జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పదో తరగతి విద్యార్థి ఎ.శ్రీజ, నర్సరీల్లో వాడే పాలిథీన్ కవర్లకు ప్రత్యామ్నాయంగా వేరుశనగ పొట్టు, ఇతర సహజసిద్ధ పదార్థాలతో 'బయో-పాట్స్' (పర్యావరణహిత కుండీలు) తయారు చేసింది.
ఈ కుండీలు మట్టిలో సులువుగా కలిసిపోవడమే కాకుండా మొక్క ఎదుగుదలకు కూడా తోడ్పడతాయి. శ్రీజ చేసిన ఈ సరికొత్త ఆవిష్కరణకు గాను గతేడాది జాతీయ స్థాయి CSIR ఇన్నోవేషన్ అవార్డుల్లో 3వ స్థానం లభించడమే కాకుండా, రాష్ట్రస్థాయి అవార్డు కూడా లభించింది.
ఈమె చేస్తున్న పనిని గుర్తించిన టీ-వర్క్స్ సంస్థ ఆమెకు ‘BioPress 4T’ అనే కుండీల తయారీ యంత్రాన్ని అందించి అండగా నిలవగా, రీసెంట్ గా పార్లమెంటరీ కమిటీ నుంచి కూడా ఆమెకు ప్రశంసలు రావడం విశేషం.
#TALRadioTelugu #GoodNews #StudentInnovation #EcoFriendly #TelanganaPride #BioPots #GreenInnovation
#💪పాజిటీవ్ స్టోరీస్ #😇My Status #🙆 Feel Good Status