Ravi  Talluri
ShareChat
click to see wallet page
@91775
91775
Ravi Talluri
@91775
feelgood
https://youtu.be/s4vdMp6hmnw?si=UIQJ76OzSaNr54Gj #మన సంప్రదాయాలు సమాచారం
youtube-preview
*_"#రిప్లై_ఇచ్చే_ముందు 3 సెకన్లు_* *_ఆగు సోదరా ⏱️"_* *_నాకు అర్థమైంది ఒక్కటే. #గెలిచినోడు ఎప్పుడూ ఫాస్ట్‌గా మాట్లాడడు. ఫాస్ట్‌గా ఆలోచిస్తాడు._* *_చేప ఎందుకు గాలానికి దొరకదు_*. *_ఎర చూడగానే లొట్టలేయదు. 3 సెకన్లు ఆగుతుంది_*. *_వాసన చూస్తుంది. దాటిపోతుంది._* *_నీ లైఫ్‌లో "#3సెకన్లరూల్" పెట్టాల్సిన 4 చోట్లు:_* *_1. వాట్సాప్/FBలో గొడవ స్టార్ట్ అయినప్పుడు..._* *ఎవడో నిన్ను తిట్టాడు. వేలు టైప్ చేయడానికి దురద పెడుతుంది*. *ఆగు.ఫోన్ పక్కన పెట్టు. మంచినీళ్లు తాగు. 3 నిమిషాలు తర్వాత చూడు*. *"వీడి కోసమా నేను టైప్ చేసేది" అనిపిస్తుంది. Delete కొట్టేస్తావ్. BP కంట్రోల్.* *2. ఇంట్లో ఆవిడ ఫైర్ అయినప్పుడు* *"మీకసలు బుద్ధి లేదు" అంది. నువ్వు వెంటనే "నీకే లేదు" అంటే ఇల్లు యుద్ధభూమి.* *ఆగు. 3 సెకన్లు. ఊపిరి తీసుకో. "సరే, కాసేపట్లో మాట్లాడుకుందాం" అని లేచిపో*. *హాల్‌లోకి వచ్చి న్యూస్ పెట్టుకో*. *అరగంట తర్వాత ఆమే టీ తెస్తుంది. కేసు క్లోజ్.* *3. ఆఫీస్‌లో బాస్ కెలికినప్పుడు* *మీటింగ్‌లో అందరి ముందు "ఇదేం వర్క్" అన్నాడు. ఈగో దెబ్బతింది.* *ఆగు. 3 సెకన్లు. లేచి ఎదురు మాట్లాడితే మెమో పక్కా.* *నవ్వి "చెక్ చేసి రిపోర్ట్ ఇస్తా సార్" అను. వాడి బ్యాటరీ డౌన్. నువ్వు సేఫ్.* *4. రోడ్డు మీద ఎవడైనా హారన్ కొట్టి తిట్టినప్పుడు*. *వెంటనే బండి ఆపి వెనక్కి తిరిగితే పోలీస్ స్టేషన్,* *హాస్పిటల్ రెండిట్లో ఒకటి గ్యారెంటీ.* *ఆగు. 3 సెకన్లు. లెఫ్ట్‌కి తీసి పోనివ్వు. 10 సెకన్ల లేట్ తప్ప ప్రాణం దక్కుతుంది*. *_మా నాన్న లాజిక్:_* *"ఉడుకు నీళ్లలో చెయ్యి పెడితే కాలుతుంది రా. 3 సెకన్లు ఆగి చూస్తే ఆవిరి తెలుస్తుంది."* *మనుషుల మాటలు కూడా ఉడుకు నీళ్లే సోదరా. డైరెక్ట్‌గా దూకకు*. *_#Practical_Hack:_* *ఎప్పుడైనా రియాక్ట్ అవ్వాలనిపిస్తే ఫోన్‌లో స్క్రీన్‌షాట్ తీసుకో*. *టైప్ చేసిన మెసేజ్‌ని Send కొట్టకుండా సేవ్ చేసుకో. 1 గంట తర్వాత చదువు.* *90% టైమ్ "థాంక్స్ గాడ్ పంపలేదు" అంటావ్.* *So Be Like The Fish.* *గాలం = ఇన్‌స్టంట్ రియాక్షన్.* *3 సెకన్లు ఆగు.* *వాసన చూడు. సేఫ్‌గా ఈదుకుంటూ పో.* *సముద్రం అంతా నీదే.* *నీ లైఫ్‌లో "3 సెకన్లు ఆగి" బతికిపోయిన సీన్ ఏదైనా ఉందా?* *కామెంట్‌లో చెప్పు. నీ 3 సెకన్లు ఇంకొకడి 3 ఏళ్లు కాపాడొచ్చు.* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - 1రిఫ్లె ఇచ్చే ముందు ஸ సిసెకనుఆగు ನಐದರಾ @* 1రిఫ్లె ఇచ్చే ముందు ஸ సిసెకనుఆగు ನಐದರಾ @* - ShareChat
*_కేజ్రీ వాదనలు అనూహ్యం..అపూర్వం!_* *_సేకరణ_* *ఢిల్లీ హైకోర్టులో అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన వాదనలు సాధారణ విషయం కాదు. భారత ప్రజాస్వామ్యంలో ఇది ఒక కీలక మలుపుగా నిలిచిపోతుంది. న్యాయమూర్తుల పక్షపాతం, నిష్పాక్షికత గురించి చర్చలు ఎప్పుడు వచ్చినా, ఆయన వాదనలు గుర్తుకువస్తాయి*. *తనకు, తన పార్టీకి న్యాయవ్యవస్థపై గౌరవం, విశ్వాసం ఎప్పటికీ ఉందని, అయితే తాను చేసిన ఈ రిక్యూసల్‌ (recusal) అభ్యర్థనకు బలమైన 10 కారణాలు ఉన్నాయని అన్నారు. మరోవైపు అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన రిజాయిండర్‌ను రికార్డుల్లోకి తీసుకోవడానికి ఢిల్లీ హైకోర్టు సోమవారం అంగీకరించింది.