*మరణం లేకుండా మనిషి.. శాశ్వతంగా జీవించవచ్చా. దీనిపై ఎప్పటి నుంచో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.*
*********************************
*పోస్ట్ చేసిన వారు:-*
*యల్లాప్రగడ సత్యనారాయణ శర్మ*
*********************************
*చాలా మంది శాస్త్రవేత్తలు.. పెరుగుతున్న మనిషి వయసును అడ్డుకునేందుకు ఎన్నో రకాల చికిత్సలను కనుగొంటున్నారు.*
*అవి పూర్తి స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ మనుషుల ఆయుర్దాయం పెంచడంలో మాత్రం కీలక పాత్రను పోషించాయి.*
*గత కొన్ని దశాబ్దాలతో పోల్చితే మనుషుల సగటు జీవిత కాలం దాదాపు రెట్టింపు అయింది.*
*అయితే ప్రస్తుతం ప్రతీ రంగంలోకి ప్రవేశించి విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వచ్చే ఐదేళ్లలో మనుషుల సగటు జీవితకాలం రెట్టింపు కానున్నట్లు నిపుణులు చెబుతున్నారు.*
*దీంతో మనుషుల జీవిత కాలం 150 ఏళ్లకు పెరుగుతుందని భావిస్తున్నారు.*
*మరణాన్ని జయించడం కోసం జరుగుతున్న పరిశోధనల్లో ఇదొక కీలక ముందడుగు అని పేర్కొంటున్నారు.*
*Artificial Intelligence*
*మనిషి జీవితం వందేళ్లు కాదు,150 ఏళ్లు.. ఏఐతో..అద్భుతం, చావును జయించడంలో తొలి అడుగు అవుతుందా!*
*మనిషి జీవితం అంటే మనం 100 ఏళ్లు అనుకుంటాం. కానీ స్వాతంత్య్రం వచ్చే నాటికి భారతీయుల సగటు జీవితకాలం కేవలం 32 ఏళ్లు మాత్రమే.*
*సౌకర్యాల లేమి, సరైన వైద్యసదుపాయాలు లేకపోవడం, అంటువ్యాధులు.. ఇలా రకరకాల కారణాల వల్ల మరణం ముందుగానే సంభవించేది.*
*ఒక్క భారత్లోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో సగటు జీవితకాలం చాలా తక్కువగా ఉండేది.*
*ఆ తర్వాత వైద్యరంగంలో వచ్చిన ఎన్నో విప్లవాత్మక మార్పులు, పరిశోధనలు, కొత్త టెక్నాలజీ సాయంతో పనిచేసే వైద్య పరికరాలతో..అనేక రకాల వ్యాధులను గుర్తించడమే కాకుండా నయం చేయడం, అవి రాకుండా వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో.. మరణాల రేటు బాగా తగ్గింది.*
*అదే సమయంలో గతంతో పోలిస్తే.. గత కొన్ని దశాబ్దాలుగా.. దేశంలో శిశు మరణాల రేటు బాగా పడిపోవడంతో.. సగటు జీవిత కాలం పెరిగింది.*
*ప్రస్తుతం భారతీయుల సగటు జీవితకాలం 70 ఏళ్లు కాగా.. హాంకాంగ్, దక్షిణ కొరియా లాంటి దేశపౌరులు 85 ఏళ్ల సగటు జీవితకాలంతో ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలిచారు.*
*ఏఐతో అద్భుతాలు.*
*మరీ ముఖ్యంగా గత 200 ఏళ్లుగా మనిషి జీవితంలో పెను మార్పులు సంభవించాయి.*
*1824లో అమెరికాలో సగటు ఆయుర్దాయం 40 ఏళ్లుగా ఉండగా.. ప్రస్తుతం అది దాదాపు రెట్టింపు అయ్యింది. ఇక మనిషి జీవిత కాలాన్ని పెంచడంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది.*
*ప్రతీ రంగంలోనూ సంచలన మార్పులకు శ్రీకారం చుడుతున్న ఏఐ.. వైద్య రంగంలోనూ అద్భుతాలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.*
