Ravi  Talluri
ShareChat
click to see wallet page
@91775
91775
Ravi Talluri
@91775
feelgood
*_మంచం మీద ఉన్న "రామాయణ విషవృక్షం" రాసిన ముప్పాళ్ల రంగనాయకమ్మ అనే రంగనాయకమ్మ గురించి_* *_నాస్తికత్వం ఒక లాభసాటి వ్యాపారం_* *_కమ్యూనిజం ఒక లాభసాటి వృత్తి_* *_రెండింటిలోనూ నిష్ణాత ఈ రంగనాయకమ్మ అనే వృత్తి నాస్తికురాలు_*. *_మొగుడిని వదిలించుకోవటము తప్పు కాదు. కానీ ఎదిగిన పిల్లల ముందే తనకంటే 12 ఏళ్ళు చిన్నవాడైన గాంధీతో పెళ్ళి అనె జంఝాటం లేకుండా కాపురం చేసిన ఈమె నైతికవిలువలు ఏపాటి? నా శరీరం నా ఇష్టం అంటూ బ్రతికిన ఈమె తన పిల్లల మన:స్థితి ఎన్నైడైనా గమనించిందా ? సమాజాన్ని ధిక్కరించానని మురిసిపోయిన ఆవిడ, అదే సమాజంలో తన పిల్లల పరిస్థితి గురించి ఆలోచించిందా ?_* *_ఆమె ఎంతో ముందు చూపుతో సమాజానికి అందించిన సహజీవనం అనే బాటలో రేపు అందరూ పయనించి, కాపురాలు చేస్తే, వాళ్ళకు పుట్టే పిల్లలకు చట్టబద్ద తలితండ్రులు లేకపోతే, ఆ పిల్లలు సమాజానికి బరువుకాబోరా ?_* *_రామాయణ విషవృక్షం రాసింది_*. *_ఎంతమంది చదువరులు ఆ విషవృక్షంలోని విషాన్ని మూల రామాయణంలోని విషయాలతో పోల్చి, నిజమెంతో బేరీజు వేసుకుని చదివి ఉంటారు ?_* *_రామాయణంలోని ఏదో ఒక చిన్న విషయాన్ని పట్టుకుని దాని ఆధారంగా 90% తన కపోల సృష్టితో వండివార్చిన అబద్దాలే ఎక్కువ_*. *_ఈమె రాసిన విషవృక్షం ను పూర్తిగా ఉపయోగించుకున్నది మతమార్పిడి మాఫియా తమ మతప్రచారానికి వాడుకున్నది. హిందూ ద్వేషులైన కమ్యూనికృష్టులు ఆనందించి తమ విద్వేషానికి మరింత పదును పెట్టుకున్నారు._* *_ఈమె రాసిన విషవృక్షం ప్రభావం మెండుగా ఉండి ఉంటే, ఇవాళ అసలు రామాయణాన్ని అందరూ వదిలేసి ఉండేవారు_*. *_ఒక ముప్పై ఏళ్ళ క్రితం ఒక సాహితీ సభలో విషవృక్షం రంగనాయకమ్మతో భేటీ జరిగింది_*. *_నేను ఆమెను సూటిగా ఒక్కటే ప్రశ్న వేసాను._* *_మీరు విషవృక్షాన్ని ఎందుకు రాసారు అని._* *_"ఆమె సమాధానం కూడా సూటిగానే చెప్పింది_*. *_రామాయణంలోని విషాన్ని ప్రజలకు అర్ధం అయ్యేట్లు చేసి, రామాయణ ప్రభావాన్ని తగ్గించాలనీ, రామాయణంలో స్త్రీలను అత్యల్పభోగవస్తువుగా, అల్పురాలుగా చూపించిన విషయాన్ని ఎండగడతానికీ, అన్నదమ్ముల మధ్య్ ప్రేమానురాగాలు కాకుండా దాస్యప్రవృత్తి పెంపొందించే విధంగా ఉన్నదాన్ని ఏకి పెడదామనీ అంటూ బదులు ఇచ్చింది."_* *_మంచిది, అదే పంధాలో మహాభారతం మీద కూడా రాసారు. మరి ఈ రెండింటి కన్నా ఘోరమైన విషయాలు బైబిల్ లో ఖురాన్ లో ఉన్నాయి. మరి వాటి మీద కూడా రాస్తారా అని నిలదీసాను_*. *_ఆమె దగ్గర సమాధానం లేదు_*. *_సమాజంలో హిందువులు ఎక్కువ కాబట్టి ముందు వాళ్ళను సంస్కరించి తర్వాత ముస్లిం క్రైస్తవుల జోలికి వెళతాను అని సమాధానం చెప్పింది_*. *_అంటే ఆమె ఏడుపు హిందూ మతగ్రంధాల మీదనే తప్ప అన్యమతాల జోలికి వెళ్ళే ధీరవీరవనిత కాదు. భయం. హిందువులంటే సహనశీలురు, ఇతరమతాలవాళ్ళు తోలు తీస్తారన్న ప్రాణభీతి_*. *_మేధావి అనిపించుకోవాలన్న కుతి ఉన్న ఏ గాడిద అయినా ఓండ్ర పెట్టేది అన్ని మతాలనూ గౌరవించటం బోధించే హిందూ సంస్కృతి మీదే తప్ప, తమ దేవుడ్ని నమ్మని వాడిని నరికిచంపండి అని బోధించే మతాల జోలికి పోరు కదా ! రంగనాయకమ్మ బ్రతుకైనా అంతే !_* *_ఆ మాటే అంటే, నన్ను వదిలించుకుని పారిపోయింది._* *_ఇంకా ఆమె ఆయురారోగ్యాలతో ఆశీర్వదించిన ఆ రామచంద్రుడికి కృతజ్ఞతలు._* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
