*_ఋషి మహిమ ....!!_*
*_వేదకాలం నాటి మహర్షులు , మునులు , యోగులు సమాజ శ్రేయస్సుకోసం పాటుపడేవారు_*.
*_ముక్తి సాధనకోసం జీవితకాలం_*
*_వెచ్చించి చేసిన తపస్సును దేశ సౌభాగ్యం కోసం వినియోగించేవారు_*.
*_యజ్ఞయాగాదుల వలన లోకానికి ఎంతో మేలు కలుగుతుంది_*. *_ఋషులు తాము యజ్ఞయాగాలు చేయడమేకాక ఉత్తములైన చక్రవర్తుల చేత కూడా చేయించేవారు ._*
*_ఇందువలన అందరి అభిష్టాలు నెరవేరి లోక కల్యాణం జరిగేది._*
*_పురాణ కాలంలో అటువంటి_*
*_మహర్షులెందరో కనిపిస్తారు._*
*_అలాటి మహనీయులలో కపిల మహర్షి ఒకరు._* *_తన జీవితంలో చేయ వలసిన_* *_సత్కార్యములన్నింటిని సంపూర్ణంగా_*
*_ముగించి ,_* *_నిరాటంకంగా తపస్సు_* *_చేసుకునేందుకు పాతాళలోకానికి_*
*_వెళ్ళాడు_*.
*_తనకు తపోభంగం కలిగించిన వారెంతటివారైనా వెంటనే భస్మమైపోయేంతటి తపశ్శక్తి గల మహర్షి కపిలుడు._*
*_ఈ సమయంలో ,_*
*_భూలోకంలో సగర చక్రవర్తి_*
*_అశ్వమేధ యాగం చేయ సంకల్పించాడు_*.
*_ఆకాలంలలో, వారి అభీష్టాలు_*
*_నెరవేర్చుకునేందుకు ,తమ ప్రజల_* *_యోగక్షేమాలకోసం యాగాలను చేసేవారు._*
*_శ్రీ కృష్ణుడు కూడా_*
*_భగవద్గీతలో యాగ మహిమను_* *_వివరించాడు._*
*_ఈ ప్రపంచంలో సకల_*
*_జీవరాశులను మానవులను సృష్టించి, యజ్ఞ యాగముల_*
*_ద్వారా మీ మీ అభీష్టాలు నెరవేర్చుకొనమని ఆదేశించాడు_*.
*_యాగాలు చేస్తే వానలు_*
*_పడతాయి. వర్షాలు పడితే_*
*_పంటలు, చెట్లు సమృధ్ధిగా_*
*_పెరిగి మంచి ఫలసాయం_*
*_లభిస్తుంది_*.
*_మానవులకి_*
*_కరువు కాటకాల బాధతప్పి సుభిక్షంగా వుంటారు._*
*_మంచి ఆలోచనలతో సత్కర్మలు జరుగుతాయి_*.
*_మానవజీవితాలను సుఖవంతం_*
*_చేసుకునే మార్గాలు లభిస్తాయి_*.
*_వారి వారి జీవితాలను_*
*_సఫలం చేసుకునే అవకాశాలు_* *_లభిస్తాయి_,* *_అదేవిధంగా_*
*_అభీష్టసిధ్ధి_, _లభిస్తుంది._*
*_మహారాజులు , చక్రవర్తులు యాగాలు_*
*_చేయడానికి ముందు_*
*_యాగాశ్వానికి పూజాపునస్కారాలు చేసి ఆ అశ్వాన్ని వదులుతారు._*
*_దేశం అంతా తిరిగే ఆ అశ్వాన్ని ఏ రాజైనా పట్టి బంధిస్తే ఆ రాజుతో యుధ్ధం చేసి జయించాలి._* *_అలాగ ఆ యాగాశ్వం దేశలన్ని తిరిగి వచ్చాక_*
*_ఆ రాజు యాగం చేయడానికి_*
*_మొదలెట్టాలి_,.*
*_ఇటువంటి_*
*_ఆచారాలు_*, *_నిబంధనలుతప్పక పాటించాలి._*
*_రాజులందరిని జయించిన_*
*_వారి కి మాత్రమే యాగం చేయడానికి హక్కు వుండేది_*.
*_ఆవిధంగా_* *_సగరమహారాజు_*
*_పంపిన అశ్వం_* *_అదృశ్యమయింది_*.
*_వెంటనే సగరుని పుత్రులు_*
*_అంతా ఆ అశ్వాన్ని వెతుకుతూ వెళ్ళేరు_*. *_భూలోకంలో_*
*_ఎక్కడా అశ్వం_* *_కనిపించలేదు_*.
*_అప్పుడు ఎవరో చెప్పగా విని_*
*_సగర కుమారులు పాతాళ లోకానికి వెళ్ళేరు_*.
