*_హమారా బజాజ్ - సువేగా - చల్ మేరీ లూనా_*
*_భారతదేశ రవాణా రంగ చరిత్రనేది ఎన్నో మైలురాళ్ళతో ఆసక్తికరమైన మలుపులతో వున్న ఒక గాథ.కార్లప్రవేశం బ్రిటీష్ పాలనలోనే మొదలైంది. 1897లో క్రాంప్టన్ గ్రీవ్స్ కంపెనీ యజమాని ఫాస్టర్ అనేవాడు_*. *_భారతదేశానికి మొదటికారును తీసుకువచ్చాడు.ఆ వెంటనే 1898లో జెంషెడ్జీ టాటా ముంబాయికి మొదటికారును తెచ్చిన స్వదేశీయుడిగా ఘనత వహించాడు.దేశీయ వాహనచరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని టాటా ప్రారంభించారు.అదే సంవత్సరంలో మరికొన్ని కార్లు కూడా ముంబాయి తీరానికి చేరుకోవడంతో మనదేశంలో వాహన సంస్కృతికి పునాది పడింది._*
*_మలిదశలో కార్ల దిగుమతి & అసెంబ్లింగ్ ప్రక్రియ ఊపందుకుంది. 1928 డిసెంబరులో జనరల్ మోటార్స్ హిందూస్థాన్ లిమిటెడ్ వారు యూరప్ నుండి విడిభాగాలను దిగుమతి చేసుకొని ముంబాయిలో అసెంబ్లింగ్ చేసి భారత రహదారులపైకి కారును తీసుకువచ్చారు_*. *_అయితేసంపూర్ణంగా భారతదేశంలో తయారైన మొదటి కారు అంబాసిడర్._* *_కోల్కతాలో 1948లో మోరిస్ ఆక్స్ఫర్డ్ వారు ఈ కార్లను ఉత్పత్తి చేసి ఆ తరువాత హిందూస్థాన్ మోటార్స్ పేరుతో కార్ల ఉత్పత్తి చేశారు_*.
*_ఈ అంబాసిడర్ సుమారు 4 దశాబ్దాల పాటు భారతీయ రోడ్లను ఏలింది.హిందుస్థాన్ కంపెనీ వారు ప్రవేశపెట్టిన అంబాసిడర్ కారు కొత్త సాంకేతికతతో ఆధునిక సౌకర్యాలతో నవీన రూపంలో మరలా మార్కెట్టులోనికి వచ్చే అవకాశముంది_*.
*_కార్ల సాంకేతికతలో మరింత అభివృద్ధి చెందిన తర్వాత 1984లో మధ్యతరగతి ప్రజల కలల వాహనంగా మారుతి–800 విడుదలైంది.ఇదే భారతదేశంలో మొదటి ఎయిర్ కండీషన్డ్ (AC) కారుగా వాహనరంగంలో ఒక కొత్తయుగానికి నాంది పలికింది_*.
*_కార్లచరిత్రలో ఒక విచిత్రమైన సంఘటన 1920లో చోటుచేసుకుంది. అల్వార్ మహారాజా జై సింగ్ ఇంగ్లాండ్లో రోల్స్ రాయిస్ షోరూమ్కి సాధారణ దుస్తుల్లో వెళ్ళగా సేల్స్ ప్రతినిధులు ఆయనను సామాన్యుడిగా భావించి అవమానించారు_*. *_ప్రతీకారంగా ఆ రాజాగారు ఒకేసారి ఏడు రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేసి భారతదేశానికి తెచ్చి వాటిని మునిసిపాలిటీకి అప్పగించి చెత్త సేకరణకు ఉపయోగించారు. ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన కార్లు చెత్తబండ్లుగా వాడటంతో ఆ కార్ల బ్రాండ్ ప్రతిష్ట దెబ్బతింది.చివరికి రోల్స్ రాయిస్ యాజమాన్యం రాజుగారికి క్షమాపణలు చెప్పి కొత్తకార్లను ఉచితంగా అందించింది._*
*_ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే 1950లో భారతదేశంలో మొదటగా ప్రవేశించిన స్కూటర్ లాంబ్రెట్టా.ఆ తర్వాత 1972లో బజాజ్ స్కూటర్ హమారా బజాజ్ అంటూ మనఇంటిలో భాగమై 2009 వరకు కొనసాగింది.బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడిన చిన్నవాహనమైన సువేగా మోపెడ్._* *_మంచి వేగంతో నడిచే మోపెడ్ అనే అర్థం వచ్చేలా భారతీయ మార్కెట్లో ప్రవేశించింది_*. *_కోయంబత్తూరుకు చెందిన కెఎల్ వి ఫౌండర్స్ సంస్థ 1962లో తిరుపతిలో ఈ సువేగా కర్మాగారాన్ని స్థాపించి 1988 వరకు విజయవంతంగా ఉత్పత్తి చేసింది._*
*_ఇక 1972లో మార్కెట్లోకి వచ్చిన లూనా మోపెడ్ కూడా ఇరవైఏళ్ళ క్రితంవరకు మధ్యతరగతి ప్రజల ప్రియమైన వాహనంగా నిలిచింది. చల్ మేరీ లూనా అనే ప్రకటన గురించి ఇప్పటికీ పాతతరం వారికి గుర్తుండే వుంటుంది_*.
*_మరోవైపు పటిష్టమైన ప్రయాణానికి మారుపేరైన జీపు (Jeep) అనే పదం General Purpose నుండి పుట్టింది.రెండవ ప్రపంచ యుద్ధసమయంలో 1941లో ఐరోపా సైనికుల అత్యవసర ప్రయాణాల కోసం వీటిని రూపొందించారు. భారతదేశంలో 1954లో మహీంద్రా అండ్ మహీంద్రా వారు మొదటిసారిగా జీపును నిర్మించారు. అంతవరకు అమెరికన్ విల్లీస్ (Willys) జీపు మనదేశంలో వుండగా మహీంద్రా జీపుల రాకతో భారతీయ రహదారులపై కొత్తశకం ప్రారంభమైంది_*.
*_ఈ విధంగా భారతీయ వాహనరంగం బ్రిటీష్ కాలం నుండి స్వాతంత్ర్యం తర్వాతి దశవరకు ఎన్నో మలుపులు తిరిగి ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతూ నేటి ఆధునిక ఆటోమొబైల్ పరిశ్రమకు పునాది వేసింది._*
*_//సేకరణ//_* #మన సంప్రదాయాలు సమాచారం