ఎల్లో మీడియా.. 💥
865 Posts • 126K views
P.Venkateswara Rao
514 views 9 hours ago
#మోదీ #బీజేపీ #ఎల్లో మీడియా.. 💥 *90 ఏళ్ల దాకా మోదీ ఆ కుర్చీ వదలడా..? మరో రెండు టరమ్స్ తనేనా..⁉️* March 15, 2026🎯 మరో రెండు టరమ్స్ నేనే ప్రధానిని… అని మోడీ తనను కలిసినవాళ్లతో చెబుతున్నాడని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకొచ్చాడు ఈరోజు కొత్త పలుకు వ్యాసంలో… అంటే ఇప్పటికే తనకు 75 ఏళ్లు… అంటే 90 ఏళ్లు వచ్చే దాకా తనే ప్రధానిగా ఉండగలడా అని కూడా హాశ్చర్యపోయాడు… ‘ఈ శతాబ్ది’ నాదే అని మోడీ ధీమాగా పలు పార్టీల నాయకులతో చెబుతున్నాడని రాధాకృష్ణ ఉవాచ… నిజమో కాదో మోడీ చెప్పడు, ఖండించడు కానీ..? నిజానికి 75 ఏళ్లు దాటాక బీజేపీలో ఎంత ప్రముఖ నాయకుడైనా సరే, మార్గదర్శక మండలిలో గౌరవంగా కూర్చోబెడతారు… అంటే మర్యాదగా తప్పిస్తారు… అడ్వానీ దగ్గర నుంచి మురళీ మనోహర్ జోషి దాకా చాలా మంది ఇలాగే తప్పించబడ్డారు… మోడీకి ప్రస్తుతం 75 ఏళ్లు… మరో మూడేళ్లు ఎలాగూ ప్రధానిగా తనే ఉంటాడు… అంటే 78 ఏళ్లు… మార్గదర్శక మండలికి వెళ్లిపోవాలనే అలిఖిత నియమం నుంచి తనకు మినహాయింపు ఉంటుందా, కాలం చెప్పాలి… బీజేపీ మీద మోదీ అమోఘమైన పట్టు నిజమే కానీ… అన్నీ తను అనుకున్నట్టు జరగవు, బీజేపీ పద్ధతి వేరు… కానీ ఒకటి మాత్రం నిజం… జాతీయ రాజకీయాల్లో, రాష్ట్రాల రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పట్టును మాత్రం మోడీ ఎక్కడికక్కడ బ్రేక్ చేస్తున్న మాట నిజం… అవినీతి, అక్రమాలు, కుటుంబపాలనతో కునారిల్లుతున్న ప్రాంతీయ పార్టీలకు జాతీయాంశాలపై ఓ ఐడియాలజీ గానీ, ఓ దృక్పథం గానీ ఏమీ ఉండటం లేదు… డబ్బు, అధికారం యావ తప్ప..! ఒడిశాలో నవీన్ పట్నాయక్ బీజేడీ పని అయిపోయినట్టే ఇక… రీసెంట్ పరిణామాల్లో నితిశ్‌ను సీఎం పదవి నుంచి తప్పించారు, బీహార్‌లో బీజేపీ మరింత బలపడి, జేడీయూ కాలక్రమేణా కనుమరుగు కావడం ఖాయం… శివసేన సంగతి చూశాం, ఎన్సీపీ సంగతీ అంతే… బీహార్‌లో ఆర్జేడీ, యూపీలో ఎస్పీ ఈరోజుకూ కోలుకోవడం లేదు… కొన్ని ఉదాహరణలు ఇవి… మోడీతో పెట్టుకుని, దెబ్బతిని, మళ్లీ ఎలాగోలా మోడీ ప్రాపకం సంపాదించి చంద్రబాబు కోలుకున్నాడు, తేరుకున్నాడు… కేసీయార్ దెబ్బతిని ఇంకా కోలుకోలేదు, మోడీ ప్రాపకం కోసం ఏవేవో ప్రయత్నాలు… ఈ ఇద్దరూ ఓ దశలో మోడీని విపరీతంగా ఆడిపోసుకుని వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసినవాళ్లే… కేసీయార్ అయితే ఏకంగా