#😲బస్సు బోల్తా..30 మంది ప్రయాణికులకు.. వనపర్తి, జూన్ 29: వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలోని
44వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న టీజీఎస్ఆర్టీసీ బస్సు సోమవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. రహదారిపై వెళ్తున్న వాహనదారులతో పాటు స్థానికులు వెంటనే స్పందించి.. వారిని పెబ్బేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయని వైద్యులు వెల్లడించారు. వారికి ప్రాథమిక చికిత్స అందించినట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులతోపాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు.