలోనికి దీసికొవచ్చెను. వానిని మధుపర్కము మున్నగువానితో పూజించి వాని పాదములను కడిగి యా నీటిని తన తలపై జల్లుకొనెను. అట్లు జల్లుకొనుటలో తలపై జల్లుకొన్న నీటి తుంపురులు కొన్ని యెగిరి గోడమీదనున్న బల్లిపై దైవికముగా పడినవి. ఆ పవిత్ర జలస్పర్శ కలుగగనే ఆ బల్లికి పూర్వజన్మస్మృతి కలిగి తన దోషమును తెలిసికొని పశ్చాత్తాపము కలిగెను. నన్ను రక్షింపుము నన్ను రక్షింపుమని మానవునివలె ఆ మునిని ప్రార్థించెను. అప్పుడా ముని బల్లి మాటలకు విస్మయపడి ఓ బల్లీ! నీవెందులకిట్లు దుఃఖించుచున్నావు. నీవు యేపని చేసి యిట్టి దశనందితివి? ఇట్లేల అరచుచున్నావు? నీవు దేవజాతివాడవా, రాజువా, బ్రాహ్మణుడవా? నీవెవరవు? నీకీదశయేల వచ్చెనో చెప్పుము. నేను నీకు సాయపడుదునని ప్రశ్నించెను*. *శ్రుతదేవుని మాటలను విన్న బల్లిరూపమున నున్న హేమాంగదమహారాజు మహాత్మా! నేను యిక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగదుడను ప్రభువును. వేదశాస్త్ర విశారదుడను. భూమియందలి రేణువులెన్ని యుందునో, నీటియందు జలబిందువు లెన్నియుండునో, ఆకాశమున నెన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను అసంఖ్యాకముగ దానమిచ్చితిని. అన్ని యజ్ఞములను చేసితిని. చెరువులు మున్నగువానిని త్రవ్వించితిని. సర్వవిధములగు దానములను చేసితిని. చెరువులు మున్నగువానిని త్రవ్వించితిని. సర్వవిధములగు దానములను చేసితిని. ధర్మముగా రాజ్యమును పాలించితిని. నేనెన్ని సత్కర్మల నాచరించినను, ముమ్మారు చాతక పక్షిగను, గ్రద్దగను, యేడుమార్లు కుక్కగను, ప్రస్తుతము బల్లిగను జన్మించితిని. ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై జల్లుకొనుచుండగా కొన్ని నీటితుంపురలు నా పైబడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది. నా పాపభారము తగ్గినట్లనిపించుచున్నది. కాని నేనింకను యిరువది యేడుమార్లు బల్లిగా జన్మించవలసి యున్నట్లుగ నాకు తోచుచున్నది. నాకీవిధమైన బల్లిగా జన్మపరంపరయెట్లు తొలగునాయని భయము కలుగుచున్నది. నేను చేసిన పాపమేమియో నాకీ జన్మయేల కల్గెనో యెరుగజాలను. దయయుంచి నాకీ జన్మలు కలుగుటకు కారణము అయిన పాపమును ఆపాపము పోవు విధానమును చెప్పగోరుచున్నానని ప్రార్థించెను*. *శ్రుతదేవమహాముని హేమాంగదుని మాటలను తన దివ్యదృష్టితో పరిశీలించి యిట్లనెను. రాజా! నీవు శ్రీమహావిష్ణువునకు ప్రియమైన వైశాఖమాసమున జలమునెవనికిని దానమీయలేదు. జలము సర్వజన సులభము. దానిని దానమిచ్చుట యేమి అని తలచితివి. ప్రయాణమున అలసినవారికిని జలదానమైనను చేయలేదు. వైశాఖమాస వ్రతమును గూడ పాటింపలేదు. హోమము చేయదలచినవారు మంత్రపూతమగు అగ్నియందే హోమము చేయవలయును. అట్లుగాక బూడిద మున్నగువాని యందు హోమము చేసిన ఫలమెట్లు కలుగును? అట్లే నీవును యోగ్యులగువారికి దానమీయక అయోగ్యులగువారికి దానముల నిచ్చితివి. అపాత్రులకెన్ని దానము లిచ్చినను ప్రయోజనము లేదు కదా! వైశాఖమాస వ్రతమును చేయలేదు. జలదానమును చేయలేదు. యెంతయేపుగ పెరిగినను, సుగంధాదిగుణములున్నను ముండ్లుకల వృక్షము నెవరాదరింతురు? అట్టి వృక్షము వలన ప్రయోజనమేమి? వృక్షములలో రావిచెట్టు ప్రశస్తమైనది. అందువలన నది పూజార్హమైనది. తులసియు మిక్కిలి పవిత్రమైనదే. ఇట్టి రావిచెట్టును, తులసిని వదలి వాకుడు చెట్టునెవరైన పూజింతురా? అట్టి పూజలవలన ఫలితముండునా? అనాధలు, అంగవైకల్యము కలవారు దయజూపదగినవారు. వారిపై దయను చూపుట ధర్మము. కాని వారు మాన్యులు పూజ్యులు కారు. అట్టివారిని పూజించుట ఫల దాయకము కాదు. వారిపై దయ, జాలి చూపవచ్చును. కాని గౌరవింపరాదు. తపము, జ్ఞ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీమహావిష్ణు స్వరూపులు. అట్టివారినే పూజింపవలయును. వీరిలో జ్ఞానవంతులు శ్రీమహావిష్ణువునకు మిక్కిలి యిష్టమైనవారు. అట్టివారిని పూజించినచో తనను పూజించినట్లుగ భావించి శ్రీహరి వరములనిచ్చును. కావున జ్ఞానులైనవారు సర్వాధికులు, సర్వోన్నతులు అట్టివారిని గౌరవింపక పోవుట వారిని అనగా శ్రీమహావిష్ణువును అవమానించుటయే యగును. ఈ విధముగ చేయుట యిహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించును. మానవుడు పురుషార్థములను సాధింపవలెనన్నచో జ్ఞానుల సేవ, వారిని గౌరవించుట ముఖ్య కారణము. జ్ఞానులు కానివారు, అంధులు - ప్రజ్ఞాజ్ఞాన నేత్రములు లేనివారు. అట్టి అంధుల నెంతమందిని పూజించినను ఫల్ముండునా? గ్రుడ్డివానికేమి కనిపించును? అతడేమి చెప్పగలడు? కావున జ్ఞానహీనులైన వారి నెంతమందిని యెంత పూజించినను, వారిని సేవించినను అవి నిష్ఫలములు, నిష్ప్రయోజనములు. అంతేకాక కష్టములను, దుఃఖములను కలిగించును. పురుషార్థములగు ధర్మార్థ కామ మోక్షములెట్లు సిద్దించును?