ఆత్మవిశ్వాసం ఉంటే చాలు ఎన్ని అడ్డంకులనైనా సులభంగా దాటెయ్యొచ్చు అని నిరూపించింది.. బెంగళూరుకు చెందిన 43 ఏళ్ల ప్రియాంక అగర్వాల్.
‘రెటినైటిస్ పిగ్మెంటోసా’ అనే జన్యుపరమైన వ్యాధి కారణంగా తన 90 శాతం కంటిచూపును కోల్పోయినా ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అధికారిక శిక్షణ కూడా లేకుండా, కేవలం తనకున్న పట్టుదల, ఆత్మవిశ్వసంతో మైనస్ డిగ్రీల చలిని, వడగళ్ల వానలను సైతం తట్టుకొని, తన భర్తతో కలిసి ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖర బేస్ క్యాంప్ను అధిరోహించారు.
సముద్ర మట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఆ బేస్ క్యాంప్ను చేరుకుని, ప్రియాంక ఒక అద్భుతమైన ఘనత సాధించారు. దీంతో ఆమె భారతదేశం నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు చేరుకున్న రెండవ అంధ మహిళగా రికార్డు సృష్టించారు.
అడ్డంకులు కేవలం శరీరానికే… కానీ మనసుకు కాదు అని నిరూపిస్తూ, ఆమె చేసిన ఈ తొమ్మిది రోజుల సాహస యాత్ర ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.
#talradiotelugu #GoodNews #EverestBaseCamp #PriyankaAgarwal #IndianWomen #Mountaineering #BlindClimber #touchalife #talradio
#💪పాజిటీవ్ స్టోరీస్ #😇My Status #🙆 Feel Good Status