బంగారు దుకాణాల యజమానులు, స్వర్ణకారులకు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహణ
జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్
మహబూబ్నగర్ పట్టణంలోని విరాట్ విశ్వకర్మ సహకార సంఘం కార్యాలయం నందు బులియన్ మార్కెట్ మరియు స్వర్ణకారులు సంఘం సభ్యులతో కలిసి బంగారు దుకాణాల యజమానులు మరియు స్వర్ణకారులకు భద్రతా చర్యలపై అవగాహన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, బంగారు దుకాణాలు మరియు స్వర్ణకారుల భద్రత కోసం పటిష్టమైన ఏర్పాట్లు అత్యవసరమని తెలిపారు. ప్రతి షాప్లో నాణ్యమైన సీసీ కెమెరాలు, నైట్ విజన్ కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటల పర్యవేక్షణ ఉండేలా చూడాలని సూచించారు. కెమెరాల ఫుటేజ్ను నిర్దిష్ట కాలం వరకు భద్రపరచడం, షాప్ ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్లు స్పష్టంగా కవరయ్యేలా ఏర్పాటు చేయడం కీలకమని పేర్కొన్నారు. అదేవిధంగా అలారం సిస్టమ్స్, సురక్షిత లాకర్లు వంటి భద్రతా ఏర్పాట్లతో పాటు మొబైల్ అలర్ట్ సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్ వంటి ఆధునిక భద్రతా సాంకేతికతలను కూడా వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. అలాగే జిల్లా పోలీస్ అధికారులకు బంగారు షాపులు ఉన్న ప్రాంతాలలో గస్తీని మరింత బలోపేతం చేయాలని, నిరంతరం మొబైల్ పార్టీలు తిరుగుతూ పర్యవేక్షణ నిర్వహించాలని ఎస్పీ గారు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, డిజిటల్ అరెస్ట్ మోసాలు, ఆన్లైన్ యాత్ర/టికెట్ బుకింగ్ మోసాలు, ఫేక్ కాల్స్ మరియు మెసేజెస్ ద్వారా డబ్బులు మోసగించే ఘటనలు పెరుగుతున్నాయని చెప్పారు. తెలియని లింకులు క్లిక్ చేయకుండా, అనుమానాస్పద కాల్స్కు స్పందించకుండా, వ్యక్తిగత మరియు బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. ఏవైనా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.
రోడ్డు భద్రత కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, స్వీయ భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు.
“ప్రజా భద్రతే మా ధ్యేయం” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ పోలీసులతో సమన్వయం కలిగి పనిచేయాలని ఎస్పీ గారు కోరారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజుద్దీన్, బులియన్ మార్కెట్ అధ్యక్షుడు, స్వర్ణకారులు సంఘం అధ్యక్షుడు, బంగారు దుకాణాల యజమానులు మరియు స్వర్ణకారులు పాల్గొన్నారు.
#MahabubnagarPolice #📰 వార్తలు
పోలీసులే ప్రజలకు ఆదర్శం – భద్రతలో రాజీకి తావులేదు : జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్
మహబూబ్నగర్ రూరల్ సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బందికి హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం ఏనుగొండలోని ఓం కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరై సిబ్బందికి హెల్మెట్లను అందజేశారు. ఈ కార్యక్రమం రూరల్ సర్కిల్ సబ్ ఇన్స్పెక్టర్ల ప్రోత్సాహంతో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ – పోలీసు సిబ్బంది తమ భద్రతపై అత్యంత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం నుండి రక్షణ పొందవచ్చని, అలాగే కార్లు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు.
జిల్లా ఎస్పీ గారు సిబ్బందికి ఇచ్చిన ముఖ్య సూచనలు:
ప్రతి పోలీసు విధుల్లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, వ్యక్తిగత ప్రయాణాల్లో కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ వినియోగాన్ని కచ్చితంగా పాటించాలి.
పోలీసుల ప్రవర్తనే ప్రజలకు మార్గదర్శకం అవుతుంది; అందువల్ల నియమ నిబంధనలను ముందుగా మనమే కచ్చితంగా అమలు చేయాలి.
రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పోలీసు సిబ్బంది చురుకుగా పనిచేయాలి.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి రాజీ పడకూడదు.
విధుల్లో అప్రమత్తంగా ఉండటం ద్వారా ప్రమాదాలను నివారించడం సాధ్యమవుతుంది.