* *తీర్థములు కేవల జలములు కావు. దేవతలు శిలారూపులు కారు. చిరకాలము తీర్థస్నానము, సేవ చేసినచో శిలారూపముననున్న దైవమును చిరకాలము పూజించినచో వారియనుగ్రహము కలుగును. కాని జ్ఞానులగు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు. ఇష్టఫలప్రాప్తిని కలిగింతురు. కావున జ్ఞానులగు వారిని సేవించినచో వారియుపదేశములను పాటించినచో విషాదముండదు. యిష్టప్రాప్తిచే సంతోషము కలుగును. అంఋతమును సేవించినచో జన్మ, మృత్యువు, ముసలితనము మున్నగువానిని వలని బాధయుండదు. అమృతత్వసిద్ది కలుగును. హేమాంగద మహారాజా! నీవు వైశాఖమాస వ్రతము నాచరింపలేదు. జలదానము చేయలేదు. జ్ఞానులగువారిని సేవింపలేదు. కావున నీకిట్టి దుర్గతి కలిగినది. నీకు యీ వైశాఖమాస వ్రతము నాచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును. దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్యద్వర్తమాన కాలములలోని నీ పాపములను వాని ఫలములను పోగొట్టుకొని విజయము నందగలవు. అని పలికి శ్రుతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపముననున్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖమాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను.* *ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్యరూపమును పొందెను. శ్రుతకీర్తి మహారాజునకు, శ్ర్తదేవమహామునికి నమస్కరించెను. వారి యనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానము నెక్కి పుణ్యలోకములకు పోయెను. దేవతలందరును హేమాంగదుని యదృష్టమును మెచ్చిరి*. *హేమాంగదుడును పుణ్యలోకమున పదివేల సంవత్సరములుండెను. దివ్యలోక భోగములను అనుభవించెను. అటు పిమ్మట యిక్ష్వాకు కులమున కాకుత్స్థ మహారాజుగ జన్మించెను. ఏడు ద్వీపముల భూమిని సజ్జనులు, జ్ఞానులు మెచ్చునట్లు పరిపాలించెను. శ్రీమహావిష్ణువు అంశను పొంది యింద్రునికి స్నేహితుడై యుండెను. కులగురువగు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖమాస వ్రతమును సంపూర్ణముగ ఆచరించెను*. *అందుచేయవలసిన దానధర్మముల నన్నిటిని శ్రద్దాసక్తులతో భక్తి పూర్వకముగ చేసెను. సర్వపాపములను పోగొట్టుకొనెను. దివ్యజ్ఞానము నందెను.* *శ్రీమహావిష్ణువు సాయుజ్యము నందెను. కావున వైశాఖమాస వ్రతము సర్వపాపహరము. అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడును వైశాఖమాసవ్రతమును, వ్రతాంగములగు దాన ధర్మాదులను పాటించి శ్రీహరియనుగ్రహము నందవలెను. అని నారదుడు అంబరీషునకు వైశాఖమాసవ్రత విశిష్టతను వివరించుచు గృహగోధికావృత్తాంతమును వివరించెను*. *_వైశాఖ పురాణం 7వ అధ్యాయం సంపూర్ణం._* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
6️⃣6️⃣ *_శ్రీ మహావిష్ణు పురాణం_* *_(అరవై ఆరవ భాగం)_* *_పరశురామ అవతారం:_* *తండ్రి ఆదేశంతో చంపిన..* *_తల్లి సోదరులను_*. *_తండ్రి ఇచ్చిన వరముతో పరశురాముడు బ్రతికించుకునుట:_* *కార్తవీర్యార్జునుడిని చక్రవర్తిగా అంగీకరించి సమస్త రాజ్యాల రాజులు సామంతులై అమూల్యమైన వస్తువులు కానుకలుగా సమర్పించారు*. *కార్తవీర్యార్జునుడు బలపరాక్రములు ఎదిరించే వారు లేకపోవడంతో అహంకారం, గర్వం వచ్చాయి. రావణుడంతటి వాడినే బంధించి చెఱసాలలో పెట్టాడు. రావణుడితాత పులస్త్యమహర్షి వచ్చి బ్రతిమాలడంతో వదిలి పెట్టాడు*. *చక్రవర్తిని అనుసరిస్తూ భూలోకంలో రాజులు కూడా అహంకార గర్వాలు పొంది క్షత్రియ ధర్మమైన ధర్మ పరిపాలన, ప్రజా రక్షణ వదలి వేశారు. సుఖభోగాలలో మునిగిపోయారు. యజ్ఞయాగాదులు మానివేశారు. గర్వం అహంకారంతో తమకు మంచి చెప్పబోయిన మునులను, బ్రాహ్మణులను అవమానించారు. ఇతర వర్ణాల వారిని బాధలు పెడుతూ కష్టాలు పెట్టసాగారు. రాజు చెప్పినదే