సింగరేణి కార్మికుల కనీస అవసరాలు కూడా తీర్చకుండా యాజమాన్యం, ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయి. గనుల్లో కార్మికులకు సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే కాకుండా, కనీసం తాగునీరు కూడా అందించడం లేదు.
ప్రపంచవ్యాప్తంగా గనుల్లో కార్మికుల భద్రత, వెంటిలేషన్ కోసం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తుంటే, సింగరేణిలో మాత్రం ఇప్పటికీ పాత పద్ధతులనే కొనసాగిస్తున్నారు. గనుల్లోకి వెళ్లే కార్మికులకు తగినంత గాలి కూడా అందించలేని ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం సిగ్గుపడాలి.
#telangana