ప్రధాని పదవినే ఆశించాడు… సరే, ఎఐడీఎంకే ప్రస్తుతం బీజేపీ అనుబంధ పార్టీగా మారిపోయింది… ఎటొచ్చీ డీఎంకే, టీఎంసీలు మాత్రమే బలంగా నిలబడి, మోడీ దెబ్బల నుంచి తమను తాము కాపాడుకున్నాయి… జేఎంఎం వంటివీ ఉన్నా, మరీ బలంగా ఏమీ లేవు… మోడీ ఒక్కొక్కటీ నరుక్కుంటూ వస్తున్నాడు… ఈసారి బెంగాల్ గనుక బీజేపీ కైవసం అయితే ఇక టీఎంసీకి చుక్కలు చూపిస్తాడు… అస్సోం సంగతి తెలిసిందే కదా… సీఎం హిమంత ఎంతగా పాతుకుపోయాడో… హిమంత, యోగి, ఫడ్నవీస్… ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో బలమైన నాయకుడిని తయారు చేసి, పార్టీని పటిష్టం చేస్తూ… అవసరమైనచోట్ల ప్రాంతీయ పార్టీలను వాడుకోవడం, తరువాత తప్పించడం… ఈ కార్యాచరణ ఇలా కొనసాగుతూనే ఉంటుంది… బీజేపీ లైన్ అది, మోడీ సొంత కార్యాచరణ కాదు… ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ ఎంతగా మోడీ పాపులారిటీ పట్ల అసహనంగా ఉన్నాసరే, ఇప్పటి బీజేపీ స్థితికి ప్రధాన కారకుడు మాత్రం కచ్చితంగా మోడీయే… మరో రెండు టరమ్స్ ఉంటాడా లేడానే చర్చ వదిలేస్తే… భారత రాజకీయాల్లో తనకంటూ ఓ విశిష్ట అధ్యాయం మాత్రం లిఖించుకున్నాడు… బహుశా ఆ భావనే ‘ఈ శతాబ్ది నాది’ అనిపించిందేమో తనతో… పైగా తనకు దీటైన ప్రజాదరణ ఉన్న నేత మరొకరు కనిపించడం లేదు బీజేపీలో… అవసరాన్ని బట్టి యడ్యురప్పకు ఈ వయోపరిమితి నుంచి మినహాయింపులు ఇచ్చింది కదా పార్టీ… జమిలి ఎన్నికల పరమార్థం కూడా ప్రాంతీయ పార్టీలను మరింత దెబ్బతీయడమే… సర్ ప్రక్రియ మీద నానారకాల విఫల పోరాటం చేసిన మమత, స్టాలిన్ తదితరులు కూడా రాబోయే పరిణామాల్ని అర్థం చేసుకుంటున్నారు, జమిలిపై ఆల్రెడీ వ్యతిరేక గళం విప్పుతున్నారు కూడా… లెఫ్ట్ కూడా నామమాత్రం అయిపోతున్న నేపథ్యంలో, రేపు కేరళలోనూ అధికారం కోల్పోతున్న స్థితిలో… ఇక రాబోయే కాలంలో బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే ప్రధాన పార్టీలు కానున్నాయా..? రాహుల్ నాయకత్వం నుంచి బయటపడితే కాంగ్రెస్‌కు ఇంకాస్త మంచి రోజులు వస్తాయేమో..! ఆర్టికల్ 370 ఎత్తివేత, అయోధ్య ఆలయ నిర్మాణం, తక్షణ ట్రిపుల్ తలాఖ్ రద్దు వంటివి స్థూలంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఎజెండాలో ఉన్నా అవి సాకారం అవుతాయా అనే సందేహం సంఘ్ కేడర్‌లోనే ఉండేది… అవి సాకారం అయిపోయాయి… కామన్ సివిల్ కోడ్ వంటివి కొన్ని బాకీ ఉన్నాయి… అవీ అవుతాయి… అందుకే మోడీపై మోహన్ భగవత్ ఎంత రుసరుసలాడినా సరే, ఆ ఆగ్రహ ప్రభావం