*_1986లో ఐదేళ్ల బాలుడు రైల్వే స్టేషన్ బెంచ్‌పై కూర్చొని తన అన్న కోసం ఎదురు చూస్తూ అలాగే నిద్రపోయాడు. అతని అన్న ఎంత సేపటికి తిరిగి రాలేదు_.* *అతను అన్న కోసం వెతుకుతూ ఖాళీగా ఉన్న రైలు బోగీలోకి ఎక్కాడు. మళ్లీ నిద్రపోయాడు. లేచేసరికి తలుపులు లాక్ అయ్యాయి, రైలు అప్పటికే కదులుతోంది*. *దాదాపు రెండు రోజులు ఆగకుండా ప్రయాణం. చివరకు కలకత్తా చేరుకుంది. అది అతని ఇంటి నుంచి సుమారు 1500 కిలోమీటర్ల దూరం.* *అతను చాలా చిన్నవాడు. తన ఇంటి పేరు తెలియదు. చదవలేడు. తన ఊరి పేరు కూడా చెప్పలేడు.* *కొన్ని వారాలు కలకత్తా వీధుల్లో ఒంటరిగా జీవించాడు. రైల్వే స్టేషన్ బెంచ్‌ల కింద నిద్రపోయాడు. దొరికిన ఆహారంతో బ్రతికాడు. తరువాత అతన్ని ఒక వ్యక్తి అనాథాశ్రమానికి తీసుకెళ్లారు. “తప్పిపోయిన బాలుడు”గా నమోదు చేశారు. అతను ఎక్కడి వాడో ఎవరూ గుర్తించలేకపోయారు*. *తర్వాత ఆస్ట్రేలియాలోని టాస్మానియా ప్రాంతానికి చెందిన ఒక దంపతులు అతన్ని దత్తత తీసుకున్నారు. అతనికి కొత్త జీవితం లభించింది. అతని పేరు Saroo Brierleyగా మారింది. అక్కడే పెరిగాడు*. *అయితే అతను చిన్నప్పటి కొన్ని గుర్తులను మాత్రం మర్చిపోలేదు. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఒక వంతెన, ఒక నీటి టవర్, పరిసర ప్రాంతం నిర్మాణం, కుటుంబ సభ్యుల ముఖాలు అతని గుర్తుల్లో ఉండిపోయాయి*. *ఇరవైల్లోకి వచ్చిన తర్వాత అతను Google Earth ఉపయోగించడం ప్రారంభించాడు. తాను రైలులో ఎంతసేపు ప్రయాణించాడో గుర్తు పెట్టుకుని దూరాన్ని అంచనా వేశాడు. కలకత్తా చుట్టూ ఒక పరిధిని నిర్ణయించి, ఆ పరిధిలో ఉన్న ప్రతి రైల్వే మార్గాన్ని శాటిలైట్ చిత్రాల్లో పరిశీలించడం ప్రారంభించాడు*. *ఇది ఒకరోజు పని కాదు. నెలలు, సంవత్సరాలు ఇలా వెతికాడు. కొన్నిసార్లు వారానికి 80 గంటల వరకు మ్యాప్స్ చూసేవాడు. చిన్నప్పటి గుర్తులతో పోల్చుకుంటూ ఒక్కో ప్రదేశాన్ని ఓపికగా చెక్ చేసేవాడు*. *2011లో అతను ఒక ప్రదేశాన్ని గుర్తించాడు. ఒక నీటి టవర్, ఒక వంతెన, స్టేషన్ దాటి ఉన్న ఒక లోయ ఇవన్నీ అతని గుర్తులకు సరిపడ్డాయి. అది మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా నగరంలోని గణేష్ తలై ప్రాంతం*. *అతను వెంటనే భారతదేశానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో తిరుగుతూ చివరకు తన ఇంటిని గుర్తించాడు. తలుపు మూసి ఉండటంతో కాసేపు అనుమానం వచ్చింది. కానీ కొద్దిసేపటికి అక్కడి వారు బయటికి వచ్చారు. వాళ్లలో ఒకరు అతన్ని ఒక మహిళ దగ్గరకు తీసుకెళ్లారు* *ఆమె అతని తల్లి*. *25 సంవత్సరాలుగా కళ్లతో వెతికిన తన తల్లి ఒక్కసారిగా తన ముందే నిలబడ్డప్పుడు…* *అతడికి మాటలు రావడం ఆగిపోయింది .ఒక్కసారిగా ఆమెను పట్టుకుని బిగిగా ఏడ్చేశాడు*. *ఆమె కూడా అతన్ని వదలలేదు. 