* *జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ఎదుట తన వాదనలు వినిపించినప్పుడు, కేజ్రీవాల్‌ ప్రశాంతంగా వ్యవహరించారు. పూర్తిగా ప్రొఫెషనల్‌గా మాట్లాడారు. అత్యంత గంభీరమైన అనుమానాలను కూడా ఎంతో జాగ్రత్తగా, తగిన మాటలతో వ్యక్తపరిచారు. ఒక్కసారి కూడా న్యాయవ్యవస్థను అవమానించేలా మాట్లాడలేదు*. *న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేయని ఒక రాజకీయ నాయకుడి నుంచి కోర్టు వ్యవహారాలపై ఇంత స్పష్టత, నియంత్రణ కనిపించడం అసాధారణం. తనపై న్యాయమూర్తి పక్షపాతం చూపవచ్చని భావించే వారికి ఇప్పుడు ఆయన ఒక మార్గదర్శకంగా నిలిచారు.* *ఇప్పుడు ఆయన చేసిన వాదనల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటానికి, వాటిపై చర్చ అవసరం. తర్వాత వచ్చే తీర్పు ఎలా ఉన్నా. మార్చి 9న సీబీఐ అప్పీల్‌ వేయడం ద్వారా హైకోర్టును ఆశ్రయించినప్పుడు, జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ, సెషన్స్‌ కోర్టు జడ్జి జితేంద్ర ప్రసాద్‌ సింగ్‌ ఇచ్చిన డిశ్చార్జ్‌ ఆర్డర్‌ను, మరో పక్షాన్ని వినకుండానే తప్పుగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ సమయంలో కేజ్రీవాల్‌ తరఫున అక్కడ ఎవరూ లేరు*. *నెలల తరబడి విచారణ జరిగిన తర్వాత వచ్చిన ఆర్డర్‌పై, ట్రయల్‌ కోర్టు రికార్డు లేకుండా ఇంత గంభీర వ్యాఖ్యలు ఎలా చేయగలరు? దీనివల్ల కేజ్రీవాల్‌కు అనుమానం కలుగడం సహజం. సెషన్స్‌ కోర్టు జడ్జి లిక్కర్‌ స్కాం కేసులో తీర్పునిస్తూ విచారణాధికారి సరైన విచారణ చేపట్టకుండా అప్రూవర్‌లు ఇచ్చిన స్టేట్మెంట్‌ను ఆధారం చేసుకుని చార్జిషీట్‌ వేశారు కాబట్టి ఆ (IO)పై డిపార్ట్మెంట్‌ విచారణకు ఆదేశించారు.* *అలాగే ఆయనపై గంభీర వ్యాఖ్యలు చేశారు. విచారణ ముందే కేసును ఎవరిపై నమోదు చేయాలో నిర్ణయించుకున్నట్లు ఉన్నదని కూడా పేర్కొన్నారు. అయితే, ఆ IO కోర్టులో లేకపోయినా, అతని నుంచి అభ్యర్థన రాకపోయినా, అతనిపై చర్యలను వెంటనే నిలిపివేశారు జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ.* *గతంలో ఇదే కేసులో బెయిల్‌ పిటిషన్లను తిరస్కరిస్తూ జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ చేసిన వ్యాఖ్యలు మీడియాకు మరింత ప్రచారం చేయటానికి అవకాశమిచ్చాయి. అభియుక్తులను నేరస్థులుగా చూపించేందుకు, సాధారణంగా బెయిల్‌ విషయంలో కోర్టు అనుమతిస్తుంది. లేదా తిరస్కరిస్తుంది. విచారణ పూర్తికాకముందే ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయటం మూలంగా వారు నేరస్థులు అని అర్థం వచ్చేలా అవకాశం ఇచ్చారు.* *ఈ బెయిల్‌ కేసులన్నింటిలోనూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. ఒకటి రెండు కేసుల్లో తప్పు జరిగిందనుకోవచ్చు. కానీ అన్ని కేసుల్లోనూ రద్దు కావడం గంభీరమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నది*. *జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ కుటుంబ సభ్యులు బీజేపీ ప్రభుత్వంలో ఎంప్యానెల్‌ అయ్యారు. వారు ప్రస్తుత భారత ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌గా ఉన్న తుషార్‌ మెహతా (సీబీఐ కేసులో అతనే వాదిస్తారు) ఆఫీస్‌లో పనిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో, రాజకీయ ప్రత్యర్థులతో సంబంధం ఉన్న కుటుంబ సభ్యులు ఉన్న న్యాయమూర్తి నుంచి నిష్పాక్షికత ఎలా ఆశించగలరు?* *ఒక న్యాయమూర్తి ఏ సిద్ధాంతానికి చెందిన కార్యక్రమాలకు హాజరైనా అది సాధారణమే కావచ్చు. కానీ ఆమె ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ అయిన చెందిన అధివక్త పరిషత్‌ కార్యక్రమాలకు నాలుగుసార్లు హాజరయ్యారు. ఇతర సిద్ధాంతాల కార్యక్రమాలకు హాజరుకాలేదు. ఇలాంటి పరిస్థితిలో నిష్పాక్షిక తీర్పు ఎలా ఆశించాలి?* *కేజ్రీవాల్‌ చేసిన వాదనల్లో ఇవి కొన్ని మాత్రమే. ఆయన రిక్యూసల్‌ కోరిన అదే న్యాయమూర్తి ఎదుట నిలబడి మాట్లాడటం చాలా అసౌకర్యకరమైన పరిస్థితి. కానీ ఆయన తన వాదనలు వినిపించిన తీరు అనేకమందిని ఆశ్చర్యపరిచింది. ఆయన వాదనలు దేశంలో ఏదో మార్పునకు నాంది పలికాయి.