*ఇక ఏఐ ద్వారా అత్యంత ఎక్కువ ఉపయోగం ఏదైనా ఉందంటే.. అది అపారమైన డేటాను విశ్లేషించి.. అద్భుతమైన శాస్త్రీయ మేధస్సు కూడా కనుగొనలేని సరికొత్త పరిష్కారాలు, చికిత్సలు, వ్యాధులకు నివారణలను కనుగొనగలదని ఏఐ నిపుణులు పేర్కొంటున్నారు.*
*కణాల వృద్ధాప్యం , టెలోమియర్ కుంచించుకుపోవడం, క్యాన్సర్, మైటోకాండ్రియల్ లోపాలు, జన్యు అస్థిరత లేదా వృద్ధాప్యం, మరణానికి కారణమయ్యే ఇతర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేయడంలో ఏఐ ఒక వజ్రాయుధంగా ఉంటుందని పరిశోధనలు వెల్లడించాయి.*
*క్యాన్సర్ను గుర్తించడం, వ్యాధులకు చికిత్స చేయడం లేదా మానవ జీవిత కాలాన్ని పెంచడానికి కొత్త చికిత్సలను అభివృద్ధి చేయడంలో ఏఐ పెను మార్పులకు శ్రీకారం చుడుతుందని మార్చి 2025లో హార్వర్డ్ గెజిట్లో ప్రచురితమైన ఒక కథనం వెల్లడించింది.*
*ఆయుర్దాయం రెట్టింపు.. డేరియో అమోడీ అంచనా...*
*మనుషుల ఆయుర్దాయాన్ని పెంచడంలో ఏఐ పాత్ర గురించి శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆంథ్రోపిక్ సీఈఓ డేరియో అమోడీ వంటి కొందరు నిపుణులు.. కీలక వ్యాఖ్యలు చేశారు.*
*ఈ ఏఐ మానవ ఆయుర్దాయం విప్లవాన్ని కొనసాగించడమే కాకుండా.. దాన్ని సూపర్ఛార్జ్ చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కొంచెం ఎక్కువ అనిపించినా.. 20వ శతాబ్దంలో మనుషుల ఆయుర్దాయం దాదాపు 2 రెట్లు పెరిగిందని.. గతంలో 40 ఏళ్లు ఉండగా.. 75కి చేరినట్లు చెప్పారు. అదే సమయంలో 21వ శతాబ్దంలో ఇది 150 కావడం ట్రెండ్కు అనుగుణంగానే ఉంటుందని డేరియో అమోడీ 2024 అక్టోబర్ బ్లాగ్ పోస్ట్లో వెల్లడించారు.*
*ఎక్కువ కాలం జీవించేలా చేసే కొన్ని మందులు ఇప్పటికే ఎలుకల్లో జీవిత కాలాన్ని 25 నుంచి 50 శాతం పెంచుతున్నాయని తెలిపారు.*
*వాటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని పేర్కొన్నారు. కొన్ని జంతువులు (ఉదాహరణకు కొన్ని రకాల తాబేళ్లు) 200 ఏళ్లు జీవిస్తున్నాయని.. మనుషులు ఏదో ఒక సైద్ధాంతిక గరిష్ట పరిమితికి చేరలేదని డేరియో అమోడీ తెలిపారు.*
*5 ఏళ్లలో సగటు జీవితకాలం రెట్టింపు*
*2024 అక్టోబర్లో ఆయుర్దాయం పెంపు గురించి మాట్లాడిన డేరియో అమోడీ.. ఈ ఏడాది జనవరి నాటికి.. తన అంచనాలకు మరింత బలం చేకూర్చేలా వ్యాఖ్యలు చేశారు.*
*స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో.. ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. ఏఐ కేవలం 5 ఏళ్లలోనే మానవ జీవిత కాలాన్ని రెట్టింపు చేయగలదని తెలిపారు. ఇది ఆశ్చర్యపరిచే అంశమే అయినప్పటికీ.. వచ్చే 5 ఏళ్లలో ఏఐ గణనీయమైన అభివృద్ధిని సాధిస్తుందని వెల్లడించారు. మనుషులు 150 ఏళ్ల వయసును చేరుకున్న తర్వాత.. మనుషుల ఎగస్కేప్ వెలాసిటీకి చేరుకుంటుందని.. అంటే మానవులు ప్రాథమికంగా ఎంతకాలం జీవించాలో ఎంచుకోవచ్చని వివరించారు.*