మోడీపై ఏమీ కనిపించడం లేదు… మోడీ తనకు పడకపోతే ఎవరినైనా ఎలా శంకరగిరి మాన్యాలు పట్టిస్తాడో సంఘ్ అనుబంధ వీహెచ్పీ తొగాడియాకు తెలుసు… మరి మోహన్ భగవత్..? కాలం చెబుతుంది… చివరగా… నేను మరో ఆరు నెలలు ముఖ్యమంత్రిగా అదనపు కాలం పొందుతాను అని రేవంత్ రెడ్డి తన వాళ్లతో చెబుతున్నాడని రాధాకృష్ణ ఉవాచ… అంటే జమిలి ఎన్నికల కోసం ప్రస్తుత శాసనసభ పరిమితిని మరో ఆరు నెలలు పొడిగిస్తారని సారాంశం… కానీ రేవంత్ రెడ్డి చెబుతున్నది అదనపు ఆరు నెలలు కాదు, 2029 లో కూడా నేనే అని..!! బీజేపీ, బీఆర్ఎస్ కలవకపోతే, బీజేపీలోని వర్గ తన్నులాటలు ఆగకపోతే జరిగేది కూడా అదే..!!
8 likes
10 shares
P.Venkateswara Rao
576 views 8 days ago
#ఏపీ అప్ డేట్స్..📖 #ఎల్లో మీడియా.. 🤠 *కూటమిని కలవరపెడుతున్న అనుకూల పత్రిక కథనం❗* MARCH 7, 2026🎯 కూటమి ప్రభుత్వం కోసం ఎందాకైనా అన్నట్టుగా ఆ మీడియా వ్యవహరిస్తుంటుంది. ఆ మీడియా సంస్థకు విశాఖలో భూకేటాయింపును వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత, మళ్లీ విలువైన భూమిని కేటాయించారంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ వ్యవహారం న్యాయ స్థానంలో నడుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ శ్రేయస్సును కాంక్షించే సదరు మీడియా పోలీసింగ్ చేస్తోంటోంది. ప్రభుత్వ నిఘా వర్గాల కంటే, తనకే ఎక్కువ బాధ్యత వున్నట్టు ఎక్కడేం జరుగుతున్నదో తన మీడియా నిఘానేత్రం ద్వారా ఎప్పటికప్పుడు బయటపెట్టడానికి తహతహలాడుతూ వుంటుంది. అందులో భాగంగా ఇవాళ ఒక కీలక విషయాన్ని సదరు ప్రభుత్వ అనుకూల పత్రిక బయట పెట్టింది. వైఎస్ జగన్కు అనుకూలమైన ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో విజయవాడలో కీలక భేటీ జరిగిందట! ఏడాది క్రితం ఇదే రిటైర్డ్ అధికారి కలుద్దామని అడిగితే, ప్రస్తుత ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు దూరంగా ఉన్నారని రాసుకొచ్చారు. కానీ ఇటీవల ఆ రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి పిలిస్తే, ఆరేడుగురు ఐఏఎస్లతో పాటు మొత్తం 12 మంది ఉన్నతాధికారులు వెళ్లారనే సంగతిని బయట పెట్టడం విశేషం. మరీ ముఖ్యంగా ఐఏఎస్లలో కార్యదర్శి స్థాయి అధికారులున్నారనే సంచలనాన్ని బయట పెట్టారు. ఈ కథనం కూటమి ప్రభుత్వం ప్రమాదంలో వుందనే హెచ్చరిక చేస్తోంది. ప్రభుత్వంపై ప్రజలనాడిని గుర్తించేది మొదట ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులే. ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూలత లేదని పసిగడితే, నెమ్మదిగా ప్రతిపక్ష నాయకులకు చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తారు. గతంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వుందని తెలుసుకున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చేరువ అయ్యేందుకు ప్రయత్నించారు. ప్రతిపక్షం కోరిన కీలక సమాచారాన్ని చేరవేసేవారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కీలక పదవులను పొందారనడం బహిరంగ రహస్యమే. అయితే ప్రభుత్వాలు శాశ్వతం కాదని, ఉద్యోగులైన తామే పదవీ విరమణ అయ్యే వరకూ పదవుల్లో కొనసాగుతామని ఉద్యోగులకు బాగా తెలుసు. ఆ విషయాన్ని నిత్యం తమ మనసుల్లో పెట్టుకుని ఉద్యోగులు మెలుగుతూ వుంటారు. సదరు ప్రభుత్వ వీరాభిమాన పత్రిక కథనం ప్రకారం ప్రస్తుతం ప్రభుత్వంలో కీలక వ్యక్తుల వద్ద క్రియాశీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కార్యదర్శి స్థాయి అధికారులున్నారు. ఇలాంటి వాళ్లు వైసీపీ అనుకూల రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వద్దకు వెళ్లారంటే చిన్న విషయం కాదు. లాభనష్టాలను బేరీజు వేసుకున్నాకే, సదరు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి వద్దకు వెళ్లి వుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వుందనే అభిప్రాయానికి ఉన్నత స్థాయి ఉద్యోగులతో పాటు చిన్న ఉద్యోగులు కూడా వచ్చారనేందుకు ఇదే సంకేతం. అయితే ప్రస్తుతానికి సీనియర్ ఐఏఎస్ అధికారులే సదరు రిటైర్డ్ ఉన్నతోద్యోగి వద్దకు వెళ్లి వుండొచ్చు. భవిష్యత్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే ఉన్నత ఉద్యోగ వర్గాల్లో లాబీయింగ్ మొదలైందనే చర్చకు తెరలేచింది. ఒకవైపు ప్రస్తుత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, మరోవైపు వైసీపీని కూడా కన్నుగీటుతున్నారంటే, క్షేత్రస్థాయిలోనూ, ఉద్యోగుల్లోనూ వచ్చిన, వస్తున్న మార్పునకు స్పష్టమైన సంకేతంగా భావించొచ్చు. కూటమి ప్రభుత్వం నుంచి రహస్యాలు రాబట్టడానికే కీలక సమావేశం నిర్వహించారనడం కంటే, ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటున్నారని ఎందుకు అనుకోకూడదు? ప్రస్తుత కాలంలో ఏదీ రహస్యంగా వుంచడానికి వీలు కాదు. పదుల సంఖ్యలో ఐఏఎస్, ఇతర ఉన్నత ఉద్యోగులు ఒక చోట కలుస్తున్నారంటే బయటికి తెలియదని అనుకునేంత అమాయకులు లేరు. అయినప్పటికీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని కార్యదర్శి స్థాయి, అది కూడా కీలక నాయకుల వద్ద ముఖ్యమైన బాధ్యతల్ని నిర్వహించే వారు వెళ్లారంటే, ఆలోచించాల్సింది పాలకులే. ఇంత తక్కువ సమయంలో వైసీపీ పెద్దలకు ఐఏఎస్, ఇతర ఉన్నత ఉద్యోగులు దగ్గర కావాలని ఎందుకు అనుకుంటున్నారో పాలకులు సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పాలన గురించి మనం అనుకుంటున్నది, క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం వేరుగా వుందని ప్రభుత్వ పెద్దలకు ఇప్పటికైనా అర్థమై వుండాలి. ఈ కథనం నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని కలవడానికి ఎవరెవరు వెళ్లారో ఆరా తీయడం పక్కన పెట్టాలి. అసలు ప్రభుత్వం ఆలోచించాల్సింది... ఇంకా ప్రభుత్వం మూడేళ్లు ఉంటుందని తెలిసినా, వైసీపీ వైపు పెద్దపెద్ద ఉద్యోగులు ఎందుకు ఆకర్షితులవుతున్నారో ప్రశ్నించుకోవాలి. అప్పుడు సమాధానం దొరుకుతుంది. స్వీపర్, అటెండర్ స్థాయి ఉద్యోగులు మొదలుకుని, ప్రధాన కార్యదర్శి వరకూ ప్రభుత్వానికి అనుకూలంగా వుండాలని భావిస్తారు. ఇదే సందర్భంలో ప్రభుత్వ పరపతి ప్రజల్లో పడిపోతోందని గుర్తిస్తే, వెంటనే అప్రమత్తం అయ్యేది కూడా ఉద్యోగులే. ఈ కథనం చదివిన తర్వాత, ఉద్యోగుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ఎవరైనా అనుకునే అవకాశం వుంది. ఇది మిగిలిన ఉద్యోగుల్లో కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ప్రభుత్వ పరిస్థితి బాగాలేనట్టుందని, అందుకే అంతపెద్ద స్థాయి ఉద్యోగులు కూడా వైసీపీ వైపు అట్రాక్ట్ అవుతున్నారని చిన్నస్థాయి ఉద్యోగుల ఆలోచనల్లో మార్పునకు బీజం పడుతుంది. ఇది ప్రభుత్వానికి అత్యంత ప్రమాదకరం. ప్రభుత్వ పెద్దలు, కూటమి నేతలు చెప్పిన పని చేయడానికి అధికారులు పెద్దగా ఆసక్తి చూపరు. మరీ ముఖ్యంగా వివాదాస్పద అంశాల్ని ఉద్యోగులు పూర్తిగా పక్కన పెడతారు. అలాంటి పనులు చేసి వైసీపీకి తామెందుకు టార్గెట్ కావాలని అనుకుంటారు. ప్రజల్లో ప్రభుత్వంపై అంత సానుకూలత వాతావరణం లేదనే నిర్ణయానికి ఉద్యోగులు వస్తే, జరిగే మార్పులివే. తమ అనుకూల పత్రిక కథనంతో మేల్కోవాల్సింది ప్రభుత్వ పెద్దలే. తమ పాలనపై ప్రజల్లో మార్పు కనపడుతోందని, అందుకే ఎంతో నమ్మకమని భావించి కీలక బాధ్యతలు అప్పగించిన ఉద్యోగుల్లో సైతం మార్పు వస్తోందని పాలకులు గుర్తించాలి. పాలనపై పోస్టుమార్టానికి ఇదే సరైన సమయం. ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.
