*విద్యా హక్కు చట్టం అమలుచేయాలని బహుజన ప్రజా శక్తికి మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్న తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక*
▪️రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 25% నిధులు కేటాయించాలి➖ పైస నర్సింగరావు
▪️కాంపిటేషన్ కోర్సులు అయినటువంటి ఐఐటీ / జేఈఈ / నీట్ / యూపీఎస్సీ వంటి వాటికి ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి➖ జిలకర రవి
▪️విద్యను ప్రైవేటీకరణ చేయకుండా కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందించాలి➖ ఇటిక్యాల రాణి
మన దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సం॥లు కావస్తుంది. కానీ విద్య పూర్తిగా పేద వర్గాలు అందుకోలేని వివక్షతకు గురవుతుంది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో ఒక్కటైన విద్యా హక్కు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడుతుందని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక ఆవేదన వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ పంక్షన్ హాల్లో బహుజన ప్రజా శక్తి రాష్ట్ర కన్వీనర్ నల్ల లక్ష్మణ్ అధ్వర్యంలో 28-5-2026 గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, చాంద్రాయణగుట్ట ఇంచార్జీ పైస నర్సింగరావు, బాలాపూర్ ఇంచార్జీ జిలకర రవి హాజరయ్యారు .
*ప్రభుత్వం మెరుగైన విద్య అందించాలి*
నేటి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొత్తగా ప్రభుత్వ కళాశాలలు, గురుకుల విద్యాలయాలు, డిగ్రీ, పి.జి కాలేజీలు కొత్తగా మంజూరు చేయడం లేదు. నేటి తరానికి సాంకేతికతో కూడిన విద్య అసలే అందించడం లేదు. పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న కార్పోరేట్ కాలేజీలు యూనివర్సిటీలు ప్రోత్సహిస్తున్నట్టుంది. వీటిలో పేద, మధ్య తరగతి పిల్లలు అధిక ఫీజులతో చదివే పరిస్థితి లేదు. విద్యకు బడ్జెట్ కేటాయింపు లేదు. విద్యా హక్కు చట్టం అసలే అమలు కావడం లేదు. విద్యాశాఖకు మంత్రి లేడు. ఫలితంగా తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యత 2024 వరకు 66 శాతం వరకే ఆగిపోయింది. గ్రామీణ ప్రాంత అక్షరాస్యత 57 శాతం, మహిళా అక్షరాస్యత 55 శాతం వరకే ఆగిపోయింది.
*గోపాల కృష్ణ గోఖలే కమిటీ నివేదికను అమలుచేయాలి*
ఈ దేశ ప్రగతి తరగతి గదుల్లోనే రూపు దిద్దుకుంటుంది అంటారు. కానీ ఆ ఛాయలే కనిపించడం లేదు. విద్యను పూర్తిగా ఉచితంగా అందించాలని గోపాలకృష్ణ గోఖలే 1911 లో నినాదించారు. విద్య మన ప్రాథమిక హక్కు అని అంబేడ్కర్ గారు 1950 లో రాజ్యాంగంలో రాసినా అమలు జరగడంలేదు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ 2009లో 6-14 సం||ల బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలని విద్యాహక్కు చట్టం తెచ్చినా, విద్యని మానవ హక్కుగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితి సూచించినా, ఏదీ అమలుకు నోచుకోలేదు. పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నది. పూలే, అంబేడ్కర్ పోరాటాలు వృథా కానివ్వం.విద్యపై నిర్లక్ష్యాన్ని వీడండి, విద్యకు బడ్జెట్ కేటాయించి, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి సంస్కరించాలని ఈ క్రింది డిమాండ్లని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర ప్రారంభించాం.
*డిమాండ్స్*
1. నేటి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఎస్ఎస్సి / ఇంటర్ / డిగ్రీ / పీజీ కాలేజీల సంఖ్య పెంచాలి.
2. 6 నుండి 14 సం||ల వయస్సు గల విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్య, 2009 లో వచ్చిన విద్యాహక్కు చట్టం అమలు చేయాలి.
3. ప్రైవేటు విద్యా సంస్థలలో అధిక ఫీజులు నియంత్రించి, అధిక ఫీజుల నియంత్రణ చట్టం తీసుకరావాలి.
4. పేద విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయ్యాలి.
5. గురుకుల పాఠశాలలు/ కాలేజీలలో సరైన సౌకర్యాలు కల్పించాలి, వీటి సంఖ్య పెంచాలి, ప్రభుత్వం దీనిని బాధ్యతగా భావించాలి.
6. రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 25% నిధులు కేటాయించాలి.
7. ఎన్నికలలో ఇచ్చిన హామీల్లో ఒక్కటైన విద్యాహామీ ప్రతి మండల కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మోడల్ గురుకుల పాఠశాలలు నిర్మిస్తామన్నారు. ఇంతవరకు దాని ఊసే లేదు? వెంటనే నిర్మించాలి.
8. కాంపిటేషన్ కోర్సులు అయినటువంటి ఐఐటీ / జేఈఈ/ నీట్ / యూపీఎస్సీ వంటి వాటికి ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి.
9. విద్యను ప్రైవేటు చేయకుండా కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందించాలి.
*పాదయాత్రలో పాల్గొన్న నాయకులు*
ఆమనగల్ కౌన్సిలర్ జగన్ , కంటెస్టెడ్ కౌన్సిలర్ రాము,కంటెస్టెడ్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్, శ్రీనివాస్,ఫయాజ్,రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి బీముడు,మహబూబ్నగర్ జిల్లా కో ఇంఛార్జి మంథటి గోపి,నాగర్ కర్నూల్ జిల్లా ఇంఛార్జి గుడేల్లి శివాని,బల్మూర్ మండల ఇంచార్జీ వాకాడ సువర్ణ, తెల్కపల్లి మండల ఇంచార్జీ దేశమొని సరస్వతి,తాడూర్ మండల ఇంచార్జీ బండారు అనిత,లింగల టప్ప పెద్ద లక్ష్మయ్య, టప్ప చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు
#🏛️రాజకీయాలు