* *అదేమిటో ఇప్పుడే చెప్పలేం, కానీ న్యాయవ్యవస్థను అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ ఆ మార్పును అనుభూతి చెందుతున్నారు. ఈడీ వేసిన పీఎంఎల్‌ఏ (Prevention Money Laundering Act) కేసు విచారణ జరుగకుండానే కొట్టుకుపోయేది, కానీ ఆ కేసులో ఈడీ పిటిషన్‌ లేకుండానే స్టే వచ్చింది*. *కేజ్రీవాల్‌ తన వాదనల్లో ఒక ముఖ్యమైన అంశం లేవనెత్తారు. ఇప్పటివరకు కోర్టులపై పూర్తి విశ్వాసం తనకు ఉందని. అయితే, ఈ ప్రత్యేక సందర్భంలో కొన్ని పరిస్థితుల వల్లే ఈ తిరస్కరణపై అభ్యర్థన చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఇది వ్యవస్థపై అవిశ్వాసం కాదు, కానీ న్యాయ ప్రక్రియపై విశ్వాసాన్ని మరింత బలపర్చే ప్రయత్నమని ఆయన వివరించారు*. *కేజ్రీవాల్‌ చేసిన అత్యంత ప్రభావవంతమైన వాదనల్లో ఒకటి: Justice should not only be done, but also be seen to be done. ఈ భావన ద్వారా ఆయన చెప్పినది ఏమిటంటే..న్యాయం జరిగితే సరిపోదు. ప్రజలకు అది న్యాయంగా జరిగిందనే నమ్మకం కూడా కలగాలి.* *ఈ భావన భారత న్యాయవ్యవస్థలో ఎంతో ప్రాధాన్యం కలిగిన సూత్రం. ఈ వాదనలు పూర్తిగా న్యాయపరమైనవే అయినప్పటికీ, వాటి వెనుక రాజకీయ ప్రాధాన్యం కూడా ఉన్నది. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, రాజకీయ ఒత్తిళ్లు, విచారణ సంస్థల పాత్ర వంటి అంశాలు ఈ కేసు చుట్టూ తిరిగాయి. కేజ్రీవాల్‌ తన వాదనల్లో ఈ అంశాలను ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా స్పృశించారు*. *ప్రజాస్వామ్యంలో అధికారాల సమతౌల్యం (Balance of Power) ఎంత ముఖ్యమో ఆయన వివరించారు. ఈ వాదనలు కేవలం ఒక కేసుతో ముగిసిపోవు. భవిష్యత్తులో..న్యాయమూర్తుల రిక్యూసల్‌ అంశం, న్యాయవ్యవస్థలో పారదర్శకత, రాజకీయ కేసుల్లో నిష్పాక్షిక విచారణ ఇవన్నీ చర్చకు వస్తే, కేజ్రీవాల్‌ వాదనలు ఉదాహరణగా నిలుస్తాయి. భారత ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థపై విశ్వాసం అత్యంత కీలకం. అదే సమయంలో, ఆ విశ్వాసం నిలబెట్టేందుకు న్యాయం జరిగిందనే భావన కూడా ప్రజల్లో ఉండాలి అనే సూత్రం తరచూ ప్రస్తావనకు వస్తుంది.* *ఇంత బలమైన విషయాలను ప్రస్తావిస్తూ కేజ్రీవాల్‌ వాదనలను పరిగణలోకి తీసుకుని జస్టిస్‌ స్వ ర్ణకాంత శర్మ తనంత తానుగా ఈ కేసు నుంచి తప్పుకోవడం సమంజసం. ‘నిర్మొహమాటంగా నువ్వు తప్పుకో, ఎందుకంటే మాకు అనేక భయా లు, సంశయాలు ఉన్నాయి, నీ సమక్షంలో మాకు న్యాయం జరుగదు’ అంటూ తన కేసు ఉన్న హైకోర్టు జడ్జి ముందుకు వెళ్లి చెప్పడం ఆషామాషీ కాదు.* *అంతేకాకుండా ‘నీ కొడుకు, కూతురు పేర్లు బీజేపీ ప్రభుత్వం నియమించిన ఎంప్యానెల్‌ లిస్టులో ఉన్నాయి. వారిద్దరూ తుషార్‌ మెహతా ఆఫీస్‌లో పనిచేస్తున్నారు’ అని అన్నారు. అంతేకాదు.. ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ..* *కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. అంటే ఇక్కడ ఏమి తీర్పు ఇవ్వాలో నిర్ణయం జరిగిందని, తనకు న్యాయం జరుగదని, కనుక కేసు నుంచి తప్పుకోవాలని న్యాయమూర్తికి చెప్పడానికి చాలా గుండె ధైర్యం కావాలి.* #😁Hello🙋‍♂️
😁Hello🙋‍♂️ - 05 CCURT 9 5 sreul JA 05 CCURT 9 5 sreul JA - ShareChat