“పోలీసులే ప్రజలకు రోల్ మోడల్గా నిలిస్తే, సమాజం మొత్తం నిబంధనలు పాటించే దిశగా ముందుకు సాగుతుంది” అని జిల్లా ఎస్పీ గారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్.బి.రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, DCRB డీఎస్పీ రమణారెడ్డి, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజుద్దీన్, జడ్చర్ల టౌన్ ఇన్స్పెక్టర్ కమలాకర్, భూత్పూర్ సీఐ రామకృష్ణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మోతిరామ్ మరియు రూరల్ సర్కిల్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
#MahabubnagarPolice #📰 వార్తలు
మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి లక్ష్యంపై దృష్టి పెట్టాలి
వేసవి శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ సందేశం
విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి, తమ లక్ష్య సాధన కోసం అంకితభావంతో కృషి చేస్తే జీవితంలో విజేతలుగా నిలుస్తారని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి అన్నారు.
డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్, ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ల్యాబ్ ఆధ్వర్యంలో వాగ్దేవి జూనియర్ కళాశాలలో నిర్వహించిన వేసవి శిక్షణా శిబిరం ముగింపు సమావేశానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, మొబైల్ ఫోన్లకు బానిసలైతే సృజనాత్మకత దెబ్బతింటుందని తెలిపారు. తాను బీటెక్ పూర్తయ్యాకే ప్రముఖ సంస్థలను సందర్శించే అవకాశం దొరికిందని, కానీ ఇప్పుడు డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్ కలాం ల్యాబ్ కృషి వల్ల తొమ్మిదో తరగతి విద్యార్థులకే డిఆర్డీఓ వంటి ప్రఖ్యాత సంస్థలను సందర్శించే అవకాశం లభించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
విద్యార్థులు సానుకూల దృక్పథంతో కొత్త విషయాలను నేర్చుకోవాలని, మంచి అలవాట్లను అలవరచుకోవాలని సూచించారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ యోగా సాధన చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులతో పాటు పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎస్పీ బహుమతులు అందజేశారు.
తెలంగాణలోని ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్, వికారాబాద్ జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల నుండి మొత్తం 110 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ శిబిరం 12 రోజుల పాటు విజయవంతంగా కొనసాగింది.
ఈ కార్యక్రమంలో ల్యాబ్ కమిటీ అధ్యక్షులు జనార్ధన్, కోశాధికారి నర్సప్ప, డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు టి.ఎన్. వెంకటేశ్వర్లు, టి.ఎన్. శ్రీధర్, వాగ్దేవి జూనియర్ కళాశాల కరస్పాండెంట్ వెంకట్ రెడ్డి, కలాం ల్యాబ్ సభ్యులు మల్లప్ప, గుముడాల చక్రవర్తి గౌడ్, ఆంజనేయులు, అనురాధ, శ్రావణి, శోభారాణి, సురేఖ తదితరులు పాల్గొన్నారు.
#MahabubnagarPolice #📰 వార్తలు
గౌరవ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి,IPS గారి ఆదేశాల మేరకు Rajapur పోలీస్ స్టేషన్ పరిధిలోని "ఏడుగుట్టల తండా గ్రామంలో “ప్రజాభద్రత–పోలీసు బాధ్యత” కార్యక్రమం సురక్ష పోలీస్ కళాబృందం, AHTU Team, మరియు షిటీమ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆటపాట మాటలతో నిర్వహించబడింది.
పోలీసు వారు మాట్లాడుతూ
స్కూళ్ళు కాలేజీలు గ్రామాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడం, చట్టాలపై అవగాహన కల్పించడం, నేరాల నివారణకు ప్రజలను చైతన్యవంతం చేయడం వంటి అంశాలపై వివరంగా వెల్లడించారు.
“పోలీసుల ఉనికి మీ భద్రత కోసం" చట్టపరంగా జీవించే వారు భయపడాల్సిన అవసరం లేదు.”
“వర్గాలుగా విడిపోయి గొడవలు పెట్టడం సమాజ అభివృద్ధికి ఆటంకం.”
అలాంటి అసాంఘిక శక్తులను కట్టడి చేయడంలో పోలీసులు అహర్నిశలు పనిచేస్తూనే ఉన్నారు.
“రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లు అన్నివేళలా పోలీసు రికార్డులో ఉంటారు – ఇది జీవితాంతం మచ్చ.” వారికే కాదు వారి తదనంతరం వారసులకు కూడా"
“కేసుల్లో ఇరుక్కుంటే ఉద్యోగాలు, పాస్పోర్ట్, విదేశీ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.”