చేయాలని, రాజే దేవుడని కొలవమని ప్రజలకు మునులకు చెబుతూ అలా చేయని వారిని బంధించి హింసించ సాగారు*. *క్షత్రియ రాజులను దండించగల, దారిలో పెట్టగల సమర్ధుడైన క్షత్రియుడు దేవతలకు కనపడలేదు. ఎవరి రాజ్యం, ఎవరి స్వార్థం వారిదై పోయింది. బ్రహ్మాది దేవతలు, మహర్షులు మహావిష్ణువు దగ్గరకు వెళ్లి భూమి మీద జరుగుతున్న ధర్మనాశనం ఫలితంగా ఉత్పన్నమయిన లోకసంక్షోభం గురించి చెప్పారు. బ్రాహ్మణులను, మునులను కించపరిచి అవమానిండమే కాకుండా క్షత్రియ రాజులు యజ్ఞయాగాదులు ఆపివేశారు అని విన్నవించారు*. *మహావిష్ణువు తాను భూలోకంలో అవతారం ధరించి ధర్మ పరిరక్షణ చేస్తానని అభయమిచ్చి దేవతలను మునులను పంపివేశాడు. ఋచీక మహర్షి తపస్సు చేసినప్పుడు ఇచ్చిన వరము జ్ఞప్తి చేసుకుని ఋచీక మహర్షి పుత్రుడైన జమదగ్ని మహర్షికి కుమారుడిగా జన్మించదలచాడు. బ్రాహ్మణుడిగా జన్మించినా క్షత్రియ స్వభావము కలిగి దుష్ట శిక్షణ, ధర్మ పరిరక్షణ చేయవచ్చునని జమదగ్ని మహర్షి భార్య రేణుక గర్భంలో ప్రవేశించాడు*. *జమదగ్ని మహర్షికి రేణుకకు అప్పటికే నలుగురు పుత్రులు జన్మించి ఉన్నారు. శ్రీహరి ఐదవ పుత్రుడిగా రేణుకాదేవి గర్భం నుంచి నవమాసాలు అయిన తర్వాత జన్మించాడు. చేతిలో పరశుతోనే జన్మించడం వలన జమదగ్ని మహర్షి పుట్టిన బాలునికి పరశురాముడు అని నామకరణం చేశారు*. *తండ్రి వద్దనే అన్నలతో పాటు పరశురాముడు వేద విద్యలు అభ్యసించాడు. కాలక్రమంలో ధనుర్విద్యాది యుద్ద విద్యలలో ప్రవీణుడయ్యాడు. ప్రతిరోజు పరశుతో అరణ్యం లోకి వెళ్లి యుద్యవిద్యలు అభ్యసించి ఆశ్రమానికి కావలసిన కట్టెలు దర్భలు మొదలైనవి తెచ్చి ఇచ్చేవాడు*. *జమదగ్ని మహర్షి ప్రతిరోజు భగవంతునికి అభిషేక అర్చన పూజలు చేసేవాడు. ఇందుకోసం రేణుక ప్రతిదినము ఆశ్రమం సమీపంలో గల కౌశికి నదికి వెళ్లి స్నానం చేసి తన పాతివ్రత్య మహిమతో ఇసుకతో కుండను చేసి నదీజలాలలను నింపి భర్తకు అభిషేకానికి తెచ్చి ఇచ్చేది. సమయ పాలన పాటిస్తూ రేణుక తెచ్చే నీటితోనే జమదగ్ని మహర్షి అభిషేకార్చనలు చేసేవాడు*. *ఒకరోజు నదీతీరంలో రేణుక కుండ చేయడానికి ఇసుక సేకరించసాగింది. అదే సమయంలో చిత్రరథుడు అనే యక్షుడు తన భార్యతో వచ్చి నదిలో జలక్రీడలు ఆడ సాగాడు. యక్ష దంపతుల మధ్య శృంగార భరితంగా సాగుతున్న జలక్రీడ చూసిన రేణుక మనస్సు చెదిరింది. శృంగార భావం కలిగి మనస్సు నియంత్రణ తప్పడంతో రేణుక ఇసుకతో ఎంత ప్రయత్నించినా కుండను చేయలేక పోయింది. సమయం చాలా వ్యర్థం అయ్యింది*. *జమదగ్ని మహర్షికి ఆగ్రహం వస్తుందని నీరు తేకుండానే ఆశ్రమానికి వచ్చి రిక్త హస్తాలతో భర్త ముందు తల వంచుకుని నిలబడింది*. *జమదగ్ని మహర్షి చంచలమైన మనస్సుతో, నదీజలాలు తేకుండా నిలబడ్డ భార్యను చూసి దివ్య దృష్టితో జరిగింది గ్రహించాడు. “మహర్షి పత్ని మనస్సు శృంగార భావంతో స్థిరత్వం కోల్పోవడం క్షమించరాని నేరము. పాతివ్రత్యం భంగమైంది. మరణమే దానికి దండన” అని ఆగ్రహించి పెద్ద కుమారుడైన రుమణ్వంతుని పిలిచి "మీ తల్లి పాతివ్రత్య దోషానికి పాల్పడింది. తక్షణం ఈమె శిరస్సు ఖండించు" అని ఆదేశించాడు*. *రుమణ్వంతుడు తండ్రి ఆజ్ఞ పాటించి తల్లిని చంపలేకపోయాడు. మౌనంగా తల వంచుకుని నుంచున్నాడు. జమదగ్ని మహర్షి మరింత ఆగ్రహంతో సుషేణ, వసు, విశ్వావసు అనే ముగ్గురు కుమారులను వరుసగా పిలిచి రేణుకను సంహరించమని ఆదేశించాడు.* *వారు కూడా అన్న వలె తల్లి మీద ప్రేమతో ఆజ్ఞ పాటించక అన్న పక్కనే వెళ్లి నిలబడ్డారు*. *జమదగ్ని ఆశ్రమ సమీప అడవిలో ఉన్న తన ఆఖరి పుత్రుడైన పరశురాముని "పరశురామా! వెంటనే రా" అని గట్టిగా పిలిచాడు. "తండ్రీ! ఏమిటి మీ ఆజ్ఞ" అంటూ పరశురాముడు అక్కడ ప్రత్యక్షమైనాడు.