Mahbubnagar Police
ShareChat
click to see wallet page
@mahbubnagarpolice
mahbubnagarpolice
Mahbubnagar Police
@mahbubnagarpolice
Mahbubnagar District Police
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ సందర్భంగా భద్రత ఏర్పాట్లను పరిశీలించిన మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు నామినేషన్ ఉపసంహరణ మరియు బీ–ఫారం సమర్పణ ప్రక్రియ కొనసాగుతున్న దృష్ట్యా, మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి, భద్రతా విధుల నిర్వహణపై పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, నామినేషన్ ఉపసంహరణ మరియు బీ–ఫారం సమర్పణ ప్రక్రియ పూర్తిగా ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు జిల్లా పోలీస్ శాఖ అన్ని రకాల ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థులు, వారి అనుచరులు మరియు ప్రజలు ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. నామినేషన్ ఉపసంహరణ మరియు బీ–ఫారం సమర్పణకు చివరి రోజు కావడంతో, ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఈ సందర్శనలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య మరియు ఇతర సిబ్బంది ఉన్నారు. #MahabubnagarPolice #MunicipalElections #📰 వార్తలు
📰 వార్తలు - ShareChat
నామినేషన్ పత్రాల పరిశీలన సందర్భంగా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ డి.జానకి ఐపిఎస్ మున్సిపల్ ఎన్నికల పనుల్లో భాగంగా ఈరోజు నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతున్న సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపిఎస్ గారు మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సక్రమ ఏర్పాట్లు చేయాలని, అలాగే ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామంజుల రెడ్డి, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్యతో పాటు ఇతర అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. #MahabubnagarPolice #MunicipalElections #📰 వార్తలు
📰 వార్తలు - ShareChat
41 సంవత్సరాల సుదీర్ఘ పోలీసు సేవలకు ఘన సన్మానం జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపిఎస్. పోలీసు శాఖలో 41 సంవత్సరాల పాటు నిర్విరామంగా సేవలు అందించి శనివారం పదవీ విరమణ పొందుతున్న శివయ్య, సబ్ ఇన్‌స్పెక్టర్ – సిసిఎస్, మహబూబ్‌నగర్ ను జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా సేవా ప్రయాణాన్ని ప్రారంభించి, హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయికి ఎదిగి 41 సంవత్సరాల సుదీర్ఘ సేవలను నిబద్ధత, క్రమశిక్షణతో పూర్తి చేయడం అత్యంత అభినందనీయమని కొనియాడారు. ప్రజా సేవే ధ్యేయంగా, శాఖ పట్ల అంకితభావంతో పనిచేసిన శివయ్య గారి సేవలు యువ పోలీసు సిబ్బందికి ఆదర్శమని తెలిపారు. పదవీ విరమణ అనంతరం మిగిలిన జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని, ఆరోగ్యాన్ని ప్రధానంగా తీసుకుని ప్రతిరోజూ యోగ, ధ్యానం (మెడిటేషన్) వంటి అలవాట్లను పాటిస్తూ ప్రశాంతంగా జీవించాలని సూచించారు. పోలీసు శాఖలో సంపాదించిన అనుభవం, విలువలు జీవితాంతం దోహదపడతాయని పేర్కొంటూ, శివయ్య గారికి మంచి ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షు కలగాలని జిల్లా ఎస్పీ గారు ఆకాంక్షించారు. ఈ క్రమంలో DTC DSP గిరి బాబు, AO రుక్మిణి భాయి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ బాలరాజ, RI అడ్మిన్ కృష్ణయ్య, CC రామ్ రెడ్డి, ఆఫీస్ సూపెడెంట్స్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. #MahabubnagarPolice #📰 వార్తలు
📰 వార్తలు - PoLiG= PoLiG= - ShareChat
“అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా అడ్డకల్ టోల్‌గేట్ వద్ద రోడ్డు భద్రత అవగాహన జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అడ్డకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అడ్డకల్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు గారు వారి సిబ్బందితో కలిసి అడ్డకల్ టోల్‌గేట్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు గారు వాహనదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. అలాగే త్రిబుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, ఆపోజిట్ డైరెక్షన్‌లో వాహనాలు నడపడం వంటి ప్రమాదకర అలవాట్ల వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణ నష్టాలపై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి ప్రయాణిస్తున్న వాహనదారులకు గులాబీ పూలు అందజేసి అభినందించడం ద్వారా వారిని ప్రోత్సహించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ, సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలనే ఉద్దేశంతో “అరైవ్ అలైవ్” కార్యక్రమ లక్ష్యాన్ని వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, టోల్‌గేట్ అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొని సహకారం అందించారు. #MahabubnagarPolice #roadsafetyawareness #📰 వార్తలు