అలాంటి వారికి ఇంటా బయట కనీస మర్యాదలు విలువలు లేకుండా పోతాయి.
“మహిళల పట్ల గౌరవం తప్పనిసరి – వేధింపులపై శిక్షలు తీవ్రంగా ఉంటాయి.”
ముఖ్యంగా బాలికలు చదువుకునే వయసులో ప్రేమలు పెళ్ళిళ్ళు అని మోహ వ్యామొహాలకు లోనై చిన్న చిన్న ఆకర్షణలకు గురై విలువైన జీవితాన్ని, భవిష్యత్తును పాడుచేసుకోవద్దని అన్నారు.
మహిళలు విధ్యారినులపై ఎవరైనా వేధింపులకు పాల్పడితే షిటీమ్ కొండంత అండగా ఉంటుంది.
షిటీమ్ నం:8712659365
AHTU నం:8712680066
సమాచారం ఇచ్చి సహాయం పొందండి అన్నారు.
బాధిత బాలికలకు మహిళలకు భరోసా, సఖీ సెంటర్ల ద్వారా మానసిక స్థైర్యాన్ని కల్పిస్తున్నాము.
“సైబర్ మోసాలకు లొంగకండి, ఆశలకు బలి కాకండి.”
ఒకవేళ సైబర్ మోసానికి గురై నష్టపోయినప్పుడు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 సంప్రదించి సహాయం పొందండి అన్నారు.
“డ్రగ్స్, గంజాయి, మద్యం, పేకాట – ఇవి జీవితాలను నాశనం చేస్తాయి.”
డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాల తయారీ సరఫరా వినియోగం ఎక్కడైనా జరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వండి.
సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము.
“రోడ్డు భద్రత పాటించాలి – మద్యం సేవించి వాహనాలు నడపకండి.”
“యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి. వారికి పెద్దలు ఆదర్శంగా ఉండి మహబూబ్ నగర్ జిల్లాను నేర రహిత జిల్లాగా మార్చాలన్న జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానికి IPS గారి
సంకల్పాన్ని వివరించారు.
ప్రజలతో పోలీసుల భాగస్వామ్యం ద్వారా సమాజ శాంతి భద్రతలు మెరుగుపడతాయని, సమస్యలు ఉన్నచో నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. మానవ అక్రమ రవాణా గురించి మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించడం జరిగింది
ఈ కార్యక్రమంలో
గ్రామ సర్పంచ్ కవిత రమేష్, గారు, ఉపసర్పంచ్ గారు, వార్డు సభ్యులు, బాలానగర్ MEO Shankar Nayak
AHTU టీమ్ అధికారి శ్రీమతి సక్రిబాయి ASI, శ్రీమతి జ్యోతి HC, వరప్రసాద్ PC,
సురక్ష పోలీసు కళాబృందం సభ్యులు డి.రాములు, బి జగదీష్, బాలరాజు SHE team చందర్ Rajapur PS హెడ్ కానిస్టేబుల్ రవీందర్ నాయక్, కానిస్టేబుల్ ధనుంజయ్
గ్రామ ప్రజలు యువకులు మహిళలు విద్యార్థులు
పాల్గొన్నారు.
#MahabubnagarPolice #📰 వార్తలు
NEET (UG) - 2026 ప్రవేశ పరీక్షా సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా పోలీసుల సూచనలు
#MahabubnagarPolice #NeetExam2026 #📰 వార్తలు
మద్యం మత్తులో వాహనం నడిపిన డ్రైవర్కు 7 రోజుల జైలు శిక్ష
మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో పట్టణ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించబడినవి.
ఈ తనిఖీలలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన మొత్తం 5 మందిని గుర్తించి, గురువారం సెకండ్ క్లాస్ కోర్టు జడ్జి శ్రీ ఆర్.శశిధర్ గారి ఎదుట హాజరుపరచగా నలుగురు ద్విచక్ర వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.1000/- జరిమానా విధించగా, ఎక్కువ మోతాదు మద్యం మత్తులో DCM వాహనం నడిపిన డ్రైవర్ కు గౌరవ న్యాయమూర్తి 7 రోజుల జైలు శిక్ష విధించడం జరిగింది.
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉండటంతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా భారీ వాహన డ్రైవర్లు మరింత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.
