Mahbubnagar Police
658 views
2 days ago
జడ్చర్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ ప్రజా సమస్యల పరిష్కారం, నాణ్యమైన దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎన్‌హెచ్-44పై ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి నిష్పక్షపాత విధులతో ప్రజల విశ్వాసం పెంపొందించాలి హెల్మెట్ ధరించడం తప్పనిసరి… పోలీసులే ప్రజలకు ఆదర్శం కావాలి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల టౌన్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు సందర్శించి వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో నిర్వహిస్తున్న ఎఫ్‌ఐఆర్ నమోదు విధానం, స్టేషన్ డైరీలు, పెండింగ్ కేసులు, రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్, బీట్ బుక్స్, సీజ్ ప్రాపర్టీ రికార్డులు, వారెంట్ల అమలు, సీసీటీఎన్‌ఎస్ నమోదు విధానం తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. ప్రతి కేసును సమయానుకూలంగా నమోదు చేసి సీసీటీఎన్‌ఎస్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని, ప్రతి దశలో పారదర్శకత మరియు జవాబుదారీతనం పాటించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్, ఐపీఎస్ గారి ఆదేశాలను సిబ్బందికి వివరిస్తూ, నిష్పక్షపాత విధులే పోలీసుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలని సూచించారు. ముఖ్యంగా నేషనల్ హైవే-44పై అధిక ట్రాఫిక్ రద్దీ నెలకొంటున్న నేపథ్యంలో, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పర్యవేక్షణ, అవసరమైన చోట ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే పోలీస్ స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది క్రమశిక్షణ వంటి అంశాలను కూడా పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని మర్యాదగా పలకరిస్తూ, వారి సమస్యలను ఓర్పుతో విని చట్టపరమైన సహాయం అందించాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ సిబ్బంది ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం తగ్గుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీసులే ప్రజలకు ఆదర్శంగా ఉండాలని పేర్కొంటూ, హెల్మెట్ లేకుండా వచ్చే సిబ్బందిని పోలీస్ స్టేషన్‌లోకి అనుమతించవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం స్టేషన్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ, వారి విధుల నిర్వహణకు సంబంధించిన అంశాలు మరియు వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత ఇబ్బందులు ఉన్న సిబ్బంది ప్రతి శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేరుగా తనను కలవవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ కమలాకర్, ఎస్‌ఐలు జయప్రసాద్, ఖాదర్, అక్షయదీప్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. #MahabubnagarPolice #📰 వార్తలు