JanaSena Party Telangana
614 views
3 days ago
ఆంధ్రప్రదేశ్ వేదికగా అమలులోకి వచ్చిన వీబీ జీ రాం జీ • తొలి కార్యక్రమంగా ఫారం పాండ్ కి శంకుస్థాపన చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శ్రీ @ChouhanShivraj గారు, ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు • ప్రత్యేక ఆకర్షణగా డ్రెయిన్ నమూనా ప్రదర్శన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్(VB-G RAM G) చట్టం ఆంధ్రప్రదేశ్ వేదికగా జాతీయ స్థాయిలో అమలులోకి వచ్చింది. తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం పరిధిలోని ముక్కావారిపల్లెలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఫారం పాండ్ కు శుంకుస్థాపన చేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వీబీ జీ రాం జీ చట్టంలో గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రజల అభివృద్ధితోపాటు రైతుల కోసం ప్రత్యేక కార్యాచరణ ఉంటుందని తెలిసేలా ఈ పంట కుంట తవ్వకం పనులకు శ్రీకారం చుట్టారు. #ViksitBharat_G_RAM_G #VBGRAMG1July #🟥జనసేన #🟡తెలుగుదేశం పార్టీ #🧓నరేంద్ర మోడీ #🗞పాలిటిక్స్ టుడే #🏛️రాజకీయాలు