brokmahesh

48 Posts • 45K views
K. Mahesh Official
1K views 18 days ago
ప్రియమైన సహోదరి సహోదరులారా... నేటి సమాజంలో మనుషులు ఎప్పుడూ డబ్బు వెనుకే పరుగెడుతున్నారు కానీ, తోటి మనుషుల విలువను మరిచిపోతున్నారు. ఈ రోజుల్లో ధనానికి ఇస్తున్న విలువ ప్రాణమున్న మనిషికి ఇవ్వడం లేదు. ఒకరి ప్రాణం పోతుంటే వారి గురించి బాధపడే వారి కంటే, తమ సొంత జేబు ఖాళీ అయిపోతుందేమో అని భయపడేవారే ఎక్కువైపోయారు. మనిషి బ్రతికున్నప్పుడు పట్టించుకోకుండా, చనిపోయిన తర్వాత కన్నీరు కార్చడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. దయచేసి గుర్తుంచుకోండి.. మనిషి చనిపోయాక ప్రేమ చూపించడం కాదు, వారు బ్రతికున్నప్పుడే వారిని ఒక మనిషిగా గుర్తించి గౌరవించడం ఎంతో ముఖ్యం! ఎంత ఘోరమంటే.. నేటి రోజుల్లో ప్రాణంగా ప్రేమించే వారిని కూడా కేవలం డబ్బు కోసమే చాలా సులభంగా వదిలేస్తున్నారు! అంత ఎందుకండీ, డబ్బు సంపాదన కోసమే బ్రతుకుతూ కన్నవారిని సైతం అనాథలుగా వదిలేసే కఠిన హృదయులు ఈ లోకంలో ఉన్నారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తోంది.. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం! ఎవరైతే దేవుని కంటే డబ్బునే ఎక్కువగా ప్రేమిస్తూ బ్రతుకుతారో, ఒకరోజు అదే డబ్బు వారి సర్వస్వాన్ని మింగేస్తుంది. కాబట్టి మనుషులుగా మనం డబ్బు మీద కాదు ఆలోచన ఉంచేది, తోటి మనుషుల్ని, ప్రాణసమానమైన బంధాల్ని కాపాడుకునే ఆలోచన మన దగ్గర ఉండాలి.🙏 Message By Bro K. Mahesh Garu [ Voice Of Christ ] . . . #brokmahesh #viceofchrist #తెలుగు క్రిస్టియన్ #దేవునివాక్యం #✝️జీసస్
12 likes
18 shares
K. Mahesh Official
1K views 17 days ago
ప్రియమైన సహోదరి సహోదరులారా... నేటి సమాజంలో మనుషులు ఎదుటివారి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు. తోటివారు బాగుపడుతుంటే లోపల కుళ్ళుకుంటూ, అసూయతో బ్రతుకుతున్నారు. అంతకంటే ఘోరం ఏంటంటే, నేడు చాలామంది దేవునికి ఇష్టం లేకపోయినా.. కేవలం లోకంలో ఉండే మనుషుల మెప్పు కోసం, వారి ముందు గొప్పలు చాటుకోవడం కోసమే జీవిస్తున్నారు. గుర్తుంచుకోండి, ఈ లోకంలో ఉండే మనుషులు ఈ రోజు పొగుడుతారు, రేపు తిడతారు. మనుషుల మెప్పు ఎప్పటికీ శాశ్వతం కాదు! కాబట్టి మనుషులుగా మనం ఎదుటివారిని చూసి ఏడవడం మానేసి, మనుషుల మెప్పు కోసం కాకుండా.. దేవుని మెప్పు కోసం, ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం జీవించడం నేర్చుకోవాలి.🙏 Message By Bro K. Mahesh Garu [ Voice Of Christ ] . . . #✝️జీసస్ #brokmahesh #viceofchrist #తెలుగు క్రిస్టియన్ #దేవునివాక్యం
17 likes
13 shares