*_అక్కడ ఒక గుహలో అశ్వం కట్టబడి వుండడం చూశారు._*
*_వారు చూసిన గుహ_*
*_కపిల మహర్షి తపస్సు చేస్తూవున్న గుహ_*. *_అక్కడ అశ్వాన్ని కట్టి_* *_వెళ్ళినది స్వర్గాధిపతి_*
*_దేవేంద్రుడు._* *_ఎందుకంటే,_*
*_సగరమహారాజు యాగం_*
*_పూర్తి చేస్తే తన_* *_ఇంద్ర పదవికి భంగం_*
*_కలిగిస్తాడనే భయం_,.*
*_కాని సగర పుత్రులు తమ_*
*_అశ్వాన్ని బంధించినది_*
*_కపిల మహర్షి అని తలచి మహర్షికి_* *_తపోభంగం_* *_కలిగించారు_*. *_ఆయన కళ్ళు_* *_ఆగ్రహంతో_* *_తెరవగానే సగర_* *_చక్రవర్తి పుత్రులు ఆరు వేల మంది_*
*_భస్మమైపోయారు_*.
*_వీరందరికి సద్గతులు_* *_లభించాలంటే_*
*_గంగా తీర్ధంతో_* *_తర్పణాలు వదలాలి_*.
*_సగర వంశస్తులందరూ గంగా జలాన్ని_*
*_తీసుకురావడానికి ఎంతో_*
*_ప్రయత్నించారు కాని ఫలించలేదు_*.
*_చివరకు వారి వంశంలోనివాడైన_* *_భగీరధుడు మాత్రము_*
*_తన పూర్వీకులకు సధ్గతులు కలిగించాలని, దీక్ష పూనాడు._,
*_ఆకాశ గంగని భూలోకానికి_*
*_తీసుకురావడానికి ఘోర తపస్సు చేశాడు_*.
*_భగీరధుని తపస్సుకు మెచ్చిన_*
*_ఆకాశగంగాదేవి , " నీ తపస్సుకు మెచ్చి_*, *_ఆకాశంనుండి దిగి వస్తాను. కానీ , నా_*
,*_ఉధృత ప్రవాహ_* *_మార్గాన్ని నువ్వే సక్రమంగా కట్టడి_*
*_చేసుకోవాలి." అని ఆదేశించింది._*
*_భగీరధుని, పట్టుదల దీక్షలకు మెచ్చిన_* *_మహాదేవుడు_*
*_ఆకాశ గంగ ఆవేశాన్ని_* *_అణచడానికి_*
*_పరమశివుడు గంగను_*
*_తన ఝటా ఝూటంలో పూర్తిగా బంధించాడు_*.
*_దీనివలన తన_* *_ప్రయత్నం ఫలించక భగీరధుడు తీవ్ర వేదనతో మరల_*
*_పరమేశ్వరుని ప్రార్ధించి,_*
*_"స్వామీ ఒక సత్కార్యం కోసం గంగాదేవిని తీసుకుని వెళ్ళడానికి నేను తపస్సు చేశాను._*
*_కానీ ఆ గంగను_*
*_మీ జడలలో బంధించారు."_*
*_అని తిరిగి తపమాచరించాడు_*.
*_భగీరధుని యందు దయతో_* *_పరమేశ్వరుడు_*
*_గంగను కొంచెం గా విడిచి పెట్టాడు._*
*_అలా కొంచెంగా_*
*_విడవబడిన గంగ_* *_దివినుండి భూమికి దిగి పలు ఇంతలై భూమి మీద_* *_శరవేగంతో ప్రవహించ సాగింది. ఆ క్రమంలో గంగ_*
*_జహ్ను మహర్షి_*
*_ఆశ్రమాన్ని ముంచేసి_*
*_ముందుకు సాగగా_*
*_జహ్ను మహర్షి, ' లోక క్షేమానికై నేను యాగం చేద్దామని నిర్మించుకున్న_*
*_యాగ శాలని ముంచి_*
*_ప్రవహిస్తోందని , కోపోద్రిక్తుడై గంగను ఔపాసనపట్టి పూర్తిగా త్రాగివేశాడు._*
*దీనిని చూసిన భగీరధుడు*
*తను ఎంతో కష్ట పడి*
*తీసుకుని వచ్చిన గంగని*
*జహ్ను మహర్షి ఇలా త్రాగేశాడు*. *గంగను పాతాళం వరకూ తీసుకుని* *వెడితే కదా ! మా పూర్వీకుల కు* *సద్గతులు కలుగుతాయి*.
*_అడుగడుగునా_*
*_నా ప్రయత్నాలు_* *_విఫలమౌతున్నాయే అని వేదన_* *_చెందాడు._*
*_జహ్ను మహర్షి వద్దకు వెళ్ళి, మనవి చేసుకున్నాడు._* *గంగను_*
,*_వదలి తన_* *_పూర్వీకులకు_*
*_సద్గతులు_* *_కలిగించమని._*
*_ప్రార్ధించాడు._*
*_భగీరధుని లక్ష్యం ఉన్నతమైనదని_* *_తలచిన జహ్ను మహర్షి_*
*_అతని మనవి ఆలకించి_*
*_తన చెవి ద్వారా కొంచెం_*
*_గంగని బయటికి వదిలాడు._* #మన సంప్రదాయాలు సమాచారం