*_జీవితంలో ఒక్కసారైనా ఈ రైలు మార్గంలో ప్రయాణించండి_* *_భారతీయ రైల్వే అంటేనే అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీక. నెట్ వర్క్ పరంగా ప్రపంచంలో నాలుగో స్థానాన్ని సంపాదించుకుంది_*. *_ప్రతిరోజు 13వేల రైళ్లద్వారా కోటిమంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు_*. *_సెలవులు, పండగల సమయంలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. ప్రతిఒక్కరికి రైలులో ప్రయాణించడం అంటే ఎంతో సరదాగా ఉంటుంది._* *_ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. కిటికీ పక్కన కూర్చొని ప్రకృతి సోయగాలను తిలకిస్తూ, పచ్చని పంటపొలాలను చూస్తూ మురిసిపోతారు. పదే పదే రైలులోనే ప్రయాణం చేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు_* *_వాస్కోడగామా_* *_నుంచి లోండా వరకు_* *_కొండలను తొలిచి సొరంగాలను ఏర్పాటు చేసి,_* *_జలపాతాలు పైనుంచి రైలు మీద పడుతుండగా కూడా రైళ్లు ప్రయాణిస్తూనే ఉంటాయి. ఎన్నో ప్రకృతి అందాలకు నెలవైన మార్గాల్లో కూడా రైలు ప్రయాణం సాగుతుంటుంది._* *_వాస్కోడగామా నుంచి లోండా వరకు సాగే ప్రయాణంలో గోవాతోపాటు పశ్చిమ కనుమల గుండా ప్రయాణం సాగుతుంది_*. *_పచ్చదనాన్ని చూడటానికి రెండు కళ్లు సరిపోవు_*. *_ముంబయి టు గోవా_* *_ఈ మార్గంలో సహ్యాద్రి పర్వతాలు, అరేబియా సముద్రం గుండా ప్రయాణం సాగుతుంటుంది._* *_అద్భుతమైన ఈ మార్గంలో 200 రైల్వే వంతెనలతోపాటు 92 సొరంగ మార్గాలున్నాయి_*. *_ప్రయాణికులకు అద్బుతమైన అనుభూతిని పంచుతుంది._* డార్జిలింగ్ హిమాలయన్ సర్వే జల్పాయ్ గురి నుంచి డార్జిలింగ్ వరకు.. ఈ మీటర్ గేజ్ రైలు మార్గంలో పచ్చని తేయాకు తోటలతోపాటు హిమాలయాల అందాలను ఆస్వాదించొచ్చు. హిమాలయన్ క్వీన్ కల్కా నుంచి సిమ్లా వరకు 102 సొరంగాలు, 82 వంతెనల గుండా ప్రయాణం సాగుతుంటుంది. 96 కిలోమీటర్లు సాగే ట్రాయ్ ట్రైన్ జర్నీ కొత్త అనుభూతిని పంచుతుంది*. *కన్యాకుమారి నుంచి త్రివేండ్రం వరకు కొబ్బరితోటలు, కొండల మధ్య గుండా ప్రయాణం సాగుతుంటుంది. ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతిని కల్పిస్తుంది* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
*పుస్తకాలు 16 వేలు.. ఏర్పాటు చేసిన లైబ్రరీలు 24.. అది కూడా 14 ఏళ్ల వయసులో.. హైదరాబాద్ కు చెందిన ఆకర్షణ సతీష్ చేస్తున్న పని ఇది. కోవిడ్ టైమ్‌లో తన తండ్రితో కలిసి ఫుడ్ పంచుతున్నప్పుడు, క్యాన్సర్ హాస్పిటల్‌లోని పిల్లలు టైమ్ పాస్ కోసం "కలరింగ్ బుక్స్" అడగడం ఆకర్షణ మనసును కలిచివేసిందట. వెంటనే తన కాలనీ వాట్సాప్ గ్రూపుల్లో రిక్వెస్ట్ పెట్టి, అలా వచ్చిన పుస్తకాలతో MNJ క్యాన్సర్ హాస్పిటల్‌లో తన ఫస్ట్ లైబ్రరీని స్టార్ట్ చేసింది.* *ఆ సక్సెస్ ఇచ్చిన బూస్ట్‌తో తెలంగాణలోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్, బోరబండలోని బాల నేరస్థుల హోమ్స్, గాయత్రీ నగర్ అసోసియేషన్.. ఇలా ఒక్కొక్కటిగా లైబ్రరీలు ఏర్పాటు చేసుకుంటూ.. తమిళనాడు వరకు వెళ్లి ఏకంగా 24 లైబ్రరీలు ఓపెన్ చేసింది* *ఈ రోజుల్లో పిల్లలంతా స్మార్ట్ ఫోన్లకే అతుక్కుపోతుంటే, తను మాత్రం పుస్తకాలను సేకరించి సమాజానికి ఉపయోగపడేలా మంచి పనులు చేస్తూ అందరినీ ఆకర్షిస్తోంది… ఆకర్షణ. ఈమె డెడికేషన్ చూసి ఇప్పుడు నెటిజన్లు తనని ఒక రియల్ హీరోలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు*. *L&T మెట్రో రైల్, NBT వాళ్ళ సహకారంతో మన హైదరాబాద్ లో ఉన్న మెట్రో స్టేషన్లలో కూడా ప్రయాణికుల కోసం లైబ్రరీలను ఓపెన్ చేయాలనుకుంటోందట ఈమె* *ట్రైన్ కోసం వెయిట్ చేసే టైమ్‌లో ఫోన్లలో తలదూర్చకుండా, మంచి పుస్తకం చదువుకునేలా ఆకర్షణ చేస్తున్న ఈ ప్రయత్నం పబ్లిక్ నుండి మంచి ప్రశంసలు అందుకుంటోంది.* *ఈ అమ్మాయి చేస్తున్న పనిని చూసి ప్రధానమంత్రి సైతం తన మన్ కీ బాత్ లో ప్రశసించాడట. "నీ 25వ లైబ్రరీ ప్రారంభోత్సవానికి నేనే గెస్ట్‌గా వస్తాను" అని ఆయన ప్రామిస్ చేయడం ఆకర్షణ కృషికి దక్కిన ఒక మంచి గౌరవం.* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - LELUGU TAL Radio UNX LDLEL MMtuumtuu బమ ) TUPISHAH HlN    GRISHAN | FTTHETTHUIET NURISHNN dd MFUIRIl    . 6   HLNHE TTIII {ು [[IFIINAHIII টশ[[E NTETIS TOULa IIRELESSIUILES  L2 MIE (RUHEI ப + IIIIE ~079 /TCHE hlh;n' IT ٩  REntemem ಖಾದರಾಬಾದ ಲೌನ ప్రతి మెట్రో స్టేషన్ లైబ్రరీ పెట్టడమే లో లక్ష్యమట! ఈమె LELUGU TAL Radio UNX LDLEL MMtuumtuu బమ ) TUPISHAH HlN    GRISHAN | FTTHETTHUIET NURISHNN dd MFUIRIl    . 6   HLNHE TTIII {ು [[IFIINAHIII টশ[[E NTETIS TOULa IIRELESSIUILES  L2 MIE (RUHEI ப + IIIIE ~079 /TCHE hlh;n' IT ٩  REntemem ಖಾದರಾಬಾದ ಲೌನ ప్రతి మెట్రో స్టేషన్ లైబ్రరీ పెట్టడమే లో లక్ష్యమట! ఈమె - ShareChat
