ఎల్లో మీడియా.. 💥

854 Posts • 129K views
P.Venkateswara Rao
612 views 1 days ago
#ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 #ఎల్లో మీడియా.. 💥 *బొద్దింకలు సజీవంగా, చురుకుగా ఉండాలట – రాజకీయాల్లోకి రావద్దట..‼️* August 9, 2026🎯 ఒక విరుద్ధ దృశ్యం… భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభసభలో చంద్రబాబు మోదీని ఆకాశానికెత్తేశాడు… అఫ్‌కోర్స్, పవన్ కల్యాణ్ పొగిడినా సరే, తనవెప్పుడూ చంచల, అస్థిర భాషణలు, విధేయతలే కాబట్టి వదిలేస్తే… దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్, దేశముదురు చంద్రబాబు పొగడ్తలే మరీ ‘అతి’గా అనిపించాయి చాలామందికి… సరే, ఎవరి బాష్యం వాళ్లు చెప్పుకున్నారు… మోదీ భార్యను కూడా ప్రస్తావించి ఎగతాళి చేసిన చంద్రబాబుకు తరువాత రోజుల్లో ‘తత్వం’ బోధపడి, దాదాపు కాళ్లబేరానికి వచ్చాడు… సరే, పొత్తు, ఫలించిన గెలుపు, మళ్లీ అధికారం, అదంతా వేరే కథ… వరుస దెబ్బలు, తలనొప్పులతో డీలాపడిన మోదీని ఆకాశానికెత్తడం ఎవరికో ఎందుకు..? సాక్షాత్తూ చంద్రబాబు వాయిస్ రాధాకృష్ణకే నచ్చడం లేదు పాపం… అందుకే నేటి తన తొలిపలుకు వ్యాసంలో తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు… సరే, అంగారక గ్రహంలో జీవం ఉనికి అనే సబ్జెక్టు తీసుకున్నా సరే, తను అందులో కూడా జగన్‌ ప్రస్తావన తీసుకొచ్చి తిడతాడు కదా, ఇందులోనూ జగన్‌ను తీసుకొచ్చాడు… ఏమనీ అంటే..? ‘‘ప్రధాని మోదీ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉంటున్నాడనే భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలంగా ఉంది కాబట్టి, అందుకని మోదీని చంద్రబాబు అతిగా పొగడటం జనానికి నచ్చడం లేదట… (రాధాకృష్ణకు నచ్చకపోతే ఏపీ ప్రజలకు నచ్చనట్టే లెక్క తన దృష్టిలో… దీన్నీ జెన్‌జీ భాషలో సంకుచితిజం అంటారు) … 2019 లో మోదీ బలంగా ఉన్నప్పుడు చంద్రబాబు తనతో సయోధ్యతో ఉన్నాడు సరే, ఇప్పుడు మోదీ బలహీనపడ్డాడు, ఇప్పుడు కూడా అదే సాగిలబాటు అవసరమాని తెలుగు ప్రజలు తెగ ఫీలయిపోతున్నారట… అంటే మోదీ బలంగా ఉంటే దోస్తీ, బలహీనపడితే దూరమా..? వావ్… రాధాకృష్ణ ‘అవకాశవాదం ఎలా వదిలేస్తావోయ్ బాబూ’ అని ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది… అంటే, చంద్రబాబూ, నీ ఒరిజినల్ వైఖరి వదిలేస్తున్నావా, ఎంత సిగ్గుచేటు, మన నిజతత్వం ఏమిటి, నువ్వు చేస్తున్నదేమిటి..? అని శంకరాభరణంలో శంకరశాస్త్రిలా ప్రశ్నిస్తున్నాడు… జగన్‌ మనిషిగా, పాలకుడిగా, పార్టీ అధినేతగా ఎలాంటివాడైనా సరే… తనకు ప్రాప్తకాలజ్ఞత ఉంది.., మోదీకి చంద్రబాబు నిజగుణం తెలుసు… అందుకే జగన్‌ను మోదీ దూరం చేసుకోడు… జగన్ మోదీ మీద తిరుగుబాటు జెండా ఎగరేయడు… ఇదే కదా, ఈమధ్య ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పుకొచ్చింది… కాకపోతే దాన్ని జనసేన- ఢిల్లీ అమిత్ షా భేటీ అనే కల్పనాత్మక కథలో చెప్పడమే పెద్ద వివాదమై కూర్చుంది… చివరగా… కాక్రోచ్ పార్టీ రాజకీయాల్లోకి రావద్దనే నిర్ణయం భేష్ అంటాడు రాధాకృష్ణ… కేవలం విజిల్ బ్లోయర్‌లాగే ఉండాలట… జయప్రకాష్ నారాయణ, లక్ష్మినారాయణ దెబ్బతినడమే ఉదాహరణ అంటాడు… ఎందుకంటే..? ఏమో, జగన్, బాబు తప్ప వేరే ఆల్టర్నేట్ దిక్కులేని ఏపీలోకి కాక్రోచ్ పార్టీ జొరబడితే తన బాబుకే ప్రమాదం అనే భావన ఇది… అందుకే బొద్దింకలు సజీవంగా ఉండాలి, కానీ రాజకీయాల్లోకి రావద్దు..!!