* *జమదగ్ని మహర్షి జరిగింది చెప్పి "పాతివ్రత్య దోషానికి పాల్పడిన నీ తల్లిని, తండ్రి ఆజ్ఞను పాటించని నీ అన్లనను తక్షణమే సంహరించు!" అని ఆదేశించాడు*. *తక్షణమే పరశురాముడు తన పరశువుతో తల్లిని, అన్నలను సంహరించి తండ్రి ఆజ్ఞ పాటించాడు*. *జమదగ్ని పరశురాముని పితృవాక్య పాలనకు సంతోషించి వరము కోరుకోమని అన్నాడు*. *పరశురాముడు తండ్రికి నమస్కరించి "తండ్రీ! మీ ఆజ్ఞ పాటించి తల్లిని సోదరులను సంహరించాను. మీ అమోఘమైన తపశక్తితో వారికి పునఃప్రాణదానం చేసి బ్రతికించండి" అని వరం కోరాడు*. *భార్య, సోదరుల శిరస్సు మొండాలు దగ్గరకు చేర్చమని జమదగ్ని మహర్షి చెప్పి తన తపశక్తితో అతికించి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు*. *పునఃజీవితయై పాతివ్రత్య దోషం తొలగి పునీతయైన రేణుకను అర్థాంగిగా జమదగ్ని మహర్షి స్వీకరించాడు*. *పరశురాముడు తల్లికి నమస్కరించి "అమ్మా! తండ్రి ఆజ్ఞను పాటించి నిన్ను వధించడం వలన మాతృహత్యా మహాపాపం పొందాను. ఆ పావ పరిహార్థం నేను తపస్సుకి వెళుతున్నాను. చాలా సమయం పడుతుంది. నీకు అవసరం అయినప్పుడు నన్ను స్మరించి పిలువుము. తక్షణమే వస్తాను. నన్ను క్షమించి తపస్సిద్దికై ఆశీర్వదించు" అని తల్లి రేణుక ఆశీస్సులు తీసుకున్నాడు. తండ్రి జమదగ్ని అనుమతి పొంది తపస్సుకి వెళ్లి పోయాడు* #మన సంప్రదాయాలు సమాచారం
*_Dr.నోరి దత్తాత్రేయుడు_* *_The Renowned Oncologist, USA.-Journey to Fame_* *అమ్మ..* *మాకోసం సర్వం త్యాగంచేసింది.* *_డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు_*. *ఎన్నో క్లిష్టమైన క్యాన్సర్‌లను నయం చేసిన చేయి ఆయనది.* *ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులను క్యాన్సర్‌ బారి నుంచి కాపాడిన తెలుగుతేజం ఆయన.* *అమెరికాలో ఉంటూ క్యాన్సర్‌ చికిత్స విధానాన్ని కొత్త పుంతలు తొక్కించిన డాక్టర్‌ నోరీ చిన్ననాటి జ్ఞాపకాలు... వైద్య వృత్తిలో అనుభవాలు...* *కుటుంబ విషయాలు..* *ఆయన మాటల్లోనే...* *మాస్వస్థలం కృష్ణాజిల్లా, తోట్లవల్లూరు*. *పుట్టింది మంటాడలో.అమ్మ కనకదుర్గ గృహిణి.* *నాన్న సత్యనారాయణ ఉపాధ్యాయుడు. మా ఊరి పక్కనే ఉన్న కురుమద్దాలి ఆశ్రమంలో ప్రవచనాలు చెప్పేవారాయన. ప్రవచనాలు చెబితే వచ్చే డబ్బును ఆయన ఆశ్రమానికే ఇచ్చేసేవారు* *మాకున్న అర ఎకరా పొలాన్ని ఆయన ఆశ్రమానికే రాసిచ్చేశారు.* *కుటుంబానికేదైనా ఆపదొస్తే ఆ దేవుడే గట్టెక్కిస్తాడని నమ్మే మనస్తత్వం ఆయనది*. *శ్రీరామనవమి రోజున పామర్రు దగ్గర కాలువలో స్నానానికెళితే చెప్పా పెట్టకుండా కాలువ లాకులెత్తేయడంతో వరదలో కొట్టుకుపోయారాయన.* *నాన్న దూరమయ్యేప్పటికి నాకు నాలుగేళ్లు. అప్పటికి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం మాది. మేం మొత్తం పదకొండు మంది సంతానం*. *అయిదుగురు అన్నలు, అయిదుగురు అక్కలు. నేనే ఆఖరివాణ్ని. నాన్న పోయాక, మాకు అన్నీ మా అమ్మే అయ్యింది. మా చదువుల కోసం ఆవిడ పడని కష్టం లేదు. చివరికి పరీక్ష ఫీజుకని తన చేతికున్న ఒక్క గాజునూ అమ్మేసింది*. *నేను చిన్నవాణ్ని కావడం వల్ల ఎక్కువకాలం ఆమె పడ్డ కష్టాల్ని దగ్గర్నుండి చూశాను*. *మేం బాగుపడాలని తనసర్వస్వాన్నీ త్యాగం చేసింది*. *అప్పుడే అనుకున్నాను, నేను వృద్ధిలోకి వచ్చాక అమ్మ కోల్పోయినవన్నీ తిరిగి సమకూర్చాలని!* *నేను అమెరికా వెళ్లాక వచ్చిన తొలి జీతంతో ఇండియా వచ్చి అమ్మ కోల్పోయినవన్నీ కొనిపెట్టాను*. *ఆ సమయంలో ఆమె ఆనందానికి అవధుల్లేవు*. *అమ్మ త్యాగానికి తిరిగి ఎంతో కొంత ప్రతిఫలం* *చెల్లించుకోవడం కంటే జీవితానికి కావలసిందేముంటుంది*. *_బసవతారకం_...* *_ఓ మేలి మలుపు!_* *నందమూరి తారకరామారావు సతీమణి బసవతారకం క్యాన్సర్‌ చికిత్స కోసం అమెరికాలో నా దగ్గరకు వచ్చారు.* *ఆవిడకు చికిత్స పూర్తయ్యాక...* *“తెలుగు నాట క్యాన్సర్‌ ఆస్పత్రి ప్రారంభించవచ్చు కదా” అని అడిగారు*. *“కచ్చితంగా ప్రారంభిస్తాను!” అని వాగ్దానం చేశాను*. *ఆ తర్వాత ఎన్టీఆర్‌ భూమి కేటాయించారు. 1988 జూన్‌లో శంకుస్థాపన చేశాం. ఇక్కడ ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి స్థాపించడం వెనుక రెండు ఉద్దేశాలున్నాయి. ఒకటి బసవతారకం గారి కోరిక తీర్చడం. రెండోది... అప్పటికి ఇండియాలో మరీ ప్రాథమిక దశలో కునారిల్లుతున్న క్యాన్సర్‌ చికిత్సలను విప్లవాత్మకంగా మార్చివేయడం*. *కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా ఉండాలని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ హాస్పిటల్‌ పెట్టాం.* *పదేళ్లలో బసవతారకం ఆసుపత్రి ఇండియాలోని పది ఉత్తమ క్యాన్సర్‌ ఆసుపత్రుల్లో ఒకటిగా నిలిచింది*. *అతి తక్కువ సమయంలో టాటా మెమోరియల్‌, అడయార్‌ ఆసుపత్రుల స్థాయిని ఇది అందుకుంది. ప్రస్తుతం బసవతారకం ఆస్పత్రి ఇండియాలో టాప్‌ టెన్‌లో ఉంది.