మహబూబ్నగర్ జిల్లా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
#MahabubnagarPolice #📰 వార్తలు
రోజుకు 20 కుటుంబాల్లో విషాదం… ఆత్మహత్యల పెరుగుదల ఆందోళనకరం. ప్రతి ప్రాణం విలువైనదే… ఇది గణాంకం కాదు, కుటుంబాల బాధ. జీవితం అమూల్యం… చిన్న సమస్యలకే పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. మానసిక సమస్యలపై అవగాహన పెంచి, ప్రతి ప్రాణాన్ని కాపాడడం మనందరి బాధ్యత
శ్రీ శివధర్ రెడ్డి, ఐపీఎస్, డిజిపి తెలంగాణ.
#MahabubnagarPolice #📰 వార్తలు
“బాధితులకు సౌకర్యంగా – ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు సేవలు”
జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపిఎస్
మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపిఎస్ గారు తెలియజేయునది ఏమనగా, బాధితులకు మరింత సౌకర్యం కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ “ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు” సేవలను అమలు చేస్తోంది.
ఈ సేవ ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు మరియు పోలీస్ స్టేషన్కు స్వయంగా రాలేని పరిస్థితుల్లో ఉన్న బాధితులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
లైంగిక నేరాలు, హత్యాయత్నం, గాయపరిచే ఘటనలు, దొంగతనం, దోపిడీ, చోరీ వంటి ఆస్తి సంబంధిత నేరాలు, అలాగే పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, బాల్య వివాహ నిరోధక చట్టాల పరిధిలోని కేసులలో బాధితులు ఫోన్ ద్వారా సమాచారం అందించిన యెడల, వెంటనే పోలీసులు బాధితుల నివాసం లేదా వారికి అనుకూలమైన ప్రదేశానికి వెళ్లి ఫిర్యాదు స్వీకరిస్తారు.
ఫిర్యాదుదారు స్వయంగా రాయలేని పరిస్థితుల్లో, పోలీసు అధికారులు బాధితుని వాంగ్మూలాన్ని వారి భాషలో నమోదు చేసి చదివి వినిపించి, వారి సమ్మతితో సంతకం తీసుకుంటారు. అనంతరం అక్కడికక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దాని ప్రతిని బాధితునికి అందజేస్తారు.
మహిళలు మరియు పిల్లల కేసులలో మహిళా పోలీసు అధికారిని తప్పనిసరిగా పంపిస్తారు. అవసరమైతే ఇంటర్ప్రెటర్ లేదా ప్రత్యేక ఉపాధ్యాయుల సహకారంతో వాంగ్మూలం నమోదు చేయబడుతుంది. అదేవిధంగా, సంఘటన స్థలాన్ని రక్షించడం మరియు సాక్ష్యాల సేకరణ వంటి చర్యలు వెంటనే చేపడతారు.
ఈ విధానం ద్వారా ఫిర్యాదు నమోదు ప్రక్రియ వేగవంతం అవుతుంది మరియు బాధితులకు పోలీస్ స్టేషన్కు వెళ్లే అవసరం తగ్గుతుంది.
