1️⃣1️⃣2️⃣
*_శ్రీ మహావిష్ణు పురాణం_*
*_112 వ భాగం_*
*_శ్రీకృష్ణావతారము-14._*
*_చాణూర ముష్టిక,కంస సంహారం:_* *_బలరామ కృష్ణులు కువలయా పీడ ఏనుగు దంతాలు చేతబట్టుకుని కంసుని రాజప్రాసాదంలో ఏర్పాటు చేసిన మల్లయుద్ధ మైదానంలోకి ప్రవేశించారు. అప్పటికే అక్కడ ఉన్న నందుడు మొదలైన నందగ్రామ ప్రజలు, మధురప్రజలు హర్షధ్వానాలతో వారికి స్వాగతం పలికారు_*.
*_కంసుడు ఎదురుగా ఎత్తైన వేదిక పైన సింహాసనం మీద కూర్చుని బలరామకృష్ణులను పరికిస్తున్నాడు. “ఈ నీలమేఘ ఛాయ బాలుడైన కృష్ణుడా నన్ను చంపడానికి పుట్టినవాడు. నారదుడు చెప్పినట్లు నారాయణుడు అవతారమా లేక మాములు మానవబాలుడా తేలుస్తాను” అనుకుని మల్లయుద్ధ గోదా లోకి దిగమని చాణుర ముష్టికులు అనబడే తన మల్లయుద్ధ వస్తాదులకు సైగ చేశాడు._*
*_వారు మైదానంలోకి దిగగానే బలరామ కృష్ణుల వంక చూసి “ప్రియమైన మేనళ్ళులారా! మీరు మా చాణూర ముష్టికులతో మల్ల యుద్ధం చేయండి_*. *_మేటిరాక్షసులను చంపిన మీ బల పరాక్రమాలు నేడు కళ్ళారా చూసి ఆనందపడతాను_*.
*_వీరిని గెలిస్తే తరువాత నన్ను కల్వ వచ్చును” అని ఎగతాళి చేస్తునట్లు మాట్లాడాడు._*
*_కృష్ణుడు పట్టించుకోక “కంస మామా! నీ ముచ్చట చెల్లించడానికే కదా మేము మధుర వచ్చాము. ప్రియమైన మా మామ ఆఖరి కోరిక తప్పక తీరుస్తాను” అని బలరామునికి సైగ చేశాడు._*
*_ఇద్దరు వస్త్రాలు బిగించి కట్టి మల్లయుద్ధానికి సిద్దమయ్యారు_*. *_తన అనుమతి కోసం దగ్గరకు వచ్చిన చాణూర_* *_ముష్టికులతో కంసుడు_*
*_“బాలురని దయ చూపకుండా ఇద్దరు బాలురను_* *_నిర్ధాక్షిణ్యంగా చంపేయండి" అని ఆదేశించాడు._*
*_చాణురుడితో కృష్ణుడు, ముష్టికునితో బలరాముడు ద్వంద్వ పోరాటానికి దిగారు. కొదమ సింహాల లాగా పోరాడుతున్న బలరామ కృష్ణులను చూసి ప్రజలు ఆనందంతో కరతాళ ధ్వనులు చేస్తుంటే, చాణుర ముష్టికులకు వారు సామాన్య బాలకులు కాదు అనిపించింది._* *_మల్లయుద్ధ ప్రవీణుల వలె వారు కురిపించే ముష్టిఘాతాలను తట్టుకోలేక పోతున్నారు._*
*_అరక్షణంలో బాలురని చంపి కంసుడి మెప్పు, బహుమతులు పొందాలి అన్న స్థితి నుండి తమను బలరామ కృష్ణుల నుంచి ఎలా రక్షించుకోవాలి అనే స్థితికి చాణూర ముష్టికులు వచ్చారు._*
*_బలహీన పడుతున్న వారిని చూసి కృష్ణుడు బలరామునితో “అన్నా! త్వరగా వీరి పని ముగించి మనం కంస మామ సంగతి చూడాలి” అన్నాడు._*
*_కృష్ణుడు చాణూరుని ‘కరవడ’ మనే బంధంలో పట్టి ఉంచాడు._* *_చాణురుడు అతి కష్టంగా వది లించుకుని కృష్ణుని గుండెల పై పిడికిలితో కొట్టబోయాడు. కృష్ణుడు నేర్పుగా తప్పించుకుని వాడి రెండు చేతులు పట్టుకుని గిరగిరా తిప్పి నేల మీదకు గట్టిగా విసిరివేశాడు. రక్తం కక్కుకుని చాణూరుడు చనిపోయాడు_*.