* *అమరావతిలో మరో క్యాన్సర్‌ ఆసుపత్రికి శంకుస్థాపన చేశాం. ఆరేళ్లలో దాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చాను* *_అది నా జీవితాన్ని మలుపు తిప్పింది_.*` *1974లో ఉస్మానియాలో ఎండీ చేస్తున్న రోజులవి. ఆ సమయంలో అమెరికా నుండి ఓ వైద్యుల బృందం వచ్చింది. అప్పటికి రేడియేషన్‌ ఆంకాలజీలో నేను చేస్తున్న పరిశోధన చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు*. *ఆబృందంలోని ఓవ్యక్తి నాకో విజిటింగ్‌ కార్డు ఇచ్చారు.* *ఎప్పుడైనా అమెరికా వస్తే కలవమన్నారు*. *ఆ కార్డు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే... ప్రపంచంలోనే అతి పెద్ద క్యాన్సర్‌ హాస్పిటల్‌గా పేరొందిన “స్లోన్‌ కేటరింగ్‌ మెమోరియల్‌ క్యాన్సర్‌ సెంటర్‌” ఛైర్మన్‌.* *నాపోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ అయ్యాక అమెరికా వెళ్లాను.* *రకరకాల ఆసుపత్రులు తిరిగాను. ఎవరూ ఉద్యోగమివ్వలేదు. చివరికి విజిటింగ్‌ కార్డు పట్టుకుని స్లోన్‌ కేటరింగ్‌ మెమోరియల్‌ క్యాన్సర్‌ సెంటర్‌కి కెళ్లాను. నేను వెళ్లేసరికి ఫెలోషిప్స్‌కు ఎంపికలు అయిపోయాయి. ఎవరైనా చేరకపోతే నాకు అవకాశమిస్తామని చెప్పారు*. *అదృష్టవశాత్తు ఒకరు చేరకపోవడంతో నేను ఆ ప్రతిష్ఠాత్మక ఆస్పత్రిలో ప్రవేశించాను. అక్కడి నుంచి వెనుదిరిగి చూసింది లేదు. పదేళ్లలో ఫెలోషిప్‌ దగ్గర మొదలుపెట్టి అదే ఆస్పత్రిలో ఛైర్మన్‌ హోదా దాకా చకచకా అన్ని మెట్లూ ఎక్కేశాను*. *ఆ తర్వాత న్యూయార్క్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక “కార్నెల్‌ యూనివర్సిటీ” ఛైర్మన్‌గా పదోన్నతిపై వెళ్లాను. అక్కడ ‘300 మంది ప్రముఖ డాక్టర్ల’కు శిక్షణనిచ్చే కార్యక్రమం చేపట్టాను.* *లెక్కలేనన్ని పరిశోధనలు చేశాను*. *ప్రపంచానికి నేనేంటో నిరూపించాను.* *అమెరికాలో వివక్ష ఉండదు*. *నైపుణ్యం* *ఉంటే ఏ స్థాయికైనా వెళ్లొచ్చు*. *_అలా యంత్ర రూపకల్పన_* *హైదరాబాద్‌ ఉస్మానియాలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ అయ్యాక హౌస్‌ సర్జన్‌గా ఎం.ఎన్‌.జె క్యాన్సర్‌ ఆసుపత్రికి వెళ్లాను. అక్కడ రేడియేషన్‌ చికిత్స చేసే విధానం అత్యంత విచిత్రంగా, భయంకరంగా ఉండేది*. *ఒకేసారి ఒకే గదిలో పదిమందికి చికిత్స చేస్తుండేవారు*. *ముప్పై అడుగుల దూరం దాకా రేడియేషన్‌ ప్రభావం ఉంటుంది. నిత్యం దీనికి గురైతే కొన్నాళ్లకే మరణించడం ఖాయం*. *రేడియేషన్‌ చికిత్స బాధ్యత నాకు అప్పగిస్తే చేయను అని తెగేసి చెప్పేశా.* *ఆ రోజే నిర్ణయించుకున్నా. అలాంటి ఆటవిక రేడియేషన్‌ చికిత్సా విధానానికి తెరదించాలని.* *నిజానికి ప్రపంచ వ్యాప్తంగా రేడియేషన్‌ చికిత్సా పద్ధతి అలాగే ఉండేది. పేషెంటుకు, నర్సుకు, డాక్టరుకు రేడియేషన్‌ రేడియో ధార్మిక కిరణాల ప్రభావం ఉండకుండా, స్లోన్‌ మెమోరియల్‌ హాస్పిటల్‌లో పరిశోధన చేసి 1979లో ఒక కంప్యూటరైజ్డ్‌ మెషిన్‌ కనిపెట్టాను.* *దీని వాడకానికి సంబంధించి నియమ నిబంధనలన్నీ నేనే రాశా. ఆ తర్వాత అమెరికాలోని ప్రతి హాస్పిటల్లోనూ ఈ పద్ధతి వచ్చింది. ప్రపంచానికంతా విస్తరించింది. వందశాతం సురక్షితం. క్యాన్సర్‌ నయమయ్యే శాతమూ గణనీయంగా పెరిగింది. అన్ని క్యాన్సర్ల చికిత్సలోనూ ఈ మెషిన్‌ వాడుతున్నారిప్పుడు*. *సంక్లిష్ట క్యాన్సర్‌ కేసుల్ని నయం చేస్తుంటా.* *ప్రపంచంలో విఖ్యాత వైద్యులందరూ మా వల్ల కాదని చేతులెత్తేసిన అతి క్లిష్టమైన క్యాన్సర్లను నయం చేయడంలోనే నాకు మజా ఉంటుంది*. *ఇజ్రాయెల్‌ నుండి ఓ మహిళా నేత దేశవిదేశాలు తిరిగి చాలా ముదిరిపోయిన క్యాన్సర్‌తో నా దగ్గరకొస్తే, ఆవిడకు నయం చేశాను. ఇప్పటికీ భేషుగ్గా జీవించి ఉన్నారామె. ఆ ఇజ్రాయెల్‌ మహిళది అతి పెద్ద కుటుంబం. వాళ్లింట్లో ఏ ఫంక్షన్‌ జరిగినా, ఓ వందమంది దాకా కుటుంబ సభ్యులంతా హాజరవుతారు. నన్ను అదే పనిగా ఇజ్రాయెల్‌ పిలిపించి, ఓ సింహాసనం వేసి, దానిపై కూర్చోపెట్టి... “డాక్టర్‌ నోరి వల్లే నేను బతికున్నా” అని గర్వంగా చెబుతారామె. నాకు విజిటింగ్‌ కార్డు ఇచ్చి, నన్ను అమెరికాలో అత్యున్నత డాక్టర్లలో ఒకరిగా తీర్చిదిద్దిన స్లోన్‌ మెమోరియల్‌ క్యాన్సర్‌ సెంటర్‌ వ్యవస్థాపకుడికి చర్మ క్యాన్సర్‌ వచ్చింది*. *నన్ను వృద్ధిలోకి తెచ్చిన మనిషికే చికిత్స చేసి నయం చేయగలిగే అవకాశం లభించింది. ఇలాంటి సంఘటనలు గర్వంగా ఉంటాయి. నేనెప్పుడూ డబ్బు కోసం ప్రాక్టీస్‌ చేయలేదు. చేసుంటే బోల్డంత సంపాదించుండేవాణ్ణి.