9 likes
9 shares
P.Venkateswara Rao
585 views 4 months ago
#ఎల్లో మీడియా.. 🤠 *వావ్… తెలుగు టీవీ చానెళ్లలో ఇప్పుడు ఏబీఎన్ ఫస్ట్ ప్లేస్ అట…❗* October 28, 2025🔥 మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడికి ఓ ముసలివాడిగా కనిపించిన కృష్ణుడు తత్వబోధ చేస్తుంటాడు… ‘‘చిన మాయను పెద మాయ, పెద మాయను పెను మాయ, అటు మాయ ఇటు మాయ’’ అంటూ… ఈ వారం బార్క్ రేటింగులు, మరీ ప్రత్యేకించి వార్తా చానెళ్ల రేటింగులు, అందులోనూ హైదరాబాద్ సిటీ రేటింగులు చూస్తుంటే పైన తత్వమే చెవుల్లో వినిపిస్తోంది లీలగా… అలా ఉన్నాయి ఆ రేటింగుల తీరు… ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తి, సాంబలను వాళ్లంటే పడని రాజకీయ శక్తులు, క్యాంపులు పదే పదే యెల్లో చానెళ్లు, విపరీత పోకడల చానెళ్లు అని ఆడిపోసుకుంటూ ఉంటయ్… అదసలు జర్నలిజమేనా అంటుంటాయి గానీ… వాళ్లు ఆ చానెళ్లను ఎంత పైకి లేపుతున్నారో తెలుసా…? హైదరాబాద్ బార్క్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ ఇప్పుడు ఏబీఎన్… థర్డ్ ప్లేస్ టీవీ5… నిజమండీ బాబూ… ఈ టేబుల్ చూడండి, తాజా రేటింగులే ఇవి… రెండు తెలుగు రాష్ట్రాల సగటు రేటింగుల్లో నాలుగో ప్లేసులో ఉన్న ఏబీఎన్ హైదరాబాదులో ఫస్ట్ ప్లేసు ఏమిటి…? మాయ…! కేసీయార్ వాయిస్ టీ న్యూస్ మరీ అన్ని చానెళ్లలోకెల్లా దిగువన 14వ ప్లేసులో ఉండిపోయి, చివరకు ఎవరూ దేకని ఈటీవీ తెలంగాణకన్నా కునారిల్లడం ఏమిటి..? మాయ..! ఓవరాల్ రేటింగుల్లో కనిపించే ప్రైమ్ 9, మహా న్యూస్, ఐన్యూస్ హైదరాబాద్ టాప్-10 లో అసలు కనిపించకపోవడం ఏమిటి..? మాయ..! అంతా మాయ..! అసలు ఈ రేటింగు కొలిచే మీటర్లు, ఆ ఇళ్ల వీక్షణాల కొనుగోళ్లు దేశవ్యాప్తంగా ఓ పెద్ద దందా… వినోద చానెళ్లూ అదే తంతు… పెద్ద పెద్ద చానెళ్లను దాటేసి స్టార్ మా చానెల్ దేశంలోనే టాప్ ప్లేసులో ఉంటుంది… మాయ..! అదే చానెల్ తీరా హైదరాబాదుకు వచ్చేసరికి జీతెలుగుకన్నా దిగువన రెండో ప్లేసులో ఉంటుంది… మాయ..! ఈ దిక్కుమాలిన సిస్టం బదులు మరో శాస్త్రీయ విధానం తీసుకొస్తామని ప్రసార మంత్రిత్వ శాఖ చెబుతూనే ఉంటుంది, కానీ తీసుకురాదు… మాయ..! వేల కోట్ల టీవీ యాడ్స్ అందరినీ ప్రభావితం చేస్తాయి మరి..! అదే మాయ అంటే..! రేటింగ్ మేనేజ్‌మెంట్ అనేది ఓ వ్యాపార కళ, నిర్వహణ కళ… అందులో రాణించేవాడికే టీవీ ఇండస్ట్రీలో పెద్దపీట… మరి దాన్నెందుకు నమ్మడం అంటే..? పత్రికలకు సంబంధించి ఏబీసీలాగే టీవీల రేటింగులకు ఇదే ప్రామాణికంగా తీసుకోబడుతున్న అశాస్త్రీయ, అధికారిక విధానం కాబట్టి… కేంద్ర సర్కారుకు ఈ విషయంలో పెద్ద సోయి లేదు, ఆసక్తీ లేదు కాబట్టి… స్టార్ గ్రూపు మేనేజ్‌మెంట్ మెరిట్ ఎదుట పెద్ద పెద్ద ఇతర జాతీయ గ్రూపులూ వెలవెలబోతున్నాయి కాబట్టి… ఏమో, చెప్పలేం, టీవీ5 నాయుడు మరింత కాన్సంట్రేట్ చేస్తే… వచ్చేవారమో, ఆ మరుసటి వారమో టీవీ5 ఫస్ట్ ప్లేసులోకి రావచ్చునేమో..!!
8 likes
3 shares