Ravi  Talluri
ShareChat
click to see wallet page
@91775
91775
Ravi Talluri
@91775
feelgood
*_అతిధిదేవో భవ_* *ఒక అడవిలో జంట పావురాలు నివసిస్తున్నాయి. ఒకరోజు వేటగాడు ఆడపావురాన్ని బాణంతో కొట్టి చంపాడు*. *అదిచూసిన మగపావురం తన నివాసమైన చెట్టుపై దుఃఖంతో ఉన్నది*. *ఆ సమయంలో గాలివాన వచ్చింది. ఆ వేటగాడు, పావురం ఉన్న చెట్టు క్రిందచేరి చలికి వణుకుతూ, ఆకలితో బాధ పడుతున్నాడు*. *వాన తగ్గగానే, తన నివాసం వద్దకు చేరిన ఆ వేటగానిని తన అతిధిగా భావించి, కొన్ని ఎండుపుల్లలు సేకరించి, మంటచేసి వాడికి వెచ్చదనం కల్పించింది. ఆ వేటగాడు ఆకలితో బాధపడటం చూసిన ఆ పావురం ఆ మంటలో దూకి ,వాడికి ఆహారం గా మారింది.* *తన ఆడ తోడును చంపిన వాడైనా తన నివాసం వద్దకు వచ్చినాడు కనుక వాడిని తన అతిధిగా భావించి తన ప్రాణాలను త్యాగం చేసి మరీ, ఆకలి తీర్చింది ఆ పక్షి.* *ఈ సంఘటనను శ్రీ రాముడు, విభీషణుడు తనను శరణుకోరి వచ్చినపుడు, విభీషణునితో స్నేహాన్ని వ్యతిరేకించిన వానర వీరులతో చెప్పుతాడు... “ఒక పక్షి, తన భార్యను చంపిన వాడు తన నివాసం వద్దకు వచ్చి ఆకలితో బాధ పడుతుంటే అతిధిగా భావించి ప్రాణాలు వదలి ఆకలి తీర్చిందికదా! అటువంటిది మానవుడిని, నేనురక్షణ బాధ్యత కలిగిన క్షత్రియుడను, చక్రవర్తి కుమారుడను, శరణుకోరి వచ్చిన వానిని తిరస్కరించను!” అని వారిని సమాధాన పరచి విభీషణునికి అభయం ఇచ్చి, తన సోదరులలో ఒకనిగా స్థానం ఇచ్చాడు, శ్రీరాముడు*. *ఒకసారి శరణన్నవానిని కూడా రక్షించడమే నా వ్రతం అని ప్రకటిస్తాడు రాముడు*. *”మిత్రునిగా కాకపోయినా, మిత్రభావంతో నన్ను ఆశ్రయించినా, వాని దోషాలను పరిగణనలోకి తీసుకోకుండా రక్షిస్తాను” అంటాడు*. *అతిధిని దైవ భావంతో సత్కరించటం గృహస్తు బాధ్యత, అని శాస్త్రాలు చెప్పుతున్నాయి* #మన సంప్రదాయాలు సమాచారం
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:05
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:15
*_ఓo సర్వాభీష్టప్రదాయినే నమః_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:17
https://www.youtube.com/live/9WcHbWv2ZHU?si=fbXYREk5MdS8-MLb #మన సంప్రదాయాలు సమాచారం
youtube-preview
https://www.youtube.com/live/w7H0iq2wCV8?si=Arvskwoewl46cJQh #మన సంప్రదాయాలు సమాచారం
youtube-preview
*_MAAGHA PURANAM -- 27_* *_27వ అధ్యాయము_* *_ఋక్షక అనే బ్రాహ్మణ కన్య వృత్తాంతము_* *పూర్వము భృగుమహాముని వంశమందు ఋక్షక అను కన్య జన్మించి దిన దినాభివృద్ధిగా పెరుగుతున్నది* *దురదృష్టము కొద్దీ పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయాడు.* *ఋక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావముతో ఇల్లు విడిచి గంగానదీ తీరమున ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభింది.* *చాలా సంవత్సరములు చేయటము వలన అనేక మాఘ మాస స్నాన ఫలము దక్కింది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకుంటూ ప్రాణములు విడిచి పెట్టింది. ఆరోజు వైకుంఠ ఏకాదశి అవడముచే వైకుంఠమునకు వెళ్ళింది. చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు వెళ్ళింది. ఆమె మాఘ మాస వ్రత ఫలము కలిగి పవిత్రురాలు అయినందున బ్రహ్మదేవుడు ఆమెను దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి “తిలోత్తమ” అన్న పేరుతో సత్యలోకమునకు పంపాడు. ఆ కాలంలో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసారు. వారి తపస్సుకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై “మీకేమి కావలయును? కోరుకొనుము” అనగా “స్వామీ! మాకు ఇతరుల వలన మరణము కలుగకుండా ఉండునట్లు వరమిమ్మ” ని వేడుకొన్నారు. బ్రహ్మ అలాగే ఇచ్చానని చెప్పి అంతర్ధానము అయ్యాడు*. *బ్రహ్మదేవుని వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహా గర్వముతో దేవతలను హింసించి, మహర్షుల తపస్సులకు భంగము కలిగిస్తూ, యజ్ఞయాగాది క్రతువులలో మాంసం, రక్తం, వేసి నానాభీభత్సములు చేయసాగారు. దేవలోకముపై దండెత్తి దేవతలందరినీ తరిమివేసారు.