ఎల్లో మీడియా.. 💥

855 Posts • 130K views
P.Venkateswara Rao
605 views 2 days ago
జర్నలిజం ముసుగులో బ్రోకరిజం YSRCP హయాంలో అప్పుచేస్తే రాష్ట్రం శ్రీలంక.. బాబు అప్పు చేస్తే రుణసమీకరణ.. *వారెవ్వా 💦💦💦 #ఎల్లో మీడియా.. 💥*
5 likes
8 shares
P.Venkateswara Rao
590 views 10 days ago
#ఎల్లో మీడియా.. 💥 #ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 *విశ్వ‌స‌నీయ‌త కోల్పోయిన టీడీపీ మీడియా…బాబుకు భారీ నష్టం❗* 04.08.2026🎯 మీడియా, టీడీపీని వేర్వేరుగా చూడ‌లేం. మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబు చేతిలోకి అధికారం, టీడీపీ వ‌చ్చాక…. మీడియాకు ప్రాధాన్యం పెరిగింది. మీడియాని అడ్డం పెట్టుకునే చంద్ర‌బాబు స‌గానికి పైగా ప‌నులు చ‌క్క‌బెట్టార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. చంద్ర‌బాబు మ‌న‌సెరిగి, ఆయ‌న ప్ర‌త్య‌ర్థుల‌ను మీడియానే టార్గెట్ చేస్తుంటుంది. అవి విప‌క్ష‌మైనా, స్వ‌ప‌క్ష‌మైనా స‌రే. అంతెందుకు, 1995లో ఎన్టీఆర్‌ను గ‌ద్దె దించి, అధికారాన్ని చంద్ర‌బాబు సొంతం చేసుకున్న త‌ర్వాత మీడియా తీరు ఏ రీతిలో సాగిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎన్టీఆర్‌, ల‌క్ష్మిపార్వ‌తిపై నీచాతి నీచ రాత‌లు, కార్టూన్లు వేసిన ఘ‌న చ‌రిత్ర‌… ఇదే టీడీపీ మీడియాకు ద‌క్కుతుంది. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మీడియా పెద్ద‌న్న పాత్ర పోషించే, ఆ ప‌త్రిక ఎన్టీఆర్‌ను దిగంబ‌రంగా చిత్రీక‌రించ‌డం ఒక్క‌టే త‌క్కువ‌. చంద్ర‌బాబును వ్య‌తిరేకిస్తే, ఎన్టీఆర్ అయినా స‌రే వ‌దిలిపెట్టేది లేద‌ని స‌ద‌రు అనుకూల మీడియా అనేక సంద‌ర్భాల్లో నిరూపించుకుంది. ఎన్టీఆర్ చ‌నిపోయాక‌, రాజ‌కీయ అవ‌స‌రాల రీత్యా, ఆయ‌న విగ్ర‌హానికి, చిత్ర‌ప‌టానికి పూల దండ‌లు వేస్తూ, పూజ‌లు చేస్తుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంటుంది. అయితే సోష‌ల్ మీడియా రావ‌డం, అలాగే టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియాని ఎదుర్కొని రాజ‌కీయాలు చేయాలంటే, మ‌న‌కు ఒక మీడియా వ్య‌వ‌స్థ అవ‌స‌ర‌మ‌ని దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి భావించారు. ఆ ఆలోచ‌న‌, రాజ‌కీయ అవ‌సరాల నుంచి “సాక్షి” పుట్టింది. ఆ ప‌త్రిక‌, చానెల్ ఏ మేర‌కు జ‌గ‌న్ రాజ‌కీయ అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌నేది వేరే చ‌ర్చ‌. సోష‌ల్ మీడియా విస్తృతి పుణ్య‌మా అని టీడీపీ అనుకూల మీడియా విశ్వ‌స‌నీయత గాలిలో కొట్టుకుపోయింది. టీడీపీ మీడియా రాత‌ల వెనుక దురుద్దేశాల్ని ఎండ‌గ‌ట్ట‌డంలో సోష‌ల్ మీడియా పైచేయి సాధించింది. అలాగే ఆ ప‌త్రిక‌ల విశ్వ‌స‌నీయ‌త‌ను సోష‌ల్ మీడియా పూర్తిగా దెబ్బ‌కొట్టింద‌నేందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌లు చెప్పుకుందాం. భోగాపురంలోని అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ విమానాశ్రయాన్ని ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ ప‌త్రిక చేప‌ల‌కంచేరుకు చెందిన మైలిప‌ల్లి ఎల్లాజీ పేరుతో ఒక అభిప్రాయాన్ని ప్ర‌చురించింది. అయితే స‌ద‌రు వ్య‌క్తి మూడేళ్ల క్రితం చ‌నిపోయాడ‌ని, ఆయ‌న‌కు జ‌న‌సేన ఎమ్మెల్యే లోకం మాధ‌వి నివాళుల‌ర్పించే ఫొటోతో స‌హా సోష‌ల్ మీడియా బ‌య‌ట పెట్టింది. జీవించి లేని వ్య‌క్తి అభిప్రాయాన్ని కూడా టీడీపీ ప‌త్రిక ప్ర‌చురించ‌డాన్ని బ‌య‌ట పెట్ట‌డం ద్వారా, ఆ ప‌త్రిక పాఠ‌కులు సైతం అస‌హ్యించుకునే ప‌రిస్థితి. ఇదే ప‌త్రిక క‌ర్నూలు జిల్లా చిప్ప‌గిరి మండ‌లం నేమ‌క‌ల్లులో టీడీపీ, వైసీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగితే, ఒక మ‌హిళ వ‌స్త్రాల‌ను ప్రతిప‌క్ష పార్టీ వారు చించేసి, దుశ్శాస‌న ప‌ర్వానికి తెర‌లేపారంటూ గ‌గ్గోలు పెడుతూ రాసింది. కానీ నిజ‌మేంటో సోష‌ల్ మీడియా బ‌య‌ట పెట్టి, టీడీపీ ప‌త్రిక రాత‌ల్లోని డొల్ల‌త‌నాన్ని, ప్ర‌తిప‌క్ష పార్టీని బ‌ద్నాం చేయాల‌న్న కుట్ర‌ను బ‌య‌ట‌పెట్ట‌డం గ‌మ‌నార్హం. టీడీపీ కార్య‌క‌ర్త నాగ‌రాజు …పోలీసులు చూస్తుండ‌గానే త‌న భార్య నైటీని చించేశాడు. ఆ నింద‌ను వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి, అలాగే కార్య‌క‌ర్త‌ల‌పై వేసి, రాజ‌కీయంగా బ‌ద్నాం చేసేందుకు కుట్ర‌ప‌న్నాడ‌ని … వీడియో సాక్షిగా వాస్త‌వం బ‌య‌ట ప‌డింది. ఇప్పుడు ఏమీ తెలియ‌న‌ట్టు ఆ ప‌త్రిక మిన్న‌కుండిపోయింది. కానీ సోష‌ల్ మీడియాలో స‌ద‌రు వీడియోని షేర్ చేస్తూ, త‌ప్పుడు రాత‌లు, అలాగే అక్ర‌మ కేసు బ‌నాయించ‌డాన్ని తూర్పార‌ప‌డుతున్నారు. గుంటూరులో ఒక మ‌హిళ‌ను వివ‌స్త్ర‌ను చేసి, తీవ్రంగా కొట్టి, తిట్టి…గ‌తంలో ఎప్పుడూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌ర‌గ‌ని దుర్ఘ‌ట‌న చోటు చేసుకుంది. కానీ ఇదే టీడీపీ గెజిట్ ప‌త్రిక‌గా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప‌త్రిక లోపలి పేజీల్లో చిన్న వార్త‌ను ప్ర‌చురించింది. జ‌నానికి తెలియ‌కూడ‌ద‌ని జాగ్ర‌త్త ప‌డింది. దీనికి కార‌ణం… దుశ్శాస‌న ప‌ర్వానికి పాల్ప‌డింది టీడీపీ నాయ‌కుడు కావ‌డ‌మే. మ‌రో అనుకూల ప‌త్రిక అస‌లు ఆ సంఘ‌ట‌నే జ‌ర‌గ‌న‌ట్టు ఎలాంటి వార్త రాయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎక్కువ‌గా బ‌ద్నాం అయ్యిందెవ‌రంటే, టీడీపీ మీడియానే అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఆరాధించే నాయ‌కుడి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం 50 శాతం ప‌ని చేసినా, క‌నీసం ప్ర‌జ‌ల త‌ర‌పున మీడియా మిగిలిన 50 శాతం ప‌ని చేస్తుంటే, ఇవాళ విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చేది కాదు. జ‌ర్న‌లిజం నైతిక విలువ‌ల్ని పూర్తిగా వ‌దిలేసి, కేవ‌లం టీడీపీ, చంద్ర‌బాబు ప్ర‌యోజ‌నాలు త‌ప్ప‌, ప్ర‌జ‌ల గోడు ప‌ట్ట‌ద‌నే రీతిలో స‌ద‌రు మీడియా దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇందుకు ఎన్నైనా ఉదాహ‌ర‌ణ‌లు