12 likes
14 shares
P.Venkateswara Rao
618 views 2 months ago
#ఎల్లో మీడియా.. 💥 *బాబును ఏమీ అనలేడు- పవన్‌ ను తప్పనలేడు- జగన్‌ను అనకుండా ఉండలేడు…💥* June 7, 2026✍🏻 ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎంత పాతవిషయాల్ని తన కొత్త పలుకులో రాసుకొచ్చినా సరే… ప్రపంచంలోని ఏ విషయాన్నయినా సరే తీసుకొచ్చి జగన్ మెడకు చుట్టే ప్రయత్నం చేస్తుంటాడు… అఫ్‌కోర్స్, సాక్షిలో వర్దెల్లి మురళి కూడా ప్రతి దాన్నీ చంద్రబాబు దగ్గరకు తీసుకొస్తుంటాడు… సరే, ఇద్దరివీ రాజకీయ ప్రేరిత వ్యాసాలే కదా… నిష్పాక్షికతను ఆశించలేం, చూడలేం, ఉండవు కూడా… ఈరోజు రాధాకృష్ణ ఇటీవల నాగేశ్వర్- పవన్ కల్యాణ్ వివాదంలోకి జగన్‌ను తీసుకొచ్చాడు… నిజానికి పవన్ కల్యాణ్‌, చంద్రబాబు తెలంగాణ వనరుల్ని దోచుకోలేదనీ, అలా దోచుకున్న వైఎస్‌ను, జగన్‌ను మాత్రం తెలంగాణవాదులు ఏమీ అనడం లేదని బాధపడిపోయాడు పాపం… ఇక్కడ తనకు ఓ క్లారిటీ కావాలి, ఉంది, ఈ వ్యాసంలోనూ అది కనిపించింది, కానీ మళ్లీ ఏదోరకంగా జగన్ మీద వ్యతిరేకతను, తన కూటమే కాబట్టి చంద్రబాబును, పవన్ కల్యాణ్‌ను ఏమీ అనడు… పవన్ కల్యాణ్ భాష ‘ఎవడబ్బ జాగీరు’ ప్రస్తావన ఏది వ్యాసంలో..? తెలంగాణవాదం ఆది నుంచీ ఆంధ్రుల దోపిడీ మీద మాత్రమే కాదు… స్వరాష్ట్ర సాధన, స్వపరిపాలన కోసం… ఎవరు హైదరాబాదు, తెలంగాణల్లో బతికినా తెలంగాణ భూమిపుత్రులకు వ్యతిరేకత లేదు, ఆహ్వానిస్తారు, అక్కున చేర్చుకుంటారు… ఎటొచ్చీ ఒక చంద్రబాబు, ఒక పవన్ కల్యాణ్ రాష్ట్రం విడిపోయి పుష్కరమైనా ఇంకా ఇక్కడ రాజకీయాలు చేయాలి, పోటీచేయాలి, గెలవాలి, మళ్లీ తెలంగాణ మీద పెత్తనం రావాలని కోరుకోవడంతోనే వస్తోంది సమస్య… రాధాకృష్ణకు అది తెలుసు… అందుకే తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉండండి అని హితవు పలికాడు… కానీ ఇటీవల వివాదంలో తప్పు ఎక్కడ జరిగిందో మాత్రం విశ్లేషించలేకపోయాడు… ఎందుకంటే, ఇందులో క్రెడిబులిటీ కోల్పోయి, తీవ్ర విమర్శల పాలైన నాగేశ్వర్‌ది ఎంత తప్పుందో పవన్ కల్యాణ్‌ది అంతకన్నా ఎక్కువ తప్పుంది…అభిప్రాయాలు ఆయనేదో రాశాడు, ఏపీలో కేసులు పడ్డయ్, నాగేశ్వర్‌కు అనుకూలంగా తెలంగాణవాదులు