* *క్యాన్సర్‌ బాధితుల కోసం కొత్త చికిత్సలు ఆవిష్కరించాలన్న కుతూహలం ఒక్కటే తప్ప, డబ్బు పట్ల ఎప్పుడూ పెద్దగా ఆసక్తి లేదు* *వైద్యుడిగా ఓ అద్భుతం చేసి రోగిని బతికిస్తే వచ్చినప్పుడు లభించే సంతృప్తి అనేది అన్నింటికంటే అత్యున్నతమైనది. అలాంటి సంతృప్తి డబ్బు వల్ల రాదు*. *వీఐపీలు అందరూ నా దగ్గరికే వస్తారు* *క్యాన్సర్‌ చికిత్స కోసం టాలీవుడ్‌, బాలీవుడ్‌ నటులు, రాజకీయనేతలు, అధికారులు ఇలా అందరు వీఐపీలు నా దగ్గరకే వస్తారు*. *1978లో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వస్తే, కొత్త విధానంతో చికిత్స చేశా. అనంతరం ఆయన 18 ఏళ్లు హాయిగా జీవించారు. ఆ తర్వాత నేను ఇండియా వచ్చినప్పుడల్లా నన్ను బెంగళూరులో తన ఇంటికి పిలిపించుకుని చాలా గౌరవంగా చూసుకునేవారు. యశ్‌ చోప్రా భార్యకు మెదడు క్యాన్సర్‌ మూలంగా పక్షవాతం వచ్చింది. లండన్‌లో లాభం లేదని నా దగ్గరకొచ్చారు. చికిత్స చేశాను. మూడు వారాల్లో పక్షవాతం నుండి తేరుకుని, చక్రాల కుర్చీలో వచ్చినావిడ నడుచుకుంటూ వెళ్లిపోయారు. అప్పుడు యశ్‌ చోప్రా డాలర్ల కట్టలు నా టేబుల్‌ మీద ఉంచి ఎంతైనా తీసుకోమన్నారు. మాది సేవా ఆసుపత్రి అని చెప్పాన్నేను*. *నటి శ్రీదేవి అమ్మగారికి పొరపాటు ఆపరేషన్‌ జరిగి, నా దగ్గరకు తీసుకొస్తే చికిత్స చేశాను. ఆ తర్వాత ముంబయి వచ్చినప్పడల్లా శ్రీదేవి ఇంట్లోనే భోజనం చేసేదాకా వదిలేవాళ్లు కాదు. అక్కినేని నాగేశ్వరరావు క్యాన్సర్‌ ముదిరాక నా దగ్గరికొచ్చారు. నేనే చికిత్స చేశా. ఇలాంటి ఉదంతాలకు లెక్కే లేదు.* *పరిశోధనలో ఉన్నా నా భార్య సుభద్ర డాక్టరే. మా అబ్బాయి సతీష్‌.. లా చేసి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అయ్యాడు. అమ్మాయి ప్రియ, ఇన్‌ఫెక్టివ్‌ డిసీజ్‌లో డాక్టర్‌. కుటుంబ సభ్యులందరూ సేవా మార్గంలోనే ఉన్నారు. అదొక సంతృప్తి*. *ప్రస్తుతం నేను క్యాన్సర్‌ పరిశోధనల్లోనే ఉన్నాను. క్యాన్సర్లో ప్రధానం ముందస్తు పరీక్షలు(స్క్రీనింగ్‌). మొబైల్‌ స్క్రీనింగ్‌ విధానాన్ని పరిపుష్టం చేయడానికి కృషి చేస్తున్నాను.* *క్యాన్సర్‌ రాకుండా ఏం చేయొచ్చు- అనే విషయమై తెలుగువాళ్లకోసం ఓ బుక్‌ రాస్తున్నా. ఇన్నేళ్ల నా క్యాన్సర్‌ వైద్య ప్రస్థానంలో నేను చూడని ఫెలోషిప్పులు, అవార్డులు, రివార్డులు, గౌరవాలు లేవు.* *అమెరికాలో రెండు పెద్ద దేవాలయాలు కట్టాను*. *ఈ విశ్వాన్ని ఏదో శక్తి నడుపుతుందని నమ్ముతాన్నేను.మేను దైవ భక్తుణ్ని. అందుకే అమెరికా వెళ్లి వృద్ధిలోకి వచ్చాక న్యూయార్కులో ఒకటి, న్యూజెర్సీలో ఒకటి..* *రెండు దేవాలయాలు కట్టించాను. చాలా పెద్ద దేవాలయాలవి. ఎందరెందరో ఏవేవో కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం భగవంతుడి దగ్గరకు వెళ్లి చెప్పుకొనే వెసులుబాటు కల్పించాననే తృప్తి లభించింది. అదొక ఆధ్యాత్మిక సంతృప్తి!* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:13
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:23
*_24/04/2025 - వైశాఖ శుద్ధ అష్టమి - శ్రీ బగళాముఖి దేవి జయంతి_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:24
https://www.youtube.com/live/OvsiccdP1Cw?si=8WXC8mmVJSeMCo4d #మన సంప్రదాయాలు సమాచారం
youtube-preview
https://www.youtube.com/live/roGye79kEXw?si=q9fGdepGjQRdvFR0 #మన సంప్రదాయాలు సమాచారం
youtube-preview