*బిజెపి పార్టీ వ్యవస్థపక సభ్యులు సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి నిన్న మీడియా సాక్షిగా మోదీపై పరోక్షంగా విరుచుకుపడ్డారు.* *"మనం విశ్వగురువులం అని డబ్బాలు కొట్టుకోవడం ఆపండి..అంటూ ఒకప్పుడు మనం విశ్వగురువులం , ఇప్పుడు అస్సలు కాదు" అంటూ మోదీ బృందం చేస్తున్న అతి ప్రచారాన్ని కడిగిపారేశారు.* *జోషి అగ్రహానికి ప్రధానకారణం 2014లో అధికారం దక్కగానే మోదీ, అమిత్ షా ద్వయం తెలివిగా 75 ఏళ్ల నిబంధనను తెరపైకి తెచ్చి, బీజేపీ పార్టీని జీరో నుండి అధికార స్థాయికి చేర్చిన అద్వానీ, జోషి వంటి సీనియర్ నాయకులను రాజకీయంగా సమాధి చేశారు. '* *మార్గదర్శక్ మండల్' అనే పేరుతో ఒక చెత్త బుట్టను తయారు చేసి అందులో పాత నేతలను పడేశారు. కనీసం మర్యాద ఇవ్వకుండా, సంప్రదించకుండా 2019లో వారి టికెట్లు కట్ చేసి రోడ్డున పడేశారు.* *కానీ అసలు ఆట ఇప్పుడే మొదలైంది. ఇతరులకు రిటైర్మెంట్ రూల్స్ పెట్టిన మోదీకి 2025లో 75 ఏళ్లు నిండినా, తానూ మాత్రం కుర్చీ వదలడం లేదు. "* *మాకు ఒక నీతి.. నీకు ఒక నీతా?" అన్నదే ఇప్పుడు జోషి వంటి సీనియర్ల ఆగ్రహం. బిజెపి అంటే మోదీ, మోదీ అంటే బిజెపి అనే రేంజ్‌లో తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుంటూ, సెకండ్ లైన్ లీడర్లు ఎవరూ ఎదగకుండా గొంతు నొక్కేస్తున్నారని వారు గుర్రుగా ఉన్నారు*. *పార్టీని ప్రాణం పోసి పెంచిన తమను అవమానించి, ఇప్పుడు మొత్తం పార్టీని తన గుప్పెట్లోకి తీసుకోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు*. *ఈ పరిణామాలన్నీ ఆరెస్సెస్ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మోదీ ఇమేజ్ పార్టీ సిద్ధాంతం కంటే పెద్దదిగా మారిపోవడం*, *పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చచ్చిపోవడం పట్ల సంఘ్ పెద్దలు మండిపడుతున్నారు. అందుకే ఇప్పుడు సీనియర్ నేతలను ఉసిగొల్పి మోదీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే పనిలో ఉన్నారు*. *క్షేత్రస్థాయిలో ధరల పెరుగుదల, నిరుద్యోగంతో పాటు మోడీ పబ్లిసిటీ పిచ్చి అబద్దాలు జనాలు నమ్మకపోవడం మోదీ గ్రాఫ్ పడిపోతుండటం కూడా ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణం*. *మోదీ ఇమేజ్ అనే బుడగ ఎప్పుడైనా పేలవచ్చు, కానీ పార్టీ పునాదులు కదిలిపోకూడదని సంఘ్ భావిస్తోంది* *అనేది* *జోషి మాటల వెనుక ఉన్న అసలు విషయం* #😁Hello🙋‍♂️
😁Hello🙋‍♂️ - ShareChat
*_భారత ప్రధానమంత్రి మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మొన్న బెంగాల్ లో స్థానిక దుకాణానికి వెళ్లి ,మురుమూరలు కొనుగోలు చేయడం అక్కడ స్థానిక ప్రజలతో ముచ్చటించడం జరిగింది_* *ఒక సామాన్య పౌరుడిలా ప్రధాని వ్యవహరిస్తున్నారని అందరు భావించినప్పటికీ, భద్రతా ప్రమాణాల ప్రకారం ఇది అత్యంత క్లిష్టమైన మరియు ముందస్తుగా రూపొందించిన ఒక ప్రక్రియ*. *భారత ప్రధాని భద్రత అత్యంత కఠినంగా ఉంటుంది ఇంత కఠినంగా మారడానికి ప్రధాన కారణం 1991లో జరిగిన రాజీవ్ గాంధీ హత్య. అప్పటి వరకు ఉన్న భద్రతా లోపాల కారణంగా, ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు ఆత్మాహుతి దాడికి గురయ్యారు*. *ఈ ఘటన తర్వాత భారత ప్రభుత్వం SPG (Special Protection Group)చట్టాన్ని సవరించి, ప్రధాని భద్రతను ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి చేర్చింది.