*అయితే ఇది జీవపరంగా సాధ్యం కాకపోవచ్చని అమోడీ అంగీకరించారు.*
*నానోబాట్స్, బ్రెయిన్ బ్యాకప్లు*
*మనుషుల ఆయుర్దాయం పెరుగుతుందన్న అంచనాలు కేవలం అమోడీ మాత్రమే కాకుండా..పలువురు సైంటిస్ట్లు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.*
*ఫేమస్ శాస్త్రవేత్త రే కుర్జ్వీల్ కూడా 2032 నాటికి రెండు రకాలుగా ఏఐ వృద్ధాప్యాన్ని ఆపివేయగలదని తెలిపారు. అవే ఏఐ నానోబాట్స్, బ్రెయిన్ బ్యాకప్ అని వెల్లడించారు.*
*ఏఐ పవర్ఫుల్ నానోబాట్స్ మనుషుల శరీరంలో దెబ్బతిన్న కణాలను బాగుచేయడానికి ఏఐ పవర్ఫుల్ నానోబాట్స్ పనిచేస్తాయని రే కుర్జ్వీల్ తెలిపారు.*
*దీంతోపాటు శరీరంలో ఎక్కడైతే ప్రభావిత ప్రాంతం ఉంటుందో నేరుగా అక్కడికే ఔషధాలను అందించేందుకు ఈ నానోబాట్స్ ఉపయోగపడతాయని పేర్కొన్నారు.*
*బ్రెయిన్ బ్యాకప్*
*ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనుషుల మెదడులను క్లౌడ్కు బ్యాకప్ చేసే సామర్థ్యం ద్వారా.. మానవుల ఆయుర్దాయం పెరుగుతుందని రే కుర్జ్వీల్ అంచనా వేశారు.*
*అయితే మానవ మెదడు, అది ఎలా పనిచేస్తుందనే దానిపై ఇంకా అనేక ప్రశ్నలు ఉన్నందున ఇది సాధ్యమయ్యే అవకాశం లేదని కొందరు భావిస్తున్నారు.*
*ఏఐతో ఆయుర్దాయం పెరుగుదలపై విమర్శకుల అభిప్రాయం*
*క్యాన్సర్ను గుర్తించడానికి, రోగాలకు చికిత్స చేయడానికి, మనుషుల జీవిత కాలాన్ని మెరుగుపరిచేందుకు ఏఐని ఉపయోగించడం వల్ల మనుషుల జీవసంబంధమైన ఆయుర్దాయం పెరగదని నిపుణులు పేర్కొంటున్నారు.*
*వృద్ధాప్య జీవ ప్రక్రియను ఏఐ అడ్డుకోగలదు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చికాగోలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ ఎపిడెమియాలజీ, బయోస్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ ఎస్. జే. ఓల్షాన్స్కీ తెలిపారు. అమోడీ బ్లాగ్ పోస్ట్ చేసిన సమయంలోనే.. ఓల్షాన్స్కీ నేచర్ ఏజింగ్లో ఒక అధ్యయనాన్ని ప్రచురించారు. అయితే ఆయుర్దాయం విషయంలో వందేళ్ల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని ఆయన వెల్లడించారు.*
*ప్రస్తుతం వృద్ధాప్యం అడ్డుగా ఉందని.. ఈ ప్రక్రియ ఇప్పుడు మార్చలేనిదని పేర్కొన్నారు.*
*కానీ వృద్ధాప్యాన్ని నియంత్రించడానికి శాస్త్రవేత్తలు ఒక మార్గాన్ని కనుగొనడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని ఓల్షాన్స్కీ ఒక ఈమెయిల్లో తెలిపారు.*
*5 ఏళ్లలో అద్భుతమైన రీతిలో ఏఐ మానవ ఆయుర్దాయాన్ని పెంచినా.. అది నిర్ధారణ కావడానికి.. ఒక శతాబ్దం పాటు ధృవీకరణ, పరీక్షలు అవసరం అవుతాయని పేర్కొన్నారు. ఈ అంచనాలు నిజమవుతాయో లేదో రాబోయే కాలంలో వేచి చూడాలి.*
*సేకరించి పోస్ట్ చేసినవారు:-*
*యల్లాప్రగడ సత్యనారాయణ శర్మ*
#🌍నా తెలంగాణ #📙ఆధ్యాత్మిక మాటలు #😃మంచి మాటలు #షేర్ చాట్ బజార్👍 #🌊మన కోస్తాంధ్ర