25 సంవత్సరాలుగా ఆగిపోయిన ఆ తల్లి ప్రేమ ఒక్కసారిగా బయటికి వచ్చింది*. *అప్పుడు అతనికి తెలిసింది ఆ రోజు స్టేషన్‌లో అతను ఎదురు చూసిన అతని అన్న గుడ్డు రైలుకు ఢీకొని మరణించాడు అని* *అతని తల్లి ఇద్దరు కుమారులను 25 సంవత్సరలు వెతికింది. ఒకరి గురించి నిజం తెలిసింది, మరొకడు ఇలా తిరిగి వచ్చాడు* *ఈ నిజమైన కథ తరువాత A Long Way Home అనే పుస్తకంగా వచ్చింది. అదే కథ ఆధారంగా తీసిన Lion సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.ఆరు విభాగలలో అస్కార్ కి నామినేట్ అయింది* *చిన్నప్పటి గుర్తులు… 25 సంవత్సరాల సహనం… చివరకు ఒక మనిషిని తన తల్లి దగ్గరకు తీసుకెళ్లాయి*. *ఇలాంటి నిజమైన సంఘటనలు చాలా అరుదు. చదివిన తర్వాత చాలా సేపు మనసులోనే మిగిలిపోతాయి* #😁Hello🙋‍♂️
😁Hello🙋‍♂️ - ShareChat
2️⃣0️⃣1️⃣ *_సంపూర్ణ మహాభారతము_* *_201 వ రోజు_* *_ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము:_* *_సేనలసమాయత్తం:`_* *సాత్యకి ఒక అక్షౌహిని సేనతో పాండవుల వద్దకు వచ్చాడు. చేధి దేశాధీశుడు, శిశుపాలుని కుమారుడు దృష్టకేతు, జరాసంధుని కుమారుడు సహదేవుడు ఒక్కొక్క అక్షౌహిని సేనతో వచ్చి కలిసారు. కేకయ రాజులు కూడా ఒక్క అక్షౌహినితో కలిసాడు. ద్రుపదుడు బంధువులతో ఒక్క అక్షౌహినితో కలిసాడు. పర్వత రాజు ఒక్క అక్షౌహినితో కలిసాడు. విరాట రాజు తన సైన్యముతో కలిసాడు*. *పాండ్యరాజు ఒక్క అక్షౌహినితో కలిసాడు. ఇలా పాండవ సైన్యం ఏడు అక్షౌహినులైంది. ఇక సుయోధనుడు కూడా తన సైన్యాన్ని సమాయత్తం చేస్తున్నాడు*. *భగదత్తుడు ఒక్క అక్షౌహినితోను, కాంభోజరాజు సుదక్షిణుడు ఒక్క అక్షౌహినితోను, భూరిశ్రవుడు ఒక్క అక్షౌహినితోనూ, శల్యుడు ఒక్క అక్షౌహినితోను, సింధురాజు జయద్రధుడు ఒక్క అక్షౌహినితోనూ, మాహిష్మతీపతి నీలుడు ఒక్క అక్షౌహినితోనూ, యాదవరాజు కృతవర్మ ఒక్క అక్షౌహినితోను, అవంతీరాజులు విందాను విందులు తలా ఒక్క అక్షౌహినితోనూ, వివిధదేశముల నుండి వచ్చిన సైన్యం మూడు అక్షౌహినులయ్యాయి. మొత్తం పదకొండు అక్షౌహినుల సైన్యం కౌరవపక్షాన చేరింది* *_ద్రుపదరాజు పంపిన పురోహితుని రాయభారం_* *ద్రుపదరాజు పంపిన పురోహితుడు హస్థినకు చేరాడు. అతడు భీష్ము, ద్రోణ, కృపాచార్యు, విదుర దుర్యోధనాధులను కలుసుకున్నాడు*. *మరునాడు* *దృతరాష్ట్రసభలో* *“ధృతరాష్ట్రుడు, పాండురాజు* *అన్నదమ్ములు. వారి పుత్రులైన కౌరవ, పాండవులకు రాజ్యంపై సమాన హక్కు ఉందని మీకంతా తెలుసు.* *పాండవులను చంపడానికి చేసిన అనేక ప్రయత్నాలు వాటి నుండి వారు తప్పించుకున్న విధం మీకు తెలుసు*. *పాండవులు తమ బాహు బలంతో నూతన రాజ్యాన్ని స్థాపించి, వృద్ధి చేసిన రాజ్యంను శకునితో కలిసి కుట్రపన్ని జూదం వంకతో దుర్యోధనుడు అపహరించిన విషయం మీకు తెలుసు. వీటిని అంగీకరించిన దృతరాష్ట్రుని ఏమనాలి.* *పాండవపత్నిని సభలో వలువలు వలిచి అవమానించిన విషయం, వారి రాజ్యం అపహరించిన విషయం ఎలా మరువగలము. నాటి నిర్ణయానుసారం ఇప్పుడు వారు అరణ్య అజ్ఞాత వాసాలు ముగించుకుని మునుపటి తప్పులను తలంచక వారి రాజ్యభాగం కోరుతూ సంధి నిమిత్తం నన్ను పంపారు. కౌరవ, పాండవ ప్రవర్తనను ఎరిగిన మీరు దుర్యోధనుడికి నచ్చ చెప్పటం మంచిది. పాండవులు బల హీనులు కారు. జననష్టం లేకుండా తమ రాజ్యంను పొందాలనుకుంటున్నారు. వారి వైపు ఏడు అక్షౌహినుల సైన్యమే ఉంది, మా వద్ద పదకొండు అక్షౌహినుల సైన్యం వుందని అనుకుంటున్నారేమో సాత్యకి, భీముడు ఒక్కొక్కరు వెయ్యి అక్షౌహినులకు సమం. అర్జునుని ఎదిరించి నిలువగలిగిన వీరుడు ముల్లోకాలలో లేడు. అన్నిటికి మించి చతురోపాయములో సమర్ధుడైన శ్రీకృష్ణుడు వారి వైపు ఉండగా వారిని విజయలక్ష్మి వరించకుండా ఉండ కలదా? వారిని పిలిపించి వారి రాజ్య భాగం ఇప్పించి అందరూ క్షేమంగా సుఖంగా ఉండండి” అని చెప్పి కూర్చున్నాడు* #మన సంప్రదాయాలు సమాచారం