కొందరు నిలబడ్డారు… దాంతో పవన్ కల్యాణ్‌కు కోపమొచ్చింది… సరిగ్గా రాష్ట్ర అవతరణ దినంరోజే మీటింగు తలపెట్టాడు, తప్పు… ప్రభుత్వం, పోలీసులు, చివరకు కోర్టు కూడా వద్దంది… కానీ ఎలాగోలా గోకాలని ప్రెస్ మీట్ పెట్టాడు… ఎవడబ్బ జాగీరు, వస్తా, ఎన్నికల్లో పోటీచేస్తా, తిరుగుతా అని ఏదేదో మాట్లాడాడు… అక్కడొచ్చింది సమస్య… మళ్లీ ఈ ఆంధ్రుడి రాజకీయం, పెత్తనం ఏమిటనే ఏవగింపు, వ్యతిరేకత తెలంగాణలో ప్రబలింది… పైగా పవన్ కల్యాణ్ గతంలో కూడా పోటీచేశాడు, భంగపడ్డాడు, ఐనా ఏదో సాధిస్తాడట, ఉద్దరిస్తాడట… అందుకే ఈ వ్యతిరేకత… ఇవేమీ రాధాకృష్ణ రాయడు, రాయలేదు… కారణం, చంద్రబాబు- పవన్ కల్యాణ్ కూటమి కాబట్టి..! పైగా ఈ వివాదంతో సంబంధం లేని ‘ప్రత్యక్ష’ సంబంధం లేని జగన్‌ను ఇందులోకి లాక్కొచ్చాడు… ఎవరెవరో ఏవేవో వ్యాఖ్యానిస్తున్నట్టు పవన్ కల్యాణ్ కూతల వెనుక వ్యూహాల్లేవు, ఎవరూ లేరు… అది తన మూర్ఖ వ్యవహారమే… అది తనకూ తెలిసొచ్చింది తరువాత… తెలంగాణ సెంటిమెంట్ మళ్లీ పెరిగితే బీఆర్‌ఎస్‌కు లాభం అంటాడు రాధాకృష్ణ… ఆరోజులు పోయాయి మాస్టారూ… తెలంగాణ జోలికొస్తే తెలంగాణ తిరగబడుతుంది, రాజకీయాలు- ఎన్నికలు వచ్చేసరికి పార్టీల నడుమ పోరు సమీకరణాలు వేరుగానే ఉంటాయి… బీజేపీ- బీఆర్ఎస్- కాంగ్రెస్… ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్లస్‌లో ఉంది, బీఆర్ఎస్ ఇంకా పాత పరాభవాల నుంచి తేరుకోలేకపోతోంది… బీజేపీ అంతర్గత కుమ్ములాటలతో ఎదగలేకపోతోంది… సో, రేవంత్ రెడ్డి అంటే పడని కాంగ్రెస్ అంతర్గత అసంతృప్తివాదులు, వ్యతిరేకులు కావాలనే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించి, మరింత గోకారనే రాధాకృష్ణ విశ్లేషణ అంతగా కన్విన్సింగుగా లేదు, ఐతే అది కాంగ్రెస్… అంతర్గత కుమ్ములాటలు సహజం… ఐనా బీఆర్ఎస్‌కు తెలంగాణ సెంటిమెంట్ నిజంగా కలిసొచ్చే పక్షంలో అది పొన్నం ప్రభాకర్‌కు కూడా నష్టమే కదా, ఆమాత్రం తెలియదా తనకు..? తెలుసనే విషయం రాధాకృష్ణకు తెలియదా..?! ఎవడబ్బ జాగీరు వ్యాఖ్యలపై తెలంగాణ భగ్గుమనేసరికి… పవన్ కల్యాణ్‌కు తత్వం బోధపడి, ప్చ్, మా ఏపీలో కులకొట్లాటలు తప్ప ఈ చైతన్యం, ఈ సంఘీభావం, ఈ ఉద్వేగాలు లేవు