చెప్పొచ్చు. ఇటీవ‌ల రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు, పీవీ సునీల్‌కుమార్‌లు… టీడీపీ అనుకూల మీడియా వికృత ధోర‌ణుల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వారి ఎక్స్ ఖాతాల్లో పోస్టులు, వీడియోల‌ను చూస్తే, క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చెప్ప‌డాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. తెలంగాణ‌లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హీరోయిన్ల‌తో సంబంధాలు అంట‌క‌ట్టి, డిబేట్ల‌ను నిర్వ‌హించిన నీచ చ‌రిత్ర టీడీపీ మీడియాకే ద‌క్కుతుంది. అందుకే వాటిని మీడియా హౌస్‌లుగా కాకుండా, కలేబ రాల నీ కేంద్రాల‌ని మాజీ మంత్రి జ‌గ‌దీశ్వ‌ర‌రెడ్డి అభివ‌ర్ణించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మెడిక‌ల్ క‌ళాశాల‌ల ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ, వైసీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తే, క‌నీసం చిన్న ఫొటో, సింగిల్ కాల‌మ్ వార్త‌ను క్యారీ చేయ‌డానికి కూడా మ‌న‌సురాలేదు. టీడీపీ మీడియా ధోర‌ణి చూస్తే, ఒక విష‌యం గుర్తుకొస్తుంది. వెనుక‌టికి ఒక కోడి పుంజు, తాను కూత కూయందే తెల్ల‌వార‌ద‌ని అనుకునేద‌ట‌. టీడీపీ మీడియా తీరు కూడా అట్లే వుంది. తాను రాయ‌క‌పోతే , స‌మాజానికి ఏ స‌మాచారం తెలియ‌ద‌నే భ్ర‌మ‌లో వుంది. అలాగే తాను రాసిందే వార్త అనే మ‌త్తులో వుంది. అలాంటి అభిప్రాయాల‌కు కాలం చెల్లింద‌ని ఎంత త్వ‌ర‌గా గ్ర‌హిస్తే, అంత మంచిది. ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ మీడియా ఒంటెత్తు పోక‌డ‌ల‌తో జ‌నం విసిగి పోయారు. తెలంగాణ‌లో నేరుగా ఆ మీడియాకు హెచ్చ‌రిక‌లు చేస్తుండ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. ఇటీవ‌ల ఢిల్లీలో జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద గోదీ మీడియాను జెన్ జీ త‌రం ఏ ర‌కంగా అవ‌హేళ‌న చేసిందో చూశాం. గోదీ మీడియాకి మించి, తెలుగు స‌మాజంలో టీడీపీ మీడియా వ్య‌వ‌హారాలున్నాయి. వైసీపీని గ‌ద్దె దించ‌డం టీడీపీ కంటే త‌మ‌పైనే ఎక్కువ బాధ్య‌త వున్న‌ట్టు ఆ పార్టీ మీడియా వికృత రాత‌లు రాస్తోంద‌న్న విమ‌ర్శ వుంది. చంద్ర‌బాబు వ్య‌తిరేకిస్తే, బీజేపీ, మోదీ, అమిత్‌షాల‌పై విషం క‌క్క‌డాన్ని 2019కి ముందు చూశాం. అయితే చంద్ర‌బాబుపై అంధ‌భ‌క్తితో విశ్వ‌స‌నీయ‌త‌ను కోల్పోయిన సంగ‌తిని టీడీపీ మీడియా విస్మ‌రించింది. ఇంకా సోష‌ల్ మీడియా రాక ముందు వ్య‌వ‌హారాల్నే కొన‌సాగిస్తోంది. అందుకే రోజురోజుకూ స‌ద‌రు మీడియా అభాసుపాల‌వుతోంది. ఈ కార‌ణంగానే జ‌నాలు ప‌ట్టించుకోని ప‌రిస్థితి. వ్య‌క్తిత్వం, గౌర‌వం లేని వారికి సమాజంలో విలువ ఉండ‌న‌ట్టే, విశ్వ‌స‌నీయ‌త కోల్పోయిన మీడియాగా త‌మ రాత‌ల‌కు అలాంటి స్థాన‌మే వుంటుంద‌ని గుర్తిస్తే మంచిది. ఇప్పుడీ మీడియా త‌ప్పుల‌న్నీ టీడీపీకి భారంగా మారాయనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.
