సముద్రంలో ప్రమాదాలకు గురైన వారిని కాపాడాలని… ఇండియన్ ఆర్మీకి ఉపయోగపడాలని డ్రోన్లు తయారు చేస్తున్నాడు వైజాగ్కు చెందిన యువ ఇంజనీర్ యోగేష్ కుమార్!
ఏరోనాటికల్ ఇంజనీర్ అయిన ఇతను… తన తమ్ముడు అశ్విన్తో కలిసి ‘అక్షయ ఏరోస్పేస్’ ద్వారా రక్షణ, వ్యవసాయం, పరిశ్రమల కోసం ఇప్పటివరకు 420కి పైగా అత్యాధునిక డ్రోన్లను తయారు చేశారు.
ఇండియన్ ఆర్మీ కోసం ‘కామికేజ్’ డ్రోన్లు, నేవీ కోసం వాటర్ప్రూఫ్ డ్రోన్లు తయారు చేయడమే కాకుండా… సముద్రంలో ప్రమాదానికి గురయ్యే వారిని రక్షించేందుకు ప్రత్యేక ‘ఎయిర్ టాక్సీ’ ప్రాజెక్టుపై కూడా పనిచేస్తున్నారు.
అంతేకాదు… డ్రోన్ల తయారీలో ఆసక్తి ఉన్న యువతకు శిక్షణ ఇస్తూ, వారు స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
#GoodNews #YogeshKumar #AkshayaAerospace #DroneTechnology #IndianInnovation #Vizag #AeronauticalEngineer #DroneIndia #StartupIndia
#🙆 Feel Good Status #😇My Status