Mahbubnagar Police
491 views
4 days ago
బంగారు దుకాణాల యజమానులు, స్వర్ణకారులకు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహణ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ మహబూబ్‌నగర్ పట్టణంలోని విరాట్ విశ్వకర్మ సహకార సంఘం కార్యాలయం నందు బులియన్ మార్కెట్ మరియు స్వర్ణకారులు సంఘం సభ్యులతో కలిసి బంగారు దుకాణాల యజమానులు మరియు స్వర్ణకారులకు భద్రతా చర్యలపై అవగాహన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, బంగారు దుకాణాలు మరియు స్వర్ణకారుల భద్రత కోసం పటిష్టమైన ఏర్పాట్లు అత్యవసరమని తెలిపారు. ప్రతి షాప్‌లో నాణ్యమైన సీసీ కెమెరాలు, నైట్ విజన్ కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటల పర్యవేక్షణ ఉండేలా చూడాలని సూచించారు. కెమెరాల ఫుటేజ్‌ను నిర్దిష్ట కాలం వరకు భద్రపరచడం, షాప్ ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్లు స్పష్టంగా కవరయ్యేలా ఏర్పాటు చేయడం కీలకమని పేర్కొన్నారు. అదేవిధంగా అలారం సిస్టమ్స్, సురక్షిత లాకర్లు వంటి భద్రతా ఏర్పాట్లతో పాటు మొబైల్ అలర్ట్ సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్ వంటి ఆధునిక భద్రతా సాంకేతికతలను కూడా వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. అలాగే జిల్లా పోలీస్ అధికారులకు బంగారు షాపులు ఉన్న ప్రాంతాలలో గస్తీని మరింత బలోపేతం చేయాలని, నిరంతరం మొబైల్ పార్టీలు తిరుగుతూ పర్యవేక్షణ నిర్వహించాలని ఎస్పీ గారు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, డిజిటల్ అరెస్ట్ మోసాలు, ఆన్‌లైన్ యాత్ర/టికెట్ బుకింగ్ మోసాలు, ఫేక్ కాల్స్ మరియు మెసేజెస్ ద్వారా డబ్బులు మోసగించే ఘటనలు పెరుగుతున్నాయని చెప్పారు. తెలియని లింకులు క్లిక్ చేయకుండా, అనుమానాస్పద కాల్స్‌కు స్పందించకుండా, వ్యక్తిగత మరియు బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. ఏవైనా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. రోడ్డు భద్రత కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, స్వీయ భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. “ప్రజా భద్రతే మా ధ్యేయం” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ పోలీసులతో సమన్వయం కలిగి పనిచేయాలని ఎస్పీ గారు కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజుద్దీన్, బులియన్ మార్కెట్ అధ్యక్షుడు, స్వర్ణకారులు సంఘం అధ్యక్షుడు, బంగారు దుకాణాల యజమానులు మరియు స్వర్ణకారులు పాల్గొన్నారు. #MahabubnagarPolice #📰 వార్తలు