* *ఈ నిబంధనల ప్రకారం ప్రధాని తన ఇష్టానుసారం భద్రతను పక్కన పెట్టి సామాన్యుడిలా రోడ్ల మీదకు రావడం చట్టరీత్యా అసాధ్యం*. *ప్రధాని పర్యటనలకు సంబంధించి 'బ్లూ బుక్' అనే అత్యంత రహస్య నియమావళి ఉంటుంది. దీని ప్రకారం ప్రధాని ఏదైనా ఒక షాపుకు వెళ్లాలని నిర్ణయించుకుంటే, దానికి కొన్ని రోజుల ముందే భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తనిఖీ చేస్తాయి.* *సదరు దుకాణంలో ఉండే వ్యక్తుల నేపథ్యాన్ని పోలీసులు ముందే వెరిఫై చేస్తారు*. *ప్రధాని అక్కడ ఉన్నంత సేపు ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం 'నో ఫ్లై జోన్' మరియు 'నో ఎంట్రీ జోన్'గా మారుతుంది. అంటే అక్కడ కనిపించే ఇతర కస్టమర్లు కూడా సామాన్యులు కాకపోవచ్చు, వారు మారువేషంలో ఉన్న భద్రతా సిబ్బంది అయ్యే అవకాశం ఉంది*. *ఎన్నికల సమయంలో ప్రధాని ఒక షాపుకు వెళ్లి వస్తువు కొనడం అనేది కేవలం ఒక ప్రచార వ్యూహం* *కోట్లాది రూపాయల భద్రతా వలయంలో ఉండే నాయకుడు సామాన్యుడికి దగ్గరగా ఉన్నాడని చూపించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. కానీ వాస్తవానికి ఒక సామాన్య పౌరుడు ఆ సమయంలో ప్రధాని దగ్గరకు వెళ్లడం అసాధ్యం.* *ప్రధాని ఏదైనా వస్తువు కొంటే దానికి సంబంధించిన సొమ్మును ఆయన తన వ్యక్తిగత ఖాతా నుండి లేదా పార్టీ నిధుల నుండి చెల్లించాలి.* *అయితే, ఆ చిన్న వస్తువు కొనడానికి ప్రభుత్వం చేసే భద్రతా ఖర్చు కోట్ల రూపాయల్లో ఉంటుంది. వందల మంది పోలీసులు, స్నిపర్లు, జామ్మర్లు మరియు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల మోహరింపు మధ్య జరిగే ఈ 'సాధారణ షాపింగ్' ప్రజాస్వామ్యంలో ఒక పబ్లిసిటీ చర్య మాత్రమే*. *భారత ప్రధాని భద్రత అనేది ఆయన వ్యక్తిగత విషయం కాదు, అది దేశ గౌరవానికి మరియు స్థిరత్వానికి సంబంధించిన అంశం. కాబట్టి,* *రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఏర్పడిన కఠిన నిబంధనల దృష్ట్యా, ప్రధాని "సామాన్యుడిలా" షాపుకు వెళ్లడం అనేది కేవలం ఒక స్క్రిప్ట్ ప్రకారం జరిగే ఈవెంట్ మాత్రమే* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
2️⃣0️⃣2️⃣ *_సంపూర్ణ మహాభారతము_* *_202వ రోజు_* *_ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము_* *ఉద్యోగ పర్వము,  మహాభారతం ఇతిహాసంలోని ఐదవ భాగము.*  *ఆంధ్ర మహాభారతంలో ఈ భాగాన్ని తిక్కన అనువదించాడు*. *ఉద్యోగము అనగా "ప్రయత్నము". యుద్ధానికీ, శాంతికి జరిగే యత్నాలు ఈ పర్వంలో ముఖ్య కథాంశం*. *సంస్కృత మూలంలో 6,698 శ్లోకాలు ఉన్నాయి.  సనత్సుజాతీయము ఉద్యోగ పర్వంలో ఒక భాగం (41 నుండి 46 వరకు అధ్యాయాలు). దీనిపై ఆది శంకరాచార్యులు వ్యాఖ్యానం వ్రాశారు..* *_ప్రధమాశ్వాసం_* *ఉత్తరాభిమన్యుల వివాహం గడిచి నాలుగు రోజుల తరువాత ధర్మరాజు తన సోదర, పుత్ర సమేతంగా విరాటరాజు కొలువు కూటంలో ప్రవేశించాడు. అప్పుడు విరాటరాజు కృష్ణుడు, బలరాముడు, వారి పుత్రులు బంధువులతో ఇష్టాగోష్ఠి జరుపుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అందరినీ చూసి “పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తి చేసారు. వారు ఎంతటి ధర్మపరులో అందరికీ తెలుసు. సుయోధనుడు శకుని సాయంతో పాండవులను మాయా జూదంలో ఓడించి పాండవుల రాజ్యలక్ష్మిని అన్యాయంగా అపహరించాడు. కనుక పాండవులకు కౌరవులకు క్షేమకరమైన ఒక మార్గం అన్వేషించి పాండవుల రాజ్యం వారికి సంక్రమింప చేయాలి*. *పాండవులకు పితృధనంగా కొంతరాజ్యం లభించింది. ధర్మరాజు రాజసూయ యాగం నిర్వహించి రాజ్యాన్ని విస్తరించి మాయా జూదంలో అంతా దుర్యోధనుని పరం చేసి అడవులలో సోదర, పత్నీ సమేతంగా అనేక ఇడుములు