రిజర్వేషన్లను వ్యతిరేకిద్దాం,ప్రతిభకు సలాం చేద్దాం!
రిజర్వేషన్లు మన ప్రతిభకు గొడ్డలిపెట్టు!ప్రతిభకు పట్టం కట్టడం అంటే భారతదేశాన్ని అభివృద్ధి పథంలో శరవేగంగా పయనింపచేయడం!
రిజర్వేషన్లకు రాం రాం పాడి,మంగళం పాడి,ప్రతిభే కొలమానంగా మన ప్రభుత్వాలు ముందుకు సాగేలా ఓక పెద్ద ఎత్తున ఉద్యమానికి అంకురార్పణ గావించేలా ప్రజా సంఘాల వారు మేధావి వర్గాల వారుతీవ్ర కృషి సల్పాలి!
ఎందుకంటే అగ్రవర్ణాల వారికి 100 ర్యాంకు వచ్చిన దక్కని ఫలం,రిజర్వేషన్ వున్న వారికి 5000 ర్యాంకు వచ్చిన ఫలం దక్కడం ఓ అమానుషం,ఓ తీరని అన్యాయం క్రిందకు వస్తుంది!
ఇప్పటికైనా కుల,మతాలకు అతీతంగా ప్రతి ఒక్క ప్రజానీకం రిజర్వేషన్లకు శాశ్వత విరామం ప్రకటించేలా ప్రతిభ వున్నవారికి పట్టాభిషేకం చేసేలా మనవంతుగా తీవ్ర కృషి సల్పుదాం!
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మనమంతా చెయ్యి చెయ్యి కలిపి ఇప్పటినుంచే మన ప్రయత్నాలకు మొగ్గ తొడిగితే ఫలితం ఈ రోజు కాకుంటే రేపొద్దున అయిన మన ఆవిరళ కృషికి ఓ మహోన్నత ఫలితం దక్కి తీరుతుంది!
.
ఏదిఏమైన ' కృషితో నాస్తి దుర్భిక్ష్యం ' కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు' అనే నీతి నానుడికి పెద్ద పీట వేసి ప్రతిభకు సెల్యూట్ దక్కేలా ప్రతి ఒక్క ప్రజానీకం ఓ మహోన్నత ప్రయత్నానికి స్వీకారం చూట్టి తీరాలి.అప్పుడే మనం ఆరు,నూరైనా మనం అనుకున్న ఆశయాన్ని, లక్ష్యాన్ని సాధించి తీరుతాం. అందులో భాగంగా గత అనేక సంవత్సరాలుగా రిజర్వేషన్ అనే పెనుభూతానికి,రక్కసికి ఎందరి ప్రతిబో మట్టి పాలు అయిన విషయం మనందరికి విధితమే.కాబట్టి ఇప్పటికయినా మించి పోయింది లేదు భవిష్యత్ తరాలకు ఏదైనా మంచి చేయాలనే మనం భావిస్తే మాత్రం ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత రిజర్వేషన్ అనే ప్రక్రియకు పూర్తి స్థాయిలో గ్రహణం పట్టించేలా ప్రతి యొక్క మానవతావాదులు కుల మతాలకు అతీతంగా ఓక విప్లవాత్మక పంథాలో ముందుకు నడిచి మన కేంద్ర ప్రభుత్వం వారి మెడలు వంచి అయిన మనం అనుకున్నది సాధించి రాబోయే తరాల వారికి ప్రతిభకే లాల్ సలాం అనే గొప్ప బహుమతిని ప్రసాదిద్దాం! అన్నింటికి మించి ప్రతిభా సంపన్నులు, మేధావి వర్గం వారు రిజర్వేషన్ అనే ఏకైక కారణంగా వారి జ్ఞానాన్ని పరాయి దేశాలకు వెళ్లి దారాదత్తం చేయకుండా వారంతా మన భారతదేశంలోనే వుంటూ మన భరతమాత అభివృద్ధికి పాటుపడేలా మన వంతుగా ఓ యుద్ధప్రాతిపదికన ఓ రగిలే,మండే అగ్నిజ్వాలగా కులం,మతం అనే అడ్డుగోడలను చీల్చి అందరూ ఏకత్రాటిగా నిలబడి మరీ ప్రతిభకు జై కొట్టేలా రిజర్వేషన్ల భూస్థాపితానికి కృషి సల్పాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్క ప్రజానీకంపై, మానవ హక్కుల సంఘాల, మేధావి వర్గాల వారిపై ఎంతైనా ఉంది.జై హింద్! బోలో భారతమాతకీ జై! మేరా హిందూస్తాన్ మహాన్!✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా!
#against reservations