*_మన ఆరోగ్యం…!_* *_పురోగమనమా?_* *_తిరోగమనమా?_* *_‘బ్యాక్ టు బేసిక్స్’_* *_చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం..!_* *_స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై_!* *_విద్యార్థుల చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం ఇచ్చిన గవర్నమెంట్‌‌_* *_గతంలో ప్రతి విద్యార్థికి ఒక ల్యాప్‌‌‌‌టాప్ అక్కడి రూల్‌‌_*.. *_ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు..._* *_ఒక టెక్స్ట్‌‌‌‌బుక్ తప్పనిసరి!_* *_లిటరసీ లెవల్స్ పడిపోవడం, పిల్లల్లో ఏకాగ్రత తగ్గడం వల్లే..!_* *_‘బ్యాక్ టు బేసిక్స్’ కాన్సెప్ట్కు పునాది._* *స్వీడన్ దేశం ప్రపంచానికి ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది*. *దశాబ్ద కాలంగా డిజిటల్ రివల్యూషన్​కి మారుపేరుగా నిలిచిన ఈ దేశం.. ఇప్పుడు సడెన్​గా ‘బ్యాక్ టు బేసిక్స్’ అనే సరికొత్త కాన్సెప్ట్​ను మొదలుపెట్టింది*. *ఇది కేవలం ఒక మార్పు మాత్రమే కాదు. మోడర్న్​ టెక్నాలజీ వల్ల కలిగే అనర్థాలను ముందే గుర్తించి, మనిషి మేధస్సును మళ్లీ గాడిలో పెట్టే ఒక టర్నింగ్​ పాయింట్​!* *కొన్నేళ్ల క్రితం వరకు క్లాస్‌‌రూమ్ అంటే చేతిలో ట్యాబ్, కళ్లముందు కంప్యూటర్ స్క్రీన్ మాత్రమే ఉండేవి.* *కానీ, 2026 నాటికి స్వీడన్‌‌లోని పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. ప్రభుత్వం భారీ పెట్టుబడితో మళ్లీ పాత రోజుల్లోలాగే పుస్తకాలను, పెన్నులను తరగతి గదుల్లోకి తీసుకొచ్చింది.* *_స్క్రీన్ల నుంచి పేజీల వైపు_..* *2009 నుంచే స్వీడన్ తన విద్యా వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేసింది. ప్రతి విద్యార్థికి ఒక ల్యాప్‌‌టాప్ లేదా ట్యాబ్లెట్ ఇవ్వడం అక్కడి రూల్​.* *అయితే, గత పదేళ్ల అనుభవం తర్వాత ఎక్స్​పర్ట్స్​కి​ ఒక చేదు నిజం తెలిసింది. డిజిటల్ డివైజ్​ల వల్ల స్టూడెంట్స్​లో చదివే స్కిల్​ తగ్గింది. దాంతోపాటు ఏకాగ్రత కూడా బాగా తగ్గిందని రీసెర్చ్​ల్లో తేలింది. *అందుకే, సుమారు120 మిలియన్ డాలర్ల ఖర్చుతో ప్రతి విద్యార్థికి కనీసం ఒక సబ్జెక్ట్​కు ఒక ఫిజికల్ టెక్స్ట్‌‌బుక్ ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది*. *_భారీగా ఖర్చుపెడుతోంది_* *గవర్నమెంట్ భారీగా డబ్బు ఖర్చు పెట్టి స్కూల్స్​లో పుస్తకాలు, పెన్నులు, పేపర్‌‌‌‌లను తిరిగి తీసుకొస్తోంది*. *లిటరసీ లెవల్స్ పడిపోవడం, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు డిజిటల్ ఓవర్‌‌యూజ్ వల్ల వచ్చాయని గుర్తించి, “ఫ్రమ్ స్క్రీన్​ టు బైండర్​” అనే స్లోగన్‌‌తో ముందుకు వెళ్తోంది*. *ఈ ఏడాది ఆగస్టు నుంచి స్వీడన్​లో జాతీయ స్థాయి మొబైల్ ఫోన్ బ్యాన్ అమలులోకి రాబోతోంది. *స్టూడెంట్స్​ ఉదయం స్కూల్‌‌కు వచ్చిన వెంటనే తమ ఫోన్‌‌లను అప్పగించాలి. స్కూల్ డే మొత్తం క్లాసులు, బ్రేక్స్, ఆఫ్టర్- స్కూల్ యాక్టివిటీలు కూడా ఫోన్ లేకుండా గడపాలి*. *2028 నాటికి పూర్తిగా టెక్స్ట్‌‌బుక్ మీదే ఆధారపడనుంది*. *ప్రీ-స్కూల్‌‌లోనూ డిజిటల్ టూల్స్ తప్పనిసరి కాదు.* *_లగోమ్ - స్వీడిష్ లైఫ్​స్టైల్ మంత్ర!_* *స్వీడన్ ఈ ‘బ్యాక్ టు బేసిక్స్’ కాన్సెప్ట్​ని కేవలం స్కూళ్లకే పరిమితం చేయలేదు. వాళ్ల ప్రాచీన సంస్కృతిలోని ‘లగోమ్’ అనే సూత్రాన్ని మళ్లీ వెలికితీశారు. లగోమ్ అంటే ‘అతి ఉండొద్దు. కొదవ కాకూడదు. సరిపడా ఉండాలి’ అనేది దీనర్థం.* *ఈ సూత్రాన్ని పాటిస్తూ వాళ్లు రీచ్ అయిన అచీవ్​మెంట్స్ ఒకసారి చూస్తే.. ఫాసిల్ ఫ్రీ స్టీల్ తయారీలో స్వీడన్ టాప్​లో ఉంది*. *2026 నాటికి సిటీల్లో సైకిల్ ట్రాక్‌‌లు, ప్రకృతికి దగ్గరగా ఉండే చెక్క ఇళ్ల నిర్మాణం పెరిగింది*. *అలాగే ప్రస్తుతం స్వీడన్ వైద్యులు ఒత్తిడితో బాధపడే రోగులకు మందుల కన్నా ‘నేచర్ ప్రిస్క్రిప్షన్’ అంటే అడవుల్లో గడపడం, పర్వత ప్రాంత గాలిని పీల్చడం వంటి ప్రకృతి చికిత్సలను సూచిస్తున్నారు.* *_ఇంటీరియర్ డిజైన్లో మార్పులు_* *2026 నాటికి స్వీడిష్ ఇళ్లలో ‘కోల్డ్ మినిమలిజం’ స్థానంలో ‘వార్మ్ అండ్ హ్యూమన్-సెంట్రిక్ డిజైన్’ వచ్చి చేరింది*. *కేవలం తెల్లటి గోడలు కాకుండా మట్టి రంగులు, సేజ్ గ్రీన్ వంటి ప్రకృతికి దగ్గరగా ఉండే రంగులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి ఇంటిలోనూ ఒక మూల ప్రకృతిని ప్రతిబింబించేలా మొక్కలు, సహజమైన కాంతి వచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు*. *_ఇంటి పెరట్లోనే పండిస్తూ.._* *స్వీడన్ ప్రజలు ఇప్పుడు తమ ఇంటి పెరట్లోనే ఆహారాన్ని పండించుకునే పద్ధతిని మళ్లీ మొదలుపెట్టారు*. *సిటీల్లోని పెద్ద సూపర్ మార్కెట్లు కూడా లోపలే ఆకుకూరలు పండించే వినూత్న సాంకేతికతను వాడుతున్నాయి*. *అలాగే, వ్యర్థాలను తగ్గించడానికి పాత దుస్తులను మళ్లీ రీసైకిల్ చేసి కొత్త పోగులుగా మార్చే ఫ్యాక్టరీలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి* *_అనలాగ్ రివైవల్_* *టెక్నాలజీ విపరీతంగా పెరిగిన ఈ కాలంలో మళ్లీ పాత పద్ధతులపై ఆసక్తి పెరగడాన్ని ‘అనలాగ్ రివైవల్’ అంటారు.* *డిజిటల్ స్క్రీన్​ల వల్ల వచ్చే హ్యాపీనెస్​ కంటే, చేత్తో తాకగలిగే వస్తువులు మనకు ఎక్కువ మానసిక సంతృప్తిని ఇస్తాయి. *అంతేకాదు.. చేతిరాత రాయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. *పేపర్ మీద చదవడం వల్ల విషయం బాగా గుర్తుంటుంది*. *ఇది కేవలం పాత కాలానికి వెళ్లడం కాదు. టెక్నాలజీ వల్ల కోల్పోయిన ‘స్పర్శ జ్ఞానాన్ని’ మళ్లీ పొందడం*. *_మెదడుకు విరామం_* *శరీరంలోని మలినాలను తొలగించుకోవడానికి డిటాక్స్ డ్రింక్స్ వంటివి తీసుకుంటుంటారు. అలాగే స్మార్ట్‌‌ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం నుంచి మన మెదడును కాపాడుకోవడానికి డిజిటల్ డిటాక్స్ అవసరం.