అని బాధపడ్డాడు… ఐనా తనలోని అసలు పవన్ కల్యాణ్ ఊరుకోడు కదా… తెలంగాణ భూమిపుత్రుల్నే పోటీలో పెడతాను అని మరో వెటకారం… ఆంధ్రా పెత్తందారు చంకలో చేరిన భూమిపుత్రులను కూడా తెలంగాణ సమాజం సహించదు. అదొక్కటీ పవన్ కల్యాణ్‌కు అర్థం కావాల్సిన అసలు తత్వం… కాళోజీ అంటాడు… “దోపిడి చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముతం, ప్రాంతం వాడే దోపిడి చేస్తే ప్రాణం తోనే పాతర వేస్తం” అందుకే రాధాకృష్ణ వ్యాసం తన రాజకీయ అనుకూల వాసనలకు లోబడి, జగన్ వ్యతిరేక భావనలకు లోబడి, ఏమాత్రం లోతు లేకుండా… పెరిఫెరల్‌గా… ఆత్మ లేకుండా తోకపటాకులాగా తుస్సుమంది…
6 likes
14 shares
P.Venkateswara Rao
576 views 3 months ago
#ఎల్లో మీడియా.. 💥 రామోజీ ప్రతిష్టను కాపాడిన తమిళనాడు , బెంగాల్ ఎన్నికలు...‼️ అది ఎలా అంటారా..? మార్గదర్శి కి సంబంధించి... న్యాయస్థానంలో వాదనల సందర్భంగా ...రామోజీ మరణించారు కాబట్టి ఈ కేసులో తదుపరి విచారణ ఆపాలని మార్గదర్శి తరపున న్యాయవాదులు వాదించగా... అలా అయితే రామోజీ ఆస్తులను అటాచ్ చేసి ప్రజలకు పంచి పెడతాం ..అని గౌరవ న్యాయస్థానం అదిరిపోయే సమాధానం ఇచ్చింది.. దీంతో మార్గదర్శి తరపున వాదించిన న్యాయవాదులతో పాటుగా మార్గదర్శి యాజమాన్యం కూడా బిత్తర పోయింది అయితే.... తమిళనాడు , బెంగాల్ ఎన్నికల ఫలితాలపై , వాటి విశ్లేషణలపై అందరూ దృష్టి కేంద్రీకరించడం తో "మార్గదర్శికి గట్టిగా న్యాయస్థానాల్లో మొట్టికాయలు పడిన విషయం".... పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు ..! ఈ విధంగా... తమిళనాడు బెంగాల్ ఎన్నికలు.... మార్గదర్శి పరువును కాపాడాయని చెప్పవచ్చు..! ఈ ఎన్నికల లు జరగకపోయి ఉంటే... కొన్ని దశాబ్దాల తరబడి రామోజీ... తన మీడియా ద్వారా వైయస్సార్ పైన , ఆయన తనయుడు పైన , ఆయన కుటుంబం పైన పదేపదే బురద జల్లుతూ వికృతంగా వార్తలను రాసినందుకు.... బదులుగా ఇప్పుడు మార్గదర్శికి ముట్టికాయలు పడిన సందర్భాన్ని .. ఒక పెద్ద అస్త్రంగా వైఎస్ఆర్సిపి శ్రేణులు ఉపయోగించుకొని.... రామోజీ అక్రమాలపై పెద్ద ఎత్తున విరుచుకుపడేవని పలువురు అంటున్నారు...! #MargadarsiScam
10 likes
17 shares