జిల్లా ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకొని నేరాలను నిర్భయంగా ఫిర్యాదు చేయాలని కోరడమైనది. మహబూబ్నగర్ జిల్లా పోలీస్ ప్రజల భద్రతకు కట్టుబడి పనిచేస్తున్నది. #📰 వార్తలు
తెలంగాణలో రోడ్ల మీద భద్రత కోసం "అరైవ్ అలైవ్" ప్రచారం. #డిఫెన్సివ్డ్రైవింగ్ #అరైవ్అలైవ్ #రోడ్సేఫ్టీ #డ్రైవ్సేఫ్ #మహబూబ్నగర్పోలీస్
Arrive Alive a campaign for safer roads in Telangana. #DefensiveDriving #ArriveAlive #RoadSafety #DriveSafe #MahabubnagarPolice #📰 వార్తలు






![📰 వార్తలు - NEET [UG] -2026 ITELANGANA POLIC 365 कठख० ದೃಢಲ್ಪೀ సందర్ంగా 7 IIAHABUBIAGAR POLICE Conooulon మహబూబీనగర్ పోలీసుల సూచనలు ಏರಿಕ್ಷ ತದಿ పరీక్షా సమయం . మద్యాహ్వం| 4# మొత్తం 200 ೧ಂಬಲ ನುಂಡಿ 3-5-2026 కేంద్రాలు . పరీక్ష ನಾಯಂತಂ 5 00 ೧ಂಬಲನಂ5 . ಆಐವಾಂಂ 12 నిషేధాలు పరీక్షా | చుట్టూ 100 మీటర్ల పరిధిలో | ಕಂದಾಲ ` గుంపులుగా ఉండదం నిషేధం: . ಮಮಾಬುಾಬನಗ5 ಸಕ್ಷನ 163 ಬಿಎನಎಸ ಅಮಲು . ನೌಶಿನುಲ ಜಿಲ್ಲಾ (పాత 144 సెక్షన్ సి ఆర్ పీసి) . తరఫున NEET EXAMS మూసివేత ದದಯಿಂ 7*00 ೧ಂಬಲ ನುಂಡಿ సాయంత్రం 6.30 వరకు . విద్యార్థులకు XEROX INTERNET STATIONERY ఇంటర్పెట్ సెంటర్లు; జిరాక్ప్ సెంటర్లు; సూచనలు స్టేషనరీ షాపులు మూసివేత: వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్తు: - భద్రతా చర్యలు ಕಂದಂ ' 93 ಅನುಮಾನಾನ್ಪದ ನೃತ್ತುಲಕ್ತ ನಿಯಾ. నిబంధనలు ನಿಬಂಧಿನಲು ದಲ್ಲಂಮಿನ್ತಿ చట్టపరమైన చర్యలు తీసుకుంటారు: ٥٤ ಆ೮ ಏ ಬನ್ದ. విద్యార్థులకు ALL ٧ -THE ప్రశాంతంగా పరీక్షలు రాయండి:. BEST పరీక్ష విజియవంతం కావదానికి పోలీసు సహకారం అవసరం: ನಮಾತಲಂಏಂಡಿ సురక్షితంగా ఉందండి ' NEET [UG] -2026 ITELANGANA POLIC 365 कठख० ದೃಢಲ್ಪೀ సందర్ంగా 7 IIAHABUBIAGAR POLICE Conooulon మహబూబీనగర్ పోలీసుల సూచనలు ಏರಿಕ್ಷ ತದಿ పరీక్షా సమయం . మద్యాహ్వం| 4# మొత్తం 200 ೧ಂಬಲ ನುಂಡಿ 3-5-2026 కేంద్రాలు . పరీక్ష ನಾಯಂತಂ 5 00 ೧ಂಬಲನಂ5 . ಆಐವಾಂಂ 12 నిషేధాలు పరీక్షా | చుట్టూ 100 మీటర్ల పరిధిలో | ಕಂದಾಲ ` గుంపులుగా ఉండదం నిషేధం: . ಮಮಾಬುಾಬನಗ5 ಸಕ್ಷನ 163 ಬಿಎನಎಸ ಅಮಲು . ನೌಶಿನುಲ ಜಿಲ್ಲಾ (పాత 144 సెక్షన్ సి ఆర్ పీసి) . తరఫున NEET EXAMS మూసివేత ದದಯಿಂ 7*00 ೧ಂಬಲ ನುಂಡಿ సాయంత్రం 6.30 వరకు . విద్యార్థులకు XEROX INTERNET STATIONERY ఇంటర్పెట్ సెంటర్లు; జిరాక్ప్ సెంటర్లు; సూచనలు స్టేషనరీ షాపులు మూసివేత: వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్తు: - భద్రతా చర్యలు ಕಂದಂ ' 93 ಅನುಮಾನಾನ್ಪದ ನೃತ್ತುಲಕ್ತ ನಿಯಾ. నిబంధనలు ನಿಬಂಧಿನಲು ದಲ್ಲಂಮಿನ್ತಿ చట్టపరమైన చర్యలు తీసుకుంటారు: ٥٤ ಆ೮ ಏ ಬನ್ದ. విద్యార్థులకు ALL ٧ -THE ప్రశాంతంగా పరీక్షలు రాయండి:. BEST పరీక్ష విజియవంతం కావదానికి పోలీసు సహకారం అవసరం: ನಮಾತಲಂಏಂಡಿ సురక్షితంగా ఉందండి ' - ShareChat 📰 వార్తలు - NEET [UG] -2026 ITELANGANA POLIC 365 कठख० ದೃಢಲ್ಪೀ సందర్ంగా 7 IIAHABUBIAGAR POLICE Conooulon మహబూబీనగర్ పోలీసుల సూచనలు ಏರಿಕ್ಷ ತದಿ పరీక్షా సమయం . మద్యాహ్వం| 4# మొత్తం 200 ೧ಂಬಲ ನುಂಡಿ 3-5-2026 కేంద్రాలు . పరీక్ష ನಾಯಂತಂ 5 00 ೧ಂಬಲನಂ5 . ಆಐವಾಂಂ 12 నిషేధాలు పరీక్షా | చుట్టూ 100 మీటర్ల పరిధిలో | ಕಂದಾಲ ` గుంపులుగా ఉండదం నిషేధం: . ಮಮಾಬುಾಬನಗ5 ಸಕ್ಷನ 163 ಬಿಎನಎಸ ಅಮಲು . ನೌಶಿನುಲ ಜಿಲ್ಲಾ (పాత 144 సెక్షన్ సి ఆర్ పీసి) . తరఫున NEET EXAMS మూసివేత ದದಯಿಂ 7*00 ೧ಂಬಲ ನುಂಡಿ సాయంత్రం 6.30 వరకు . విద్యార్థులకు XEROX INTERNET STATIONERY ఇంటర్పెట్ సెంటర్లు; జిరాక్ప్ సెంటర్లు; సూచనలు స్టేషనరీ షాపులు మూసివేత: వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్తు: - భద్రతా చర్యలు ಕಂದಂ ' 93 ಅನುಮಾನಾನ್ಪದ ನೃತ್ತುಲಕ್ತ ನಿಯಾ. నిబంధనలు ನಿಬಂಧಿನಲು ದಲ್ಲಂಮಿನ್ತಿ చట్టపరమైన చర్యలు తీసుకుంటారు: ٥٤ ಆ೮ ಏ ಬನ್ದ. విద్యార్థులకు ALL ٧ -THE ప్రశాంతంగా పరీక్షలు రాయండి:. BEST పరీక్ష విజియవంతం కావదానికి పోలీసు సహకారం అవసరం: ನಮಾತಲಂಏಂಡಿ సురక్షితంగా ఉందండి ' NEET [UG] -2026 ITELANGANA POLIC 365 कठख० ದೃಢಲ್ಪೀ సందర్ంగా 7 IIAHABUBIAGAR POLICE Conooulon మహబూబీనగర్ పోలీసుల సూచనలు ಏರಿಕ್ಷ ತದಿ పరీక్షా సమయం . మద్యాహ్వం| 4# మొత్తం 200 ೧ಂಬಲ ನುಂಡಿ 3-5-2026 కేంద్రాలు . పరీక్ష ನಾಯಂತಂ 5 00 ೧ಂಬಲನಂ5 . ಆಐವಾಂಂ 12 నిషేధాలు పరీక్షా | చుట్టూ 100 మీటర్ల పరిధిలో | ಕಂದಾಲ ` గుంపులుగా ఉండదం నిషేధం: . ಮಮಾಬುಾಬನಗ5 ಸಕ್ಷನ 163 ಬಿಎನಎಸ ಅಮಲು . ನೌಶಿನುಲ ಜಿಲ್ಲಾ (పాత 144 సెక్షన్ సి ఆర్ పీసి) . తరఫున NEET EXAMS మూసివేత ದದಯಿಂ 7*00 ೧ಂಬಲ ನುಂಡಿ సాయంత్రం 6.30 వరకు . విద్యార్థులకు XEROX INTERNET STATIONERY ఇంటర్పెట్ సెంటర్లు; జిరాక్ప్ సెంటర్లు; సూచనలు స్టేషనరీ షాపులు మూసివేత: వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్తు: - భద్రతా చర్యలు ಕಂದಂ ' 93 ಅನುಮಾನಾನ್ಪದ ನೃತ್ತುಲಕ್ತ ನಿಯಾ. నిబంధనలు ನಿಬಂಧಿನಲು ದಲ್ಲಂಮಿನ್ತಿ చట్టపరమైన చర్యలు తీసుకుంటారు: ٥٤ ಆ೮ ಏ ಬನ್ದ. విద్యార్థులకు ALL ٧ -THE ప్రశాంతంగా పరీక్షలు రాయండి:. BEST పరీక్ష విజియవంతం కావదానికి పోలీసు సహకారం అవసరం: ನಮಾತಲಂಏಂಡಿ సురక్షితంగా ఉందండి ' - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_583666_1cbcfaf3_1777704441610_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=610_sc.jpg)