📰 వార్తలు - Zudio hhbUlonab Zudio hhbUlonab - ShareChat
DRIVING BEFORE AGE CAN END A LIFE#MahbubnagarPolice #RoadSafety #📰 వార్తలు
📰 వార్తలు - మైనర్లకు దాపానాలు ಇವ್ದಾದ್ದು" ಏಡಡದ್ದು ವಿತ್ಲ್ಲಾ ధీరత్వం ధృఢత్న IIAHABUBNAGAR POLICE  M VE /8 SAFER CAMPAIGN FOR ROADS Al TELANGANA IN DRNING BEFORE AGE CAN END A LIFE MAHABUBNAGAR DISTRICT POLICE drusfreembnr police@smaiLcom spmahaboobnagar MahabubnagarPolice 8712659360 MbnrPolice మైనర్లకు దాపానాలు ಇವ್ದಾದ್ದು" ಏಡಡದ್ದು ವಿತ್ಲ್ಲಾ ధీరత్వం ధృఢత్న IIAHABUBNAGAR POLICE  M VE /8 SAFER CAMPAIGN FOR ROADS Al TELANGANA IN DRNING BEFORE AGE CAN END A LIFE MAHABUBNAGAR DISTRICT POLICE drusfreembnr police@smaiLcom spmahaboobnagar MahabubnagarPolice 8712659360 MbnrPolice - ShareChat
“అరైవ్ అలైవ్” నినాదంతో మహబూబ్‌నగర్‌లో రోడ్డు భద్రత బైక్ ర్యాలీ హెల్మెట్ వాడకం ద్వారా ప్రాణ రక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో “అరైవ్ అలైవ్” నినాదంతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు విచ్చేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ బైక్ ర్యాలీ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుండి ప్రారంభమై క్లాక్ టవర్, అశోక టాకీస్ చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్, మెట్టుగడ్డ యూ-టర్న్ తీసుకొని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు సాగింది. ర్యాలీలో పాల్గొన్న పోలీసు సిబ్బంది అందరూ తమ తమ ద్విచక్ర వాహనాలతో హెల్మెట్లు ధరించి పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా ప్రయాణిస్తూ ప్రజలకు రోడ్డు భద్రత ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ గారు మాట్లాడుతూ, హెల్మెట్ వాడకం ప్రాణాలను కాపాడే ముఖ్యమైన రక్షణ కవచమని తెలిపారు. “అరైవ్ అలైవ్” లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి ద్విచక్ర వాహనదారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఈ బైక్ ర్యాలీ ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై మరింత అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. #MahabubnagarPolice #RoadSafetyAwareness #📰 వార్తలు
📰 వార్తలు - ShareChat
02:01
BE SMART BE SAFE WEAR A HELMET #RoadSafetyAwareness #MahabubnagarPolice #📰 వార్తలు
📰 వార్తలు - హెర్సెటిమీరక్షణ కపచం ధీర్రత్వం ధృఢత్వ MAHABUBNAGAR POLICE ahhite A8VE CAMPAIGN FOR SAFER ROADS A TELANGANA IN BE SMART BE SAFE HELMET WEAR A DISTRICT MAHABUBNAGAR POLICE spmahaboobnagar f MahabubnagarPolice drugfreembnr police@gmail com 8712659360 MbnrPolice హెర్సెటిమీరక్షణ కపచం ధీర్రత్వం ధృఢత్వ MAHABUBNAGAR POLICE ahhite A8VE CAMPAIGN FOR SAFER ROADS A TELANGANA IN BE SMART BE SAFE HELMET WEAR A DISTRICT MAHABUBNAGAR POLICE spmahaboobnagar f MahabubnagarPolice drugfreembnr police@gmail com 8712659360 MbnrPolice - ShareChat
జిల్లా ఎస్పీ డి. జానకి ఐపీఎస్ ఆధ్వర్యంలో “ఆరైవ్ లైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం పోలేపల్లి సెజ్ ఆమ్నీల్ ఆంకాలజీ సిబ్బందికి రోడ్డు భద్రతపై అవగాహన తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో, తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి గారు ప్రారంభించిన “ఆరైవ్ లైవ్” నినాదం మేరకు పట్టణాలలో మరియు పల్లె పల్లెనా ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ క్రమంలో, రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలేపల్లి సెజ్ ఆమ్నీల్ ఆంకాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బందికి రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకం తప్పనిసరి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు మాట్లాడుతూ, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకం వల్ల కలిగే లాభాలను వివరించారు. అలాగే త్రిబుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం మరియు రాంగ్ రూట్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలపై హెచ్చరించారు. ముఖ్యంగా హైవేల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అనంతరం ఎస్పీ గారు రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సీనియర్ జనరల్ మేనేజర్ లక్ష్మణ్ గుహీలోత్, జడ్చర్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున గౌడ్, రాజాపూర్ ఎస్‌ఐ శివానందం గౌడ్, పోలీసు సిబ్బంది, కంపెనీ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. #MahabubnagarPolice #roadsafetyawareness #📰 వార్తలు
📰 వార్తలు - ARRIE ALIVE YOU FOUS PROTECT IT BE RESP BE SAFE a CAHPAIGN AIELIIILIT PR IIBN LIUE ARRIE ALIVE YOU FOUS PROTECT IT BE RESP BE SAFE a CAHPAIGN AIELIIILIT PR IIBN LIUE - ShareChat
ప్రజలకు అందుబాటులో పోలీస్ శాఖ – జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ ప్రజావాణి ద్వారా పోలీసులపై మరింత పెరిగిన ప్రజల విశ్వాసం మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ గారు పాల్గొని ప్రజల నుండి పిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలు, భూ వివాదాలు, కుటుంబ వివాదాలు, పోలీసు సంబంధిత ఇబ్బందులను జిల్లా ఎస్పీ గారికి నేరుగా విన్నవించారు. ఎస్పీ గారు ప్రతి ఫిర్యాదుదారునితో వ్యక్తిగతంగా మాట్లాడి, వారి సమస్యలను పూర్తిగా అవగాహన చేసుకున్నారు. అనంతరం ఆయా పిర్యాదులను క్షుణ్నంగా పరిశీలించి, సంబంధిత సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లకు తగిన ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ముఖ్యమైన కేసుల విషయంలో సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో ఫోన్ ద్వారా మాట్లాడి, త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ గారు మాట్లాడుతూ, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఎలాంటి పైరవీలు అవసరం లేకుండా నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలని తెలిపారు. చట్టపరమైన మార్గంలో ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. పోలీస్ వ్యవస్థ పూర్తిగా ప్రజల కోసమేనని, ఎవరి జోక్యం లేకుండా, భయభ్రాంతులు లేకుండా ప్రజలు తమ సమస్యలను వెల్లడించాలని కోరారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఇప్పటికే అనేక సమస్యలు పరిష్కారమై, ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం మరింత పెరిగిందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. #MahabubnagarPolice #📰 వార్తలు
📰 వార్తలు - ಣಫu IT S ASS త్వరలో చెన్నూరులో | ఐసీ డిపో ఏర్పాటు చేస్తాం వివేకి 7 ಣಫu IT S ASS త్వరలో చెన్నూరులో | ఐసీ డిపో ఏర్పాటు చేస్తాం వివేకి 7 - ShareChat
పోక్సో కేసు విజయవంతం – అధికారులకు జిల్లా ఎస్పీ ప్రశంసలు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్, న్యాయశాఖ అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేత మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు, ప్రాసిక్యూషన్ నిర్వహించిన పోలీస్ మరియు న్యాయశాఖ అధికారులను జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని ఎస్పీ ఛాంబర్‌లో జిల్లా ఎస్పీ గారు కేసు విజయవంతానికి కృషి చేసిన ప్రాసిక్యూటర్ జాన్, పోలీస్ లీగల్ అడ్వైజర్ విశ్వేశ్వర్, కోర్టు లైజన్ ఆఫీసర్ బాలకృష్ణ, ఏఎస్‌ఐ, కోర్టు డ్యూటీ అధికారులు ఎండి.రహీం PC-2769, కృష్ణ PC-366, శంకర్ PC-2194, అరవింద్ PC-164 లను తన ఛాంబర్‌కు పిలిచి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, మహిళలు మరియు బాలలపై జరిగే నేరాల్లో నిందితులకు తప్పకుండా శిక్ష పడేలా పోలీస్ శాఖ న్యాయశాఖతో సమన్వయంతో పని చేయడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇలాంటి కేసుల్లో చిత్తశుద్ధితో పనిచేసే అధికారులు అభినందనలకు అర్హులని తెలిపారు. మహిళలు మరియు బాలల భద్రతకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి వెంకటేశ్వర్లు మరియు డిసిఆర్బి డిఎస్పి రమణారెడ్డి గార్లు పాల్గొన్నారు. #MahabubnagarPolice #📰 వార్తలు
📰 వార్తలు - ShareChat