*ఫెడరేషన్ చైర్మన్ ను నియామకంపై కాలయాపన తగదన్న గోపి రజక*
▪️ రజకులను కార్మికులుగా గుర్తించాలన్న సంగెం రమేష్
▪️102 జీవోను అమలు చేయాలన్న నార్లగిరి కుమారస్వామి
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 12 సం.లు కావస్తున్నా రజక ఫెడరేషన్ ఏర్పాటు చేయకపోవడంతో రజకుల అభివృద్ధి కుంటుపడిందని ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు సంగెం రమేష్ ఆవేదన వ్యక్తంచేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ప్రభుత్వం అతిధి గృహంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు సంగెం రమేష్ అధ్యక్షతన 29-4-2026 బుధవారం ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, తెలంగాణ రజక వృత్తిదారుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఇల్లందుల సాంబయ్య,ఈస్ట్ జోన్ కన్వీనర్ నార్లగిరి కుమారస్వామి హాజరై మాట్లాడుతూ తక్షణమే రజక ఫెడరేషన్ చైర్మన్ ను ఏర్పాటు చేసి 15 మంది డైరెక్టర్లను నియమించి 1000 కోట్లు బడ్జెట్ కేటాయించాలని కోరారు. కులవృత్తిదారుడు ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, 141 మున్సిపాలిటీల్లో అధునాతన ధోభీఘాట్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం 102 జీవో ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల్లో దోభీ కాంట్రాక్టు రజకులకే కేటాయించాలని,45 సం.లు నిండిన వృత్తిదారుడికి ఫించన్ ఇవ్వాలని, కార్మికులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు.
కార్యక్రమంలో మాజీ ఎంపిటీసి జాలిగపు దుర్గయ్య,చెన్నరావుపేట పెద్దమనిషి చాపర్తి రాజు, ప్రధాన కార్యదర్శి ఉప్పుల వీరాస్వామి,అమినాబాద్ అధ్యక్షులు నీలగిరి రవి, పెద్దమనిషి దూదిగాని రమేష్ తదితరులు పాల్గొన్నారు.
#🏛️రాజకీయాలు