నూనె లేకుండా వంట సాధ్యమేనా? వంటనూనె వినియోగం తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపు!
భారతదేశం తన అవసరాలకు సరిపడా వంటనూనె కోసం అధికంగా ఇతర దేశాలపై ఆధారపడుతోంది. ఈ దిగుమతుల భారాన్ని తగ్గించి, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఒక వినూత్న పిలుపునిచ్చారు. వంటనూనె వాడకాన్ని తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఆయన ఆకాంక్షించారు.