P.Venkateswara Rao
555 views
2 days ago
#ఎల్లో మీడియా.. 💥 రాధాకృష్ణ గారూ... ఏమయ్యింది మీకు...? మనవాళ్లు షికార్లకు వెళితే ఒప్పు.... వేరే వాళ్ళు షికార్లకు వెళితే తప్పా ...? గతంలో పెదబాబు , చినబాబులు విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు వారికి... జాకీలు పెడుతూ వార్తలు రాశారు కదా...? అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు గుర్తు లేదా...? ఇప్పుడు మంత్రులు విదేశీ పర్యటనకు వెళితే ... దీనిని ఎందుకు తప్పుపడుతున్నారు...? అప్పట్లో కూడా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కదా..? మరి... అప్పట్లో ఇలాంటి వార్తలు ఎందుకు రాయలేదు..? 1) మింగ మెతుకు లేదు.... కానీ... మంత్రులకు సింగపూర్ ట్రిప్పు..! ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న ఈ సమయంలో... మంత్రులు సింగపూర్ వెళ్లడం అవసరమా...? అక్కడకు వెళ్లి ఏమి నేర్చుకుంటారు..? దీని వలన ఏమి ఉపయోగం..? అంటూ ఆంధ్ర జ్యోతి యజమాని రాధాకృష్ణ తీవ్రంగా మంత్రుల యాత్రను తప్పుపట్టారు (ఏప్రిల్ 25 , 2026 ) 2) గడ్డకట్టించే చలిలో... దావోస్ లో ప్రస్తుతం మైనస్ 8. డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.. ఆ గడ్డకట్టేంత చలిలో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పర్యటన సాగిస్తోంది. బందంలోని సభ్యులంతా నాలు గైదు అంచెల దుస్తులను ధరిస్తున్నారు. చంద్రబాబు మాత్రం రెండంచెల దుస్తులే ధరిస్తున్నారు. పైన కోటు కూడా చేసుకోవడం లేదు... అని మురిసిపోతూ రాధాకృష్ణ రాశాడు (జనవరి 17 , 2017 ) అంటే.... చినబాబు , పెదబాబు అమరావతి మాస్టర్ ప్లాన్లు , డిజైన్ల కోసం ప్రత్యేక విమానాల్లో సంవత్సరాల తరబడి ప్రజాధనాన్ని దుబారా చేస్తూ ...ఊరేగితే అప్పుడు నీకు కమ్మగా ఉందా..? ఇప్పుడు ....అనితమ్మ , అచ్చన్న , సత్య కుమార్ వంటి ఇతర వర్గాలకు చెందిన మంత్రులు విదేశీ పర్యటనకు వెళితే మీకు నచ్చలేదా...? అప్పుడు గుర్తుకు రాని దుబారా , రాష్ట్ర ఆర్థిక పరిస్థితి... ఇప్పుడే మీకు గుర్తుకు వచ్చిందా..? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై మీకు నిజంగానే ఆందోళన ఉంటే... ఒకవైపు ఆరోగ్య శ్రీ కి నిధులు లేక , మరొకవైపు ఫీజు రీయంబర్స్మెంట్ కి నిధులు లేక , మెడికల్ కాలేజీలను కట్టడానికి డబ్బులు లేక సతమతమవుతున్న ఈ సమయంలో .... మనకు లక్ష ఎకరాలలో ... కొన్ని లక్షల కోట్లు తగలబెట్టి రాజధానిని కట్టడం అవసరమా ....? అని ఎందుకు మీరు వార్తలు రాయలేకపోతున్నారు..? శ్రీనివాస్ ఉత్తరాంధ్ర