Ravi Talluri
428 views
11 hours ago
*_ఋషి మహిమ ....!!_* *_వేదకాలం నాటి మహర్షులు , మునులు , యోగులు సమాజ శ్రేయస్సుకోసం పాటుపడేవారు_*. *_ముక్తి సాధనకోసం  జీవితకాలం_* *_వెచ్చించి చేసిన  తపస్సును దేశ సౌభాగ్యం కోసం వినియోగించేవారు_*. *_యజ్ఞయాగాదుల వలన లోకానికి ఎంతో మేలు కలుగుతుంది_*. *_ఋషులు తాము యజ్ఞయాగాలు చేయడమేకాక ఉత్తములైన చక్రవర్తుల చేత కూడా చేయించేవారు ._* *_ఇందువలన అందరి అభిష్టాలు నెరవేరి లోక కల్యాణం జరిగేది._* *_పురాణ కాలంలో అటువంటి_* *_మహర్షులెందరో కనిపిస్తారు._* *_అలాటి మహనీయులలో  కపిల మహర్షి  ఒకరు._* *_తన జీవితంలో చేయ వలసిన_* *_సత్కార్యములన్నింటిని  సంపూర్ణంగా_* *_ముగించి ,_* *_నిరాటంకంగా తపస్సు_* *_చేసుకునేందుకు పాతాళలోకానికి_* *_వెళ్ళాడు_*.   *_తనకు తపోభంగం కలిగించిన వారెంతటివారైనా వెంటనే భస్మమైపోయేంతటి తపశ్శక్తి గల మహర్షి కపిలుడు._* *_ఈ సమయంలో ,_* *_భూలోకంలో సగర చక్రవర్తి_* *_అశ్వమేధ యాగం  చేయ సంకల్పించాడు_*. *_ఆకాలంలలో, వారి అభీష్టాలు_* *_నెరవేర్చుకునేందుకు ,తమ ప్రజల_* *_యోగక్షేమాలకోసం యాగాలను చేసేవారు._* *_శ్రీ కృష్ణుడు కూడా_* *_భగవద్గీతలో యాగ మహిమను_* *_వివరించాడు._* *_ఈ ప్రపంచంలో సకల_* *_జీవరాశులను   మానవులను సృష్టించి,  యజ్ఞ యాగముల_* *_ద్వారా మీ మీ అభీష్టాలు నెరవేర్చుకొనమని ఆదేశించాడు_*. *_యాగాలు చేస్తే వానలు_* *_పడతాయి. వర్షాలు పడితే_* *_పంటలు, చెట్లు సమృధ్ధిగా_* *_పెరిగి మంచి ఫలసాయం_* *_లభిస్తుంది_*. *_మానవులకి_* *_కరువు కాటకాల బాధతప్పి సుభిక్షంగా వుంటారు._* *_మంచి ఆలోచనలతో సత్కర్మలు  జరుగుతాయి_*. *_మానవజీవితాలను సుఖవంతం_* *_చేసుకునే మార్గాలు లభిస్తాయి_*. *_వారి వారి జీవితాలను_* *_సఫలం చేసుకునే అవకాశాలు_* *_లభిస్తాయి_,* *_అదేవిధంగా_* *_అభీష్టసిధ్ధి_, _లభిస్తుంది._* *_మహారాజులు , చక్రవర్తులు  యాగాలు_* *_చేయడానికి ముందు_* *_యాగాశ్వానికి పూజాపునస్కారాలు చేసి ఆ అశ్వాన్ని వదులుతారు._* *_దేశం అంతా తిరిగే ఆ అశ్వాన్ని  ఏ రాజైనా పట్టి బంధిస్తే  ఆ రాజుతో యుధ్ధం చేసి జయించాలి._*  *_అలాగ ఆ యాగాశ్వం దేశలన్ని తిరిగి వచ్చాక_* *_ఆ రాజు యాగం చేయడానికి_* *_మొదలెట్టాలి_,.* *_ఇటువంటి_* *_ఆచారాలు_*, *_నిబంధనలుతప్పక పాటించాలి._* *_రాజులందరిని జయించిన_* *_వారి కి మాత్రమే యాగం చేయడానికి హక్కు వుండేది_*. *_ఆవిధంగా_* *_సగరమహారాజు_* *_పంపిన అశ్వం_* *_అదృశ్యమయింది_*. *_వెంటనే సగరుని పుత్రులు_* *_అంతా ఆ అశ్వాన్ని వెతుకుతూ వెళ్ళేరు_*.  *_భూలోకంలో_* *_ఎక్కడా అశ్వం_* *_కనిపించలేదు_*. *_అప్పుడు ఎవరో  చెప్పగా విని_* *_సగర కుమారులు పాతాళ లోకానికి వెళ్ళేరు_*. *_అక్కడ ఒక గుహలో అశ్వం కట్టబడి వుండడం చూశారు._* *_వారు చూసిన గుహ_* *_కపిల మహర్షి  తపస్సు చేస్తూవున్న గుహ_*. *_అక్కడ అశ్వాన్ని కట్టి_* *_వెళ్ళినది స్వర్గాధిపతి_* *_దేవేంద్రుడు._* *_ఎందుకంటే,_* *_సగరమహారాజు యాగం_* *_పూర్తి చేస్తే తన_* *_ఇంద్ర పదవికి భంగం_* *_కలిగిస్తాడనే భయం_,.