* *ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవుని “మహానుభావా! సుందోపసుందులనే రాక్షసులకు మీరు ఇచ్చిన వరములతో గర్వము గలవారై తపశ్శాలురను బాధిస్తూ దేవలోకమునకు వచ్చి మమ్ములను తరిమి చెరసాలలో పెట్టి నానా భీభత్సం చేస్తున్నారు. వారి మరణమునకు ఏదైనా ఉపాయము ఆలోచించమ” ని దేవేంద్రుడు ప్రార్థించాడు. బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమను పిలిచి “అమ్మాయీ! సుందోపసుందులను రాక్షసులకు ఎవరి వలన మరణం కలుగదని వరం ఇచ్చి ఉన్నాను. వర గర్వంతో వాళ్ళు చాలా అల్లకల్లోలం చేస్తున్నారు. నువ్వు వెళ్ళి నీ చాకచక్యంతో వారికి మరణం కలుగు విధముగా ప్రయత్నించు” అని చెప్పాడు.* *తిలోత్తమ బ్రహ్మదేవునకు నమస్కరించి చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుతూ అరణ్యములో ఆ రాక్షస సుందోపసుందులు ఉన్న నివాసమునకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదము, ఆమె మధుర గానము విని సుందోపసుందులు తిలోత్తమును సమీపించారు. ఆమె ఎటు వెళ్ళినా, ఎటు తిరిగినా ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుతూ ఆమెను “నన్ను వరింపుమ” ని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమలాడ సాగారు*. *తిలోత్తమ “ఓ రాక్షసాగ్రేసరులారా! మిమ్ములను పెండ్లియాడుట నాకు ఇష్టమే. మీరు ఇద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి పట్ల ప్రేమతో ఉన్నాను. ఇద్దరినీ వివాహమాడుట సాధ్యం కానిది. నాకు బలవంతులైన వారిని వరించవలెనన్న ఒక కోరిక ఉన్నది. “మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే నేను వరించగలను” అని చెప్పింది*. *తిలోత్తమ మాటలు వారిని ఆలోచింప చేసాయి. నీకంటే నేను బలవంతుణ్ణి అని సుందుడు అంటే, లేదు నేనే బలవంతుణ్ణి అని ఉపసుందుడు అన్నాడు. వాదము పెరిగి పౌరుషం వచ్చి ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకుందాం అంటూ ఘోర యుద్ధానికి తలపడ్డారు*. *గదాయుద్ధము, మల్లయుద్ధము చేసారు. పలురకాల ఆయుధాలతో పోరాడుకున్నారు. చివరిగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తితో మరొకరి కంఠానికి ఖండించు కోవడముతో ఇద్దరూ చనిపోయారు.* *ఇద్దరూ మరణించడముతో దేవతలందరూ సంతోషించారు.* *తిలోత్తమను పలువిధముల శ్లాఘించారు. బ్రహ్మదేవుడు కూడా సంతోషించి “తిలోత్తమా! నీ చాకచక్యంతో సుందోపసుందుల పీడను తొలగించావు*. *దేవతలందరికీ ఆరాధ్యురాలఉ అయినావు. ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితము. ఇకనుండి నీవు దేవలోకములో అందరిచే అధికురాలిగా ఆదరింపబడతావు. నీ జన్మ ధన్యమైనది. వెళ్ళి దేవలోకములో సుఖించు” అంటూ ఆమెను దేవలోకమునకు పంపాడు* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - హహ్ హహ్ - ShareChat