* *కంటిన్యూగా వచ్చే నోటిఫికేషన్లు చూడటం వల్ల మన ఏకాగ్రత తగ్గిపోతోంది. నిద్రలేమి, ఒత్తిడి పెరుగుతున్నాయి. కాబట్టి ఈ డిజిటల్ డిటాక్స్ అనే మెథడ్​ని ఫాలో అవ్వాలి*. *రోజూ కొన్ని గంటల పాటు ఫోన్‌‌కు దూరంగా ఉండటం వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది. కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో నేరుగా మాట్లాడే సమయం దొరుకుతుంది*. *ఈ ‘అనలాగ్ రివైవల్’ ద్వారా స్వీడన్ ఫ్యూచర్​ జనరేషన్స్​కు ఒక మంచి మెసేజ్ అందిస్తోంది.* *అదేంటంటే... ‘‘అత్యున్నత సాంకేతికత అవసరమే, కానీ అది మన మూలాలను దెబ్బతీయకూడదు.’’* *_డిజిటల్ లెర్నింగ్ అవసరమా ?_* *ఇది ఒక పెద్ద చర్చ. టెక్నాలజీ వద్దని కాదు, అది ఎంత వరకు ఉండాలి? అనేదే అసలు ప్రశ్న.* *గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన విద్యను అందించడానికి, కొన్ని అంశాలను ఈజీగా అర్థమయ్యేలా వివరించడానికి యానిమేషన్ అంటే.. డిజిటల్ ఎడ్యుకేషన్ అవసరం.* *అయితే చిన్న పిల్లలకు మొదటి దశలోనే స్క్రీన్​లు అలవాటు చేస్తే, వాళ్లలో ఆలోచనా శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది.* *స్వీడన్ లాంటి దేశాలు ఇప్పుడు ఏమంటున్నాయంటే ‘‘కోడింగ్ నేర్పండి, కానీ అది పుస్తకం చదవడం నేర్చుకున్న తర్వాతే.”* *కాబట్టి డిజిటల్ విద్య అనేది ఒక ‘సాధనం’ లాగా ఉండాలి తప్ప, అది ‘గురువు’ స్థానాన్ని భర్తీ చేయకూడదు. ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ ఉంటేనే హెల్దీ ఫ్యూచర్​కు రూట్ క్లియర్​గా ఉంటుంది* #మన సంప్రదాయాలు సమాచారం
6️⃣3️⃣ *_శ్రీ మహావిష్ణు పురాణం_* *_(అరవై మూడవ భాగం)_* *_చంద్ర వంశము - జమదగ్ని మహర్షి కథ._* *పురూరవునికి ఊర్వశి వలన ఆయువు, ధీమంతుడు, అమా వశుడు, విశ్వవసుడు, శ్రతా యువు, శ్రుతాయువు అనే ఆరుగురు కుమారులు జన్మించారు*. *అమావశుని మనవడు సుహోత్రునికి జాహ్నవు అనే కుమారుడు జన్మించి రాజర్షియై గొప్ప యాగం చేయసాగాడు.* *అదే సమయంలో భగీరథుని ద్వారా భూమికి వస్తున్న ఆకాశగంగ వేగంగా ప్రవహిస్తూ వచ్చి జాహ్నవు చేసే యాగ ప్రదేశాన్ని నీటిలో ముంచివేసి యాగాన్ని ఆపివేసింది.* *జాహ్నవు మహర్షికి కోపం వచ్చి గంగ జలాలను తన కమండలం లోకి తీసుకుని పూర్తిగా త్రాగినేసాడు. గంగా ప్రవాహం భూలోకంలో ఆగిపోయింది*. *భగీరథుడు, దేవతలు వచ్చి జాహ్నవు మహర్షిని లోకకల్యాణం కోసం గంగాదేవిని వదిలివేయమని ప్రార్థించారు*. *జాహ్నవు మహర్షి శాంతించి తన ఉదరంలో ఉన్న గంగను బయటకు వదిలాడు.* *గంగాదేవి జాహ్నవు మహర్షికి పుత్రికా సమానురాలైనాటినుంచి "జాహ్నవి" అనే పేరు పొందింది*. *జాహ్నవు మహర్షి మునిమనవడు కుశాశ్వుడు. ఇతడు ఇంద్రుడి వంటి కుమారుడు కావాలని తపస్సు చేశాడు. ఇంద్రుడు తనలాంటి వాడు పుడితే తనకు ప్రమాదమని ప్రత్యక్షమై కుశాశ్వునికి తనతో సమానుడైన కుమారుడు జన్మిస్తాడని వరము ఇచ్చాడు. వరము తీర్చడానికి ఇంద్రుడు కుశాశ్వుడికి కుమారుడు గాధి రాజుగా జన్మించాడు.