పడ్డాడు. సుయోధనుడు,శకుని, దుశ్శాసన, కర్ణాదులతో చేరి వారిని అనేక అవమానాల పాలు చేసాడు. పాండవులు సాయం సంతరించుకునే లోపే వారిని ఎదుర్కోవడానికి సన్నాహాలు చేస్తున్నాడు. కనుక పాండవులు వారికి సహాయాన్నందించే వారిని సమీకరించడం అనివార్యం. వారి బలపరాక్రమాలను ప్రదర్శించ వలసిన సమయం ఆసన్నమైంది*. *అయినా కౌరవుల మనసులో ఏముందో తెలుసుకుని తదుపరి కార్యక్రమ రచన చేయడం ఉచితం కనుక హస్తినా పురానికి ఒక దూతను పంపుట ఉచితం. వారు పాండవులకు రాజ్యభాగం శాంతి మార్గంలో ఇస్తే ఇరువర్గాలకు మంచిది. లేకుంటే ఏది ఉచితమో తరువాత నిర్ణయిస్తాము” అన్నాడు*. *అప్పుడు బలరాముడు లేచి..* *“తమ్ముడు శ్రీకృష్ణుడు చెప్పినది ఉచితం*. *ఇరువర్గాలకూ ఇది క్షేమకరం. మనం ఒక దూతను కౌరవేంద్రుని వద్దకు పంపుదాము. జూదం ఆడటం సరిగా ఎరుగని ధర్మనందనుడు జూదానికి సిద్దంగావున్న కర్ణ దుర్యోధనాదులను వదిలి జూదంలో నిపుణుడైన శకునిని ఆటకు పిలిచి అతని చేతిలో ఓడిపోతూ, రోషావేశంతో జూదంను కొనసాగించి ఓడిపోయాడు.* *దానిలో శకుని తప్పేమీ లేదు. తన ప్రావీణ్యంతో రాజ్యాన్ని జూదంలో గెలిచి సుయోధన పరంచేసాడు. ఇందులో దుర్యోధనుని అపరాధం ఏమీ లేదు. కనుక ఇక్కడి నుంచి వెళ్ళే దూత ధృతరాష్ట్రుడికి నమస్కరించి వినయపూర్వకంగా వారికి ఏ విధంగానూ కోపం తెప్పించకుండా సంభాషించి కార్యాన్ని చక్కబెట్టేలా ఉండాలి” అన్నాడు*.``` *_సాత్యకి ఆవేశం_* *బలరాముని మాటలు సాత్యకికి కోపం తెప్పించాయి "బలరామా! నువ్వు ఇలా మాట్లాడటం తగదు. ఇలా మాట్లాడటం నీకే తగింది. మనుష్యునికి ఎలాంటి హృదయం వుంటే వారు అటువంటి మాటలే మాట్లాడుతారు. దుర్యోధనుడు మంచి వాడంటున్న నిన్ను మాట్లాడించి వింటున్న వారిని అనాలి. ధర్మరాజు వేడుక పుట్టి జూదం ఆడాడా? దుర్యోధనాదులంతా కుట్రపన్ని ధర్మరాజుని క్షత్రియ ధర్మాన్ని అనుసరించి జూదానికి పిలిచి, కపట జూదం ఆడి అతడి రాజ్యలక్ష్మిని అపహరించి అతని సోదరలను ధర్మ పత్నిని అవమానించారు. ధర్మరాజు ధర్మగుణం లోకానికి తెలియనిదా? నియమం ప్రకారం వనవాసం నుండి విముక్తుడు కాగానే వారి రాజ్యంను పొందడానికి ధర్మరాజు అర్హుడైనాడు. దీనుడై అతడు రాజ్యంను యాచించడం తగదు. పాండవుల వద్ద అపహరించిన రాజ్యం పాండవులకు ఇవ్వక తప్పదు. లేకున్న పాండవులు యుద్ధంలో వారి రాజ్యాన్ని పొందగలరు. భీమార్జునులను ఎదిరించి యుద్ధభూమిలో నిలువగల వాడెవడు. విరాటుని పరాక్రం తక్కువా? పాంచాల వీరులు, వృష్టి వీరులు యుద్ధంలో తలపడి సుయోధనుని తమ్ములను హతమార్చక మానరు. రాజ్యం ఇవ్వకుంటే యుద్ధం తప్పదు. దూతను పంపండి కానీ న్యాయంగా ఇస్తే సరి. అంతేగాని యాచన వలదు" అన్నాడు* #మన సంప్రదాయాలు సమాచారం
6️⃣4️⃣ *_శ్రీమహావిష్ణుపురాణం_* *_(అరవై నాల్గవ భాగం)_* *_కృతవీర్యుడు - కార్తవీర్యార్జునుడి జనన కథ:_* *సూత మహర్షి శౌనకాదులతో “మునులారా! పరశురామ అవతార కథ ముందు మనం కృతవీర్యుడు, అతని పుత్రుడు కార్తవీర్యార్జునుడి గురించి తెలుసుకుందాం” అని కార్తవీర్యార్జునుడి జనన కథ చెప్పసాగాడు..* *‘పూర్వము కృతవీర్యుడు అనే బలపరాక్రమ వంతుడైన రాజు ఉన్నాడు. ధర్మపరిపాలన చేస్తూ యజ్ఞయాగాదులు, దానధర్మాలు చేస్తూ పరిపాలించేవాడు. కృతవీర్యుడి భార్య సుగంధి సుగుణవతి, సౌశీల్యవతి. వారికి చాలా కాలం సంతానం కలుగ పోవడంతో రాజ్యం మంత్రులకు అప్పగించి భార్యతో సంతానం కోసం తపస్సు చేయడానికి అరణ్యానికి వెళ్లాడు*. *అక్కడ కృతవీర్యుడు రాలిన ఆకులు తింటూ కొంతకాలం, తరువాత వాయువు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ భార్యతో కలసి తపస్సు చేయసాగాడు. శరీరం శుష్కించిపోయినా తపస్సు మానలేదు. ఆకాశమార్గాన వెళుతున్న నారదుడు చూసి దయ కలిగి అక్కడకి వచ్చి సంతానం కోసం కృతవీర్యుడు దంపతులు చేస్తున్న తపస్సు గురించితెలుసుకుని పితృలోకం వెళ్లి కృతవీర్యుడి తండ్రికి ఆ విషయం తెలిపి వెళ్లి పోయాడు.