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* *_శనివారం ఫిబ్రవరి 14 2026_* *_శ్రీ విశ్వావసు నామ సంవత్సరం_* *_ఉత్తరాయణం శిశిర ఋతువు_* *_మాఘమాసం బహుళపక్షం_* *_తిథి: ద్వాదశి మ 03.24వరకు తదుపరి త్రయోదశి_* *_వారం: శనివారం (స్థిరవాసరే)_* *_నక్షత్రం: పూర్వాషాఢ సా 06.00వరకు తదుపరి ఉత్తరాషాఢ_* *_యోగం: సిద్ది తె 03.22వరకు తదుపరి వ్యతీపాత_* *_కరణం:తైతుల మ 03.24వరకు తదుపరి గరిజ రా తె 04.32వరకు ఆ తదుపరి వణిజ_* *_వర్జ్యం; రా 02.34-04.17_* *_దుర్ముహూర్తము: ఉ 06.31-08.03వరకు_* *_అమృతకాలం:మ 12.46-02.30_* *_రాహుకాలం: ఉ 09.00-10.30_* *_యమగండం/కేతుకాలం; మ 01.30-03.00_* *_సూర్యరాశి:కుంభం_* *_చంద్రరాశి:ధనుస్సు సూర్యోదయం:06.33 సూర్యాస్తమయం: 05.56_* *_ఓం నమో వెంకటేశాయ శని త్రయోదశి సర్వేజనాః సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవతు_ _ఓం శాంతి శాంతి శాంతిః_* *_శుభమస్తు సంతోషమస్తు_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
*_1️⃣3️⃣4️⃣_* *_సంపూర్ణ మహాభారతము_* *_134 వ రోజు_* *_వన పర్వము షష్టమాశ్వాసము:_* *_దుర్యోధనుని వైష్ణవయాగం_* *ఒక రోజు దుర్యోధనుడు కర్ణునితో..* *“కర్ణా! ధర్మరాజు రాజసూయయాగం చేసాడుకదా. అలాంటి యాగం నేను చేయాలని అనుకుంటున్నాను. తగు సన్నాహాలు కావించు!” అన్నాడు*. *కర్ణుడు వెంటనే “అదెంతపని సుయోధనా! ఈ భూమండలంలోని రాజులంతా నీ సామంతులు. అందరికీ ఆహ్వానాలు పంపించు. బ్రాహ్మణులను సత్కరించు*. *యాగశాలలు నిర్మించు. అన్న సంతర్పణకు సంభారాలు సమకూర్చు. దేవేంద్రుడు మాదిరి యాగం చెయ్యి!” అన్నాడు*. *సుయోధనుడు బ్రాహ్మణులను పిలిపించి రాజసూయయాగానికి తగిన సన్నాహాలు చేయమన్నాడు.* *వారు “సుయోధనా! పాండవులు నీ శత్రువులు. వారిని జయించి కాని నీవు రాజసూయ యాగం చేయలేవు*. *రాజసూయయాగం వంటిదే వైష్ణవయాగం. దానిని ఇది వరకు వాసుదేవుడు చేసాడు. అది నీకు తగిన యాగం” అని చెప్పారు*. *సుయోధనుడు అందుకు సమ్మతించి తల్లితండ్రులైన గాంధారిధృతరాష్ట్రుల వద్ద గురుదేవులైన ద్రోణ, కృపుల వద్ద, భీష్ముని వద్ద అనుమతి తీసుకున్నాడు.* *రాజులకు, బ్రాహ్మణోత్తములకు ఆహ్వానాలు పంపాడు*. *పాండవులకు ఆహ్వానం పంపాడు. దూత “ధర్మరాజా! సుయోధన చక్రవర్తి చేసే వైష్ణవయాగానికి మిమ్మలిని పిలువడానికి నన్ను పంపాడు. కనుక మీరు తప్పక వేంచేయాలి!” అని అర్ధించాడు*. *ధర్మరాజు “సుయోధనుడు యాగం చేయటం మాకు చాలా సంతోషం. దీని వలన మా వంశం పావనమౌతుంది*. *మేము చేసుకున్న ఒప్పందం కారణంగా మేము అరణ్యవాస సమయంలో నగరప్రవేశం చేయడం సమజసం కాదు. ఆ విషయం దయచేసి మీ రాజుకు చెప్పండి!” అన్నాడు*. *పక్కనే ఉన్న భీముడు “అరణ్యాజ్ఞాత వాసములు గడచిన పిమ్మట మేమే పిలవకుండానే వచ్చి మా ఆయుధాలతో అగ్ని గుండం వేల్చి అందులో నీ రాజు దుర్యోధనుని అతని నూరుగురు తమ్ములను యజ్ఞ పశువులుగా అర్పించగలము!” అని చెప్పు అన్నాడు*. *దూత అవే మాటలను సుయోధనునికి చెప్పాడు*. *ధృతరాష్ట్రుడు యాగనిర్వహణకు, అతిథి సత్కారానికి విదురుని నియోగించాడు.* *యాగం నిర్విఘ్నంగా సమాప్తి అయింది. యాగానికి వచ్చిన కొందరు సుయోధనుని పొగిడారు. కొందరు ధర్మరాజు చేసిన రాజసూయ యాగంతో అది సరి పోలదని అన్నారు.* *సోదరు లందరూ చుట్టూ నిలువగా ప్రముఖ ఆసనం పై కూర్చున్న దుర్యోధనుడితో కర్ణుడు “సుయోధనా! వైష్ణవ యాగం నిర్విఘ్నంగా జరిపించావు. ఇదే విధంగా పాండవులను చంపి రాజసూయ యాగం కూడా నెరవేర్చగలవు. నేను అర్జునుని చంపే వరకు నేను ఎవరితోనూ కాళ్ళు కడిగించుకోను. నీట బుట్టిన వేవీ తినను. ఎవరయినా యాచిస్తే లేదు అనను” అని భీషణ ప్రతిజ్ఞ చేసాడు*. *అందుకు సుయోధనుడు ఆనందించి “నీ సాయం ఉంటే పాండవులను జయించడం నాకు కష్టం కాదు!” అన్నాడు* #మన సంప్రదాయాలు సమాచారం