*ఖమ్మంనకు కృష్ట కటాక్షం - ఇస్కాన్ టెంపుల్‌ కు కేబినేట్ ఆమోదం* • రఘునాథపాలెంలో సుమారు 5 ఎకరాల భూమి కేటాయింపు • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషికి ఫలితం • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు మంత్రివర్గానికి మంత్రి తుమ్మల కృతజ్ఞతలు • ఇస్కాన్ టెంపుల్ నిర్మాణంతో ఖమ్మంలో ఆధ్యాత్మిక వైభవానికి నాంది • మంత్రి తుమ్మల కృషితో రూపుదిద్దుకుంటున్న సమగ్ర సేవా–సాంస్కృతిక వేదిక ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇస్కాన్ (ISKCON) సొసైటీ ద్వారా శ్రీ బలరామకృష్ణ ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రఘునాథపాలెం గ్రామం & మండలం పరిధిలో సుమారు 4 ఎకరాలు 30 గుంటల ప్రభుత్వ భూమిని ఇస్కాన్ సొసైటీకి కేటాయిస్తూ గురువారం మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా ఖమ్మంలో ఆధ్యాత్మిక– సాంస్కృతిక సేవా కేంద్రం ఏర్పాటు దిశగా ముందడుగు పడింది. జి.ఒ. 571 ప్రకారం భూమి కేటాయింపు 14-09-2012 తేదీగల రెవెన్యూ (అసైన్-I) శాఖ జి.ఒ.ఎం.ఎస్. నెం.571 నిబంధనల ప్రకారం, ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువ చెల్లింపుపై ఈ భూమిని కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది. ఆశ్రమం & భజన మందిర్ నిర్మాణం కోసం ఇస్కాన్ సొసైటీ పేరుతో ఈ భూమి వినియోగించబడనుంది. కలెక్టర్ ప్రతిపాదన.... మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్ సమర్పించిన ప్రతిపాదనను తెలంగాణ భూపరిపాలన ప్రధాన కమిషనర్ పరిశీలించి 05-01-2026న ప్రభుత్వానికి నివేదించారు. అనంతరం టి.జి.ఎల్.ఎం.ఎ (తెలంగాణ ల్యాండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ) సమావేశంలో ఈ అంశాన్ని చర్చించి, మార్కెట్ విలువ చెల్లింపుపై భూమి కేటాయింపుకు ప్రభుత్వానికి సిఫారసు చేసింది. క్యాబినెట్ ఆమోదంతో ప్రాజెక్ట్‌కు ఊపిరి... మంత్రిమండలి ఆమోదంతో ఇస్కాన్ టెంపుల్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఖమ్మం నగరానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచే ఈ ప్రాజెక్ట్ త్వరలోనే నిర్మాణ దశలోకి వెళ్లే అవకాశముంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రిమండలి తీసుకున్న ఈ నిర్ణయం ఖమ్మం అభివృద్ధికి తోడ్పడుతుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఖమ్మంలో ఇస్కాన్ మహా ప్రాజెక్టు.... ఖమ్మం నగరానికి ఆధ్యాత్మిక శోభను అందించే ఒక మహోత్తర ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక కృషితో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇస్కాన్ (ISKCON) ఆలయ నిర్మాణం ప్రారంభమవడం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఆలయం భక్తులకు శ్రీకృష్ణ భక్తి మార్గంలో సేవలు అందించడమే కాకుండా గీతా ప్రచారం, సత్సంగాలు, ధార్మిక కార్యక్రమాలకు వేదికగా నిలవనుంది. ఖమ్మం జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘం (ISKCON) ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ఆలయం సాధారణ దేవాలయ నిర్మాణం కాదు—ఇది భక్తి, విద్య, సేవ, గ్రామీణాభివృద్ధి అన్న నాలుగు స్తంభాలపై నిలబడే సమగ్ర ఆధ్యాత్మిక–సామాజిక ప్రాజెక్ట్. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవతో ముందుకు సాగుతున్న ఈ ప్రణాళిక, నగరానికి ఆధ్యాత్మిక గుర్తింపును మాత్రమే కాకుండా సమాజానికి దీర్ఘకాల ప్రయోజనాలను అందించనుంది. ఖమ్మంను ఆధ్యాత్మిక–సేవా కేంద్రంగా మలచే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. ఇస్కాన్ లక్ష్యాలు శ్రీ శ్రీ బలరామ కృష్ణ ఆలయం నిర్మాణం, గోశాల ఏర్పాటు, అన్నదానం కార్యక్రమాలు, యోగా, ధ్యానం మరియు సాత్విక ఆహార అలవాట్ల ద్వారా ఆధునిక యువతను వేద జీవన విధానానికి అనుసంధానం చేయడం, పాఠశాల విద్యార్థుల కోసం భగవద్గీత బోధన – ప్రతి ఆదివారం తరగతులు మరియు వేసవి శిబిరాలు నిర్వహించడం, మహిళా సాధికారత, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, గిరిజన సంక్షేమం. శ్రీ శ్రీ బలరామ–కృష్ణ ఆలయం: భక్తి, వాస్తు, సంస్కృతి సమ్మేళనం... ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన ప్రత్యేక ఆకర్షణగా నిలిచే శ్రీ శ్రీ బలరామ–కృష్ణ ఆలయం వేద శిల్పకళా సౌందర్యాన్ని ప్రతిబింబించేలా నిర్మాణం కానుంది. విశాల ప్రాంగణం, నిత్య పూజలు, భజనలు, ఉత్సవాలతో ఇది భక్తులను ఆకర్షించనుంది. నగర జీవన ఒత్తిడిలో మానసిక ప్రశాంతత కోరుకునే వారికి ఇది ఆధ్యాత్మిక ఆశ్రయంగా మారే అవకాశం ఉంది. పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఖమ్మం ఆధ్యాత్మిక శోభతో విరాఝిల్లనుంది. దీంతో పర్యాటక రంగాన్ని కూడా ప్రోత్సహించే అవకాశముంది. గోశాల: సంస్కృతి పరిరక్షణతో పాటు జీవ వైవిధ్యానికి మద్దతు... గోశాల ఏర్పాటు ద్వారా గోసంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం మాత్రమే కాదు, సాంప్రదాయ భారతీయ వ్యవసాయ–ఆహార వ్యవస్థలను ప్రజలకు అనుసంధానం చేయాలనే లక్ష్యం ఉంది. గో-ఉత్పత్తుల వినియోగం, ఆర్గానిక్ వ్యవసాయానికి అనుసంధానం ద్వారా రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపించవచ్చు. ఇది ఆర్థికంగా కూడా స్వయం సమృద్ధికి దోహదం చేయగలదు. అన్నదానం: ఆకలి నివారణ నుంచి సామాజిక సమానత్వం వరకు... నిత్య అన్నదానం కార్యక్రమాలు కేవలం దాతృత్వ చర్యగా కాకుండా, సమాజంలో ఆకలి నిర్మూలనకు ఒక వ్యవస్థీకృత ప్రయత్నంగా ఉంటాయి. నగరంలో వలస కార్మికులు, నిరుపేదలకు ఇది ఆధారంగా మారే అవకాశం ఉంది. అన్నదానం ద్వారా మానవతా విలువలు బలపడతాయి, సమాజంలో అనుబంధం పెరుగుతుంది. ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం పెట్టడమే ఈ అన్నదాన సేవ ప్రధాన ఉద్దేశం. యువతకు యోగా–ధ్యానం: ఆధునిక ఒత్తిడులకు వేద పరిష్కారం... ప్రస్తుత యువత ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, చెడు వ్యసనాలు, ఆధునిక జీవన శైలి సమస్యలకు యోగా, ధ్యానం, సాత్విక ఆహారం వంటి వేద పద్ధతుల ద్వారా పరిష్కార మార్గాలు చూపించాలనే లక్ష్యం ఉంది. వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, నైతికత—ఈ మూడు అంశాల్లో యువతను బలపరచడంలో ఈ శిక్షణ కీలక పాత్ర పోషించగలదు. విద్యార్థులకు భగవద్గీత బోధన: విలువలతో కూడిన విద్యా దిశ.... ప్రతి ఆదివారం భగవద్గీత తరగతులు, వేసవి శిబిరాల ద్వారా విద్యార్థుల్లో చిన్న వయసులోనే ఆధ్యాత్మికతను పెంపొందిచడం, నైతికత విలువలు, బాధ్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందించే ప్రయత్నం జరుగుతుంది. పాఠశాల విద్యకు తోడు జీవన విలువలను నేర్పే ఈ కార్యక్రమాలు భావితరాలకు దిశానిర్దేశం చేస్తాయి. మహిళా సాధికారత: ఆధ్యాత్మికతతో ఆత్మవిశ్వాసం... మహిళల సామాజిక, ఆర్థిక, మానసిక అభివృద్ధికి ఆధ్యాత్మిక విలువలను జోడించడమే ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత. స్వయం సహాయక సమూహాలు, శిక్షణ కార్యక్రమాలు, నైతిక విద్య ద్వారా మహిళలు కుటుంబం–సమాజంలో మరింత ప్రభావవంతమైన పాత్ర పోషించేలా చేయడమే లక్ష్యం. సహజ వ్యవసాయం: రైతులకు ప్రత్యామ్నాయ మార్గదర్శనం... రసాయనాల వినియోగం తగ్గించి సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రైతుల ఖర్చులు తగ్గించే దిశగా అవగాహన కల్పించనున్నారు. గోశాల, సహజ వ్యవసాయం పరస్పరం అనుసంధానమై స్థిరమైన వ్యవసాయ మోడల్‌గా మారే అవకాశముంది. గిరిజన సంక్షేమం: అట్టడుగు వర్గాలకు అభివృద్ధి దిశ... గిరిజన ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, పోషణ, ఆధ్యాత్మిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యం ఉంది. ప్రధాన జన స్రవంతిలోనికి వారిని తీసుకురావడంలో ఈ కార్యక్రమాలు కీలకంగా నిలవవచ్చు. ఖమ్మానికి కొత్త రూపు: ఆధ్యాత్మిక–సేవా హబ్‌గా రూపాంతరం.... ఖమ్మంలో ఇప్పటికే ఒక పక్క అల్లీపురంలో టిటిడి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణం మరొపక్క రఘునాథపల్లిలో ఇస్కాన్ ద్వారా శ్రీ బలరామ కృష్ణ దేవాలయ నిర్మాణం ప్రాజెక్ట్ లు పూర్తి స్థాయిలో అమలు అయితే, ఖమ్మం జిల్లా ఒక ఆధ్యాత్మిక–సేవా కేంద్రంగా ఎదగవచ్చు. భక్తి, విద్య, సేవల సమన్వయంతో ఇది రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందే అవకాశముంది. స్థానిక ఆర్థిక వ్యవస్థకు, పర్యాటక రంగానికి కూడా ఇది ఊతమివ్వగలదు. ఇస్కాన్ టెంపుల్ నిర్మాణం ఖమ్మానికి కేవలం ఆధ్యాత్మిక కేంద్రాన్ని మాత్రమే కాకుండా, సమాజంలోని విభిన్న వర్గాల సమగ్ర అభివృద్ధికి దోహదపడే దీర్ఘకాలిక ప్రణాళికగా నిలుస్తోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో ప్రారంభమైన ఈ యత్నం, అమలులోనూ అదే వేగం కొనసాగితే ఖమ్మం భవిష్యత్తుకు కొత్త దిశను చూపనుంది. #మన సంప్రదాయాలు సమాచారం