* *కృతవీర్యుడి తండ్రి బ్రహ్మ దగ్గరకు వెళ్లి నమస్కరించి “పితామహా! నా కుమారుడు ఆహారం మానివేసి సంతానం కోసం తపస్సు చేస్తూబలహీనుడై రేపోమాపో మరణించేట్టు ఉన్నాడు. ధర్మబద్దంగా పాలనచేస్తున్నా వాడికి సంతానం ఎందుకు కలగటం లేదు. మీరు దయవుంచి వాడికి ఏంచేస్తే సంతానం కలుగుతుందో చెబితే, నేను నా కుమారుడికి చెప్పి మార్గదర్శనం చేస్తాను” అని అభ్యర్థించాడు.* *బ్రహ్మ దయతో కృతవీర్యుడి తండ్రికి “మీ కుమారుడు పూర్వజన్మ వృత్తాంతం చెబుతాను. నీ రాజధానిలో సాముడు అనే కిరాతుడు ఉండేవాడు. దుర్మార్గుడు, క్రూరుడైన అతడు దొంగతనం చేయడానికి ఎవరు అడ్డం వచ్చినా చంపేసి దోచుకునే వాడు. ఒకసారి ధనం అధికంగా దొరుకుతుంది అన్న సమాచారం తో సత్పురుషులైన పన్నెండు మంది బ్రాహ్మణులను చంపి వారి ధనము, సంపదలు దోచుకుని రాత్రికి ఇంటికి చేరాడు*. *ఆ రోజు మాఘ బహుళ చవితి.* *పగలంతా దోపిడిలో తిండి లేకుండా గడిపిన సాముడు రాత్రి కుమారుని పేరుతో ‘గణేశా! గణేశా’ అని పిలిచి, కుమారుని తో కలసి భోజనం చేసాడు.* *కొంతకాలానికి సాముడు మరణించాడు. తెలియకుండానే మాఘ బహుళ చవితి నాడు పగలంతా ఉపవాసం ఉండి చంద్రోదయమైన తరువాత గణేశ స్మరణ చేసి ప్రసాదం (భోజనం) తినడం వలన సంకష్ట చతుర్థీవ్రత పుణ్యఫలం సాముడికి లభించింది.* *ఆ పుణ్యఫలం చేత నీకు కుమారుడై జన్మించి కృతవీర్యుడు అనే నామంతో రాజైనాడు. కానీ పూర్వజన్మ బ్రహ్మహత్యా పాప ఫలం అలాగే ఉండిపోయింది. ఆ పాపం తొలిగితేనే సంతానం కలుగుతుంది" అని చెప్పగా కృతవీర్యుడి తండ్రి "పాపం తొలిగి పోయే ఉపాయం చెప్పమని" ప్రార్థించాడు*. *దానికి బ్రహ్మ "నీ కుమారుడు "అనఘాష్టమీ వ్రతము" నియమనిష్టలతో, శ్రద్దా భక్తులతో చేస్తే బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందుతాడు. సంతానం పొందుతాడు. అశ్వమేధ యాగం చేసిన ఫలం కూడా లభిస్తుంది" అని చెప్పాడు*. *కృతవీర్యుడి తండ్రి కృతవీర్యుడి కలలో కనిపించి బ్రహ్మ చెప్పిన అనఘాష్టమీ వ్రతము గురించి, వ్రత విధానం గురించి తెలిపగా "ఈ వ్రతము చేస్తే తప్పక సంతానం కలుగుతుంది" అని చెప్పగా అతను భార్యతో కలసి రాజధానికి తిరిగి వెళ్లాడు.* *అనఘా అనఘుల (దత్తాత్రేయుడు, అనఘాదేవి) బంగారు ప్రతిమలు చేయించాడు*. *పుష్పమండపంలో వారిని ప్రతిష్టించి, విధివిధానాలతో భక్తి శ్రద్థలతో అనఘాష్టమీ వ్రతము, చేశాడు. దత్తాత్రేయ మంత్రం పఠిస్తూ హోమము చేసాడు*. *బ్రాహ్మణులకు అన్నసమారాధన చేసి దక్షిణలతో సంతృప్తి పరిచాడు. దంపతులిరువురు సంతాన ప్రాప్తికై బ్రాహ్మణుల ఆశీస్సులు పొందారు*. *కొంతకాలానికి కృతవీర్యుడి భార్య గర్భవతి అయ్యి నవమాసాలు ముగిసిన తర్వాత కుమారుని కన్నది. ఆ కుమారుడు సుందరమైన ముఖము, చక్కని ముక్కు నేత్రములు కలిగినా కాళ్లు చేతులు లేకుండా జన్మించాడు. చేతులు లేని భుజాలు, కాళ్లు లేని తొడలు గల శరీరము తో ఉన్న కుమారుని చూసి తల్లి దుఖించింది. కృతవీర్యుడికి తెలిసి అక్కడకు వచ్చి కాళ్లు చేతులు లేని కుమారుని చూసి బాధపడ్డాడు*. *"ఏం పాపము చేసామో కదా! అనఘాష్టమీ వ్రతముతో దత్తాత్రేయుడి అనుగ్రహం పొందినా అంగవిహీనుడైన కుమారుని పొందాము" అని దుఖిస్తున్న మహారాజుని చూసిన మంత్రులు "మహారాజా!విధివిధా నాన్ని ఎవరూ తప్పించలేరు. దుఖం చెందవద్దు. మీరు ఎంత దుఖించినా పుట్టిన బాలునికి పరిపూర్ణత రాదు. భగవంతుడు ఇచ్చిన దానిని స్వీకరించండి. కాలానుగుణంగా లోకంలో ఫలాలు పరిపక్వమైనట్టు అన్నీ తగిన సమయంలో వస్తాయి. దత్తాత్రేయుని నామ స్మరిస్తూ ఉండండి" అని హితోపదేశం చేశారు.* *కృతవీర్యుడు తేరుకుని బ్రాహ్మణులను పిలిచి పిల్లవాడికి పుణ్యాహవచనము, జాతకర్మలు చేయించాడు. దాన ధర్మాలు చేసాడు. బాలునికి "కార్తవీర్యుడు" అని నామకరణం చేసి పెంచసాగారు* #మన సంప్రదాయాలు సమాచారం