Mahbubnagar Police
ShareChat
click to see wallet page
@mahbubnagarpolice
mahbubnagarpolice
Mahbubnagar Police
@mahbubnagarpolice
Mahbubnagar District Police
జిల్లా ప్రజలకు విజ్ఞప్తి. ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలి. హెల్మెట్ ధరించడం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాదు, ప్రాణ రక్షణకు అత్యంత అవసరమైన భద్రతా చర్య. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు తలకు తీవ్ర గాయాలు కాకుండా కాపాడేది హెల్మెట్ మాత్రమే. ప్రయాణం ఎంత చిన్నదైనా, ఎంత దగ్గర దూరమైనా హెల్మెట్ ధరించే అలవాటు చేసుకోవాలి. వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. మీ కుటుంబ సభ్యుల కోసం, మీ ప్రాణ భద్రత కోసం హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించండి. "హెల్మెట్ మీ తలకు కాదు... మీ ప్రాణానికి రక్షణ." #MahbubnagarPolice #RoadSafety #📰 వార్తలు
📰 వార్తలు - ShareChat
00:18
జిల్లా ప్రజలకు విజ్ఞప్తి. కారు ప్రయాణాల్లో సీట్ బెల్ట్ ధరించడం ప్రతి ఒక్కరి బాధ్యత. సీట్ బెల్ట్ రోడ్డు ప్రమాదాల సమయంలో తీవ్ర గాయాలు మరియు ప్రాణనష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వాహనం నడిపే డ్రైవర్ మాత్రమే కాకుండా, ముందు సీటు మరియు వెనుక సీటులో కూర్చున్న ప్రయాణికులు కూడా తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి. చాలా ప్రమాదాల్లో సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల తీవ్రమైన గాయాలు, మరణాలు సంభవిస్తున్నాయి. కేవలం కొన్ని సెకన్లలో ధరించే సీట్ బెల్ట్ మీ ప్రాణాలను కాపాడగలదు. జిల్లా పోలీసు శాఖ రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ సీట్ బెల్ట్ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తోంది. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. ప్రతి ప్రయాణంలో సీట్ బెల్ట్ ధరించే అలవాటు చేసుకొని మీ కుటుంబానికి సురక్షితంగా చేరుకోండి. "సీట్ బెల్ట్ ధరించండి – ప్రతి ప్రయాణాన్ని సురక్షితంగా మార్చండి." "ఒక్క క్లిక్ సీట్ బెల్ట్... జీవితానికి పూర్తి రక్షణ."#MahbubnagarPolice #RoadSafety #📰 వార్తలు
📰 వార్తలు - ShareChat
00:15
జిల్లా ప్రజలకు విజ్ఞప్తి. కారు ప్రయాణాల్లో సీట్ బెల్ట్ ధరించడం ప్రతి ఒక్కరి బాధ్యత. సీట్ బెల్ట్ రోడ్డు ప్రమాదాల సమయంలో తీవ్ర గాయాలు మరియు ప్రాణనష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వాహనం నడిపే డ్రైవర్ మాత్రమే కాకుండా, ముందు సీటు మరియు వెనుక సీటులో కూర్చున్న ప్రయాణికులు కూడా తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి. చాలా ప్రమాదాల్లో సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల తీవ్రమైన గాయాలు, మరణాలు సంభవిస్తున్నాయి. కేవలం కొన్ని సెకన్లలో ధరించే సీట్ బెల్ట్ మీ ప్రాణాలను కాపాడగలదు. జిల్లా పోలీసు శాఖ రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ సీట్ బెల్ట్ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తోంది. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. ప్రతి ప్రయాణంలో సీట్ బెల్ట్ ధరించే అలవాటు చేసుకొని మీ కుటుంబానికి సురక్షితంగా చేరుకోండి. "సీట్ బెల్ట్ ధరించండి – ప్రతి ప్రయాణాన్ని సురక్షితంగా మార్చండి." "ఒక్క క్లిక్ సీట్ బెల్ట్... జీవితానికి పూర్తి రక్షణ." #MahbubnagarPolice #RoadSafety #📰 వార్తలు
📰 వార్తలు - ShareChat
00:31
జడ్చర్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ ప్రజా సమస్యల పరిష్కారం, నాణ్యమైన దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎన్‌హెచ్-44పై ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి నిష్పక్షపాత విధులతో ప్రజల విశ్వాసం పెంపొందించాలి హెల్మెట్ ధరించడం తప్పనిసరి… పోలీసులే ప్రజలకు ఆదర్శం కావాలి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల టౌన్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు సందర్శించి వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో నిర్వహిస్తున్న ఎఫ్‌ఐఆర్ నమోదు విధానం, స్టేషన్ డైరీలు, పెండింగ్ కేసులు, రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్, బీట్ బుక్స్, సీజ్ ప్రాపర్టీ రికార్డులు, వారెంట్ల అమలు, సీసీటీఎన్‌ఎస్ నమోదు విధానం తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. ప్రతి కేసును సమయానుకూలంగా నమోదు చేసి సీసీటీఎన్‌ఎస్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని, ప్రతి దశలో పారదర్శకత మరియు జవాబుదారీతనం పాటించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్, ఐపీఎస్ గారి ఆదేశాలను సిబ్బందికి వివరిస్తూ, నిష్పక్షపాత విధులే పోలీసుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలని సూచించారు. ముఖ్యంగా నేషనల్ హైవే-44పై అధిక ట్రాఫిక్ రద్దీ నెలకొంటున్న నేపథ్యంలో, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పర్యవేక్షణ, అవసరమైన చోట ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే పోలీస్ స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది క్రమశిక్షణ వంటి అంశాలను కూడా పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని మర్యాదగా పలకరిస్తూ, వారి సమస్యలను ఓర్పుతో విని చట్టపరమైన సహాయం అందించాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ సిబ్బంది ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం తగ్గుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీసులే ప్రజలకు ఆదర్శంగా ఉండాలని పేర్కొంటూ, హెల్మెట్ లేకుండా వచ్చే సిబ్బందిని పోలీస్ స్టేషన్‌లోకి అనుమతించవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం స్టేషన్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ, వారి విధుల నిర్వహణకు సంబంధించిన అంశాలు మరియు వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత ఇబ్బందులు ఉన్న సిబ్బంది ప్రతి శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేరుగా తనను కలవవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ కమలాకర్, ఎస్‌ఐలు జయప్రసాద్, ఖాదర్, అక్షయదీప్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. #MahabubnagarPolice #📰 వార్తలు
📰 వార్తలు - ShareChat
ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ఉండకూడదు : జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి పరిశీలించారు. కుటుంబ వివాదాలు, భూ సమస్యలు, ఆర్థిక మోసాలు, సైబర్ నేరాలు మరియు ఇతర అంశాలకు సంబంధించిన పలువురు బాధితుల వినతులను ఓర్పుతో విని సంబంధిత పోలీస్ అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించడం పోలీసు శాఖ యొక్క ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా విచారించి చట్టపరమైన చర్యల ద్వారా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి అధికారి ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ స్పందనాత్మకంగా పనిచేయాలని సూచించారు. అలాగే మహిళలు, వృద్ధులు మరియు సైబర్ మోసాలకు గురైన బాధితుల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. #MahabubnagarPolice #📰 వార్తలు
📰 వార్తలు - e e - ShareChat
బక్రీద్ పండుగ నేపథ్యంలో గోవుల అక్రమ రవాణా నివారణకు కోయిలకొండ ఎక్స్ రోడ్ చెక్‌పోస్ట్ వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య గారు కోయిలకొండ ఎక్స్ రోడ్ నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్ట్‌ను సందర్శించి తనిఖీ చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ఈ చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలను కట్టుదిట్టంగా నిర్వహించాలని చెక్ పోస్ట్ నందు విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచించారు. అనుమానాస్పద వాహనాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అక్రమ రవాణా నివారణకు పోలీస్ శాఖ, పశుసంవర్ధక శాఖ మరియు రెవెన్యూ శాఖల సమన్వయంతో ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ చెక్‌పోస్ట్ వద్ద పశుసంవర్ధక శాఖ సిబ్బంది, రెవెన్యూ శాఖ అధికారులు మరియు పోలీస్ శాఖ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. #MahabubnagarPolice #📰 వార్తలు
📰 వార్తలు - గవేంద్ర 999 ఫాస్పూడ్ మెసిరిదర్వాని ` టీ బెలం ೆe FTUNEN1- Vio0Lns చెక్పా 220&10 30408 Ma [arnrra 2 IRfdalflnl ನilalm 1521ಬ76 0 8 ROvA `4 గవేంద్ర 999 ఫాస్పూడ్ మెసిరిదర్వాని ` టీ బెలం ೆe FTUNEN1- Vio0Lns చెక్పా 220&10 30408 Ma [arnrra 2 IRfdalflnl ನilalm 1521ಬ76 0 8 ROvA `4 - ShareChat
మహబూబ్‌నగర్ జిల్లా పోలీసుల రైతులకు విజ్ఞప్తి పంట కోత అనంతరం పంట వ్యర్థాలను కాల్చడం వలన భూమి సారవంతత తగ్గిపోవడంతో పాటు వాయు కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా ఉండాలని మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల: భూమిలోని పోషకాలు నశిస్తాయి వాయు కాలుష్యం పెరుగుతుంది శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుంది అందువల్ల రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా, సేంద్రియ ఎరువుల తయారీకి లేదా ఇతర ఉపయోగాలకు వినియోగించాలని సూచనలు జారీ చేయడం జరిగినది. “మన భూమి… మన భవిష్యత్తు… రండి కలిసి కాపాడుకుందాం” #MahabubnagarPolice #📰 వార్తలు