* *గాధిరాజుకి పుత్ర సంతానం కలుగ లేదు. సౌందర్యవతి అయిన సత్యవతి కుమార్తెగా జన్మించింది. ఋచీక మహర్షి పెళ్ళి చేసుకోవాలని కోరిక కలిగి గాధిరాజు వద్దకు వెళ్లి సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు*. *వయస్సులో పెద్ద, తపస్వి ఐన ఋచీకునికి కూతురుని ఇచ్చి వివాహం చేయడం ఇష్టం లేదు*. *కుమార్తెను ఇవ్వనంటే మహర్షి ఆగ్రహించిశపిస్తాడేమో అని భయపడి గాధిరాజు “కన్యాశుల్కంగా వేయి నల్ల చెవులు గల తెల్లని అశ్వాలు తెచ్చి ఇస్తే కూతురుని ఇచ్చి వివాహం చేస్తాను” అని నిబంధన పెట్టాడు*. *సరేనన్న ఋషీకుడు వరుణదేవుని ప్రార్ధించి అశ్వతీర్థంలో జన్మించి ఉన్న వేయి నల్ల చెవులు గల తెల్లని ఆశ్వాలు తెచ్చి గాధిరాజుకి ఇచ్చి సత్యవతిని వివాహం చేసుకున్నాడు*. *సత్యవతి చేసిన పతి సేవలకు మెచ్చుకుని ఋచీకుడు వరం కోరుకోమన్నాడు. సత్యవతి తనకు తేజోవంతుడైన కుమారుని ప్రసాదించమని కోరింది. అదే సమయానికి అక్కడకు వచ్చిన గాధిరాజు భార్య, సత్యవతి తల్లి తనకు కూడా పుత్ర సంతానం కలిగేలా ఋచీకుని అడగమని సత్యవతికి చెప్పింది*. *సత్యవతి భర్తతో తనతో పాటు తన తల్లికి కూడా పుత్ర సంతానం కలిగేలా చేయమని కోరింది*. *భార్య కోరికను మన్నించి రెండు మంత్రించిన పాయసాలు తయారు చేసాడు. సత్యవతికి తేజోవంతుడైన పుత్రుడు కలగటానికి ఒకటి, అత్తగారికిబల పరాక్రమాలు కలిగిన పుత్రుడు కలగటానికి మరోకటి అని వేరే వేరే పెట్టి సంధ్యావందనము చేసుకోవడానికి నదీతీరానికి వెళ్లాడు*. *సత్యవతి తన తల్లికి రెండు మంత్ర పాయసాలు చూపించి ఋచీకుడు వచ్చాక ఇస్తారని, వాటి వలన తాము కోరుకున్నట్టుగా పుత్రులు జన్మిస్తారు అని చెప్పింది.* *పుత్రుడు కలగాలి అనే ఆత్రుత ఉన్న సత్యవతి తల్లి అల్లుడు వచ్చేదాకా ఆగకుండా వెంటనే ఒక పాయస పాత్ర తీసుకుని పాయసం తినేసింది*. *తల్లి ఒక్కతే అలా తింటే భర్త ఆగ్రహిస్తాడేమో అనుకుని సత్యవతి రెండవ పాత్రలోని పాయసం తినివేసింది. గందరగోళంలో తల్లి తినవలసిన పాయసం కూతురు, కూతురు తినవలసిన పాయసం తల్లి తినేశారు*. *నది నుండి తిరిగి వచ్చిన ఋచీకుడు జరిగింది తెలుసుకుని ఆగ్రహించాడు. భార్య సత్యవతితో “మీరు మరో ఘోరమైన తప్పు చేశారు. నీవు స్వీకరించవలసింది మీ అమ్మగారు, మీ అమ్మగారు స్వీకరించవలసింది నీవు తీసు కున్నారు. ఫలితంగా నీకు బ్రాహ్మణుడైనా క్షత్రియుడిలా యుద్ధాలు చేసి చంపేవాడు, నీ తల్లికి క్షత్రి యుడైనా బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రహ్మర్షి జన్మిస్తారు" అని కోపంగా చెప్పాడు.* *సత్యవతి భర్త పాదాలపై పడి నావలన మీకు క్రూర స్వభావుడైన కుమారుడు కలుగకూడదు*. *మీ తపఃశక్తితో క్రూరక్షత్రియ స్వభావాన్ని కుమారుని నుంచి మనవడికి మారేలా చేయండి" అని ప్రార్ధించింది*. *ఋచీక మహర్షి శాంతించి భార్య కోరినట్టు కుమారుడు కాకుండా మనవడు క్షత్రియ స్వభావుడిగా పుడతాడు అని అనుగ్రహించాడు*. *కొంతకాలానికి సత్యవతి, ఆమె తల్లి ప్రసవించి కుమారులను కన్నారు. గాధిరాజుకి విశ్వామిత్రుడు కౌశికుడు అనే నామధేయంతో జన్మించాడు. సత్యవతి, ఋచీకులకు జమదగ్ని జన్మించాడు. జమదగ్ని వేదాధ్యయనం చేసి సర్వవిద్యాపారంగతుడు అయ్యాడు. అమోఘమైన తపస్సు చేసి జమదగ్ని మహర్షి అయ్యాడు*. *తపస్సు పూర్తి అయిన తర్వాత గృహస్థాశ్రమం స్వీకరించ దలచాడు. ప్రసన్నజిత్తుడు అనేమహా రాజు వద్దకు వెళ్లి ఆయనకుమార్తె రేణుక నిచ్చి వివాహం చేయమని కోరాడు. జమదగ్ని మహర్షి గొప్పతనం గురించి విన్న ప్రసన్నజిత్తుడు కుమార్తె అంగీకారంతో రేణుకను ఇచ్చి వివాహం చేశాడు*. *రేణుక జమదగ్ని మహర్షి వెంట ఆశ్రమానికి వెళ్లింది. పతినే ప్రత్యక్ష దైవంగా భావించి సేవలు చేసింది. వారికి ఐదుగురు కుమారులు జన్మించారు. ఐదవకుమారుడిగా నారాయణుడు ఋచీక మహర్షికి ఇచ్చిన వరంకారణంగా కుమారుడిగా జన్మించాడు. అతడే మహావిష్ణు అవతారమైన పరశురాముడు* #మన సంప్రదాయాలు సమాచారం