* *_కాని సగర పుత్రులు తమ_* *_అశ్వాన్ని బంధించినది_* *_కపిల మహర్షి అని తలచి మహర్షికి_* *_తపోభంగం_* *_కలిగించారు_*. *_ఆయన కళ్ళు_* *_ఆగ్రహంతో_* *_తెరవగానే సగర_* *_చక్రవర్తి పుత్రులు ఆరు వేల మంది_* *_భస్మమైపోయారు_*. *_వీరందరికి సద్గతులు_* *_లభించాలంటే_* *_గంగా తీర్ధంతో_* *_తర్పణాలు వదలాలి_*. *_సగర వంశస్తులందరూ  గంగా జలాన్ని_* *_తీసుకురావడానికి ఎంతో_* *_ప్రయత్నించారు కాని ఫలించలేదు_*. *_చివరకు వారి వంశంలోనివాడైన_* *_భగీరధుడు మాత్రము_* *_తన పూర్వీకులకు సధ్గతులు కలిగించాలని, దీక్ష పూనాడు._, *_ఆకాశ గంగని భూలోకానికి_* *_తీసుకురావడానికి ఘోర తపస్సు చేశాడు_*. *_భగీరధుని తపస్సుకు మెచ్చిన_* *_ఆకాశగంగాదేవి , " నీ తపస్సుకు మెచ్చి_*,  *_ఆకాశంనుండి  దిగి వస్తాను. కానీ , నా_* ,*_ఉధృత ప్రవాహ_* *_మార్గాన్ని నువ్వే సక్రమంగా కట్టడి_* *_చేసుకోవాలి." అని ఆదేశించింది._* *_భగీరధుని, పట్టుదల దీక్షలకు మెచ్చిన_*  *_మహాదేవుడు_* *_ఆకాశ గంగ ఆవేశాన్ని_* *_అణచడానికి_* *_పరమశివుడు గంగను_* *_తన  ఝటా ఝూటంలో పూర్తిగా బంధించాడు_*. *_దీనివలన తన_* *_ప్రయత్నం ఫలించక భగీరధుడు తీవ్ర వేదనతో మరల_* *_పరమేశ్వరుని ప్రార్ధించి,_* *_"స్వామీ  ఒక సత్కార్యం కోసం గంగాదేవిని తీసుకుని వెళ్ళడానికి  నేను తపస్సు చేశాను._*  *_కానీ ఆ  గంగను_* *_మీ జడలలో బంధించారు."_* *_అని తిరిగి తపమాచరించాడు_*. *_భగీరధుని యందు దయతో_* *_పరమేశ్వరుడు_* *_గంగను కొంచెం గా విడిచి పెట్టాడు._* *_అలా కొంచెంగా_* *_విడవబడిన గంగ_* *_దివినుండి భూమికి దిగి పలు ఇంతలై భూమి మీద_* *_శరవేగంతో ప్రవహించ సాగింది. ఆ క్రమంలో గంగ_* *_జహ్ను మహర్షి_* *_ఆశ్రమాన్ని  ముంచేసి_* *_ముందుకు సాగగా_* *_జహ్ను మహర్షి, ' లోక క్షేమానికై  నేను యాగం చేద్దామని  నిర్మించుకున్న_* *_యాగ శాలని ముంచి_* *_ప్రవహిస్తోందని , కోపోద్రిక్తుడై గంగను ఔపాసనపట్టి పూర్తిగా త్రాగివేశాడు._* *దీనిని చూసిన భగీరధుడు* *తను ఎంతో కష్ట పడి* *తీసుకుని వచ్చిన గంగని* *జహ్ను మహర్షి  ఇలా త్రాగేశాడు*. *గంగను పాతాళం వరకూ తీసుకుని* *వెడితే కదా !  మా  పూర్వీకుల కు* *సద్గతులు  కలుగుతాయి*. *_అడుగడుగునా_* *_నా ప్రయత్నాలు_* *_విఫలమౌతున్నాయే అని వేదన_* *_చెందాడు._* *_జహ్ను మహర్షి వద్దకు వెళ్ళి,  మనవి చేసుకున్నాడు._* *గంగను_* ,*_వదలి తన_* *_పూర్వీకులకు_* *_సద్గతులు_* *_కలిగించమని._* *_ప్రార్ధించాడు._* *_భగీరధుని లక్ష్యం ఉన్నతమైనదని_* *_తలచిన జహ్ను మహర్షి_* *_అతని  మనవి ఆలకించి_* *_తన చెవి ద్వారా కొంచెం_* *_గంగని బయటికి వదిలాడు._* #మన సంప్రదాయాలు సమాచారం