10 likes
13 shares
P.Venkateswara Rao
618 views 2 months ago
#ఎల్లో మీడియా.. 💥 *బాబును ఏమీ అనలేడు- పవన్‌ ను తప్పనలేడు- జగన్‌ను అనకుండా ఉండలేడు…💥* June 7, 2026✍🏻 ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎంత పాతవిషయాల్ని తన కొత్త పలుకులో రాసుకొచ్చినా సరే… ప్రపంచంలోని ఏ విషయాన్నయినా సరే తీసుకొచ్చి జగన్ మెడకు చుట్టే ప్రయత్నం చేస్తుంటాడు… అఫ్‌కోర్స్, సాక్షిలో వర్దెల్లి మురళి కూడా ప్రతి దాన్నీ చంద్రబాబు దగ్గరకు తీసుకొస్తుంటాడు… సరే, ఇద్దరివీ రాజకీయ ప్రేరిత వ్యాసాలే కదా… నిష్పాక్షికతను ఆశించలేం, చూడలేం, ఉండవు కూడా… ఈరోజు రాధాకృష్ణ ఇటీవల నాగేశ్వర్- పవన్ కల్యాణ్ వివాదంలోకి జగన్‌ను తీసుకొచ్చాడు… నిజానికి పవన్ కల్యాణ్‌, చంద్రబాబు తెలంగాణ వనరుల్ని దోచుకోలేదనీ, అలా దోచుకున్న వైఎస్‌ను, జగన్‌ను మాత్రం తెలంగాణవాదులు ఏమీ అనడం లేదని బాధపడిపోయాడు పాపం… ఇక్కడ తనకు ఓ క్లారిటీ కావాలి, ఉంది, ఈ వ్యాసంలోనూ అది కనిపించింది, కానీ మళ్లీ ఏదోరకంగా జగన్ మీద వ్యతిరేకతను, తన కూటమే కాబట్టి చంద్రబాబును, పవన్ కల్యాణ్‌ను ఏమీ అనడు… పవన్ కల్యాణ్ భాష ‘ఎవడబ్బ జాగీరు’ ప్రస్తావన ఏది వ్యాసంలో..? తెలంగాణవాదం ఆది నుంచీ ఆంధ్రుల దోపిడీ మీద మాత్రమే కాదు… స్వరాష్ట్ర సాధన, స్వపరిపాలన కోసం… ఎవరు హైదరాబాదు, తెలంగాణల్లో బతికినా తెలంగాణ భూమిపుత్రులకు వ్యతిరేకత లేదు, ఆహ్వానిస్తారు, అక్కున చేర్చుకుంటారు… ఎటొచ్చీ ఒక చంద్రబాబు, ఒక పవన్ కల్యాణ్ రాష్ట్రం విడిపోయి పుష్కరమైనా ఇంకా ఇక్కడ రాజకీయాలు చేయాలి, పోటీచేయాలి, గెలవాలి, మళ్లీ తెలంగాణ మీద పెత్తనం రావాలని కోరుకోవడంతోనే వస్తోంది సమస్య… రాధాకృష్ణకు అది తెలుసు… అందుకే తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉండండి అని హితవు పలికాడు… కానీ ఇటీవల వివాదంలో తప్పు ఎక్కడ జరిగిందో మాత్రం విశ్లేషించలేకపోయాడు… ఎందుకంటే, ఇందులో క్రెడిబులిటీ కోల్పోయి, తీవ్ర విమర్శల పాలైన నాగేశ్వర్‌ది ఎంత తప్పుందో పవన్ కల్యాణ్‌ది అంతకన్నా ఎక్కువ తప్పుంది…అభిప్రాయాలు ఆయనేదో రాశాడు, ఏపీలో కేసులు పడ్డయ్, నాగేశ్వర్‌కు అనుకూలంగా తెలంగాణవాదులు కొందరు నిలబడ్డారు… దాంతో పవన్ కల్యాణ్‌కు కోపమొచ్చింది… సరిగ్గా రాష్ట్ర అవతరణ దినంరోజే మీటింగు తలపెట్టాడు, తప్పు… ప్రభుత్వం, పోలీసులు, చివరకు కోర్టు కూడా వద్దంది… కానీ ఎలాగోలా గోకాలని ప్రెస్ మీట్ పెట్టాడు… ఎవడబ్బ జాగీరు, వస్తా, ఎన్నికల్లో పోటీచేస్తా, తిరుగుతా అని ఏదేదో