*_సమాజ సేవ_* *1. సమాజానికి సేవ చేయడం ప్రతి మనిషి బాధ్యత. మన చుట్టూ ఉన్నవారికి సహాయం చేయాలి. చిన్న సహాయం కూడా పెద్ద మార్పు తీసుకువస్తుంది. సేవ చేయడం మనసుకు ఆనందం ఇస్తుంది*. *2. పేదలకు ఆహారం అందించడం గొప్ప సేవ. ఆకలితో ఉన్నవారిని ఆదుకోవాలి. మనకు ఉన్నదాంట్లో కొంచెం పంచుకోవాలి. ఇది నిజమైన మానవత్వం*. *3. విద్య లేకపోయిన వారికి సహాయం చేయాలి. పిల్లలకు చదువు ప్రాధాన్యం చెప్పాలి. పుస్తకాలు లేదా ఫీజులు సహాయం చేయవచ్చు. విద్య సమాజాన్ని మార్చే శక్తి.* *4. రక్తదానం చేయడం ప్రాణాలను కాపాడుతుంది. ఇది గొప్ప సేవలలో ఒకటి. ఆరోగ్యంగా ఉన్నవారు ముందుకు రావాలి. ఒక రక్తదానం ఒక ప్రాణాన్ని రక్షిస్తుంది*. *5. పర్యావరణాన్ని కాపాడడం మన బాధ్యత. చెట్లు నాటాలి మరియు సంరక్షించాలి. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. స్వచ్ఛమైన వాతావరణం అందరికీ అవసరం*. *6. వృద్ధులకు సహాయం చేయాలి. ఒంటరిగా ఉన్న పెద్దలను ఆదుకోవాలి. వారి అవసరాలు గుర్తించి సహకరించాలి. గౌరవం ఇవ్వడం కూడా సేవే*. *7. అనాథలకు సహాయం చేయాలి. వారికి ప్రేమ మరియు మద్దతు అవసరం. చిన్న సహాయం కూడా వారికి ఆశను ఇస్తుంది. సమాజం వారిని వదిలేయకూడదు.* *8. శుభ్రత పాటించడం సమాజ సేవలో భాగం. మన చుట్టూ పరిశుభ్రత ఉంచాలి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. స్వచ్ఛత ఆరోగ్యాన్ని కాపాడుతుంది*. *9. విపత్తుల సమయంలో సహాయం చేయాలి. వరదలు లేదా ప్రమాదాల్లో బాధితులకు తోడుగా ఉండాలి. ఆహారం, దుస్తులు అందించాలి. ఇది మానవత్వానికి నిదర్శనం*. *10. జంతువులను కాపాడడం కూడా సేవే. అవి కూడా జీవులు. వాటికి ఆహారం మరియు రక్షణ ఇవ్వాలి. దయ చూపడం మన లక్షణం*. *11. అవగాహన కార్యక్రమాలు చేయాలి. ఆరోగ్యం, విద్యపై ప్రజలకు చెప్పాలి. మంచి అలవాట్లు ప్రోత్సహించాలి. అవగాహన మార్పుకు దారి తీస్తుంది.* *12. సమాజంలో శాంతి కాపాడాలి. గొడవలు తగ్గించే ప్రయత్నం చేయాలి. పరస్పర గౌరవం పెంచాలి. శాంతి ఉన్న చోటే అభివృద్ధి ఉంటుంది*. *13. యువత ముందుకు రావాలి. సమాజ సేవలో భాగస్వామ్యం కావాలి. కొత్త ఆలోచనలు తీసుకురావాలి. యువతే భవిష్యత్తు.* *14. స్వచ్ఛంద సేవా సంస్థలతో కలసి పనిచేయాలి. కలిసి పని చేస్తే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సమిష్టి శక్తి గొప్పది. సమాజానికి మంచి ఫలితాలు వస్తాయి*. *15. చిన్న పనులతో ప్రారంభించాలి. పెద్ద మార్పు ఒక్కరోజులో రాదు. నిరంతరంగా సేవ చేయాలి. అప్పుడు నిజమైన మార్పు కనిపిస్తుంది* #మన సంప్రదాయాలు సమాచారం
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:12
*_జయ జయ శంకర, హర హర శంకర_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:20
*_ఓo వజ్రదంష్ట్రాయ నమః_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:15
https://www.youtube.com/live/_0lG1h5NX4I?si=PRZ4vWJz07Zx3kl7 #మన సంప్రదాయాలు సమాచారం
youtube-preview