📰 వార్తలు - రైతేన్నేలాUడ! ఆలేచించేంది పంట భూమికి నిప్పు. ఈ సమాజానికి పెనుముప్పు: పంట వ్యర్ధాలు కాల్చొద్దు భూమి సారాన్ని ವೆಯುದ್ದು @৯৯০ పర్యావరణాన్ని కాపాడండి భవిష్యత్తు కోసం ಭಾಖಿನಿ 5ಾನಾಡಂಡ పంట వ్యర్ధాలను కాల్చడం వల్ల కలిగే నష్టాలు ఆరోగ్య' ನಮನ್ಯಲು ಅಗೈ ಏಮಾದಾಲು భూసారం గాలి కాలుష్యం ನಂಭನಿನ್ತಾಯ గిపోతుంది పెరుగుతుంది వస్తాయి మన భూమి . మన భవిష్యత్తు: రండి కలిసీ కాపాడుకుందాం: మహబూబ్నగర్జిల్లాపోలీస్ పంచం ದಹu' MHABUINCARLI3E రైతేన్నేలాUడ! ఆలేచించేంది పంట భూమికి నిప్పు. ఈ సమాజానికి పెనుముప్పు: పంట వ్యర్ధాలు కాల్చొద్దు భూమి సారాన్ని ವೆಯುದ್ದು @৯৯০ పర్యావరణాన్ని కాపాడండి భవిష్యత్తు కోసం ಭಾಖಿನಿ 5ಾನಾಡಂಡ పంట వ్యర్ధాలను కాల్చడం వల్ల కలిగే నష్టాలు ఆరోగ్య' ನಮನ್ಯಲು ಅಗೈ ಏಮಾದಾಲು భూసారం గాలి కాలుష్యం ನಂಭನಿನ್ತಾಯ గిపోతుంది పెరుగుతుంది వస్తాయి మన భూమి . మన భవిష్యత్తు: రండి కలిసీ కాపాడుకుందాం: మహబూబ్నగర్జిల్లాపోలీస్ పంచం ದಹu' MHABUINCARLI3E - ShareChat
బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన నిఘా బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో పశువుల అక్రమ రవాణా జరగకుండా నిరోధించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి కుష్బూ గుప్తా, ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గార్లు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం అడ్డాకల్ టోల్‌గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్ట్‌ను జిల్లా కలెక్టర్ శ్రీమతి కుష్బూ గుప్తా, ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గార్లు సంయుక్తంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు, రెవెన్యూ మరియు పశుసంవర్ధక శాఖ అధికారులకు పశువుల రవాణాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు మాట్లాడుతూ బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ అన్ని అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పశువుల అక్రమ రవాణా, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా చట్టాన్ని గౌరవిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. #MahabubnagarPolice #📰 వార్తలు
📰 వార్తలు - 3 POLIC{ KPOS POLice 3 POLIC{ KPOS POLice - ShareChat
వరి కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను సంయుక్తంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి కుష్బూ గుప్తా, ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ ప్రస్తుతం జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కొనుగోళ్లు పారదర్శకంగా, వేగవంతంగా జరిగేలా జిల్లా కలెక్టర్ శ్రీమతి కుష్బూ గుప్తా, ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గార్లు సంయుక్తంగా అడ్డాకల్ మండలంలోని వేముల గ్రామం వరి కొనుగోలు కేంద్రాన్ని అలాగే అడ్డాకల్ గ్రామంలోని రైస్ మిల్లును సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతులతో నేరుగా మాట్లాడి ధాన్యం తూకం, నాణ్యత పరిశీలన, టోకెన్ల జారీ, రవాణా తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునే ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రైస్ మిల్లులో నిల్వలు, ధాన్యం దిగుమతి–ఎగుమతి ప్రక్రియ, మిల్లింగ్ పనితీరును పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. రైతులకు చెల్లింపులు సకాలంలో జరిగేలా చూడాలని, కొనుగోలు కేంద్రాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. వరి కొనుగోలు ప్రక్రియలో ఎక్కడైనా అక్రమాలు, అవినీతి లేదా రైతులను ఇబ్బందులకు గురిచేసే పరిస్థితులు తలెత్తకుండా రెవెన్యూ, సివిల్ సప్లైస్, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ గారు అధికారులను ఆదేశించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చేపడుతున్న వరి కొనుగోలు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. #MahabubnagarPolice #📰 వార్తలు
📰 వార్తలు - ShareChat
ప్రజావాణి ఫిర్యాదులపై వేగవంతమైన స్పందన – బాధితులకు న్యాయం జరిగేలా సమర్థ చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి పరిశీలించారు. కుటుంబ వివాదాలు, భూ సమస్యలు, ఆర్థిక మోసాలు, సైబర్ నేరాలు మరియు ఇతర అంశాలకు సంబంధించిన పలువురు బాధితుల వినతులను ఓర్పుతో విని సంబంధిత పోలీస్ అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించడం పోలీసు శాఖ యొక్క ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా విచారించి చట్టపరమైన చర్యల ద్వారా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి అధికారి ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ స్పందనాత్మకంగా పనిచేయాలని సూచించారు. అలాగే మహిళలు, వృద్ధులు మరియు సైబర్ మోసాలకు గురైన బాధితుల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. #MahabubnagarPolice #📰 వార్తలు
📰 వార్తలు - ShareChat