ప్రియ సహోదరి సహోదరులారా...
ఈ లోకంలో ఏ చిన్న పని జరగాలన్నా, పెద్ద పని జరగాలన్నా ఈరోజు అంతా ధనంతోనే నడుస్తోంది. మనిషి ఎంత అన్యాయం చేసినా... తన వైపు న్యాయం ఉండేలా చూసుకోవడానికి పెద్ద పెద్ద అధికారులను సైతం కొనేస్తూ, ఈనాటి ధనవంతులు న్యాయాన్ని తమ వైపు తిప్పుకుంటున్నారు. తమకున్న ధన బలాన్ని బట్టి ఈ లోకంలోని ప్రభుత్వాల నుండి, అధికారుల నుండి వారు సులభంగా తప్పించుకోవచ్చు ఏమో!
కానీ గుర్తుంచుకోండి... రేపటి రోజున దేవుని న్యాయసింహాసనం ఎదుట, దేవుని రాజ్యంలో ప్రవేశించేటప్పుడు ఇలాంటి లంచాలు, ధన బలాలు అస్సలు చెల్లవు! ఎందుకంటే దేవుని రాజ్యం కేవలం నీతితో, యథార్థతతో కూడినది. అక్కడ పక్షపాతం లేదు, లంచాలకు తావు లేదు. ఎవరు ఈ లోకంలో తగ్గించుకుని, అంతరంగ శుద్ధితో, నీతిగా మరియు న్యాయంగా నడుచుకుంటారో... వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు. ఈ లోక ధనం తాత్కాలికం, పరలోక రాజ్యమే శాశ్వతం అని గ్రహిద్దాం! 🙏✨
.
.
.
#brokmahesh #viceofchrist #తెలుగు క్రిస్టియన్ #దేవునివాక్యం #✝️జీసస్