మాట్లాడాడు… అక్కడొచ్చింది సమస్య… మళ్లీ ఈ ఆంధ్రుడి రాజకీయం, పెత్తనం ఏమిటనే ఏవగింపు, వ్యతిరేకత తెలంగాణలో ప్రబలింది… పైగా పవన్ కల్యాణ్ గతంలో కూడా పోటీచేశాడు, భంగపడ్డాడు, ఐనా ఏదో సాధిస్తాడట, ఉద్దరిస్తాడట… అందుకే ఈ వ్యతిరేకత… ఇవేమీ రాధాకృష్ణ రాయడు, రాయలేదు… కారణం, చంద్రబాబు- పవన్ కల్యాణ్ కూటమి కాబట్టి..! పైగా ఈ వివాదంతో సంబంధం లేని ‘ప్రత్యక్ష’ సంబంధం లేని జగన్‌ను ఇందులోకి లాక్కొచ్చాడు… ఎవరెవరో ఏవేవో వ్యాఖ్యానిస్తున్నట్టు పవన్ కల్యాణ్ కూతల వెనుక వ్యూహాల్లేవు, ఎవరూ లేరు… అది తన మూర్ఖ వ్యవహారమే… అది తనకూ తెలిసొచ్చింది తరువాత… తెలంగాణ సెంటిమెంట్ మళ్లీ పెరిగితే బీఆర్‌ఎస్‌కు లాభం అంటాడు రాధాకృష్ణ… ఆరోజులు పోయాయి మాస్టారూ… తెలంగాణ జోలికొస్తే తెలంగాణ తిరగబడుతుంది, రాజకీయాలు- ఎన్నికలు వచ్చేసరికి పార్టీల నడుమ పోరు సమీకరణాలు వేరుగానే ఉంటాయి… బీజేపీ- బీఆర్ఎస్- కాంగ్రెస్… ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్లస్‌లో ఉంది, బీఆర్ఎస్ ఇంకా పాత పరాభవాల నుంచి తేరుకోలేకపోతోంది… బీజేపీ అంతర్గత కుమ్ములాటలతో ఎదగలేకపోతోంది… సో, రేవంత్ రెడ్డి అంటే పడని కాంగ్రెస్ అంతర్గత అసంతృప్తివాదులు, వ్యతిరేకులు కావాలనే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించి, మరింత గోకారనే రాధాకృష్ణ విశ్లేషణ అంతగా కన్విన్సింగుగా లేదు, ఐతే అది కాంగ్రెస్… అంతర్గత కుమ్ములాటలు సహజం… ఐనా బీఆర్ఎస్‌కు తెలంగాణ సెంటిమెంట్ నిజంగా కలిసొచ్చే పక్షంలో అది పొన్నం ప్రభాకర్‌కు కూడా నష్టమే కదా, ఆమాత్రం తెలియదా తనకు..? తెలుసనే విషయం రాధాకృష్ణకు తెలియదా..?! ఎవడబ్బ జాగీరు వ్యాఖ్యలపై తెలంగాణ భగ్గుమనేసరికి… పవన్ కల్యాణ్‌కు తత్వం బోధపడి, ప్చ్, మా ఏపీలో కులకొట్లాటలు తప్ప ఈ చైతన్యం, ఈ సంఘీభావం, ఈ ఉద్వేగాలు లేవు అని బాధపడ్డాడు… ఐనా తనలోని అసలు పవన్ కల్యాణ్ ఊరుకోడు కదా… తెలంగాణ భూమిపుత్రుల్నే పోటీలో పెడతాను అని మరో వెటకారం… ఆంధ్రా పెత్తందారు చంకలో చేరిన భూమిపుత్రులను కూడా తెలంగాణ సమాజం సహించదు. అదొక్కటీ పవన్ కల్యాణ్‌కు అర్థం కావాల్సిన అసలు తత్వం… కాళోజీ అంటాడు… “దోపిడి చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముతం, ప్రాంతం వాడే దోపిడి చేస్తే ప్రాణం తోనే పాతర వేస్తం” అందుకే రాధాకృష్ణ వ్యాసం తన రాజకీయ అనుకూల వాసనలకు లోబడి, జగన్ వ్యతిరేక భావనలకు లోబడి, ఏమాత్రం లోతు లేకుండా… పెరిఫెరల్‌గా… ఆత్మ లేకుండా తోకపటాకులాగా తుస్సుమంది…
6 likes
14 shares