*_అక్కడ ముష్టికుడూ అంతే. బలరాముని బాహు ప్రహారాలకు తట్టుకోలేక రక్తం ధారగా కారుతుంటే నేల పై పడి మరణించాడు. కృష్ణుడు కంసుడి వైపు వెళ్లగా బలరాముడు చాణూరముష్టికులకు తోడుగా వచ్చిన మల్ల యోధుల, రాజ భటుల పని పట్టసాగాడు_*.
*_కంసుడు తన మీదకు సింహం లాగా ఉరుకుతూ వస్తున్న కృష్ణుని చూసి కత్తి దూశాడు._*
*_కంసుడి ఖడ్గ ప్రహరాన్ని తప్పించుకుని కృష్ణుడు అతని సింహాసనం పై నుంచి కిందకు తోసాడు_*. _కంసుడి కిరీటం పడిపోయింది. కత్తి దూరంగా పడింది. జట్టు పట్టుకుని మల్లయుద్ధ మైదానంలో పడ వేశాడు. కృష్ణుడి బాహువుల బలానికి కంసుడికి భయం, ఆశ్చర్యం కలిగాయి._
*_తన ఆకారంలో సగం కూడా లేని బాలుని ఏం చేయలేక నిస్తేజుడై చూస్తున్నాడు. మరణభయం కన్నులలో కనపడసాగింది. కంసుడి భయాన్ని ప్రజల్లో పోగొట్టాలని వాడిని మైదాన మంతా గిరగిరా తిప్పి మధ్యలో పడవేసి మీద కూర్చున్నాడు. కంసుని వంక నవ్వుతూ చూస్తూ “మామా! ఇన్నాళ్లూ చేసిన అనేక దుష్కర్మలకు ఫలం ఇప్పుడు పొందబోతున్నావు. పుట్టిన మానవునికి మరణం సహజం. అది మరచి అశరీరవాణి చెప్పిందని చెల్లెలు, బావను, కన్నతండ్రిని జైలులో పెట్టావు. పుట్టిన బిడ్డలను దయ కరుణ లేకుండా నిర్ధాక్షిణ్యంగా పుట్టగానే చంపావు. ఇప్పుడు మృత్యువు నీ ముగింట నిలిచింది. చూసి ప్రాణం వదులు” అనిరెండుచేతులు పిడికిలి బిగించి గుండెలపైకొట్టాడు_*.
*_నోటి వెంట రక్తం రాగా కంసుడు ప్రాణం వదిలేశాడు._*
*_కృష్ణుడి మీదకు వస్తున్న కంసుడి సోదరులను బలరాముడు యమపురికి పంపాడు. దేవతలు ఆకాశం నుంచి బలరామ కృష్ణుల మీద పుష్పవర్షం కురిపించారు. మధుర ప్రజలు పండుగ చేసుకున్నారు_*.
*_అక్రూరుని వెంట బలరామ కృష్ణులు చెరసాలకు వెళ్లి_* *_తల్లిదండ్రులు వసుదేవుడు, దేవకిదేవిల_*
*_చెర విడిపించారు_*. *_తమకు నమస్కరిస్తున్న బలరామ కృష్ణులను దేవకీవసుదేవులు లేపి హత్తుకున్నారు._* *_తనివితీరా ఎదిగిన కుమారులను చూసి మురిసిపోతున్నారు._*
*_అక్రూరుడు వెళ్లి కారాగారంలో ఉన్న కంసుని తండ్రి ఉగ్రసేనుని విడిపించి అక్కడకు తీసుకు వచ్చాడు. తాతగారికి బలరామ కృష్ణులు ఇద్దరు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు_*.
*_కృష్ణుడు ఉగ్రసేనునితో తాతగారూ! మరణించిన కంసుడు మొదలైన కుమారులకు అంత్యక్రియలు జరి పించండి" అనికోరాడు_*.
*_ఉగ్రసేనుడు అక్రూరునితో కలసివెళ్లాడు. తల్లిదండ్రులను తీసుకుని బలరామ కృష్ణులు రాజభవనానికి వెళ్లారు. అక్కడ నందుడు మరియు ఇతర గ్రామవాసులు వేచి ఉన్నారు. నందునిపాదాలకు నమస్కరించి కృష్ణుడు “నాన్న గారూ! ఇన్నాళ్లు మాకు దూరంగా చెరసాలలో ఉన్న మా తల్లిదండ్రులు దేవకి వసుదేవులతో నేను,బలరాముడు ఉంటాం. మీరు నంద గ్రామం తిరిగి వెళ్లి యశోదమ్మకు సంగతి చెప్పి జాగ్రత్తగా చూసుకోండి" అని తాము తిరిగిరాలేమన్నసంగతి అర్ధం అయ్యేటట్టు చెప్పాడు. నందుడు,గోపాలురు నిరాశగా బృందా వనానికి బయలుదేరి వెళ్లారు_* #మన సంప్రదాయాలు సమాచారం